Remake
-
ఆ హీరోతో నా సినిమా అందుకే ఆగిపోయింది: దర్శకుడు శంకర్
భారత అగ్రదర్శకుల్లో ఒక్కరైన శంకర్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు ఇండియన్-2 ఈ నెలలోనే రిలీజ్కు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఆ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారాయన. మరోవైపు రామ్చరణ్ గేమ్ ఛేంజర్ నిర్మాణంలో ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ రెండూ కాకుండా.... శంకర్ ఇండియన్ 3పైనా ఫోకస్ చేశాడు. తాను తర్వాత తీయబోయే చిత్రం అదేనని తాజాగానూ స్పష్టం చేశారాయన. దీంతో శంకర్ అప్కమింగ్ ప్రాజెక్టు ఇంకా ఏదైనా ఉందా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో చాలా కాలం కిందట ఆయన డైరెక్షన్లో రావాల్సిన ఓ సినిమా.. ఇప్పుడు తెర మీదకు వచ్చింది. అదే ‘అన్నియన్’(అపరిచితుడు) రీమేక్.He is a maverick and charismatic showman no one else can play!Welcome aboard, @RanveerOfficial Can't wait for this magnificent journey to begin mid 2022.⁰@jayantilalgada @PenMovies pic.twitter.com/LJueK4d8ra— Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021బాలీవుడ్ క్రేజీ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా అన్నియన్ రీమేక్ చేయాలని శంకర్ భావించారు. ఇందు సంబంధించిన టెస్ట్ షూట్ చేసి.. ఆ ఫొటోలను సైతం రిలీజ్ చేశారు. అయితే ఎందుకనో ఆ ప్రాజెక్టు గురించి తర్వాత అప్డేట్ లేకుండా పోయింది. తాజాగా.. ఇండియన్ 2 ప్రమోషన్లో శంకర్ ఈ ప్రాజెక్టు గురించి స్పందించారు.He is a maverick and charismatic showman no one else can play!Welcome aboard, @RanveerOfficial Can't wait for this magnificent journey to begin mid 2022.⁰@jayantilalgada @PenMovies pic.twitter.com/LJueK4d8ra— Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021‘‘రణ్వీర్తో అన్నియన్ను హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నాం. కానీ, ఆ తర్వాత మా ఆలోచనలన్నీ మారిపోయాయి. భారీ బడ్జెట్తో ఇతర భాషల్లో చిత్రాలు తీద్దామని, అది అన్నియన్ కంటే గొప్పగా ఉండాలని మా నిర్మాతలు నన్ను కోరారు. దీంతో ఆలోచనల్లో పడ్డాం. రణ్వీర్తో సినిమా ఉంటుంది. కానీ, అది అన్నియన్ రీమేక్ కాదు. అంతకు మించిన కథతో తప్పకుండా ఆయనతో సినిమా తీస్తా’’ అని శంకర్ ప్రకటించారు. -
నేకెడ్ గన్ రీమేక్లో...
హాలీవుడ్ హాట్ తార పమేలా ఆండర్సన్ అభిమానులకు ఓ శుభవార్త. ఈ గ్లామరస్ స్టార్ తాజాగా ‘నేకెడ్ గన్’ రీమేక్లో నటించడానికి అంగీకరించారు. ఈ మధ్యకాలంలో చేసిన చిత్రాల్లోకన్నా ఈ చిత్రంలో పమేలా పాత్ర నిడివి ఎక్కువ కావడం, హీరోయిన్ పాత్ర కావడం అనేది అభిమానులు ఆనందించే విషయమే. 1980 చివర్లలో 1990 ఆరంభంలో వచ్చిన క్రైమ్ కామెడీ ‘నేకెడ్ గన్’ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మూడో భాగం 1994లో వచ్చింది. 30 ఏళ్లకు ‘నేకెడ్ గన్’ మళ్లీ తెరపైకి రానుంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అకీవా షాఫర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ రీమేక్లో లీడ్ రోల్లో లియామ్ నీసన్ నటించనుండగా, అతని సరసన పమేలా ఆండర్సన్ నటించనున్నారు. గత మూడు భాగాల్లో డిటెక్టివ్ పాత్రను లెస్లీ నీల్సన్ చేయగా అతని ప్రేయసిగా ప్రిసిల్లా ప్రెస్లీ నటించారు. రీమేక్లో డిటెక్టివ్గా లియామ్ నీసన్, అతని ప్రేయసిగా పమేలా ఆండర్సన్ నటించనున్నారు. వచ్చే ఏడాది జూలై 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక పమేలా గురించి చె΄్పాలంటే... 1990లలో హాటెస్ట్ స్టార్ అంటే పమేలానే. ‘ప్లే బాయ్’ మ్యాగజీన్ మోడల్గా అప్పట్లో బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారామె. అలాగే బుల్లితెర కోసం ‘బేవాచ్’ సిరీస్ (1992–1997)లో చేసిన సీజే పార్కర్ పాత్ర కూడా హాట్ స్టార్గా పమేలాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. సినిమాల పరంగా ‘రా జస్టిస్, స్కేరీ మూవీ 3, బోరాట్, బేవాచ్’ వంటివి పమేలా క్రేజ్ కొనసాగడానికి ఉపయోగపడ్డాయి. -
మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మలయాళ సినిమాల హవా నడుస్తోంది. మిగతా ఇండస్ట్రీల్లో సరైన మూవీ లేక నీరసంగా ఉండగా.. మలయాళంలో మాత్రం వరసపెట్టి బ్లాక్ బస్టర్స్ పడుతున్నాయి. దీంతో అందరూ ఈ చిత్రాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఓ క్రేజీ మలయాళ సినిమా తెలుగులో రీమేక్ కానుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: 'ప్రభాస్'కు గిఫ్ట్ పంపిన వేణుస్వామి సతీమణి) లాక్ డౌన్ టైంలో ఓటీటీలకు జనాలు బాగా అలవాటు పడిపోయారు. అలా అన్ని భాషా చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరించారు. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. అలా 2022లో 'జయజయజయహే' చిత్రాన్ని చూసి అరె భలే ఉందే అనుకున్నారు. ఎలాంటి అంచనాలకు లేకుండా రిలీజై దాదాపు రూ.45 కోట్ల మేర కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆల్రెడీ దీని తెలుగు వెర్షన్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని త్వరలో తెలుగులో రీమేక్ చేయబోతున్నారని, ఇందులో ప్రముఖ నటుడు-దర్శకుడు తరుణ్ భాస్కర్.. లీడ్ రోల్ చేయనున్నాడని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: రవితేజ మల్టీప్లెక్స్.. పూజా కార్యక్రమంలో కుమార్తె 'మోక్షద' సందడి) -
'ఉప్పెన' రీమేక్.. స్టార్ హీరోయిన్ చెల్లెలుకు ఛాన్స్
తెలుగు చిత్రం 'ఉప్పెన' పేరుకు తగ్గట్టుగానే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్. అయినా చిత్రం సంచలన విజయం సాధించింది. వర్ధమాన నటుడు వైష్ణవ తేజ్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంతోనే కృతి శెట్టి ఎంట్రీ ఇచ్చింది. నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడు పాత్రలో నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళం, బాలీవుడ్లో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తాజాగా రామ్ చరణ్- జాన్వీకపూర్ల కొత్త ప్రాజెక్ట్ RC16 సినిమా ఓపెనింగ్ కార్యక్రం జరిగిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బుచ్చిబాబు డైరెక్టర్గా ఉన్నారు. సినిమా ప్రారంభ కార్యక్రమంలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఉప్పెన సినిమా చూశానని అది తనకు బాగా నచ్చిందని చెప్పారట. అంతేకాకుండా ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయాలనే అభిప్రాయం ఉన్నట్లు పేర్కొన్నారట. ఈ క్రమంలో తన చిన్న కూతురు ఖుషి కపూర్ని ఉప్పెన సినిమా చూడమని బోనీ కపూర్ సలహా ఇచ్చారట. ఒకవేళ బాలీవుడ్లో ఉప్పెన చిత్రాన్ని రీమేక్ చేస్తే అందులో హీరోయిన్గా ఖుషి కపూర్ను సెట్ చేయాలని ఆయన ప్లాన్లో ఉన్నారట. ముంబైలోని ధీరూబాయ్ అంబానీ స్కూల్లో ఖుషి కపూర్ విద్యాభ్యాసం పూర్తిచేసింది. లండన్ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ కూడా తీసుకుంది. బాలీవుడ్లో సరైన ఎంట్రీ కోసం ఆమె ఎదురుచూస్తుంది. ఉప్పెన సినిమా అయితే ఆమెకు కరెక్ట్గా సెట్ అవుతుందని బోనీకపూర్ ప్లాన్లో ఉన్నారట. మరీ ఇందులో ఎంతమేరకు నిజం ఉందో తెలియాలంటే బోనీ కపూర్నే క్లారిటీ ఇవ్వాలి. (అక్క జాన్వీ కపూర్తో ఖుషి కపూర్) మరోవైపు ఉప్పెన సినిమాను కోలీవుడ్లో కూడా రీమేక్ చేయాలనే ప్లాన్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తుందట. విజయ్ వారసుడు సంజయ్ దర్శకత్వం వహించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ తమిళ్లో ఉప్పెన రీమేక్ అయితే అందులో కృతి శెట్టినే హీరోయిన్గా ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువ అని చెప్పవచ్చు. ఇప్పటికే పలు సినిమాలతో కోలీవుడ్లో కృతి శెట్టి బిజీగా ఉంది. ఉప్పెన రీమేక్ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇండస్ట్రీలో రూమర్స్ భారీగానే కొనసాగుతున్నాయి. -
సూపర్ హిట్ సినిమా అరుదైన ఘనత.. తొలి భారతీయ చిత్రంగా రికార్డ్!
మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం మూవీకి అరుదైన ఘనత దక్కింది. ఈ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లిష్, స్పానిష్లలో తెరకెక్కించన్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్లో రీమేక్ కానున్న మొదటి భారతీయ చిత్రంగా దృశ్యం నిలవనుంది. ఈ చిత్రాన్ని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్ను సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే దృశ్యం సిరీస్ చిత్రాలను కొరియన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా హాలీవుడ్కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో హలీవుడ్ దృశ్యంలో నటీనటులుగా ఎవరు కనిపించనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాగా.. త్వరలోనే మలయాళంలో దృశ్యం 3 రానుంది. -
మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ మధ్యే మోకాలికి చిన్నపాటి సర్జరీ చేయించుకున్న ఆయన.. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని, కొత్త ప్రాజెక్ట్స్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ మధ్యే 'భోళా శంకర్' సినిమాతో థియేటర్లలోకి వచ్చిన చిరు.. కెరీర్లోనే ఘోరమైన డిజాస్టర్ని అందుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీ వల్ల మెగాస్టార్ చిరు.. తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవిని కంప్లీట్ యాక్టర్ అనొచ్చు. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా ఆయన సినిమాలు చేస్తున్నారు. హిట్, బ్లాక్బస్టర్ సినిమాలతో పాటే ఫ్లాప్స్ని కూడా చూశారు. అయితే అప్పట్లో అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి జనాలకు పెద్దగా తెలిసేది కాదు. కానీ 'ఆచార్య', 'భోళా శంకర్' చిత్రాలు మాత్రం ఫ్లాప్ కావడంతో పాటు విపరీతమైన ట్రోలింగ్కి గురయ్యాయి. (ఇదీ చదవండి: డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్న విజయ్ కొడుకు.. సినిమా కన్ఫర్మ్) రీఎంట్రీలో తప్పటడుగులు వేస్తున్న చిరు.. 'ఖైదీ నం.150', 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్' రీమేక్స్లో నటించారు. కానీ వాటి ఫలితం ఏంటనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా రీమేక్స్ దెబ్బకొడుతున్నా సరే.. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బ్రో డాడీ' రీమేక్ చేయబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం అయితే ఇప్పటివరకు లేదు. అయితే 'భోళా శంకర్' రిజల్ట్ చిరుని ఆలోచనలో పడేసిందట. దీంతో ఇకపై రీమేక్స్ చేయకూడదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఓ నిర్మాత.. మలయాళ చిత్ర రీమేక్స్ రైట్స్ పట్టుకుని మెగాస్టార్కి దగ్గరకి వెళ్తే.. సున్నితంగా నో చెప్పేశారట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీన్నిబట్టి చూస్తుంటే కాస్త లేట్ అయినా సరే చిరు.. స్ట్రెయిట్ సినిమాలే చేస్తారనమాట. (ఇదీ చదవండి: కేఏ పాల్ని కలిసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడారు?) -
మెగా బ్రదర్స్కు రీమేక్స్ నేర్పుతున్న పాఠాలు!
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం 'రీమేక్'. మంచి కథ చెప్పాలనో లేదా పని ఈజీ అయిపోతుందనో తెలీదు కానీ స్టార్ హీరోల దగ్గర నుంచి దర్శకనిర్మాతల వరకు రీమేక్స్పై అప్పుడప్పుడు మోజు పడుతుంటారు. అయితే ఈ మధ్య ఆ సరదా కొంచెం ఎక్కువైంది. మెగాబ్రదర్స్నే తీసుకుంటే.. ఈ మధ్యే వారాల వ్యవధిలో తలో రీమేక్ సినిమాని రిలీజ్ చేశారు. వీటికి పాజిటివ్ కంటే నెగిటివ్ టాక్ ఎక్కువొచ్చింది. చిరంజీవి-పవన్ ఈ రీమేక్స్లో నటించడం ఓ కారణమైతే, అవి రెండు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవడం మరో కారణం. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: 'జైలర్'కి మరో హీరో అనిరుధ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లు!) చిరంజీవి 'భోళా శంకర్'.. అప్పుడెప్పుడో 2015లో తమిళంలో వచ్చిన 'వేదాళం' సినిమాకు రీమేక్. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడే మెగా అభిమానులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ వాళ్ల బాధ పట్టించుకునే నాథుడు ఎవరు? ఇక మెహర్ రమేశ్ దర్శకుడు అని తెలియగానే గగ్గోలు పెట్టారు. ఏం చేస్తాడో ఏంటో అని భయపడ్డారు. ఇప్పుడు వాళ్లు అనుకున్నదే నిజమైంది. ఎప్పుడో జమానా కాలంలో తీయాల్సిన మూవీ ఇప్పుడు తీశారని, చిరు ఇమేజ్ డ్యామేజ్ చేశాడని బండ బూతులు తిడుతున్నారు! మెగాస్టార్ చిరంజీవి అసలు 'భోళా శంకర్' ఎందుకు చేశారనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే కమల్హాసన్, రజనీకాంత్, మోహన్లాల్, మమ్ముట్టి.. చిరుతో పాటు దక్షిణాదిలో ఆయా భాషల్లో పేరు తెచ్చుకున్న స్టార్ హీరోలు. వాళ్లందరికీ రియాలిటీ అర్థమై, వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. చిరు కూడా ఆ తరహా కథలను ఎంచుకుంటే బెటర్. భోళా.. లాంటి సినిమాలు ఒకప్పుడు ఆడేవేమో కానీ ఇప్పుడు అయితే చాలా కష్టం. ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా. ఏ చిన్న తప్పు దొరికినా ఏకిపారేస్తారు. ఇప్పుడు వాళ్లకు 'భోళా శంకర్' దొరికింది. ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్తో యంగ్ హీరో పెళ్లి... డేట్ కూడా ఫిక్స్!) చిరు సంగతి ఇలా ఉంటే పవన్ పరిస్థితి ఇంకా విచిత్రం! రీఎంట్రీ తర్వాత పవన్ మూడు సినిమాలు చేస్తే.. అవన్నీ హిందీ, మలయాళ, తమిళంలో వచ్చిన చిత్రాలకు రీమేక్స్. పని తక్కువ, రెమ్యునరేషన్ ఎక్కువ వస్తుందనే ఆలోచనతో సినిమాలు చేశాడు! ఫ్యాన్స్ ఏమో దీన్ని 'మహా ప్రసాదం' అన్నట్లు హడావుడి చేశారు. కట్ చేస్తే సాధారణ ప్రేక్షకుడు మాత్రం 'మాకేంటి ఈ ఖర్మ' అని తనలో తానే తిట్టుకున్నాడు. అయితే మెగా బ్రదర్స్ చేస్తున్న రీమేక్స్ మెగా అభిమానులని ఎంటర్టైన్ చేయొచ్చు. కానీ సాధారణ ప్రేక్షకుడి మాత్రం వీళ్లకు మెల్లగా దూరమైపోతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. కాస్త లేటయినా సరే స్ట్రెయిట్ కథలతో సినిమాలు చేస్తే పర్లేదు. అలా కాదు మేం రీమేక్స్ చేస్తాం అనుకుంటే మాత్రం మెగాస్టార్, పవర్స్టార్ అనే ట్యాగ్స్ హిస్టరీలో తప్ప రియాలిటీలో కనిపించవు! అభిమానులకు బాధగా అనిపించినా సరే ఇదే నమ్మలేని నిజం. (ఇదీ చదవండి: జైలర్ కలెక్షన్స్: టైగర్ కా హుకుం.. రికార్డులే రికార్డులు) -
వరుస రీమేక్స్పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
మెగా అభిమానులని ఈ మధ్య కాలంలో బాగా బాధపెడుతున్న విషయం ఒక్కటే. అది రీమేక్స్. మెగా బ్రదర్స్ ఇద్దరూ వరసగా రీమేక్ చిత్రాలు చేస్తున్నారు. వాళ్ల వైపు నుంచి రీజన్ ఏంటనేది పక్కనబెడితే.. సాధారణ ప్రేక్షకులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయమై వచ్చే ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విమర్శలు ఏకంగా మెగాస్టార్ చెవిన పడ్డట్లు ఉన్నాయి. దీంతో అసలు రీమేక్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందనేది ఫుల్గా క్లారిటీ ఇచ్చేశారు. నచ్చి చేశాను 'అమ్మ ప్రేమ.. అభిమానుల ప్రేమ ఎప్పుడూ బోర్ కొట్టదు. అది చల్లగా మదిని హత్తుకుంటుంది. అందుకే మీరందరూ గర్వపడేలా ఉండాలని ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటాను. ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ ముందుకెళ్తున్నాను. నా మనసుకు నచ్చి చేసిన సినిమా ఇది. రీమేక్స్ చేస్తుంటారేంటని కొందరు తరుచూ అడుగుతున్నారు.' (ఇదీ చదవండి: 'ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది'.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్) రీమేక్.. తప్పేంటి? 'ఓ మంచి కథ దొరికినప్పుడు.. దాన్ని మన ప్రేక్షకులకు చూపించేందుకు రీమేక్ చేస్తే తప్పేంటనేది నాకు అర్థం కాదు. ఈ 'భోళా శంకర్' ఒరిజినల్ 'వేదాళం' ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేదు. ఎవరూ చూడలేదు. అందుకే ధైర్యంగా ఈ మూవీ చేసేందుకు ముందుకొచ్చాను. ఇది కచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఇది సూపర్హిట్ అవుతుందనే భరోసా అందరిలో కనిపించింది' అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇది మూడో రీమేక్ మెగాస్టార్ చిరంజీవి.. 2007 తర్వాత దాదాపు పదేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. ఇక రీఎంట్రీ చిత్రం 'ఖైదీ నం.150'.. తమిళ సినిమా 'కత్తి'కి రీమేక్. ఇది బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది. దీని తర్వాత 'సైరా', 'ఆచార్య' చిత్రాలు చేసిన చిరుకు నిరాశే మిగిలింది. దీంతో మళ్లీ రూట్ మార్చారు. మలయాళ 'లూసిఫర్' రీమేక్తో 'గాడ్ ఫాదర్'గా వచ్చారు. ఇది ఓ మాదిరి హిట్ అయింది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' స్ట్రెయిట్ మూవీ కానీ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు చేస్తున్న 'భోళా శంకర్'.. అప్పుడెప్పుడో 2015లో తమిళంలో వచ్చిన 'వేదాళం'కి రీమేక్. మరి దీని టాక్ ఏంటో తెలియాలంటే ఆగస్టు 11 వరకు వెయిట్ చేయాల్సిందే. (ఇదీ చదవండి: వాళ్ల నాన్నకు సర్జరీ జరిగింది.. కానీ: హీరోయిన్పై మెగాస్టార్ కామెంట్స్) -
'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?
సూపర్స్టార్ రజినీకాంత్ 'జైలర్' విడుదలకు రెడీ అయిపోయింది. తెలుగులో పెద్దగా బజ్ లేదు. అయితే రీసెంట్గా విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు కాస్త పెరిగాయి. రజినీ స్టైల్, స్వాగ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఎందుకంటే తలైవాకు సరైన హిట్ పడి చాలా కాలమైపోయింది. ఇలాంటి టైంలో 'జైలర్' ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఓ వివాదం 'జైలర్' ఎలా ఉండబోతుందో అనే విషయం ఆగస్టు 10న తెలిసిపోతుంది. కాపీ అనేది పక్కనబెడితే ఇప్పటికే టైటిల్ విషయమై ఓ వివాదం నడిచింది. 'జైలర్' టైటిల్ తమదని మలయాళ దర్శకుడు సక్కిర్ మడతిల్ కోర్టుని ఆశ్రయించారు. మార్కెట్ పరంగా తమ చిత్రానికి నష్టం రాకూడదని సన్ పిక్చర్స్ సంస్థ కోర్టుని ఆశ్రయించింది. ఆగస్టు 2న హియరింగ్ జరగ్గా.. తీర్పు ఏంటనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) కథ కాపీ కొట్టారా? ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం.. 'జైలర్' ఫస్టాప్లో ఓ అమాయకుడిలా కనిపిస్తాడు. ఇంట్లో కొడుకు, మనవడు, భార్య.. ఇలా ప్రతి ఒక్కరూ అతడితో ఆడేసుకుంటూ ఉంటారు. అయితే అతడు బయటకు కనిపిస్తున్నది వేరు, గతం వేరే అనే విషయం తెలుస్తుంది. తనలో అసలు సిసలు యాక్షన్ ని బయటకు తీస్తాడు. తర్వాత ఏం జరిగింది? అనేది స్టోరీ అని తెలుస్తోంది. కథ ఒకేలా ఉందే? అయితే 'జైలర్' సినిమాకు 2021లో వచ్చిన హాలీవుడ్ మూవీ 'నోబడీ'తో పోలికలు కనిపిస్తున్నాయి. ఇందులోనూ ఓ వయసైపోయిన వ్యక్తి.. భార్యబిడ్డలతో బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో రష్యన్ మాఫియాతో తలపడతాడు. తనని 'నోబడీ' అనుకున్న వాళ్లందరికీ షాకిస్తాడు. 'జాన్ విక్' టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య పోలికలు కనిపిస్తుండడంతో కాపీ కొట్టారనే ప్రచారం జరుగుతోంది. థియేటర్లలోకి 'జైలర్' వస్తే గానీ దీనిపై క్లారిటీ రాదు. (ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక) -
'నాయట్టు' రీమేక్.. తెలుగులో ఇన్నాళ్లకు
2021లో మలయాళంలో విడుదలై అద్భుతమైన ఆదరణ దక్కించుకున్న మరో హిట్ సినిమా తెలుగులో రీమేక్కు రెడీ అయిపోయింది. చాలారోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటికీ ఇన్నాళ్లకు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఎవరెవరు నటిస్తున్నారు అనే వివరాలతో పాటు ఇతర విషయాల్ని ఇన్నాళ్లకు వెల్లడించారు. (ఇదీ చదవండి: తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్, సిస్టర్గా!) ఈ ప్రాజెక్ట్కు 'కోటబొమ్మాళి PS' అనే పేరు ఖరారు చేశారు. రాజకీయ నాయకులు, పోలీసుల మధ్య జరిగే పరిణామాల ఆధారంగా నడిచే కథ ఇది. ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో, వరలక్ష్మి శరత్కుమార్ స్పెషల్ రోల్లో కనిపించనున్నారు. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తేజ మార్ని దర్శకుడు. రంజిన్ రాజ్-మిధున్ ముకుందన్ సంగీతం సమకూర్చారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. 'నాయట్టు' కథేంటి? రాష్ట్రంలో ఎన్నికల జరిగే టైమ్. ఓ చిన్న ఊరిలో ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్కు ఓ కులానికి చెందిన వ్యక్తుల మధ్య పోలీస్ స్టేషన్ లో చిన్న ఘర్షణ జరుగుతుంది. దానికి రాజకీయం తోడవడంతో పరిస్థితులు మారపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సై, కానిస్టేబుల్స్ ప్రయాణిస్తున్న జీపు ఢీకొని.. గొడవలో ప్రధాన వ్యక్తి స్నేహితుడు చనిపోతాడు. దీంతో వీళ్ల ముగ్గురిని బంధించి హత్య కేసు పెట్టమని ఆర్డర్స్ వస్తాయి. దీంతో ఎస్పై, ఇద్దరు కానిస్టేబుల్స్ తప్పించుకుంటారు. చివరకు ఏమైందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) -
టమాటా చిత్ర కథ: అహ నా టమాటంట
‘చికెన్ తినాలంటే చికెన్ మాత్రమే తిననక్కర్లేదు. గాల్లో వేలాడుతున్న కోడిని చూస్తూ, ఊహించుకుంటూ బ్రహ్మాండంగా తినవచ్చు’ అనే గొప్ప సత్యాన్ని ‘అహ నా పెళ్లంట’ సినిమాలో లక్ష్మీపతి (కోట శ్రీనివాసరావు) జనులకు చెప్పకనే చెప్పారు. ‘ఇప్పుడు ఆ సినిమాని రీమేక్ చేస్తే గాలిలో వేలాడుతున్న కోడికి బదులు టమాటాలు ఉంటాయి’ అని నెటిజనులు ఒకటే జోకులు! ఒక మహిళ దుబాయ్కి వెళ్లింది. ఇండియాకు తిరిగి వచ్చే ముందు...‘నీ కోసం ఏం తీసుకురమ్మంటావు?’ అని తల్లిని అడిగింది. ‘బంగారు నగలో, లగ్జరీ గిఫ్టో అడిగి ఉంటుంది’ అని అనుకుంటారు చాలామంది. కానీ ఆ తల్లి బంగారం కంటే విలువైన టమాటాలను అడిగింది. ఒకటి కాదు రెండు కాదు...‘పది కిలోల టమాటాలు తీసుకురామ్మా’ అని కూతురిని అడిగింది. పదికిలోల టమాటాలను పెరల్పెట్ స్టోరేజ్ జార్లలో ప్యాక్ చేసి ఇండియాకు తీసుకువచ్చింది కూతురు. ఈవిడ సోదరి ట్విట్టర్లో షేర్ చేసిన దుబాయ్ టమాటాల స్టోరీ వైరల్ అయింది. ∙∙ బంగారు నగలు అంటే ఎవరికి మాత్రం మక్కువ ఉండదు? అయితే టమాటాలేమో బంగారం కంటే విలువైపోయాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ ‘యూరేకా... టమాటాలతో ఆభరణాలు’ అని అరిచింది. టమాటాలను చెవిరింగులుగా ధరిస్తూ ‘న్యూ గోల్డ్’ కాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో ఫొటో షేర్ చేసింది. ∙∙ శిల్పాశెట్టి షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ 11 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక వీడియో విషయానికి వస్తే... టమాటాల కోసం సూపర్మార్కెట్కు వెళుతుంది శెట్టి. టమాటాలన్నీ కూడబలుక్కొని ‘టచ్మీ నాట్’ అన్నట్లుగా చూస్తుంటాయి. టమాటాలను చేతిలో తీసుకున్న ప్రతిసారీ ఆమె నటించిన ‘దడ్కన్’ సినిమాలోని ‘ఖబడ్దార్. హౌ డేర్ యూ’ అనే డైలాగ్ ప్లే అవుతుంటుంది! -
అసలు ఈ డిజాస్టర్ ఏంటి?.. ఆ సాంగ్పై షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్స్!
ఒకప్పుడు బాలీవుడ్ అంటే మెలోడీ సాంగ్స్, హిట్ సినిమాలే గుర్తొచ్చేవి. కానీ ఆ పరిస్థితి తలకిందులైంది. ఇటీవల పఠాన్ సినిమా మినహాయిస్తే వరుస ఫ్లాప్ సినిమాలే దర్శనమిస్తున్నాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ రీమేక్లపై ఆధారపడిందంటూ పలువురు సినీ ప్రముఖుల నుంచి విమర్శలొచ్చాయి. దీంతో రోజు రోజుకీ హిందీ చిత్రాల పరిస్థితి మరింత దిగజారిపోతోంది. (ఇది చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!) దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో పోటీ పడుతుంటే.. బాలీవుడ్ మాత్రం ఇంకా రీమేక్లపైనే ఆధారపడుతోంది. అయితే ఈ సారి ఏకంగా ఓ పాకిస్థానీ పాటను రీమేక్ చేయడంతో బాలీవుడ్ రేంజ్ మరింత దిగజారింది. యంగ్ హీరో ఇటీవలే అల వైకుంఠపురములో చిత్రాన్ని హిందీలో 'షెహజాదా' పేరుతో రీమేక్ చేసి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. అయితే తాజాగా ఆయన నటించిన సత్యప్రేమ్ కీ కథ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో గ్లోబల్ స్థాయిలో ఫేమస్ అయిన పాకిస్థానీ పాట 'పసూరి'ని రీమేక్ చేశారు. గతేడాది ఎక్కువమంది యూట్యూబ్ లో వెతికిన వాటిలో ఈ సాంగ్ అగ్రస్థానంలో నిలిచింది. దీన్నే కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా 'సత్యప్రేమ్ కీ కథ' చిత్రంలో వాడేశారు. ఇప్పటికే చిత్రబృందం ఈ సాంగ్ రిలీజ్ చేయగా నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ సైతం స్పందించారు. ఈ మేరకు ఆయన కాస్తా ఫన్నీగా ట్వీట్ చేశారు. అసలేంటీ ఈ డిజాస్టర్ అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్స్ కూడా అదేస్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ కూడా చేశా.. విడాకులపై గజినీ హీరోయిన్!) కాగా.. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిస్తోన్న సత్య ప్రేమ్ కి కథ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. భూల్ భూలయ్యా- 2 తర్వాత ఈ జంట మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. Aye ki pasoori paayi ay. — Shoaib Akhtar (@shoaib100mph) June 27, 2023 -
పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!
ఒకప్పుడు బాలీవుడ్ పేరు చెప్పగానే మెలోడీ పాటలు, హిట్ సినిమాలే గుర్తొచ్చేవి. ఇప్పుడేమో ఘోరమైన ఫ్లాప్ సినిమాలే కనిపిస్తున్నాయి. రోజురోజుకీ హిందీ చిత్రాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఎంతలా అంటే అక్కడి ప్రేక్షకులు.. దక్షిణాది చిత్రాల కోసం ఎదురుచూసేంతలా. ఇప్పుడు అదంతా కాదన్నట్లు ఓ పాట వల్ల కొత్త విమర్శలు వస్తున్నాయి. బాలీవుడ్ లోని ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కార్తిక్ ఆర్యన్ ఒకడు. ఇతడు చేసిన సినిమాల్లో కొన్ని రీమేక్స్ ఉన్నాయి. అయినా వన్ ఆఫ్ ది టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇతడి సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ పలు చిత్రాల్లో నుంచి కాపీ కొట్టి తీసినట్లు అనిపిస్తాయి. ఈ ఏడాది 'షెహజాదా'తో ఘోరమైన ఫ్లాప్ అందుకున్నాడు. ఇది 'అల వైకుంఠపురములో' చిత్రానికి రీమేక్. (ఇదీ చదవండి: 'కార్తీకదీపం 2'పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్బాబు!) ఇలా పలు మూవీల్ని రీమేక్ చేయడం వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న పాటని కూడా రీమేక్ చేసి పడేశాడు. గతేడాది ఎక్కువమంది యూట్యూబ్ లో వెతికిన వాటిలో పాకిస్థానీ పాట 'పసూరి' అగ్రస్థానంలో నిలిచింది. దీన్నే కార్తిక్ ఆర్యన్ కొత్త సినిమా 'సత్యప్రేమ్ కీ కథ' కోసం వాడేశారు. తాజాగా ఈ గీతాన్ని రిలీజ్ చేయగా నెటిజన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ప్రస్తుతం దక్షిణాది సినిమాల డామినేషన్ కనిపిస్తోంది. మన దర్శకులు, హీరోలు కొత్త సినిమాలతో నార్త్ ఆడియెన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరోవైపు హిందీ హీరోలేమో పరాయి దేశాల పాటల్ని కూడా వదలట్లేదు. నిర్ధాక్షణ్యంగా రీమేక్ చేసి పడేస్తున్నారు. ఇదంతా చూస్తున్న నెటిజన్స్ కి బాలీవుడ్ పై రోజురోజుకీ విరక్తి కలుగుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు! (ఇదీ చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!) -
రీమేక్ మూవీలో నాగ చైతన్య.. క్లారిటీ ఇదే!
అక్కినేని హీరో నాగ చైతన్య ఇటీవలే కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. వెంకట్ ప్రభు డైరెక్షన్లో తమిళ, తెలుగులో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించారు. అయితే తాజాగా నెట్టింట్లో ఓవార్త చక్కర్లు కొడుతోంది. (ఇది చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్!) ఇటీవల హిందీలో విడుదలైన కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ నటించిన చిత్రం భూల్ భూలయ్యా-2. హిందీలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం తెలుగు రీమేక్లో అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్నారంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతే కాకుండా ఈ చిత్రంలో టబు పాత్రలో జ్యోతిక కూడా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరలైంది. (ఇది చదవండి: చిన్న సూట్కేసుతో ముంబై వచ్చా.. చేతిలో డబ్బుల్లేక: నటి) తాజాగా ఈ వార్తలపై నాగచైతన్య టీం స్పందించింది. నాగ చైతన్య ఎలాంటి రీమేక్ చిత్రంలో నటించడం లేదంటూ ప్రకటన విడుదల చేసింది. భూల్ భూలయ్య-2 రీమేక్పై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని మీడియాను అభ్యర్థిస్తున్నాం అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. గతంలో అమీర్ ఖాన్తో కలిసి లాల్ సింగ్ చద్దాలో నాగ చైతన్య బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. -
కొరియాలో దృశ్యం
భారతీయ ‘దృశ్యం’ కొరియా తెరపైకి వెళ్లనుంది. మోహన్లాల్ హీరోగా, మీనా, ఆశా శరత్, అన్సిబా హాసన్, సిద్ధిఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ అయి హిట్ అయింది. ‘దృశ్యం’ తర్వాత మోహన్లాల్–జీతూజోసెష్ కాంబోలో వచ్చిన ‘దృశ్యం 2’ కూడా వీక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇక దృశ్యం సినిమా హిందీ రీమేక్లో అజయ్ దేవగన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కాగా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ కొరియాలో రీమేక్ కానుంది. సౌత్ కొరియా ఆంథాలజీ స్టూడియోస్, ఇండియన్ పనోరమ స్టూడియోస్ పతాకాలపై చోయ్ జే వోన్, కుమార్ మంగత్ పాఠక్ హిందీ ‘దృశ్యం’ ని కొరియాలో రీమేక్ చేయనున్నారు. ఫ్రాన్స్లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోవత్సాల్లో ఈ విషయాన్ని చోయ్ జే, మంగత్ పాఠక్ ప్రకటించారు. ఇండియన్, కొరియన్ ప్రొడక్షన్ హౌస్లు కలిసి ఓ సినిమాను నిర్మిస్తుండటం ఇదే తొలిసారి. ‘‘సాధారణంగా కొరియన్ చిత్రాలు భారతీయ భాషల్లో రీమేక్ అవుతుంటాయి. కానీ, ఇప్పుడు ఓ ఇండియన్ సినిమా కొరియాలో రీమేక్ అవుతుంది’’ అన్నారు పాతక్. -
స్పెషల్ ఫోకస్
బాలీవుడ్పై జ్యోతిక స్పెషల్ ఫోకస్ పెట్టినట్లున్నారు. వరుసగా ఆమె హిందీ ప్రాజెక్ట్స్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇరవయ్యేళ్ల తర్వాత ఇటీవల హిందీ చిత్రం ‘శ్రీ’లో నటించారు జ్యోతిక. వ్యాపారవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్గా రూపొందిన ఈ సినిమాలో రాజ్కుమార్ రావు టైటిల్ రోల్ చేశారు. అలాగే ఓ హిందీ వెబ్ సిరీస్కు జ్యోతిక సైన్ చేశారనే టాక్ కొన్ని నెలల క్రితం బీటౌన్లో బలంగా వినిపించింది. తాజాగా మరో హిందీ ప్రాజెక్ట్కు జ్యోతిక సై అన్నారు. వికాస్ బాల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా హిందీలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో అజయ్ దేవగన్ భార్య పాత్రలో జ్యోతిక కనిపిస్తారట. గుజరాతీ ఫిల్మ్ ‘వష్’కు ఈ చిత్రం రీమేక్ అని భోగట్టా. -
'ప్రాజెక్ట్-k' ఆ హాలీవుడ్ మూవీకి రిమేకా! షాక్ లో ప్రభాస్ ఫ్యాన్స్
-
ఈ నెలలోనే ఛత్రపతి
బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఛత్రపతి’. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకి వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. నుష్రత్ బరుచ్చా హీరోయిన్గా నటించారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ (2005)ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో పెన్ స్టూడియోస్పై ధవల్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ని విడుదల చేశారు మేకర్స్. ‘‘తెలుగు ‘ఛత్రపతి’ సినిమా బ్యాక్డ్రాప్ని మార్చి, యాక్షన్ ఎంటర్టైనర్గా హిందీ ‘ఛత్రపతి’ని తెరకెక్కించారు వినాయక్. శ్రీనివాస్ రగ్డ్ అండ్ మాస్ లుక్లో కనిపిస్తాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించాడు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నిజార్ అలీ షఫీ, సంగీతం: తనిష్క్ బాగ్చి, వరల్డ్ వైడ్ విడుదల: పెన్ మరుధర్ సినీ ఎంటర్టైన్మెంట్. -
ఓటీటీకి వచ్చేసిన 'అల వైకుంఠపురములో'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హేగ్డే హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'అల వైకుంఠపురములో'. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. టాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమాను హిందీ రీమేక్గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించారు. బాలీవుడ్లో 'షెహజాదా' పేరుతో రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అభిమానులను అంతగా ఆకట్టులేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఏప్రిల్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రీమేక్ సినిమా చేస్తే ఆ డైరెక్టర్ కెరీర్ క్లోజ్ అయినట్టే
-
కలెక్షన్స్ లో షాక్ ఇస్తున్న రీమేక్ సినిమాలు
-
సౌత్ సినిమాలతో హిట్ కొడుతున్న జాన్వీ కపూర్
-
హిట్టు కోసం అలా చేయడం నాకు చేతకాదు : కృష్ణవంశీ
ట్రెండ్ అనేది ఉందా? నో అంటారు కృష్ణవంశీ. ప్రేక్షకుల మైండ్సెట్ మారిందా? అస్సలు కానే కాదు అంటారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ఇంకా చాలా విషయాలు చెప్పారు. ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ముఖ్య తారలుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ మార్తాండ’. మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కి రీమేక్గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్లో విడుదల కానుంది. ఇక కృష్ణవంశీ ఇంటర్వ్యూలోకి వెళదాం... ► మీ కెరీర్లో ‘రంగ మార్తాండ’ రెండో రీమేక్ (నాగార్జునతో తీసిన ‘చంద్రలేఖ’ మలయాళ రీమేక్ ). మళ్లీ రీమేక్ సినిమా చేయాలని ఎందుకనుకున్నారు.. కథలు రాయలేకపోతున్నారా? కృష్ణవంశీ : (నవ్వుతూ)... కథలు రాయలేకపోవడం కాదు. ‘రంగ మార్తాండ’ నేను చేయాలనుకున్నది కాదు. మరాఠీ సినిమా ‘నట సామ్రాట్’ రీమేక్లో నటించడంతో పాటు డైరెక్ట్ చేయాలనుకున్నాడు ప్రకాశ్రాజ్. ‘ఈ సినిమాని రీమేక్ చేయా లనుకుంటున్నాను. నాకు స్క్రీన్ ప్లేలో సహాయం చెయ్’ అని అడిగాడు. ఒకరోజు రాత్రి కూర్చుని చూడటం మొదలెట్టా.. ఒకచోట కాదు ఐదార్లు చోట్ల ఏడుపొచ్చేసింది. ‘ఇది ఎక్స్ట్రార్డినరీ సినిమా. రీమేక్ చెయ్, నీకు ఎలాంటి సహాయమైనా నేను చేస్తాను’ అని ప్రకాశ్తో అన్నాను. ‘నేను డైరెక్ట్ చేసి యాక్ట్ చేయడం కంటే నువ్వెలాగూ ఎమోషన్స్ని అద్భుతంగా డీల్ చేస్తావు. నన్ను కూడా బాగా డీల్ చేస్తావు. నువ్వు డైరెక్ట్ చేస్తే బావుంటుంది. నాకోసం చెయ్’ అన్నాడు. సరే అన్నాను. అలా ‘రంగ మార్తాండ’ ప్రాజెక్ట్లోకి వచ్చాను. ► ‘నట సామ్రాట్’లో మిమ్మల్ని అంతగా కదిలించినదేంటి? ఇది మన తల్లిదండ్రుల కథ. మన తల్లిదండ్రులకు కావాల్సినంత విలువ ఇస్తున్నామా? లేదా గౌరవించి తప్పుకుంటున్నామా? అనే పాయింట్ ఉంది. సామాజిక పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ వల్ల మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మారుతోంది. సక్సెస్ సాధించాలని పరుగు తీయడంలోనో, అందరితో పొగిడించుకోవాలనే ప్రయత్నంలోనో, అందరికంటే అధికుణ్ణి అనిపించుకోవాలనే తపనలోనో మనల్ని మనం కోల్పోతున్నాం. అది ‘నట సామ్రాట్’లో నాకు కనిపించింది. ఇది ఒక స్టేజ్ యాక్టర్ కథ. అతను స్టేజ్ మీద విలువలతో బతికినవాడు.. బ్రహ్మాండమైన నటుడు. అందుకే ‘రంగ మార్తాండ’ అనే బిరుదు ఇస్తారు. ఆ బిరుదు వచ్చిన రోజునే అతను నటనకి రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు. అప్పటివరకూ నటుడిగా రంగుల ప్రపంచం, నిరంతరం చప్పట్ల మధ్య ఉండే అతను నిజ జీవితంలో తండ్రిగా, తాతగా, భర్తగా, స్నేహితుడిగా తన పాత్ర పోషించే సమయంలో లైఫ్లో ఎంతమంది నటులున్నారో తెలుస్తుంది. అతను నమ్మిన ఆదర్శాలకు, బయట నిజాలకు క్లాష్ అవుతుంది. తల్లిదండ్రులు స్వార్థపరులయిపోయారు. పిల్లలు స్వార్థపరులయిపోయారు అని నిందించకుండా ఎవరి పాయింట్లో వాళ్లే కరెక్ట్ అన్నట్టు చూపిస్తూ, వాళ్ల మధ్య క్లాష్ ఎలా వస్తుంది? అనేదే ఈ కథ. ► ‘రంగ మార్తాండ’ మళ్లీ మిమ్మల్ని హిట్ ట్రాక్లోకి తీసుకుని వస్తుందనుకుంటున్నారా? నేను ఇలా చెబితే నమ్మశక్యంగా ఉంటుందో లేదో తెలియదు కానీ హిట్ కోసం నేనెప్పుడూ సినిమా తీయలేదు. తీసిన తర్వాత జనానికి నచ్చితే హిట్ అవుతుంది అనుకునేవాణ్ణి. హిట్ కోసం తీయాలంటే అప్పటికి మార్కెట్లో ఉన్న హిట్ ఫార్ములాని వాడాలనిపిస్తుంది. అప్పుడు అది సినిమా మ్యానుఫాక్చరింగ్ అవుతుంది తప్ప మేకింగ్ అవ్వదు. అలా చేయడం నాకు చేతకాదు. ఒకవేళ హిట్ కోసమే చేసేలా అయితే మంచి థ్రిల్లర్ సబ్జెక్టో, హీరో ఓరియంటెడ్ కథలో చేస్తాను కానీ ఇదెందుకు చేస్తాను? ఒకవేళ అలాంటి సినిమాలు తీసినా హిట్ అవుతాయని గ్యారంటీ ఏంటి? నా అనుభవంలో నాకు అర్థమయిందేంటంటే ఎవ్వరూ హిట్ సినిమా తీయలేరు. తీసిన సినిమాలు హిట్ అవుతాయి... అంతే. ► ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా హవా సాగుతోంది. ఈ ట్రెండ్ని మీరెలా చూస్తారు? నా చిన్నప్పటినుంచి మా ఊర్లో హిందీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మన సినిమా (తెలుగు) దేశం నలు మూలలకు వెళుతోంది. అన్ని ప్రాంతాల వాళ్లు ఆదరిస్తున్నారు. ఇది కేవలం సౌత్ సినిమాలా కాకుండా సౌత్ సినిమాని కూడా ఇండియన్ సినిమాగా చేయొచ్చు అనే అర్థంతో పాన్ ఇండియా సినిమా అంటున్నారని అనుకుంటున్నాను. ► మీరు పాన్ ఇండియా సినిమా ట్రై చేస్తారా? ఏమో చెప్పలేం. అది సినిమాను బట్టి ఉంటుంది. ► కరోనా వల్ల ఇండస్ట్రీలో చాలామందికి రెండేళ్లు గ్యాప్ వచ్చింది. కానీ దానికంటే ముందే మీకు రెండేళ్లు గ్యాప్ వచ్చింది.. కారణం? ఆటోమేటిక్గా వచ్చేసింది అలా. ఫ్లాప్ అయిన తర్వాత పుంజుకోవడం కష్టం. హిట్.. ఫ్లాప్ అనేది నేను తీసుకోను. కానీ ఆ ఎఫెక్ట్ నా మీదుంటుంది. హిట్ కోసమని మెట్టు దిగి, దిగజారి ప్రజల్ని మభ్యపెట్టి సినిమా తీయలేను. రాజీ పడలేను. ఎంత ఆకలేసినా సింహం గడ్డి తినదు కదా. గ్యాప్ అయితే ఫ్లాప్స్ వల్లే వచ్చింది. హిట్ ఇస్తుంటేనే ఇండస్ట్రీలో ఫాస్ట్గా ఉంటాం. ► ప్రేక్షకుల మైండ్ సెట్ మారిందని కొంత వల్గర్ కామెడీ, రేంజ్కి మించిన వయొలెన్స్ తీస్తున్నారు కొందరు... దీని గురించి మీరేం అంటారు? ప్రేక్షకుల మైండ్ సెట్ మారలేదని నా అభిప్రాయం. అయినా ఇదో ఫేజ్ అనుకుంటున్నాను. మనం ఆ తరం (పాత సినిమాలు) చూశాం కాబట్టి ఇప్పుడు సినిమాలు చూసి బాధపడతాం. కానీ ఇప్పటివాళ్లు ఇవే చూశారు కాబట్టి వారికి ఇదే కరెక్ట్ అనిపిస్తుందేమో. ► ఫార్ములా ఫాలో కాకపోతే మీరు పోటీలో ఎలా నిలబడతారు? సినిమా తీసే ఫార్మాట్ ఒక్కటే మారింది. బేసిక్ ఎమోషన్స్ అన్నీ అవే. అదే లవ్, అదే ఫ్యామిలీ, అదే విలనిజం అన్నీ అవే. మంచి మీద చెడు గెలుస్తుంది అని చివర్లో చెప్పడం. కొన్నిసార్లు రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతాయి. అలా అని ప్రయాణం మానేస్తామా? మన ప్రయాణం మనది. మనం ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టకుండా, వీలైతే మన వల్ల కొందరైనా పాజిటివ్గా ఉండగలుగుతున్నారా అనేదే మనం పట్టించుకోవాల్సింది. సో.. పోటీ గురించి భయపడటం, బాధపడటం నాకు రాదు. ► అలాగే ఒకప్పుడు ఎమోషన్ అంటే బలంగా చూపించేవారు. ఇప్పుడు కొన్ని చిత్రాల్లో లైటర్వీన్గా కనిపిస్తోంది. అదేమంటే ట్రెండ్ మారిందంటున్నారు... ఎమోషన్ని స్ట్రాంగ్గా చూపించడానికి ఇష్టపడటంలేదా? తెలియడం లేదా? చేతకావడం లేదా? దాసరిగారిలా, కేవీ రెడ్డిగారిలా, విశ్వనాథ్గారిలా సినిమాలు తీయలేం. అలా ఎవ్వరూ తీయలేరు కాబట్టి ట్రెండ్ మారింది అనుకుందామా? కరెక్ట్గా తీయగలిగితే అలా అనుకోనక్కర్లేదా? మరి.. కరెక్ట్గా తీయడం అంటే ఏంటని నన్ను అడగకండి. నాక్కూడా తెలియదు. ‘శంకరాభరణం’ సినిమాను ప్రపంచం ఆదరించింది కదా? ట్రెండ్ అంటూ ఏదీ లేదు. ట్రెండ్ అంటే నా దృష్టిలో బూతు. మనకు రామాయణం, మహాభారతం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నీ అందర్నీ నీతిగా నిజాయితీగా సామరస్యంగా ఉండాలనే బోధించాయి. ఏ మతమయినా ఇదే చెప్పింది. ఇప్పటికీ మనం వాటినే అనుసరిస్తున్నాం. ఇప్పుడు సినిమా కూడా ఒక మతంలా అయిపోయింది. ఏం మాట్లాడాలి? ఏం బట్టలు వేసుకోవాలి? అన్నీ సినిమా చెబుతుంది. సో... అలాంటి మీడియమ్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం ఏం చేసినా సోషల్ బెనిఫిట్ ఉండాలి. ఫ్యామిలీ, ఎడ్యుకేషన్.. ఇలా అన్నింటికీ ఉపయోగపడేలా తీయాలి. ► ‘రంగ మార్తాండ’కి చిరంజీవి చెప్పిన వాయిస్ ఓవర్ గురించి? ఒక నటుడు తనని తనెలా అర్థం చేసుకుంటాడు? అనేది ఓ కాన్సెప్ట్లా అనుకుని, వాయిస్ ఓవర్ చెప్పించాలని అనుకున్నాను. రచయిత లక్ష్మీ భూపాల్తో రెగ్యులర్ పాటలా.. మాటాలా వద్దు.. షాయిరీలా చెప్పిద్దాం.. అలా రాయమని అన్నాను. ఇదే మాట ఇళయరాజాగారికి చెబితే ‘నువ్వు రాయించుకుని తీసుకురా చేద్దాం’ అన్నారు. బ్రహ్మాండంగా వచ్చింది. ఈ వాయిస్ ఓవర్ని ఏదైనా పెద్ద యాక్టర్తో చెప్పిస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు తట్టినవి రెండే పేర్లు. సీనియర్ ఎన్టీఆర్గారు... చిరంజీవిగారు. చిరంజీవిగారికి ఫోన్ చేస్తే, రమ్మన్నారు. వెళ్లి, వివరించాను. షాయరీ ఐడియా విని ఆయన థ్రిల్లయ్యారు. ‘నా గురించి నేను చెప్పుకున్నట్టు ఉంది’ అన్నారు. ► అన్నం’ సినిమా అనౌన్స్ చేశారు? ‘రంగ మార్తాండ’ తర్వాత అదే చేస్తాను. ‘సింధూరం, ఖడ్గం, మహాత్మ’ ఆ జోన్ ఫిల్మ్ ఇది. ఫుడ్ మాఫియా, వ్యవసాయం, అన్నం, మనిషి తన స్వార్థం కోసం ఆవుల్ని, కోళ్లను ఎలా వాడుకుంటున్నాడు? అనేది కాన్సెప్ట్. ► ‘రంగ మార్తాండ’ సినిమాలో ఒక నటుడు తన రియల్ లైఫ్ గురించి ఏం తెలుసుకున్నాడో చూపిస్తున్నారు. మరి.. మీ లైఫ్ని విశ్లేషించుకుంటే మీకేమనిపిస్తోంది? నా అర్హతకి కొన్ని వేల రెట్లు ఎక్కువే ఇచ్చింది ఈ జీవితం. ఇప్పుడు నా మనసిక స్థితి ఎలా ఉందంటే.. ఏం చేసినా అది నేను చేయలేదు. అది (విధి) చేయించింది నాతో. ఎంత కాలం చేయించదలచుకుంటే అంత కాలం చేయిస్తుంది. నేనంటూ ఏం కోరుకోవడం లేదు. మన పుట్టుక మన కంట్రోల్లో లేదు. ఎప్పుడు పోతామో కూడా తెలియదు. మా ఊరి నుంచి మద్రాస్ తోసింది, అక్కడి నుంచి వర్మగారి దగ్గరకు తోసింది హైదరాబాద్కు. అక్కడ నుంచి దర్శకుడిని అయ్యాను. అన్నీ అలా జరుగుతూ వచ్చేశాయి.. అంతే. ► చాలామంది ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.. మీకు ఆ ఉద్దేశం లేదా? వచ్చే ఏడాది చేసే ప్లాన్ ఉంది. ఇప్పుడే చెప్పను కానీ పెద్ద బ్లాస్ట్ అది. 200–300 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఓటీటీలో క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది. స్టార్సే ఉండాలని రూల్ కూడా లేదు. సినిమాను స్వచ్ఛంగా తీయొచ్చు. ► మీ సినిమాల్లో హీరోలతో బ్రహ్మాండంగా నటింపజేశారు. మీ అబ్బాయి రిత్విక్తో సినిమా చేస్తారా? వాడేం అవ్వాలనుకుంటాడో అది వాడి ఇష్టం. కాసేపేమో ఫుట్బాల్ అంటాడు. రేసర్ అంటాడు. యాక్టర్ అంటాడు. ఇప్పుడు టీనేజ్లో ఉన్నాడు కదా. కొత్తది ఏది చూసినా దాని మీదకు ధ్యాస వెళ్లిపోతుంది. ► మీ అబ్బాయి ఏమైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనేం అనుకోవడంలేదు. వాడి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నాకు, రమ్యకృష్ణకి బిడ్డ అయ్యాడంటేనే వాడి అదృష్టం మీకు అర్థం అవుతుంది కదా (నవ్వుతూ). – డి.జి. భవాని -
రీమేక్గా వస్తున్న వెబ్ సిరీస్లు..
ఒక భాషలో హిట్టయిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ కావడం చూస్తూనే ఉంటాం. ఈ ధోరణి ఇప్పుడు వెబ్ సిరీస్ల విషయంలోనూ కనిపిస్తోంది. హిట్ వెబ్ సిరీస్లు ఇతర భాషల్లోకి రీమేక్ అవుతున్నాయి. వెబ్ తెరపై వ్యూయర్స్ను ఎట్రాక్ట్ చేసేందుకు ఇంగ్లిష్ కథలను మన భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఈ ఇంగ్లిష్ కథల్లో నటిస్తున్న ఇండియన్ తారలెవరో చూద్దాం. వెంకటేశ్ కెరీర్లో దాదాపు పాతిక రీమేక్ సినిమాలు ఉంటాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు వెంకీ వెబ్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తొలిసారి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేశారు. అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్’ అనే వెబ్ సిరీస్కి అడాప్షన్ ఈ ‘రానా నాయుడు’. అంటే.. రీమేక్. ఈ వెబ్ సిరీస్లో వెంకటేశ్తో పాటు రానా, ప్రియా బెనర్జీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ ద్వయం దర్శకత్వం వహించారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఏడాదే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ‘రే డోనోవన్’ కథ విషయానికి వస్తే... బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, స్పోర్ట్స్ పర్సన్స్ వంటి వారికి ఎదురైన సమస్యలను పరిష్కరిస్తుంటాడో వ్యక్తి. కానీ తన కుటుంబ సభ్యులు ఎవరైనా సెలబ్రిటీలకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే వాటి జోలికి మాత్రం వెళ్లడు. కుటుంబసభ్యులతో అతనికి ఎటువంటి భేదాభిప్రాయాలు వచ్చాయి? అతని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా జైలుకు వెళ్లారా? అనే అంశాల నేపథ్యంలో సాగుతుందీ వెబ్ సిరీస్. ఈ సిరీస్కి రీమేక్గా వస్తున్న ‘రానా నాయుడు’ ముంబై బ్యాక్డ్రాప్లో ఉంటుంది. మరోవైపు బ్రిటిష్ వెబ్ సిరీస్ ‘ప్రెస్’ అడాప్షన్ ‘ది బ్రోకెన్ న్యూస్’లో నటించారు సోనాలీ బెంద్రే. క్యాన్సర్తో పోరాడి గెలిచిన తర్వాత సోనాలీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చింది ఈ వెబ్ సిరీస్ కోసమే. వినయ్ వైకుల్ డైరెక్ట్ చేసిన ‘ది బ్రోకెన్ న్యూస్’లో సోనాలీతో పాటు జైదీప్ అహ్లావత్, శ్రియా పిల్గొన్కర్ ప్రధాన పాత్రధారులు. ఈ సిరీస్లో అమీనా ఖురేషీ పాత్రలో కనిపిస్తారు సోనాలి. స్క్రిప్ట్ ప్రకారం.. ముంబైలో ‘ఆవాజ్ భారత్’, ‘జోష్ 24/7’ అనే రెండు న్యూస్ చానల్స్ ఉంటాయి. ‘ఆవాజ్ భారత్’ చానెల్ హెడ్గా ఉంటారు అమీనా. ఈ రెండు న్యూస్ చానెల్స్ టీఆర్పీ రేటింగ్ కోసం ఎలా పోటీ పడ్డాయి? టీఆర్పీని పెంచే క్రమంలో ఈ న్యూస్ చానెల్స్లోని సీనియర్ ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడికి లోనయ్యారు? వాటి పరిణామాలు, పరిస్థితుల సమాహారంగా ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. ‘ది బ్రోకెన్ న్యూస్’ ఈ నెల 10 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే బ్రిటిష్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్లో నటిస్తున్నారు బాలీవుడ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్. సందీప్ మోడి దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్లో శోభితా ధూళిపాళ్ల, అనిల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రధారులు. ఆర్మీలో పని చేసిన అనుభవం ఉన్న ఓ వ్యక్తి ఒక ప్రముఖ హోటల్లో నైట్ మేనేజర్ డ్యూటీ చేస్తుంటాడు. ఇదే సమయంలో వ్యాపారవేత్త ముసుగులో చట్టవిరుద్ధంగా ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తుంటాడు మరో వ్యక్తి. ఈ వ్యాపారవేత్తను గమనించేందుకు ప్రభుత్వం కూడా అతని కదలికలపై ఓ స్పై టీమ్ను నియమిస్తుంది. ఇదే సమయంలో నైట్ మేనేజర్తో పరిచయం ఉన్న ఓ యువతి హత్యకు గురవుతుంది? ఈ హత్యకు కారకులు ఎవరు? ఆమెను ఎందుకు హత్య చేశారు. స్పై టీమ్కు, నైట్ మేనేజర్కు ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. నిజానికి ఇందులో హృతిక్ రోషన్ చేయాల్సింది కానీ ఫైనల్గా ఆదిత్యా రాయ్ చేతికి వచ్చి చేరింది. పైన పేర్కొన్న వెబ్ సిరీస్లే కాదు.. మరికొన్ని హాలీవుడ్ సిరీస్లు రీమేక్ కానున్నాయి. -
'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. అక్కడ రీమేక్
Yoo Ji-tae As The Professor In Money Heist: Korea Joint Economic Area: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. దేశాలు, భాషలు దాటేసి మరీ సినిమాలు, సిరీస్లకు మోస్ట్ పాపులారిటీ వస్తోంది. అలా మోస్ట్ పాపులర్ అయిన వెబ్ సీరీస్లలో 'మనీ హెయిస్ట్' ఒకటి. ముందుగా ఈ సిరీస్ స్పానిష్లో 'లా కాసా డె పాపెల్ (ది హౌజ్ ఆఫ్ పేపర్)' అనే టైటిల్తో వచ్చింది. తర్వాత యూఎస్లో ఇదే సిరీస్ను 'మనీ హెయిస్ట్' టైటిల్తో ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో విడుదల చేశారు. బ్యాంకుల దోపిడీ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ సూపర్ హిట్ అయింది. ఇప్పటివరకు ఈ సిరీస్ నుంచి వచ్చిన 5 సీజన్లు మంచి టాక్ తెచ్చుకున్నాయి. అయితే తాజాగా ఈ సిరీస్కు రీమేక్ రాబోతుంది. మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ కొరియన్ భాషలో రీమేక్ కానుంది. 'మనీ హెయిస్ట్: కొరియా- జాయింట్ ఎకనామిక్ ఏరియా పార్ట్ 1' టైటిల్తో కొరియాలో రిలీజ్కు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన విషయాన్ని ప్రకటిస్తూ ఇందులోని ప్రొఫెసర్ పోస్టర్ను విడుదల చేసింది నెట్ఫ్లిక్స్. కొరియన్ 'మనీ హెయిస్ట్లో ప్రొఫెసర్గా 'యూ జి-టే' నటించనున్నాడు. ఈ పోస్టర్లో జాకెట్తో పాటు ఫార్మల్ దుస్తులు ధరించి, స్పెక్ట్స్ పెట్టుకుని ప్రొఫెసర్ ఏదో ఆలోచిస్తున్నట్లు మనం చూడొచ్చు. ఈ సిరీస్ను జూన్ 24 నుంచి ప్రదర్శించనున్నట్లు నెట్ఫ్లిక్స్ పేర్కొంది. చదవండి: స్పానిష్ టీవీ సిరీస్కు ఫుల్ క్రేజ్ ఎందుకంటే.. Get ready to go back to class, The Professor arrives in just 6 weeks 🥳 MONEY HEIST: KOREA - JOINT ECONOMIC AREA ARRIVES ON JUNE 24th 🕺🏻💃 pic.twitter.com/fBtWRU4FQJ — Netflix India (@NetflixIndia) May 13, 2022 ఇదివరకు వచ్చిన 'మనీ హెయిస్ట్'లో ప్రొఫెసర్ పాత్రకు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సిరీస్లోనే కేవలం ప్రొఫెసర్ పాత్రకే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో ప్రొఫెసర్గా అల్వారో మోర్టే నటించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందుకే ప్రస్తుతం వస్తున్న 'మనీ హెయిస్ట్: కొరియా- జాయింట్ ఎకనామిక్ ఏరియా పార్ట్ 1'పై అందులోని ప్రొఫెసర్ పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ఇందులో ప్రొఫెసర్గా నటిస్తున్న 'యూ జి-టే' ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. కాగా వెన్ మై లవ్ బ్లూమ్స్, హీలర్, మ్యాడ్ డాగ్ చిత్రాల్లో అలరించాడు 'యూ జి-టే'. అలాగే దక్షిణ కొరియా సిరీస్ స్క్విడ్ గేమ్ కూడా పాపులర్ అయిన విషయం తెలిసిందే. చదవండి: 'మనీ హెయిస్ట్ సీజన్ 5' ఎమోజీలొస్తున్నాయ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హిందీ ‘జెర్సీ’ చూసిన నాని ఏమన్నాడంటే..
Nani Interesting Comments on Shahid Kapoor: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన హీరో స్టార్ నాని జెర్సీని హిందీలో షాహిద్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల అనంతరం ఈ రోజు(ఏప్రిల్ 22) థియేటర్లో విడుదలైంది. ఇందులో షాహిద్ పాత్రకు సినీ సెలబ్రెటీల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అలాగే ఈ సినిమా చూసిన నాని కూడా చిత్ర యూనిట్పై ప్రశంసలు కురిపించాడు. చదవండి: కన్నడ ప్రేక్షకులకు సారీ చెప్పిన నాని, అసలేం జరిగిందంటే.. హిందీ జెర్సీలో తన రోల్ పోషించిన షాహిద్ను పొగడ్తలతో ముంచెత్తాడు.ఈ మేరకు నాని ట్వీట్ చేస్తూ అర్జున్ పాత్రకు షాహిద్ పూర్తి న్యాయం చేశాడని పేర్కొన్నాడు. ‘జెర్సీ సినిమా చూశాను. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాతో మరోసారి హిట్ కొట్టేనట్టే. షాహిద్కపూర్ అర్జున్ పాత్రను మనస్సు పెట్టి చేశాడు. మృణాళ్ ఠాకూర్, పంకజ్ కపూర్ సర్, మై బాయ్ రోనిత్ (చైల్డ్ యాక్టర్) కూడా చాలా బాగా చేశారు.. నిజమైన మంచి సినిమా ఇది. చిత్రయూనిట్కు నా శుభాకాంక్షలు’ అంటూ నాని రాసుకొచ్చాడు. చదవండి: జెర్సీ సినిమా భరించలేకున్నానంటూ కేఆర్కే రివ్యూ ఇక నాని ట్వీట్కు షాహిద్ సమాధానం ఇచ్చాడు. ‘థాంక్యూ మై ఫ్రెండ్(అర్జున్ నుంచి మరోక అర్జున్). మీది చాలా పద్ద మనసు అందుకే జెర్సీకి ఈ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మోర్ పవర్ టూ యూ’ అంటూ రీట్వీట్ చేశాడు. కాగా ఇప్పటివరకు స్క్రీనింగ్ అయిన షోల వరకు ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇందులో షాహిద్కు జోడిగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ నటించింది. దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సాచెట్ అండ్ పరంపర మ్యూజిక్ అందించారు. Thank you. From one Arjun to another. Big love my friend. You have a big heart and that’s what jersey is all about. More power to you. https://t.co/mMOkevCH5T — Shahid Kapoor (@shahidkapoor) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒకే సెట్లో సల్మాన్, చిరంజీవి
టాలీవుడ్ స్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒకే స్టూడియోలోకి అడుగుపెట్టనున్నారు. డైరెక్టర్ స్టార్ట్ అనగానే గెట్.. సెట్.. షూట్ అంటూ నటించడానికి రెడీ అవుతున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఓ కీలక పాత్ర చేయనున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ శనివారం ముంబయ్లో ఆరంభం కానుందని టాక్. కజ్రత్లోని ఎన్డీ స్టూడియోలో జరగనున్న ఈ షెడ్యూల్లో చిరంజీవి, సల్మాన్ పాల్గొనగా కొన్ని యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషన్ సీన్స్ కూడా చిత్రీకరించనున్నారని టాక్. దాదాపు వారం పాటు ఈ షెడ్యూల్ జరుగుతుందట. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమా మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్. ఇందులో నయనతార కీలక పాత్ర చేస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ఆ తెలుగు మూవీ రీమేక్ కోసం పోటీ పడుతున్న బాలీవుడ్ అగ్ర హీరోలు
నేచురల్ స్టార్ నాని హీరోగా ద్విపాత్రిభినయనం చేసి విజయం సాధించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. గతేడాది క్మిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మంచి టాక్ సంపాదించుకుంది. థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ ఓటీటీలో సైతం రికార్డు వ్యూస్ను రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: Prabhas-Pooja Hegde: ఎడమొహం పెడమొహంగా ప్రభాస్-పూజా? అయితే ఈ రీమేక్ ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు సినిమాలను రీమేక్ చేసి మంచి హిట్స్ అందుకుంటున్న హీరో షాహిద్ కపూర్ రీమేక్ హక్కును తీసుకునే ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అగ్ర హీరో అజయ్ దేవగన్ సైతం శ్యామ్ సింగరాయ్ రీమేక్కు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఒకే దర్శకుడిని రీమేక్ కోసం వీరిద్దరు సంప్రదించినట్లు బి-టౌన్లో వినికిడి. మరి ఇందులో ఎవరి ప్రయత్నాలు ఫలించి శ్యామ్ సింగరాయ్ హక్కులను పొందుతారో చూడాలి. -
నాగ చైతన్య స్పీడు.. ఆ హిట్ మూవీ రీమేక్కు గ్రీన్ సిగ్నల్!
Buzz: Naga Chaitanya In Maanaadu Remake: నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్గా లవ్స్టోరీ, బంగార్రాజు సినిమాలతో ఏడాది గ్యాప్లోనే రెండు హిట్స్ అందుకున్నాడు. ఇక రాశిఖన్నాతో చేస్తున్న థ్యాంక్యూ మూవీ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు చై. తాజాగా మానాడు సినిమాతో హిట్ కొట్టిన వెంకట్ ప్రభుతో ఓ సినిమాకు సైన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే మానాడు రీమేక్ రైట్స్ని సురేష్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేశారు. ఇటీవలె ఈ కథను చైకు వినిపించడం, ఆయన కూడా వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయినట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ రానున్నట్లు సమాచారం. -
65 ఏళ్ల తర్వాత రీమేక్ అవుతున్న హాలీవుడ్ మూవీ
The Ten Commandments: డౌగ్రే స్కాట్, లినస్ రోచ్, నవీన్ ఆండ్రూస్, మియా మాస్ట్రో, పాల్ రైస్ ప్రధాన పాత్రధారులుగా నటించిన తాజా చిత్రం ‘ది టెన్ కమాండ్మెంట్స్’. దర్శక ద్వయం రాబర్ట్ డోర్న్ హెల్మ్, జెఫ్రీ మడేజా తెరకెక్కించిన చిత్రం ఇది. ఈ సినిమా ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ తదితర భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా నేడు(డిసెంబర్ 31) విడుదలవుతోంది. కాగా 1956లో దర్శక–నిర్మాత సెసిల్ బి డెమిల్లే రూపొందించిన ‘ది టెన్ కమాండ్మెంట్స్’కి ఇది రీమేక్. అప్పట్లో దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ చిత్రం 50 వారాలకు పైగా ప్రదర్శితమైంది. 65 ఏళ్ల తర్వాత ఈ చిత్రకథాంశంతో రీమేక్ అయిన తాజా ‘ది టెన్ కమాండ్మెంట్స్’ ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో మోసెస్గా డౌగ్రే స్కాట్, ఆరోన్గా లినస్ రోచ్ కనిపిస్తారు. -
వెంకీ మామ చేతిలో మరో రీమేక్.. ఆ 'లైసెన్స్' వస్తుందా ?
Victory Venkatesh Another Remake Film Is Driving License: విభిన్న కథా చిత్రాలతో విజయపథంలో దూసకుపోతున్నారు విక్టరీ వెంకటేశ్. కథ నచ్చితే మల్టీ స్టారర్, రీమేక్ చిత్రాలు చేయడానికి అస్సలు వెనుకాడరు. ఇటీవల మలయాళ రీమేక్ చిత్రం 'దృశ్యం 2'తో సూపర్ సక్సెస్ అందుకున్నారు వెంకీ మామ. టాలీవుడ్లో రీమేక్ చిత్రాలకు పెట్టింది పేరు వెంకటేశ్. సుమారు 25కుపైగా రీమేక్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మరో రీమేక్ చేయడానికి వెంకీ మామ సిద్ధంగా ఉన్నారని సమాచారం. మలయాళంలో హిట్ అయిన 'డ్రైవింగ్ లైసెన్స్' అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారట. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా హక్కుల్ని దక్కించుకున్నారు. మొదట వెంకటేష్, రవితేజలు కలిసి నటిస్తారని ప్రచారం జరిగింది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో 'డ్రైవింగ్ లైసెన్స్'ను తెరకెక్కించడం ఆలస్యం అయింది. ఇప్పుడు ఈ చిత్రం రామ్ చరణ్ నుంచి గీతా ఆర్ట్స్ చేతికి వచ్చిందని సమాచారం. వెంకటేశ్తో ఈ సినిమా తీయాలని గీతా ఆర్ట్స్ భావిస్తోందట. రవితేజ కోసం అనుకున్న పాత్రలో ఓ యంగ్ హీరోను తీసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకీ మామ 'ఎఫ్ 3'తో పాటు ఓ వెబ్ సిరీస్తో బిజీగా ఉన్నారు. వాటి తర్వాత 'డ్రైవింగ్ లైసెన్స్' కోసం కష్ట పడతారని సమాచారం. ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా చేయడం నా అదృష్టం' -
rx100 హిందీ రీమేక్
-
‘డ్రైవింగ్ లైసెన్స్’ తీసుకోనున్న అక్షయ్కుమార్
మాలీవుడ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ను బాలీవుడ్లో అక్షయ్కుమార్ తీసుకోనున్నారు. మలయాళ హిట్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ హిందీ రీమేక్లో అక్షయ్కుమార్ నటించనున్నారని లేటెస్ట్ టాక్. ఇందులో ఇమ్రాన్ హష్మి మరో హీరోగా నటిస్తారు. అక్షయ్ కుమార్తో ‘గుడ్న్యూస్’ చిత్రాన్ని తీసిన రాజ్ మెహతా ‘డ్రైవింగ్ లైసెన్స్’ హిందీ రీమేక్ను తెరకెక్కిస్తారట. వచ్చే ఏడాది ఈ షూటింగ్ ఆరంభం కానుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... మలయాళ ‘డ్రైవింగ్ లైసెన్స్’లో పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ నటించారు. ఈ చిత్రానికి జూనియర్ లాల్ డైరెక్టర్. తమ అభిమాన హీరోతో సెల్ఫీ దిగాలనుకున్న ఓ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కుటుంబం ఎలాంటి ఇబ్బందులకు లోనైంది? హీరోకి, ఇన్స్పెక్టర్కు ఈగో క్లాషెస్ ఎందుకొచ్చాయి? అన్నదే ఈ చిత్ర కథాంశం. -
గర్భవతిగా కనిపించనున్న కీర్తి సురేశ్!
Keerthy Suresh: కృతీసనన్ లీడ్ రోల్లో నటించిన బాలీవుడ్ చిత్రం ‘మిమీ’ (2021) తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కానుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. ‘మిమీ’ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం ఓ నిర్మాణ సంస్థ చర్చలు జరుపుతోందనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు... కృతీసనన్ చేసిన పాత్రను సౌత్లో కీర్తి సురేశ్ చేయనున్నారని, ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు మొదలయ్యాయని టాక్. ఓ విదేశీ జంటకు బిడ్డను ఇవ్వడం కోసం సరోగసీ ద్వారా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని యువతి కథే ‘మిమీ’ చిత్రం. మరి.. ‘మిమీ’ రీమేక్కు కీర్తీ సురేశ్ పచ్చజెండా ఊపుతారా? వేచి చూడాలి. -
బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన రెజీనా!..హీరో ఎవరంటే
రెజీనీ కసాండ్రా.. కొన్నాళ్ల క్రితం తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ చెన్నై చిన్నది ఈ మధ్యకాలంలో రేసులో వెనకబడింది. వరుస ఫ్లాపులతో టాలీవుడ్లో సినిమాలు తగ్టించిన ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్లో బంపర్ ఆఫర్ వచ్చిందని సమాచారం. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్లో రెజీనాను ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. 2005లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఛత్రపతి సినిమాను ప్రస్తుతం హిందీలో వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే హీరోయిన్ విషయంలో మొదటి నుంచి సస్పెన్స్ కొనసాగింది. ఇప్పటికే ఛత్రపతి రీమేక్ కోసం పలువురు స్టార్ హీరోయిన్లను సంప్రదించినా వారు సున్నితంగా ఆఫర్ తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఆ మధ్య అనన్య పాండే హీరోయిన్గా ఫైనలైజ్ అయ్యిందంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఇటీవలె హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభించిన చిత్ర బృందం..రెజీనాను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. -
'కాసేదాన్ కడవులడా' రీమేక్లో ప్రియా ఆనంద్
చెన్నై: 1972లో విడుదలైన క్లాసిక్ కామెడీ చిత్రం కాసేదాన్ కడవులడా. ముత్తురామన్, లక్ష్మి నాయకా నాయికలుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. అలాంటి చిత్రం ఇప్పుడు మళ్లీ రీమేక్ అవుతోంది. ఇందులో నటుడు మిర్చి శివ, నటి ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్.కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బాలసుబ్రమణియం, ఛాయాగ్రహణం, కన్నన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ ఇటీవల చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు కన్నన్ వివరిస్తూ కాసేదాన్ కడవులడా చిత్ర రీమేక్ హక్కులను అధికార పూర్వకంగా పొంది దాని స్థాయికి తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. -
బాలీవుడ్లో రీమేక్ అవుతున్న ‘ఆకాశం నీ హద్దురా!’
తమిళ సూపర్ హిట్ చిత్రం ‘సూరరై పోట్రు’ హిందీలో రీమేక్ కానుంది. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. సూర్య నిర్మాత కూడా. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’గా వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబరులో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలై వీక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అంతేకాదు.. 93వ ఆస్కార్ అవార్డుల నామినేషన్ ఎంపిక బరిలో నిలిచింది. తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నట్లు సూర్య వెల్లడించారు. బాలీవుడ్ నిర్మాత విక్రమ్ మల్హోత్రాతో కలిసి ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించనున్నారు సూర్య. మాతృతకు దర్శకత్వం వహించిన సుధా కొంగరయే హిందీ రీమేక్కు కూడా దర్శకత్వం వహించనున్నారు. హిందీలో నిర్మాతగా సూర్యకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. అయితే ఈ రీమేక్లో ఎవరు హీరోగా నటిస్తారనేది తెలియాల్సి ఉంది. -
'జనతా గ్యారేజ్' రీమేక్లో బాలీవుడ్ స్టార్ హీరో
బాహుబలి సక్సెస్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకు మార్కెట్ పెరిగిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. దీంతో బాలీవుడ్ హీరోలు వరుసగా తెలుగు సినిమాలపై మోజు పెంచుకుంటున్నారు. ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను రీమేక్ చేసి హిట్ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే బీటౌన్ హీరోలు మన తెలుగు సినిమాలను రీమేక్ చేస్తుండగా ఇప్పుడు ఆ జాబితాలోకి సల్మాన్ ఖాన్ కూడా చేరారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా, మోహన్లాల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రాన్నిబాలీవుడ్లో రీమేక్ చేయన్నునారట. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అగ్రిమెంట్ కూడా రూపొందినట్లు బీటౌన్ టాక్. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. -
వెంకటేశ్ఎంట్రీతో ఆ సినిమాను వదులుకున్న రజనీకాంత్!
సూపర్ స్టార్ రజనీకాంత్, దృశ్యం రీమేక్ లో కనిపించాలనుకున్నారా...? మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్రను,రిపీట్ చేయాలనుకున్నారా? తలైవా తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది.మరి దృశ్యం రీమేక్ లో ఆయన కనిపించలేకపోయారు? అందుకు కారణం వెంకటేశ్ అట. మాలీవుడ్ డైరెక్టర్ జీతు జోసెఫ్ క్రియేట్ చేసిన వండర్ దృశ్యం. ఇప్పటి వరకు వచ్చిన రెండు భాగాలు సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలిభాగం తమిళం, కన్నడం, హిందీ, తెలుగు తో పాటు సిన్హాలా, అలాగే చైనీస్ భాషల్లోకి రీమేక్ అయింది. దృశ్యం మొదటి భాగం రీమేక్ లో లోకనాయకుడు కమల్ హాసన్ నటించారు.అయితే కమల్ కంటే ముందే,ఈ రీమేక్ లో నటించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తిని చూపించారు.అందుకు తగ్గట్లే తమిళ నిర్మాత కలైపులి థానుతో కలసి చర్చలు జరిపారు.అన్ని కుదిరి ఉంటే రజనీకాంత్ దృశ్యం తమిళ,తెలుగు రీమేక్ లో నటించాల్సింది. కాని వెంకటేశ్ ఎంట్రీతో సూపర్ స్టార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారట. దృశ్యం మొదటి భాగానికి సంబంధించి తెలుగు,తమిళ భాషల్లో నటించేందుకు రజనీకాంత్ మొదట ఇంట్రెస్ట్ చూపించారు. కాని ఎప్పుడైతే వెంకటేష్ తెలుగు వర్షన్ కు సంబంధించిన రైట్స్ కొనుగోలు చేయడం , షూటింగ్ కూడా స్టార్ట్ చేసారని తెలియడంతో తన నిర్ణయం మార్చుకున్నారు. తెలుగు , తమిళ వర్షన్స్ కలిపి దృశ్యం మొదటి భాగంలో నటించాలనుకున్నారు రజనీకాంత్. అప్పుడే తమ ప్రాజెక్ట్ వల్ల నిర్మాతకు లాభం ఉంటుంది అనుకున్నారు. కానీ ఒక్క తమిళ రీమేక్ కు మాత్రమే అయితే నో అని చెప్పారట. ఇక సూపర్ స్టార్ కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ వైపు చూస్తే,ఈ దీపావళికి అన్నాత్తే అనే కొత్త చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి అమెరికా వెళ్లారు తలైవా.ఇప్పుడు అక్కడి నుంచి ఇండియాకు రిటర్న్ అయ్యారు తలైవా.వచ్చి రావడంతోనే అన్నాత్తే సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు రజనీకాంత్. -
నాంది రీమేక్లో బాలీవుడ్ స్టార్ హీరో
తెలుగు హిట్ ‘నాంది’ (2021) హిందీలో రీమేక్ కానుంది. హిందీ నటుడు, దర్శక–నిర్మాత అజయ్ దేవగణ్తో కలిసి ఈ రీమేక్ను ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. ‘‘చాలా ముఖ్యమైన ఓ కథను షేర్ చేసుకోవాల్సిన సమయం ఇది. అజయ్ దేవగణ్ ఫిలింస్, ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ కలిసి తెలుగు హిట్ ‘నాంది’ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి అన్ని పనులు పూర్తయ్యాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు అజయ్ దేవగణ్. మరి.. ‘నాంది’ హిందీ రీమేక్కు ఎవరు దర్శకత్వం వహిస్తారు? నటీనటులు ఎవరు? అనే విషయాలను స్పష్టం చేయలేదు. ఇక ‘నాంది’ కథ విష యానికి వస్తే.. హాయిగా జీవిస్తున్న ఓ మధ్యతరగతి సాఫ్ట్వేర్ ఉద్యోగి అనూహ్యంగా హత్యారోపణలతో జైలుపాలవుతాడు. న్యాయం కోసం పోరాడే ఆ వ్యక్తి కథే ‘నాంది’ చిత్రం. కొంత గ్యాప్ తర్వాత అల్లరి నరేశ్ కెరీర్ని హిట్ ట్రాక్ ఎక్కించిన ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకుడు. చదవండి : ఆర్టిస్ట్లు లోకల్ కాదు.. యూనివర్సల్ మరో తెలుగు సినిమాకు సైన్ చేసిన హీరో ధనుష్ -
‘అలవైకుంఠపురంలో' హిందీ రీమేక్ టైటిల్ ఇదే..
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అలవైకుంఠపురంలో'. గతేడాది సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో డేవిడ్ ధావన్ తెరకెక్కించనున్నారు. కార్తీక్ ఆర్యన్, కృతిసనన్లు హీరో, హీరోయిన్లుగా నటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి “షెహజాదా అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో టబు పాత్రలో బాలీవుడ్ నటి మనీషా కొయిరాల నటించనున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ పాత్ర కోసం టబునే సంప్రదించినా ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ ఛాన్స్ మనీషా కొయిరాలకు దక్కినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో మురళీశర్మ పోషించిన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కనిపించనున్నారు. చదవండి : తల్లి పాత్రలో అందాల నటి మనీషా కొయిరాల అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేసిన బాలీవుడ్ యంగ్ హీరో -
'ఏక్ మినీ కథ' హీరోకు ఛాన్స్ ఇచ్చిన సుష్మిత కొణిదెల!
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొన్ని రోజుల క్రితం భర్త విష్ణుప్రసాద్తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ బ్యానర్లో ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్ను కూడా నిర్మించింది. ఇప్పుడు ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయనుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘8 తూట్టాక్కళ్’ (8బుల్లెట్లు) అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తుందట. ఇప్పటికే మూవీ రీమేక్ హక్కులను కూడా కొన్నారట. గణేశ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో సంతోష్ శోభన్ను హీరోగా ఫైనల్ చేయారట. 'ఏక్ మినీ కథ' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న సంతోష్ శోభన్కు యూత్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ఇప్పటికే ఆయనకు పలు సినీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా నందిని రెడ్డి సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు ఫిల్మ్నగర్ టాక్. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. చదవండి : నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్ శివన్ మరో బిజినెస్లోకి ఎంట్రీ ఇస్తున్న సమంత -
తల్లి పాత్రలో అందాల నటి మనీషా కొయిరాల
తెలుగు సినిమాలకు మార్కెట్ బాగా పెరిగింది. కొన్నాళ్లుగా టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్లో రీమేక్ అయి అక్కడ కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. రీసెంట్గా మన తెలుగు పాటలకు బాలీవుడ్లో సీటీమార్ స్టెప్పులేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురంలో చిత్రం హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. డేవిడ్ ధావన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా కార్తీక్ ఆర్యన్ – కృతిసనన్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఇక తెలుగులో సుశాంత్కు తల్లిగా నటించిన టబు పాత్రను బాలీవుడ్లో మనీషా కొయిరాల చేయనుందట. ఇప్పటికే మేకర్స్ ఆమెతో చర్చలు జరపగా, మనీషా కూడా అందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ పాత్ర కోసం టబునే సంప్రదించినా ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ ఛాన్స్ మనీషా కొయిరాలకు దక్కిందట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ రీమేక్ వెర్షన్ను అల్లు అరవింద్ సహా నిర్మాతగా వ్యవహిరించనున్నట్లు తెలుస్తోంది. చదవండి : ‘అర్జున్ రెడ్డి’లా పవన్ కల్యాణ్.. ఓల్డ్ పిక్ వైరల్ ముఖంపై మొటిమలు రాకుండా ఉమ్మి వాడుతా: తమన్నా -
బాలీవుడ్ రీమేక్.. బెల్లంకొండ బ్రదర్తో కృతిశెట్టి?
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ టాలీవుడ్ ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓ మూవీ షూటింగ్ దశలో ఉండగా ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా గణేష్ హీరోగా మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా 2006లో షాహిద్ కపూర్, అమృతారావు జంటగా నటించిన చిత్రం ‘వివాహ్’ అనే బాలీవుడ్ మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నారు. దీనికి సంబంధించి రీమేక్ హక్కులను కూడా సొంతం చేసుకున్నారట. ఈ మూవీలో బెల్లంకొండ గణేష్కు జోడీగా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్గా చేయనున్నట్లు సమాచారం. తొలి చిత్రం ఉప్పెనతో సూపర్ క్రేజ్ను సొంతం చేసుకున్న కృతిశెట్టి అయితే ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో దీనికి సంబంధించి ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, కృతి కూడా దీనికి పాజిటివ్గా రెస్పాండ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ మంగళూరు బ్యూటీ చేతిలో ఓ అరడజను సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ నాని హీరోగా తెరకెక్కుతోన్న శ్యామ్ సింగ రాయ్తో పాటు.. సుధీర్ బాబు నటిస్తోన్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. చదవండి : Krithi Shetty: ‘బేబమ్మ’కు ఓ కోరిక ఉందట.. నెరవేర్చేదెవరు? శాండల్ వుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు వీళ్లే! -
Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
అల్లుడు శీను’ సినిమాతో హీరోగా పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్కు ఇప్పటిదాకా ఒక్క పెద్ద హిట్ కూడా పడలేదు. దీంతో రీమేక్ చిత్రాలనే నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు. తమిళ రీమేక్ రాక్షసుడు అనంతరం ప్రస్తుతం బెల్లంకొండ చేస్తోన్న రీమేక్ చిత్రం ఛత్రపతి. రాజమౌళి దర్శకత్వంలోఘీ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఈ మూవీ రీమేక్తో బాలీవుడ్లో ఎంట్రీకీ రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బెల్లంకొండ సరసన నటించేందుకు ఇదివరకే కొందరు స్టార్ హీరోయిన్లను సైతం సంప్రదించినా వారు మాత్రం నో చెప్పారట. దీంతో ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ చేసేందుకు అనన్య పాండే ఒప్పుకుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు బెల్లంకొండ ఇప్పుడు మరో రీమేక్ చిత్రంతో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఇటీవల ధనుష్ హీరోగా తమిళంలో ‘కర్ణన్’ సూపర్ రిలీజైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సూపర్ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే బెల్లంకొండ ఈ మూవీ రైట్స్ను కొనుగోలు చేసినట్లు సమాచారం. బెల్లంకొండ తెలుగులో నటించిన చివరి మూవీ అల్లుడు అదుర్స్’. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమాను రిలీజ్ చేసినా బాక్స్ఫీస్ వద్ద ఈ మూవీ బోల్తా కొట్టింది. దీంతో కర్ణన్ మూవీని రీమేక్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. చదవండి : 'ప్రభాస్ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను' నిర్మాతగా మారిన యంగ్ హీరో.. తండ్రితో తొలి సినిమా! -
Sushmita Konidela: సుష్మిత చేతిలోకి ఎనిమిది బుల్లెట్లు
హీరో చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొన్ని రోజుల క్రితం భర్త విష్ణుప్రసాద్తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్ను నిర్మించారు. ఇప్పుడు సినిమా నిర్మించనున్నారట. తమిళ సినిమా ‘8 తూట్టాక్కళ్’ (8బుల్లెట్లు) అనే సినిమా రీమేక్ హక్కులు కొన్నారట. వెట్రి, అపర్ణా బాలమురళి జంటగా శ్రీ గణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2017లో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. తెలుగు రీమేక్లో ఓ యువ హీరో నటించనున్నారట. పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
Nayanthara: 'మాతృదేవోభవ' రీమేక్లో నయనతార
అమ్మప్రేమలోని గొప్పతనాన్ని అడుగడుగునా చాటిచెప్పిన చిత్రం మాతృదేవోభవ. 1993లో విడుదలైన ఈ చిత్రం ఎవర్ గ్రీన్ క్లాసిక్గా నిలిచింది. ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోని ప్రేక్షకులు లేరు. అమ్మప్రేమలోని మాధుర్యాన్ని అంతలా కనెక్ట్ చేసిన చిత్రమిది. కె. అజయ్ కుమార్ దర్శకత్వంలో నాజర్, మాధవి నటించిన ఈ చిత్రాన్ని కె.ఎస్. రామారావు నిర్మించారు. తాజాగా చిత్ర నిర్మాత రామారావు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తనకు మాతృదేవోభవ రీమేక్ చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టేశారు. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన అజయ్ కుమారే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించాలని పేర్కొన్నారు. అయితే హీరోయిన్ పాత్రలో ఎవరు నటించాలనే ప్రశ్నకు బదులుగా..నయనతార, కీర్తి సురేష్ ఇద్దరూ ఈ పాత్రకు సరిపోతారని, నయనతార నటన ఇంకాస్త మెచ్యూర్డ్ కూడా ఉంటుందని, ఆమె అయితే సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడున్న నటీనటులు కథ కంటే రెమ్యూనరేషన్కే ప్రాధాన్యత ఇస్తున్నారని, వాళ్లు అడిగే రెమ్యూనరేషన్ వింటేనే కంగారు ఉందని చెప్పుకొచ్చారు. మరి చిన్న పాత్రకు సైతం భారీ పారితోషికం అందుకునే నయనతార ఈ సినిమాను చేస్తోందా? లేక కథకు ప్రాధాన్యమిచ్చి రెమ్యూనరేషన్ విషయంలో కాస్త వెనక్కు తగ్గుతుందా అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది చదవండి : పుష్ప: ఆ రోల్ చేయడానికి ఐశ్వర్య ఒప్పుకుంటుందా? సామాన్యుల కోసం నడుం బిగించిన నటుడు -
వైరల్ వీడియో: ‘సారంగదరియా’పై పేరడి సాంగ్
-
‘సారంగదరియా’పై పేరడి సాంగ్ వైరలయ్యా..
ఎవరి నోట విన్నా.. ఎవరి ఫోన్లోనైనా.. సారంగదరియా పాట మార్మోగుతోంది. యూట్యూబ్లో ఇటీవల వంద మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్న సారంగదరియా పాటకు పేరడి పాట ఒకటి ప్రస్తుతం వైరల్ అయ్యింది. కరోనా టీకాపై సారంగదరియా పాటను రీమేక్ చేస్తూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాశాడని తెలుస్తోంది. ఆ పాటకు సంబంధించిన లిరిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. దీంతో చాలామంది వాట్సప్ స్టేటస్లు.. ఫేసుబుక్ పోస్టులు చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జోడిగా లవ్స్టోరీస్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని సారంగదరియా పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాట విడుదలై ఎంత హిట్టయ్యిందో అంత వివాదాస్పదమైంది. ఆ పాటపై ఎన్నో వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఈ పాట వివాదంపై ఓ షోలో దర్శకుడు శేఖర్ కమ్ముల భావోద్వేగానికి గురయిన విషయం తెలిసిందే. అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న సారంగదరియా పేరడీ సాంగ్ చూడండి.. వినండి. ఓ పాప అద్భుతంగా ఆ పాటను పాడుతూ ఆకట్టుకుంది. కుడి భుజం మీద టీకా మీరు వేసుకొనుటకిది మోకా వ్యాధి రమ్మన్న రాదురా కాకా దాని పేరే కోవిడ్ టీకా.. వారి ఎడమ భుజం మీద టీకా జర వేసుకొనుడి ఇది మోకా వ్యాధి రమ్మన్న రాదురా కాకా దాని పేరే కోవిట్ టీకా మక్కుకి కాటన్ మాస్కుల్ లేకున్న బతుకులు ముష్కిల్ చేతికి ప్లాస్టిక్ గ్లౌజుల్ లేకున్న ఉంటయ్ రిస్కుల్ అడుగడుగున కోవిడ్ ఆంక్షల్ పాటిస్తే ఉండవు చావుల్ ఒంట్లో మజిల్సు నొప్పుల్ లేకున్న జ్వరము నిప్పుల్ దివి కంటితో చూడగా తప్పుల్ తుర్రున పోతయిరా ముప్పుల్ టీకా… టీకా… టీకా ఇది కరోనా కట్టడి మోకా వ్యాధి రమ్మన్న రాదురా కాకా దాని పేరే కోవిడ్ టీకా -
బాలీవుడ్లో రీమేక్ కానున్న ‘ఉప్పెన’
మెగా మేనల్లుడు వైష్ణవ్తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈ నెల 12న విడుదలై బాక్సాపీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం... లాక్డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. దేవీశ్రీ సంగీతం, విజయ్ సేతుపతి నటన ఈ సినిమా విజయంలో సగ భాగం అయింది. ఇప్పటికే ఈ సినిమా రూ.70 కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటుతోంది. దీంతో ఈ సినిమాను ఇప్పుడు తమిళం, హిందీ భాషల్లోనూ రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే తన కుమారుడు సంజయ్ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేయాలని తమిళ సూపర్స్టార్ విజయ్ భావిస్తున్న్ట్లట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర బృందంతో ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొదట ఈ సినిమాను టాలీవుడ్తో పాటు తమిళ్లో కూడా విడుదల చేయాలని భావించినా విజయ్ సేతుపతి మాత్రం వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. కథ బాగుందని, డబ్ చేయడం కంటే రీమేక్ చేస్తే మంచి వసూళ్లను రాబడుతుందని సలహా ఇచ్చారట. అంతేకాకుండా తమిళ రీమేక్ రైట్స్ను స్వయంగా విజయ్ సేతుపతి తీసుకోబుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్లోనూ ఉప్పెనను రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా ఉప్పెన రీమేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. చదవండి : (‘ఉప్పెన’పై మహేశ్ బాబు రివ్యూ) (బాప్రే.. కేజీఎఫ్ 2 తెలుగు రైట్స్కి అన్ని కోట్లా?) -
నితిన్ అంధుడిగా కనిపించేది అప్పుడే!
బాలీవుడ్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం 'అంధాధున్'. తెలుగులో నితిన్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ రీమేక్ బాధ్యతను తన భుజానెత్తుకున్నాడు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూన్ 11న థియేటర్లలో సందడి చేయనున్నట్లు వెల్లడించారు. నితిన్ అంధుడిగా, సంగీతకారుడిగా కనిపించనున్న ఈ సినిమాలో హీరోయిన్ నభా నటేశ్ అతడితో జోడీ కడుతోంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న టబు పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు. హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్గా పని చేస్తున్నారు. JUNE 11th is the Date!! #Nithiin30 @tamannaahspeaks @NabhaNatesh @GandhiMerlapaka @SreshthMovies_ pic.twitter.com/jTGdMRLslA — nithiin (@actor_nithiin) February 19, 2021 అంధుడైన హీరో ఓ హత్యకు ఎలా సాక్షిగా మారతాడనేది ఈ చిత్ర ప్రధాన కథ. బాలీవుడ్లో ఈ సినిమా ఆయుష్మాన్ ఖురానాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. మరి నితిన్కు ఈ సినిమా ఎన్ని ఫలాలనిస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే అతడు దేశదద్రోహిగా నటించిన 'చెక్' ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు 'రంగ్దే' మార్చి 26న ప్రేక్షకులను పలకరించనుంది. ఆ తర్వాత రెండు నెలల గ్యాప్ తీసుకుని 'అంధాధున్' రీమేక్తో అభిమానులను అలరించేందుకు రానున్నాడు. చదవండి: 15 నిమిషాల కథ విని ఒప్పుకున్నా: నితిన్ ముంబైలో ఇళ్లు కొన్న బుట్టబొమ్మ -
పీకు రీమేక్లో టాప్ హీరోయిన్?
దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, ఇర్ఫాన్ ఖాన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన హిందీ చిత్రం ‘పీకు’. సూజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామాకు విశేషమైన ఆదరణ లభించింది. 2015లో ఈ సినిమా విడుదలైంది. విడుదలైన ఐదేళ్లకు ఈ సినిమా సౌత్లో రీమేక్ కాబోతోందని సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రం రీమేక్ హక్కులను తీసుకుందట. హిందీలో దీపికా చేసిన పాత్రను ఈ రీమేక్లో త్రిష చేస్తారని టాక్. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది. చర్చల దశలోనే ఉన్న ఈ రీమేక్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మలయాళంలో మోహన్లాల్తో ‘రామ్’, మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వమ్’ సినిమాల్లో నటిస్తున్నారు త్రిష. -
హిందీలోకి అల్లు అర్జున్ హిట్ సినిమా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘జులాయి’ సినిమా హిందీలో రీమేక్కి సిద్ధమైంది. జులాయి రీమేక్ని సూపర్ డైరెక్టర్ టోని డిసౌజ రూపొందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుందని హిందీ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘రేసుగుర్రం’. ఈ సినిమా కూడా హిందీలో రిమేక్ కానుండగా.. ఇందులో కూడా నమషి చక్రవర్తి హీరోగా నటిస్తుడటం విశేషం. రాజ్కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'బ్యాడ్బాయ్'గా పేరు ఖరారు చేసినట్టు తెలిసింది. ఇక ఈ రెండు సినిమాల్లోనూ హైదరాబాద్ అమ్మాయి అమ్రిన్ ఖురేషి హీరోయిన్ కావడం మరో విశేషం. (చదవండి: సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా!) -
కలెక్షన్లు కురిపిస్తూ రికార్డు సృష్టిస్తోన్న 'లక్ష్మీ'
ఒకప్పుడు హిందీ సినిమాలను తెలుగులో రీమేక్ చేసే ట్రెండ్ నడిచేది. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలు బాలీవుడ్లో వరుసగా పట్టాలెక్కుతున్నాయి. ఒక్క తెలుగు మాత్రమే కాదు, మొత్తం సౌత్ ఇండస్ట్రీ మీదనే బాలీవుడ్ దర్శకనిర్మాతల కన్ను పడింది. ఇక్కడి సినిమాలను తిరిగి రూపొందిస్తూ ఒరిజినల్ కన్నా పెద్ద హిట్టు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు, తమిళంలో సూపర్ డూపర్ హిట్ సాధించిన 'కాంచన' చిత్రం హిందీలో 'లక్ష్మీ'గా తెరకెక్కింది. దీనికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఖాన్, తుషార్ కపూర్ కలిసి నిర్మించారు. (చదవండి: నటిపై ట్రోలింగ్: దేవుళ్ల మీదే ఎగతాళా?) స్టార్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం థియేటర్ల ఓపెనింగ్ కోసం వేచి చూడకుండా నవంబర్ 9న ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ హాట్స్టార్లో రిలీజైంది. అదే రోజు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, పపువా న్యూగినియా, యూఏఈలో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలోనే ఒకటిన్నర కోట్లు రాబట్టింది. ఫిజిలో 17, ఆస్ట్రేలియాలో 70, న్యూజిలాండ్లో 42 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక హాట్స్టార్ వీఐపీ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కరోనా కాలంలో ఇలాంటి వసూళ్లు రావడం గొప్ప విషయమని విశ్లేషకులు అంటున్నారు కాగా మొదట్లో ఈ చిత్రానికి 'లక్ష్మీ బాంబ్' అని టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే లక్ష్మీ అంటే పవిత్రమైన పేరు అని, టైటిల్ దాన్ని కించపరిచేలా ఉందని శ్రీ రాజ్పుత్ కర్ణిసేన సినిమా యూనిట్కు నోటీసులు పంపింది. దీంతో చిత్ర యూనిట్ టైటిల్ను లక్ష్మీ అని మార్చక తప్పలేదు. (చదవండి: టైటిల్లో మార్పులు.. కొత్త పోస్టర్ విడుదల) -
నవ్వించడానికి రెడీ
రణ్వీర్ సింగ్ ప్రేక్షకులను నవ్వించాలనుకున్నారు. అందుకే దర్శకుడు రోహిత్ శెట్టితో కలిశారు. ఇప్పుడు రణ్వీర్తో కలసి ప్రేక్షకులను నవ్వించడానికి పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా రెడీ అయ్యారని సమాచారం. అసలు విషయంలోకి వస్తే.. ‘అంగూర్’ (1982) చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నారు రోహిత్ శెట్టి. హీరోగా రణ్వీర్ సింగ్ని ఎంపిక చేసి, అధికారికంగా ప్రకటించారు కూడా. రణ్వీర్ది డబుల్ రోల్. తన సరసన ఇద్దరు కథానాయికలు ఉంటారు. ఆ పాత్రలను పూజా హెగ్డే, జాక్వెలిన్ చేయబోతున్నారని బాలీవుడ్ టాక్. ఇది వినోద ప్రధానంగా సాగే సినిమా. ఆరంభం నుంచి చివరి వరకూ ఫుల్ కామెడీ ఉంటుంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ని ప్రారంభించాలనుకుంటున్నారు. -
ఈ రీమేక్లో టబు పాత్రలో ఐశ్వర్య.. కానీ!
బాలీవుడ్ సూపర్ హిట్ థ్రిల్లర్ చిత్రం ‘అంధధూన్’ తమిళ రీమేక్లో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో అయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నట్లు సినీయర్ హీరో ప్రశాంత్ తండ్రి, నిర్మాత తియగరాజన్ తెలిపారు. ఈ రీమేక్లో ప్రధాన పాత్రలో ప్రశాంత్ నటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే బాలీవుడ్లో బ్లక్బస్టర్గా నిలిచిన ‘అంధధూన్’లో టబు కీలక పాత్ర పోషించారు. దీంతో తమిళ రిమేక్కు టబు పాత్రకు గాను ఐశ్వర్యరాయ్ను సంప్రదించినట్లు నిర్మాత తియగరాజన్ చెప్పారు. ఆయన ఓ జాతీయా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో టబు పాత్ర కోసం ఐశ్వర్యరాయ్తో చర్చలు జరుపుతున్నాం. అయితే ఇప్పటి వరకు తన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఒకవేళ తను ఓకే చెబితే మాత్రం దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రశాంత్, ఐశ్వర్యలు కలిసి పని చేస్తారు’ అంటూ చెప్పకోచ్చారు. (చదవండి: నితిన్ రీమేక్ మూవీ: డైరెక్టర్..) 1998లో ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జీన్స్’ సినిమాలో ప్రశాంత్, ఐశ్వర్యలు హీరో, హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లక్బస్టర్గా నిలిచింది. ఇటీవల తెలుగులో వచ్చిన ‘వినయ విధేయ రామ’లో ప్రశాంత్ రామ్ చరణ్కు అన్నగా నటించిన విషయం తెలిసిందే. అయితే ‘అంధధూన్’ తమిళ రిమేక్లో మరో ముఖ్య పాత్రల కోసం ప్రముఖ నటుడు కార్తీక్, హాస్యనటుడు యోగిలను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చినప్పటికి కార్తీక్ పాత్ర ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమా కోసం ప్రశాంత్ 23 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ 2018లో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో విడుదలైన ‘అంధధూన్’ చిత్రం బీ-టౌన్లో సూపర్ హిట్గా నిలిచింది. ఇందులో అంధుడిగా ఆయుష్మాన్ నటనకు విమర్శకు నుంచి ప్రశంసలు అందుకుంది. అంతేగాక తన పాత్రకు ఉత్తమ నటుడిగా కూడా ఎన్నికయ్యాడు. అలాగే తెలుగులో కూడా రీమేక్ కానున్న ‘అంధధూన్’లో హీరో నితిన్ నటిస్తున్నాడు. శ్రేష్ట్ మూవీస్ పతాకంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో తమన్నా, నభా నటేష్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. (చదవండి: 21 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ.. అయితే ఏంటి?!) -
షూటింగ్కి రెడీ
కరోనా బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్స్తో బిజీ కాబోతున్నారు శ్రుతీహాసన్. ఇటీవలే కొన్ని యాడ్స్ చిత్రీకరణల్లో పాల్గొన్నారామె. తాజాగా సినిమా చిత్రీకరణలకు కూడా సిద్ధమయ్యారు. అక్టోబర్ నుంచి ‘వకీల్ సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటారట శ్రుతీహాసన్. పవన్ కల్యాణ్, అంజలి, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ ‘పింక్’కి రీమేక్. ఇందులో పవన్ కల్యాణ్ భార్యగా శ్రుతీహాసన్ నటించనున్నారు. అయితే ఇందులో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని సమాచారం. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ ‘క్రాక్’లోనూ నటిస్తున్నారు శ్రుతి. ఆ సినిమా చిత్రీకరణ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. -
నితిన్ సినిమాకు నో చెప్పిన బుట్టబొమ్మ!
ఒక భాషలో హిట్టయిన చిత్రాలను మరో భాషలోకి రీమేక్ చేయడం సినీ పరిశ్రమలో సర్వసాధారణమైన విషయం. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అంధాదున్’ సూపర్ హిట్ అయ్యింది. ఇందులో టబు ముఖ్యపాత్ర పోషించారు. అంధుడైన హీరో జీవితంలో టబు రావడం వల్ల జరిగిన మార్పులు ఈ సినిమాలో కథను మలుపు తిప్పుతాయి. అయితే హిందీలో హిట్టయిన ‘అంధాదున్’ చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం వరుస విజయాలతో దూసుకుపోతున్న బుట్టబొమ్మ పూజా హెగ్డేను సంప్రదించగా నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు అంత ప్రాముఖ్యత ఉండదని, అందుకే పూజా తిరస్కరించినట్లు కొందరు చెబుతుంటే, పారితోషికం సమస్య వల్ల నో చెప్పిందని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ న్యూస్ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. చదవండి: బుట్టబొమ్మను కన్నెత్తి చూడని అఖిల్ -
హిందీ హెలెన్!
హిందీ ‘హెలెన్’గా జాన్వీ కపూర్ కనిపించబోతున్నారా? అంటే అందుకు తగ్గ ప్రయత్నాలు మొదలయ్యాయనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. 2019లో మలయాళంలో సూపర్హిట్ సాధించిన చిత్రం ‘హెలెన్’. అన్నాబెన్ టైటిల్ రోల్ చేశారు. ఫారిన్ వెళ్లాలనుకునే బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ ‘హెలెన్’ ఇంగ్లీష్ ట్రైనింగ్ క్లాసులు తీసుకుంటూ ఓ రెస్టారెంట్లో పార్ట్టైమ్ జాబ్ చేస్తుంటుంది. కానీ ఓ రోజు ఆ రెస్టారెంట్లోని కోల్డ్ స్టోరేజ్లో ఇరుక్కుపోతుంది హెలెన్. అప్పటికే ఆ రెస్టారెంట్ మేనేజర్ తాళం వేసి వెళ్లిపోతాడు. మైనస్ 18 డిగ్రీల చలిలో హెలెన్ తనను తాను ఎలా రక్షించుకుంది? అన్నదే ఈ చిత్రం ప్రధానాంశం. హిందీలో ‘హెలెన్’ చిత్రం రీమేక్ కానుందట. జాన్వీ కపూర్ టైటిల్ రోల్ చేయనున్నారని సమాచారం. మరోవైపు ఈ ‘హెలెన్’ చిత్రం తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో కూడా రీమేక్ కానుందని తెలిసింది. -
లవ్ మాక్టైల్
కన్నడలో ఘనవిజయం సాధించిన ‘లవ్ మాక్టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. ఇందులో సత్యదేవ్, తమన్నా జంటగా నటించనున్నారు. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్పై నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. భావనా రవి, నాగశేఖర్ నిర్మాతలు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ రీమేక్కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ని సెప్టెంబర్లో ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. కీరవాణి వారసుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేయబోతున్నారు. మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తాం’’ అన్నారు. -
దృశ్యం 2
మోహన్లాల్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన చిత్రం ‘దృశ్యం’ (2013). థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ అంశాలు ఈ సినిమాను పెద్ద హిట్ చేశాయి. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా భాషల్లో రీమేక్ అయింది. గత దశాబ్దంలో ఎక్కవ భాషల్లో రీమేక్ అయిన సినిమాల్లో ‘దృశ్యం’ ఒకటి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషలో రీమేక్ అయింది. చైనీస్ భాషలో రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా కూడే ఇదే కావడం విశేషం. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు జీతూ జోసెఫ్ ప్రకటించారు. మొదటి భాగంలో నటించిన మోహన్లాల్, మీనా ఇందులోనూ భార్యాభర్తలుగా నటిస్తారట. మిగతా నటీనటులు మారతారని తెలిపారు. కేరళలో సినిమా చిత్రీకరణలకు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ సినిమాను ఆరంభించాలనుకుంటున్నారట. -
నారప్ప వచ్చాడప్ప
‘నారప్ప’ తిరిగొచ్చారు. వెంకటేష్ టైటిల్ రోల్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో డి.సురేష్బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళంలో సూపర్హిట్ సాధించిన ధనుష్ ‘అసురన్’ చిత్రానికి ‘నారప్ప’ తెలుగు రీమేక్. ఇటీవల తమిళనాడులో మొదలైన ఈ సినిమా భారీ షెడ్యూల్ ముగిసింది. హీరో వెంకటేష్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కించారని తెలిసింది. స్టంట్మాస్టర్ పీటర్హెయిన్స్ ఆధ్వర్యంలో ఫైట్స్ని చిత్రీకరించారు. దేవి శ్రీదేవి సతీష్ సహ–నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘నారప్ప’ చిత్రాన్ని జూన్లోపే విడుదల చేయాలనుకుంటున్నారు. -
నిన్ను విసిగించడం మిస్ అవుతా
వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కూలీ నెం.1’. 1995లో వచ్చిన ‘కూలీ నెం.1’ చిత్రానికి ఇది రీమేక్. పాత సినిమాకి దర్శకత్వం వహించిన డేవిడ్ ధావనే రీమేక్ని తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సారా మాట్లాడుతూ – ‘‘కూలీ’ సినిమాని ముగించాం. మా బెస్ట్, కూలెస్ట్ కూలీగా ఉన్నందుకు వరుణ్ ధావన్కు స్పెషల్ థ్యాంక్స్. నా లగేజ్ని నాతో నువ్వు మోయించినట్టుగా ఎవ్వరూ మోయించి ఉండలేరు. నిన్ను విసిగించడం కచ్చితంగా మిస్ అవుతాను’’ అని అన్నారు. ‘కూలీ నెం.1’ చిత్రం మే 1న విడుదల కానుంది. అన్నట్లు.. వరుణ్ ధావన్.. డేవిడ్ ధావన్ కుమారుడు అనే సంగతి తెలిసిందే. -
‘లూసిఫర్’ బాధ్యతలు సుకుమార్కు?
మలయాళంలో సంచలన విజయం సాధించిన చిత్రం ‘లూసిఫర్’. మోహన్లాల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆక్కడ ఎంతటి ట్రెండ్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ సినిమాలోని హీరో ఎలివేషన్ సీన్స్ చాలా కొత్తగా సూపర్బ్గా ఉంటాయి. కాగా, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కోసం ‘లూసిఫర్’ చిత్ర తెలుగు హక్కులను మెగాపవర్స్టార్ రామ్చరణ్ కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ చిత్రంతో బిజీగా ఉన్న చిరంజీవి ఆ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ను పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించే బాధ్యతను క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్కు రామ్చరణ్ అప్పగించనట్టు టాలీవుడ్ టాక్. అంతేకాకుండా లూసిఫర్లో పృథ్వీరాజ్ పాత్రను రామ్చరణ్ పోషించే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ముందుగా డైరెక్టర్ పరుశురామ్తో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావించినప్పటికీ యూత్లో ఉన్న క్రేజ్తో ఆ బాధ్యతను సుకుమార్కు అప్పగించారని టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్ చిత్రంతో సుకుమార్, కొరటాల శివ చిత్రంతో చిరంజీవి బిజీబిజీగా ఉన్నారు. వీరిద్దరి సినిమాలు ఈ ఏడాది చివర్లో పూర్తి కానున్నాయి. ఆ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ను పట్టాలెక్కించే అవకాశం ఉంది. అయితే చిరంజీవి తన తదుపరి చిత్రం త్రివిక్రమ్తో తీసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. సినిమాల్లో రీఎంట్రీ తర్వాత ‘ఖైదీ 150’, ‘సైరా’, ప్రస్తుతం ‘ఆచార్య(అనధికారిక టైటిల్)’ వంటి సామాజిక, పీరియాడిక్ అంశాలను ఎంచుకున్న మెగాస్టార్ తన తదుపరి చిత్రం వినోదాత్మకంగా ఉండాలనే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా లూసిఫర్ను మరికొంత కాలం ఆపి త్రివిక్రమ్తో ఓ సినిమా చేశాక ఆ చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నారట. అంతేకాకుండా లూసిఫర్ను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసేందుకు తగిన సమయం కావాలని సుకుమార్ బృందం కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆలస్యమైనా ‘లూసిఫర్’ చిత్రాన్ని సుకుమార్తోనే తెరకెక్కించాలని రామ్చరణ్ భావిస్తున్నాడట. చదవండి: ‘పారాసైట్’ విజయ్ మూవీ కాపీనా..! అప్పుడు అభిమన్యుడు.. ఇప్పుడు శక్తి -
టైటిల్స్ కుదిరాయి
సినిమా ప్రేక్షకుడి దాకా వెళ్లాలన్నా, ప్రేక్షకుడు థియేటర్ దాకా రావాలన్నా ప్రచారం కీలకం. సినిమా ప్రచారంలో మొట్టమొదటి చాప్టర్ సినిమా టైటిల్. పేరు ఎంత బావుంటే, ఎంత క్యాచీగా ఉంటే సినిమాకి అంత ప్లస్సు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ సినిమాలకు టైటిల్స్ ఫిక్స్ అయ్యాయని తెలిసింది. ఆ వివరాలు... ఆచార్య చిరంజీవి చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. సామాజిక అంశాలతో కూడుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కి ‘ఆచార్య’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ని బట్టి గమనిస్తే చిరంజీవి ఈ సినిమాలో ఫ్రొఫెసర్ పాత్రలో కనిపిస్తారని ఊహించవచ్చు. డియర్ ప్రభాస్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ముందు ‘జాన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ‘ఓ డియర్’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. అలాగే ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ను కూడా పరిశీలిస్తున్నారని టాక్. వకీల్ సాబ్ హిందీ చిత్రం ‘పింక్’ తెలుగు రీమేక్ను తన రీ ఎంట్రీ కోసం ఎంచుకున్నారు పవన్ కల్యాణ్. ఇందులో లాయర్ పాత్రలో నటిస్తున్నారాయన. ఈ సినిమా కోసం ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ రిజిస్టర్ చేశారట. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మే 15న విడుదల కానుంది. -
అమ్మకు కీర్తి తెచ్చిన పాత్రలో కీర్తి
మామగారు రజనీకాంత్ నటించిన చిత్రాల్లో అల్లుడు ధనుష్కి బాగా నచ్చిన చిత్రాలు ‘మాపిళ్లయ్’, ‘నెట్రిక్కన్’. వీటిలో ‘మాపిళ్లయ్’ రీమేక్లో నటించారు ధనుష్. ఇప్పుడు ‘నెట్రిక్కన్’ రీమేక్లో నటించాలనుకుంటున్నారని సమాచారం. ఇక్కడ విశేషం ఏంటంటే... 1981లో విడుదలైన ‘నెట్రిక్కన్’లో రజనీ సరసన ఓ కథానాయికగా కీర్తీ సురేష్ తల్లి మేనక నటించారు. ఆ సినిమాలో మేనక నటనకు మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ రీమేక్లో ధనుష్తో కీర్తీ జోడీ కట్టనున్నారని సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప్రారంభం అవుతుందట. ఎస్.పి. ముత్తురామన్ దర్శకత్వంలో కె. బాలచందర్ ‘నెట్రిక్కన్’ని నిర్మించారు. ఇప్పుడు ధనుష్ తన వండర్బార్ బేనర్లోనే ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నారట. దర్శకుడు ఇంకా ఖారారు కాలేదు. ‘నెట్రిక్కన్’ కథ విషయానికి వస్తే.. ఉమనైజర్ అయిన తండ్రి ప్రవర్తనను మార్చాలని తాపత్రయపడే కొడుకు కథ ఇది. తండ్రీకొడుకుల పాత్రలను రజనీయే చేశారు. సో.. రీమేక్లో ధనుష్ ఈ రెండు పాత్రలు చేస్తారని ఊహించవచ్చు. -
ఉమామహేశుడి ఉగ్రరూపం
‘బాహుబలి’ వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా, నిర్మాత ప్రవీణా పరుచూరితో కలసి ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యదేవ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా మలయాళ ‘మహేశింటె ప్రతీకారమ్’ చిత్రానికి రీమేక్. అరకు వ్యాలీలో జరిపిన 36 రోజుల షెడ్యూల్తో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేశారు. ‘‘ఉమా మహేశ్ చాలా సౌమ్యుడు. ఓ సందర్భంలో అతను ఉగ్రరూపం దాల్చాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటనేది కథ. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2020 ఏప్రిల్ 17న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. -
నేను నటిస్తున్నానంటే..
సినిమా: నేను నటిస్తున్నానంటే.. అంటోంది నటి సమంత. ఇంతకీ ఈ బ్యూటీ ఏం చెప్పాలనుకుందో అనేగా మీ ఆసక్తి. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి. చాలా మందిలానే ఆదిలో అవకాశాల వేటలో అలసిన నటి సమంత. మాస్కోవిన్ కావేరి, బానాకాత్తాడి ఇలా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించిన ఈ చెన్నై చిన్నది దర్శకుడు గౌతమ్మీనన్ దష్టిలో పడడం, తమిళంలో విన్నైతాండి వరువాయా చిత్రంలో నటి త్రిష పోషించిన పాత్రను తెలుగులో సమంత చేయడం, ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించడం చక చకా జరిగిపోయాయి. అంతే సమంత నట జీవితం ఒక్క సారిగా మారిపోయింది. ఆ తరువాత తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వరుస కట్టాయి. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇదిలా ఉండగా తన తొలి చిత్ర హీరో నాగచైతన్య ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. సమంత పెళ్లి చేసుకోవడంతో ఆమె కేరీర్కు డేమేజ్ అవుతుందనుకున్న వారూ లేకపోలేదు. అలాంటిది అలాంటి వారి ఊహలను పటాపంచల్ చేస్తూ వివాహానంతరం సమంత కేరీర్కు డోకా లేదు కదా, మరింత పెరిగిందనే చెప్పాలి. వరుస విజయాలతో దూకుడు మీదున్న సమంత ఇప్పుడు చిత్రాల ఎంపికలో జాగ్రత్త వహిస్తోంది. తన పాత్రల ఎంపికలో మార్పు వచ్చింది. ప్రస్తుతం తమిళ చిత్రం 96 రీమేక్లో నటిస్తోంది. కాగా ఇటీవల సమంత ఒక భేటీలో పేర్కొంటూ తాను ఇంతకు ముందు ఎలాంటి పాత్రనైనా అంగీకరించానన్నారు. అయితే వివాహానంతరం తన స్థాయి, తాను కోడలుగా వెళ్లిన కుటుంబ నేపథ్యం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారా? అన్న ప్రశ్న తరచూ తలెత్తుతోందన్నారు. అయితే అలాంటి పరిస్థితి తనకు లేదని, నటిగా పరిణితి చెందానని, ఇంత కాలం సినిమాలో ఉంటే సినిమాల ఎంపికలో మార్పు రాకుండా ఉంటుందా? అని ప్రశ్నించారు. అలాగైతే తానింత కాలం సినిమా రంగంలో ఉండి ప్రయోజనం ఏముంటుందీ? అని అన్నారు. కాబట్టి తన అనుభవంతో చిత్ర కథలను ఎంపిక చేసుకుంటున్నానని చెప్పారు. ఇకపై కేవలం కమర్శియల్ చిత్రాలనే చేయరాదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చిత్రంలో సమంత ఉందంటే అంది వైవిధ్యభరిత కథా చిత్రంగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారని అన్నారు. తానూ విభిన్న కథా పాత్రలనే కోరుకుంటున్నానని, ఇకపై తాను నటించే చిత్రాలు కచ్చితంగా కొత్తగా ఉండేలా చూసుకుంటానని సమంత చెప్పింది. నిజంగానే ఈ బ్యూటీ వచ్చిన అవకాశాలన్ని అంగీకరించడంలేదు. ప్రస్తుతం 96 చిత్రాన్ని పూర్తి చేశారు. ఇది వచ్చే ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోందని సమాచారం. తాజాగా ఒక వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. ఇందులో వెరైటీగా విలనీయం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. -
రీమేకుకింగ్
మనుషులంతా ఒక్కటే అయినట్టు ప్రేక్షకులంతా కూడా ఒక్కటే. తమిళంలో అయినా తెలుగులో అయినా నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. అక్కడ అయినా ఇక్కడ అయినా పొయ్యి వెలిగించే వంట చెయ్యాలి. అక్కడ ఉడికిన కథ ఇక్కడా ఉడుకుతుంది. అందుకే ఇప్పుడు రీమేక్ల పాకం పండుతోంది. త్వరలో వడ్డిస్తారు. మెస్ టికెట్ కొనుక్కోండి. రీమేకుక్స్ను కలవండి. రైతు కుటుంబం ‘చంటి, చినరాయుడు, సుందరకాండ, అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు, సూర్య వంశం, రాజా’... తెలుగులో హిట్గా నిలిచిన ఈ చిత్రాలు తమిళ చిత్రాలకు రీమేక్. మన తెలుగులో ఎక్కువగా రీమేక్ చిత్రాల్లో నటించిన హీరో ఎవరంటే వెంకటేశ్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా వెంకీ మరో తమిళ చిత్రం ‘అసురన్’ తెలుగు రీమేక్లో నటించనున్నారు. ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఊరికి కాస్త దూరంగా కుటుంబంతో కలిసి హాయిగా ఉంటున్న ఓ రైతు భూమిని ఆ గ్రామంలోని ఓ పెద్ద మనిషి సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఆ పెద్దమనిషికి రైతు కుటుంబం ఎలా బుద్ధి చెప్పిందన్నదే ‘అసురన్’ కథ. ముగ్గురమ్మాయిల కథ అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన హిందీ చిత్రం ‘పింక్’ సూపర్హిట్ సాధించింది. అనిరు«ద్ రాయ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని అజిత్తో ‘నేర్కొండ పార్వై’గా తమిళంలో రీమేక్ చేశారు బోనీ కపూర్. ఇప్పుడు ‘పింక్’ని ‘దిల్’ రాజుతో కలిసి తెలుగులో రీమేక్ చేయనున్నారు బోనీ కపూరే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. అమితాబ్ పాత్రలో పవన్కల్యాణ్ నటించనున్నారని టాక్. ముగ్గురు అమ్మాయిలు ఓ ‘రాక్ కాన్సెర్ట్’కు వెళతారు. అక్కడ అబ్బాయిలతో కలిసి మద్యం సేవిస్తారు. ఆ తర్వాత ఈ ముగ్గురు అమ్మాయిలకు బెదిరింపులు మొదలవుతాయి. అకస్మాత్తుగా ఈ ముగ్గురిలో ఒకర్ని హత్యాయత్నం నేరారోపణపై పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ విషయాలన్నింటినీ గమనిస్తుంటాడు ఓ రిటైర్డ్ లాయర్. ఈ ముగ్గురు అమ్మాయిలకు ఈ అతను ఎలా సహాయం చేశాడు? ఈ అమ్మాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేసిందెవరు? అనే అంశాల సమాహారమే ‘పింక్’ కథ. పోలీస్ వర్సెస్ గ్యాంగ్స్టర్ విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో మంచి విజయం సాధించిన చిత్రం ‘విక్రమ్ వేదా’. దర్శక ద్వయం పుష్కర్–గాయత్రి తెరకెక్కించారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగు రీమేక్ తెరకెక్కనుందని సమాచారం. ఒక హీరోగా రవితేజ నటిస్తారు. మరో హీరో ఫైనలైజ్ కావాల్సి ఉందని తెలిసింది. ఇక ‘విక్రమ్ వేదా’ కథ విషయానికి వస్తే... ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్టుకు, గ్యాంగ్స్టర్కు మధ్య జరిగే మైండ్ గేమే ఈ చిత్రం. పోలీసులు ప్లాన్ చేసిన ఓ ఎన్కౌంటర్ వీరిద్దరి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందన్నదే కథ. సొంత పరిశోధన క్రైమ్ డిపార్ట్మెంట్కు మారాలనుకున్న ఓ యువ ట్రాఫిక్ పోలీసాఫీసర్ ఓ క్రైమ్ కేసుపై ఆసక్తి పెంచుకుని పై అధికారులకు తెలియకుండా పరిశోధన మొదలు పెడతాడు. చివరికి ఈ కేసు గురించి అతనికి తెలిసిన నిజాలు ఏంటి? ఈ యువ పోలీసాఫీసర్కు ఓ రిటైర్డ్ పోలీసాఫీసర్, ఓ పాత్రికేయుడు ఎలా సహాయం చేశారు? అన్నదే కన్నడ మూవీ ‘కవలుదారి’(2019) కథాంశం. ఇందులో అనంతనాగ్ హీరోగా నటించారు. ఈ సినిమా తెలుగు రీమేక్లో సుమంత్ హీరోగా నటిస్తారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తారు. ఛాలెంజ్ దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన కన్నడ చిత్రం ‘కాలేజ్ కుమార్’కు మంచి ప్రేక్షకాదరణ దక్కింది. తండ్రీ కొడుకుల చాలెంజే ఈ సినిమా కథ. ప్యూన్గా పని చేసే ఓ తండ్రి తన కొడుకుని పెద్ద స్థాయి ఉద్యోగిగా చూడాలనుకుంటాడు. కానీ కొడుకేమో పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తున్నట్లు దొంగ ఆధారాలు చూపిస్తుంటాడు. ఓ రోజు తండ్రికి నిజం తెలుస్తుంది. ఆ సమయంలో ఒకరికొకరు సవాల్ విసురుకుంటారు. ఈ సినిమా ‘కాలేజ్ కుమార్’ టైటిల్తోనే తెలుగులో రీమేక్ అవుతోంది. మాతృకకు దర్శకత్వం వహించిన హరి సంతోషే తెలుగుకూ దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్నారు. తండ్రి పాత్రను ప్రభు చేస్తారని తెలిసింది. ముక్కుసూటితనం తెలుగులో కృష్ణవంశీ డైరెక్షన్ స్టైల్కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. గతంలో ఆయన తెరకెకెక్కించిన ‘నిన్నేపెళ్లాడతా, సిందూరం, అంతఃపురం, ఖడ్గం, చందమామ’ చిత్రాలు సాధించిన విజయాలు అలాంటివి. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కి రీమేక్ ఇది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించనున్నారు. ముక్కుసూటి మనస్తత్వం ఉన్న ఓ సీనియర్ థియేటర్ ఆర్టిస్టు జీవితంలోని ఎత్తుపల్లాల సంఘటనల సమాహారమే ‘నట సామ్రాట్’. మరాఠీ నటసామ్రాట్గా నానా పటేకర్ అభినయించారు. తెలుగు రీమేక్లో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ నటించనున్నారు. ప్రతీకారం ‘కేరాఫ్ కంచెరపాలెం’ వంటి భిన్నమైన ప్రయత్నంతో దర్శకుడిగా మంచి మార్కులు వేయించుకున్నారు వెంకటేష్ మహా. ఇప్పుడు జాతీయ అవార్డు సాధించిన మలయాళ హిట్ ‘మహేషింటే ప్రతీకారం’ చిత్రాన్ని వెంకటేష్ మహా తెలుగులో రీమేక్ చేస్తున్నారని తెలిసింది. మలయాళంలో ఫాహద్ ఫాజల్ పోషించిన పాత్రను తెలుగులో సత్యదేవ్ చేస్తున్నారు. ఊరందరి ముందు జరిగే ఓ కోట్లాటలో ఓ ఫొటోగ్రాఫర్ ఓడిపోతాడు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు ఆ ఫొటోగ్రాఫర్. తాను ఓడిపోయిన వ్యక్తి చేతిలో తిరిగి గెలిచేంత వరకు చెప్పులు వేసుకోనని శపథం చేస్తాడు. ఆ ఫొటోగ్రాఫర్ శపథంతో పాటు, ఓ అమ్మాయి మనసును కూడా ఎలా గెల్చుకున్నాడు అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. – శివాంజనేయులు ముసిమి ఆన్ ద వే రాజకీయ వారసత్వ నేపథ్యంలో సాగే మలయాళ హిట్ ‘లూసిఫర్’ సినిమా తెలుగు రీమేక్స్ హక్కులను దక్కించుకున్నారు రామ్చరణ్. ‘లూసిఫర్’లో మోహన్లాల్ చేసిన పాత్రలో చిరంజీవి నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక బాలీవుడ్లో అజయ్దేవగన్ నటించిన ‘దే దే ప్యార్దే’ తెలుగు హక్కులను డి. సురేష్బాబు దక్కించుకున్నారు. ఈ సినిమా తెలుగు రీమేక్లో వెంకటేశ్ నటిస్తారట. పెళ్లైన తర్వాత భార్య ఉండగానే ఓ యువతి ప్రేమ కోసం తాపత్రయపడే మధ్య వయస్కుడి కథే ఈ చిత్రం. బాలీవుడ్ యువనటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన హిందీ చిత్రం ‘బదాయి హో’ బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్స్ను రాబట్టింది. తెలుగులో ఈ చిత్రాన్ని బోనీ కపూర్, ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. ఓ ఉమ్మడి కుటుంబంలో పెళ్లి కావాల్సిన కొడుకు ఉన్న ఓ తల్లి మరో బిడ్డకు జన్మనివ్వబోతోందని తెలుస్తుంది. అప్పుడు ఆ కొడుకుని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి ఏ షరతులు పెట్టింది... అన్నదే ‘బదాయి హో’ కథాంశం. ఇంకా... తమిళంలో విజయ్ నటించిన ‘తేరీ’, మలయాళ హిట్ ‘ఇష్క్’ చిత్రాలు తెలుగులో రీమేక్ కానున్నాయని సమాచారం. చిరంజీవి రిలీజ్కి సిద్ధం తమిళ హిట్ ‘96’ చిత్రాన్ని ‘దిల్’ రాజు తెలుగులో రీమేక్ చేశారు. శర్వానంద్, సమంత నటించిన ఈ సినిమా రిలీజ్కు ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. మరో తమిళ చిత్రం ‘కణితన్’ తెలుగులో ‘అర్జున్ సురవరం’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్ నటించారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. హిందీలో కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ చిత్రం తెలుగు రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మీ’లో తమన్నా నటించారు. ఈ సినిమా రిలీజ్కి రెడీ అయింది. -
చైనీస్కు దృశ్యం
ఒక భాషలో విజయవంతమైన చిత్రాలు మరో భాషలో రీమేక్ కావడం సాధారణం. ఈ మధ్య కాలంలో మలయాళ హిట్ సినిమా ‘దృశ్యం’ ఎక్కువ భాషల్లో రీమేక్ అయింది. తాజాగా చైనీస్ భాషకి వెళ్లడం విశేషం. మోహన్లాల్ హీరోగా జీతూ జోసెఫ్ రూపొందించిన థ్రిల్లర్ ‘దృశ్యం’. తెలుగులో వెంకటేశ్ (దృశ్యం), తమిళంలో కమల్ హాసన్ (పాపనాశనం), కన్నడంలో రవిచంద్రన్ (దృశ్య), హిందీలో అజయ్ దేవగన్ (దృశ్యం) హీరోలుగా రీమేక్ చేశారు. అంతేకాదు.. సింహళీ (శ్రీలంక)భాషలో ‘ధర్మయుద్య’గా రీమేక్ అయింది. ఇప్పుడు చైనీస్లో ‘షీప్ వితౌట్ ఏ షెపర్డ్’ ౖటñ టిల్తో రీమేక్ అయింది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20న విడుదలవుతోంది. -
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్న్యూస్. పవర్స్టార్ మళ్లీ తెరపై సందడి చేయనున్నారు. సరికొత్త కాంబినేషన్లో పవన్ కొత్త సినిమా తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. హిందీలో హిట్ అయిన పింక్ సినిమా రీమేక్లో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. నాని హీరోగా ‘ఎంసీఏ’ సినిమా తీసిన వేణు శ్రీరామ్కు దర్శకత్వం బాధ్యతలు అప్పగించినట్టు ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అమితాబ్ బచ్చన్, తాప్పీ పొన్ను ప్రధాన పాత్రల్లో నటించిన ‘పింక్’ సినిమా 2016లో హిందీలో మంచి విజయాన్ని అందుకుంది. 23 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు రూ. 85 కోట్లు వసూలు చేసింది. సామాజిక సందేశంతో క్రైమ్ డ్రామా జానర్లో తెరకెక్కిన ఈ సినిమాను తమిళంలో ‘నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్ చేశారు. స్టార్ హీరో అజిత్ ప్రధానపాత్ర పోషించిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించారు. తమిళంలోనూ విజయం సాధించడంతో తెలుగులోనూ రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ‘పింక్’ రీమేక్లో పవన్ నటిస్తున్నాడని తెలియడంతో సోషల్ మీడియాలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతీకార కథతో..
మొదటి సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’లో ప్రేమనే ఇతివృత్తంగా, మూడు దశల్లో ప్రేమకథలను చూపించారు దర్శకుడు వెంకటేశ్ మహా. ఇప్పుడు తన కొత్త సినిమాను ప్రతీకార ఛాయలున్న కథతో రూపొందిస్తున్నారట. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘మహేషింటె ప్రతీకారం’ చిత్రానికి ఈ సినిమా రీమేక్ అని తెలిసింది. ‘మహేషింటె ప్రతీకారం’లో చిత్రం ఫాహద్ ఫాజల్ ముఖ్యపాత్ర చేశారు. తెలుగు రీమేక్లో ఆయన పాత్రను సత్యదేవ్ చేస్తున్నారు. నవంబర్లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. ‘మహేషింటె ప్రతీకారం’ సినిమాకి జాతీయ అవార్డు లభించింది. తమిళంలో ఈ సినిమాను దర్శకుడు ప్రియదర్శన్ రీమేక్ చేశారు. -
ఏదైనా నేర్చుకోవడమే
గత ఏడాది ‘కేధార్నాథ్’ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. ఆ తర్వాత రోహిత్శెట్టి ‘సింబ’లో హీరోయిన్గా మెరిసిన ఈ బ్యూటీ ప్రస్తుతం డేవిడ్ ధావన్ (కూలీ నం 1 తాజా రీమేక్), ఇంతియాజ్ అలీ (లవ్ ఆజ్ కల్ సీక్వెల్) వంటి సీనియర్ దర్శకులతో వర్క్ చేస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్లోనే బాగా అనుభవం ఉన్న దర్శకుల సినిమాల్లో నటించడం వల్ల ఏమైనా ఒత్తిడికి గురవుతున్నారా? అన్న ప్రశ్నకు సారా బదులిస్తూ–‘‘అలా ఏం లేదు. డేవిడ్, ఇంతియాజ్సార్లతో వర్క్ చేయడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ నా లక్ కూడా. ఇంతియాజ్సర్ షూటింగ్ ఉందంటే రెండు వారాల ముందే రిహార్సల్స్ స్టార్ట్ అవుతాయి. ఇక డేవిడ్సర్ సినిమా అంతా సెట్లో అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఉంటుంది. ఈ రెండు అనుభూతులు నాకు వినోదాత్మకంగానే ఉన్నాయి. ప్రస్తుతం కెరీర్ స్టార్టింగ్లో ఉన్నాను. ఏదైనా నేర్చుకోవడమే అనుకుని కష్టపడుతున్నాను. నా పాత్రల ఎంపికలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటాను. గ్లామర్, డ్యాన్స్ వంటి కమర్షియల్ అంశాలు ఇష్టమే కానీ నేను చేసే కమర్షియల్ సినిమాల్లో నా పాత్రలో పెర్ఫార్మెన్స్, ఎమోషన్ ఎలిమెంట్స్కు స్కోప్ ఉందో లేదో చూసుకుంటాను’’ అన్నారు. -
ట్రూమేక్
కాగితం మీద సీన్ ఉంటే నమ్మకం కుదరదు. అదే ఆల్రెడీ తీసేసిన స్క్రిప్ట్ అయితే ఒక గ్యారంటీ. అది పెద్ద హిట్ అయి ఉంటే ఇంకా భరోసా. అక్కడ హిట్ అయ్యింది ఇక్కడ హిట్ అవుతుందిలే అని ధైర్యం. కాని రీమేక్లు ఎప్పుడూ మేజిక్స్టిక్లే. అవి సరిగ్గా తిప్పితే పూలవర్షం కురుస్తుంది.లేదంటే పాము పడగై కాటేస్తుంది. ఇటీవలి రీమేక్లు సక్సెస్స్టోరీ ఇది. రీమేక్ అనేది కత్తి మీద సాము. మార్పులు చేసి తీయాలా యథాతథంగా తీయాలా అనేది ఎప్పుడూ ఒక పజిల్. మార్పులు చేసి తీసిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మార్పులు చేయకుండా తీసిన సినిమాలూ హిట్ అయ్యాయి. మార్పులు చేసినా, చేయకపోయినా ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. సినిమాలు ఎలా ఎందుకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయో చెప్పలేము. చిరంజీవి అంతటి మెగాస్టార్ కెరీర్ పరంగా ఒడిదుడుకులలో ఉన్నప్పుడు హిట్ ఇచ్చి నిలబెట్టిన ‘హిట్లర్’ రీమేకే. పెద్ద సక్సెస్ ఇచ్చి రాజకీయ ప్రవేశానికి ఊతం ఇచ్చిన ‘ఠాగూర్’ రీమేకే. ‘శంకర్దాదా ఎంబిబిఎస్’ కూడా రీమేకే. అలాగే మోహన్బాబుకు సినిమా రంగంలో సెకండ్ లైఫ్ ఇచ్చి స్టార్ ఇమేజ్ తెచ్చిన ‘అల్లుడుగారు’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘రౌడీ గారి పెళ్లాం’ సినిమాలు రీమేక్లే. కాని రీమేక్ అంటే మాత్రం చాలామంది దర్శకులు నెర్వస్గానే ఫీలవుతారు. గతంలో తెలుగులో రీమేక్ స్పెషలిస్టులు ఉండేవారు. పాతరోజులలో ఎస్.డి.లాల్ వంటి డైరెక్టర్లు హిందీ సినిమాలను తెలుగులో రీమేక్ చేసేవారు. ‘నిప్పులాంటి మనిషి’ (జంజీర్), అన్నదమ్ముల అనుబంధం (యాదోంకి బారాత్), నేరం నాది కాదు ఆకలిది (రోటి) ఇవన్నీ ఎస్.డి.లాల్ తీసిన సినిమాలు. తర్వాతి రోజులలో రవిరాజా పినిశెట్టి రీమేక్లకు వాసి గాంచారు. ఆయన తీసి సూపర్హిట్ చేసిన ‘పుణ్యస్త్రీ’, ‘పెదరాయడు’, ‘చంటి’ రీమేక్లే. ఇక దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు రీమేక్ సినిమాలతోనే కెరీర్ నిర్మించుకున్నారు. ‘శుభాకాంక్షలు’, ‘సుస్వాగతం’, ‘సూర్యవంశం’, ‘సుడిగాడు’ ఇందుకు ఉదాహరణ. అయితే ఇప్పుడు అలా లేదు. అందరు దర్శకులూ అవకాశాన్ని బట్టి రీమేక్లు తీయడానికి సిద్ధమవుతున్నారు. తీస్తున్నారు కూడా. మొన్న మొన్న వచ్చిన నాగార్జున ‘ఊపిరి’ ఫ్రెంచ్ ‘‘ది ఇన్టచ్బుల్స్’కు రీమేక్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. నాగచైతన్య ‘ప్రేమమ్’ కూడా మలయాళ సూపర్హిట్కు రీమేక్. చందు మొండేటి దర్శకుడు. ఇటీవల తెలుగులో మళ్లీ రీమేక్ల చర్చ వస్తోంది. కారణం ఇటీవలి రీమేక్ సినిమాలు హిట్ కావడమే. ఎంత మార్చాలి ఎంత మార్చక్కర్లేదు అనే లెక్కలని జాగ్రత్తగా వేసి తీసిన సినిమాలివి. ఒక రకంగా వీటిని ‘ట్రూమేక్’లు అనొచ్చు. ఒరిజినల్ సినిమా పట్ల నిజాయితీతో ఉండి తీసిన సినిమాలన్నమాట. వాటి విశేషాలు. ఓహో బేబీ! సినిమా కథకు ఐడియా వెలగడం పెద్ద విషయం కాదు. దానిని విస్తరించి ఆసక్తికరమైన తొంభై సీన్లుగా మలచడం అసలు విజయం. ఒక స్త్రీ జీవిత చరమాంకంలో తిరిగి యంగ్గా జీవించే ఛాన్స్ వస్తే అనే ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే దానిని సినిమాకు వీలుగా మలిచిన తీరు కూడా ఆసక్తికరమే. అందుకే కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ పెద్ద హిట్ అయ్యింది. కథకు యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉందని గ్రహించాక 11 భాషలకు చెందిన సినీరంగాలవారు ఈ కథను దేశ విదేశాలలో ఎగరేసుకుపోయారు. అలా ఈ కథ తెలుగుకు కూడా చేరి ‘ఓ బేబీ’ అయ్యింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ముఖ్య పాత్రలో నటించారు. బేబీగా 80 ఏళ్ల వృద్ధ స్త్రీ పాత్రను లక్ష్మి చేశారు. రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యపాత్రల్లో నటించారు. బేబీ ఎంత బాగా నచ్చిందంటే సూపర్హిట్ కావడమే కాదు సుమారు 30 కోట్ల గ్రాస్ కూడా వసూలు చేసింది. హిందీలో కూడా రీమేక్ కాబోతోంది. హిందీలో ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తారని తెలిసింది. ఈ సినిమా హిట్ కావడానికి కారణం తెలుగుదనం తప్పిపోని విధంగా తెరకెక్కించడం, ఇది మన కథే అన్న భావన కలిగించడం. ఎప్పుడైతే బామ్మగా లక్ష్మి చేశారో ఆమె తన నుడికారంతో ఒక సాధారణ బామ్మను చూస్తున్న అనుభూతిని కలిగించారు. సమంత ఆ పాత్రను నేటి అమ్మాయిగా ప్రేక్షకులకు దగ్గర చేయగలిగింది. సగటు తెలుగు స్త్రీ మనోభావాలను, జీవితపు వెలితిని చూపడం వల్లే ఈ సినిమా హిట్ అయ్యిందని చెప్పొచ్చు. ‘‘రీమేక్తో వచ్చిన చిక్కేంటంటే సినిమా సరిగ్గా ఆడకపోతే పాడు చేశారు అంటారు. ఒకవేళ హిట్ అయితే సేమ్ అలానే తీశారు హిట్ అయిపోయింది అంటారు. రీమేక్స్తో ఎక్కువ పేరు సంపాదించడం కొంచెం కష్టం’’ – నందినీ రెడ్డి, ‘ఓ బేబి’ రిలీజ్ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో. రాక్షసుడు గతంలో ఎస్.వి.కృష్ణారెడ్డి ‘గన్షాట్’ అనే సైకో ఫిల్మ్ తీశారు. అందులో సైకోగా ప్రకాష్రాజ్ నటించారు. అలీ హీరో. కామెడీ చేయాల్సిన అలీ సీరియస్ రోల్ చేయడం, సీరియస్నెస్ చూపించాల్సిన విలన్ కామెడీ చేయడంతో ఈ సినిమా ప్రేక్షకులను సరిగా చేరలేదు. కాని ‘రాక్షసుడు’ సినిమా మాత్రం మొదటి సీన్ నుంచే సీరియస్ మూడ్లోకి తీసుకెళ్లిపోతుంది. స్కూల్ వయసు ఉన్న ఆడపిల్లలను చంపి అవయవాలను చిన్న చిన్న భాగాలుగా చేసి రాక్షసానందం పొందే ఈ సైకో కిల్లర్ను సినిమా దర్శకత్వం కోసం సైకోలను స్టడీచేసి, సినిమా తీసే వీలులేక పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఎలా పట్టుకున్నాడనేది కథ. తమిళంలో సూపర్హిట్ అయిన ‘రాక్షసన్’కు రీమేక్ ఇది. అక్కడ ఈ కథను రాసి దర్శకత్వం వహించింది రామ్కుమార్. తెలుగులో రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు. క్లైమాక్స్ వరకూ విలన్ ఎవరనేది ప్రేక్షకుడు పసిగట్టలేనంత పకడ్బందీగా స్క్రీన్ప్లే ఉంది. తమిళ ఒరిజినల్ను చాలా కొద్ది మార్పులతో రీమేక్ చేయడం వల్ల ఈ సినిమా ప్రేక్షకుల్లో దూసుకుపోయిందనే అభిప్రాయం ఉంది. సాధారణంగా పాత్రకు తగ్గ నటులు దొరక్కపోతే పాత్ర ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే తమిళంలో ముఖ్యపాత్రలు చేసిన ఇద్దరు ముగ్గురు నటులు తెలుగులో చేయడం కూడా సినిమా హిట్కు కారణం కావచ్చు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లోనే బెస్ట్ హిట్ ఇదని చిత్రబృందం పేర్కొంది. ‘‘రీమేక్ చేయడం అంటే ఒక పెయింటింగ్ని మళ్లీ వేయడం. అది అంత ఈజీ కాదు. తమిళ సినిమా ఓ టెంపోలో నడుస్తుంటుంది. అదే టెంపోను ఇక్కడ రిపీట్ చేయగలిగాను. సక్సెస్ సాధించాను’’ – రమేశ్ వర్మ, ‘రాక్షసుడు’ రిలీజ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.– ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది గురి తప్పిన బాణాలు రీమేక్లు అన్నిసార్లు సత్ఫలితాలు ఇవ్వవు. తమిళంలో సూపర్హిట్ అయిన సత్యరాజ్ సినిమా ‘వాల్టర్ వెట్రివేల్’ను తెలుగులో చిరంజీవి, శ్రీదేవిలతో ‘ఎస్.పి.పరశురామ్’గా తీస్తే ప్రేక్షకులు నిరాకరించారు. గ్లామర్ స్టార్ శ్రీదేవి ఈ సినిమాలో పాత్రపరంగా అంధురాలు కావడం జనానికి రుచించలేదు. మలయాళంలో మోహన్లాల్ నటించగా సూపర్హిట్ అయిన ‘దేవాసురమ్’ను తెలుగులో మోహన్బాబు ‘కుంతీపుత్రుడు’గా తీస్తే ప్రేక్షకులు మెచ్చలేదు. కన్నడలో సూపర్హిట్ అయిన విష్ణువర్థన్ సినిమా ‘ఆప్తరక్షక’ తెలుగులో వెంటేష్తో ‘నాగవల్లి’గా తీస్తే సత్ఫలితం ఇవ్వలేదు. కన్నడలో సూపర్హిట్ అయిన శివ రాజ్కుమార్ ‘జోగి’ని తెలుగులో ప్రభాస్తో ‘యోగి’గా తీస్తే ఆశించిన ఫలితం ఇవ్వలేదు. హిందీలో సూపర్ హిట్ అయిన ఆమిర్ ఖాన్ ‘మన్’ను తెలుగులో నాగార్జునతో ‘రావోయి చందమామ’గా తీస్తే ప్రేక్షకులు నిరాశాజనకమైన రిజల్ట్స్ ఇచ్చారు. కనుక పట్టువదలక పని చేస్తూ పోవడమే చేయదగినది. నచ్చితే హిట్ అవుతుంది. లేకుంటే అనుభవం వస్తుంది. ఎవరు ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాలతో థ్రిల్లింగ్ హిట్స్ అందుకున్నారు అడివి శేష్. మళ్లీ ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా ‘ఎవరు’తో వచ్చారు. స్పానిష్ సినిమా ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. ఆల్రెడీ హిందీలో ‘బద్లా’ గా ఈ సినిమా రీమేక్ అయింది. ఆ రెండు సినిమాలను చూసిన వారు కూడా ఎంటర్టైనింగ్గా చూసేలా మరిన్ని ట్విస్ట్లతో తెలుగు చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రామ్జీ. ఓ బడా బిజినెస్మేన్ భార్య పోలీస్ ఆఫీసర్ను చంపేస్తుంది. తన మీద అత్యాచారం చేశాడని, ఆత్మరక్షణ కోసం కాల్చానని చెబుతుంది ఆమె. ఇందులో నుంచి తప్పించడానికి విక్రమ్ వాసుదేవ్ అనే లంచగొండి పోలీస్ ఆఫీసర్ సహాయం తీసుకుంటుంది. ఈ కేస్లో నుంచి తప్పించుకోవడానికి విక్రమ్ వీళ్లకు సాయం చేశాడా? వీళ్లు తప్పించుకున్నారా? లేదా అనేది క్లుప్తంగా ‘ఎవరు’ కథ. ఒరిజినల్లో ఉన్న కొన్ని పాత్రలను తప్పించి, మరిన్ని ట్విస్ట్లు జోడించి ఎంగేజింగ్ థ్రిల్లర్గా రూపొందించారు.‘‘ఒరిజినల్ సినిమా అక్కడ ఎందుకు ఆడింది? అనే విషయం అర్థం చేసుకోవాలి. ‘ఇన్విజిబుల్ గెస్ట్’ కోల్డ్ ఫిల్మ్. వాళ్ల ఎమోషన్స్ అలానే ఉంటాయి. మనవి అలా ఉండవు. దాన్ని అర్థం చేసుకుని మనకు తగ్గట్టుగా మలుచుకుంటే కచ్చితంగా సక్సెస్ సాధించవచ్చు’’ – వెంకట్ రామ్జీ. ‘ఎవరు’ దర్శకుడు. -
ఆ బాలీవుడ్ రీమేక్పై నాని కన్ను
ప్రస్తుతం సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో రీమేక్ల ట్రెండ్ నడుస్తుంది. ఒక భాషలో ఘనవిజయం సాధించిన సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ లిస్ట్లో ఓ బాలీవుడ్ సూపర్హిట్ చేరనుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా హిందీలో ఘనవిజయం సాధించిన సినిమా అంధాధున్. ఈ సినిమాలో నటనకు గాను ఆయుష్మాన్ జాతీయ అవార్డును కూడా సాధించాడు. ఈ సినిమాను సౌత్లో రీమేక్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరగుతున్నాయి. ఇప్పటికే తమిళ వర్షన్లో ప్రశాంత్ హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు తెలుగు వర్షన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో నటించేందుకు నాని ఆసక్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గ్యాంగ్ లీడర్ షూటింగ్ పూర్తి చేసిన నాని, ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని నెగెటివ్ రోల్లో కనిపించనున్నాడు. ఈ సినిమా తరువాత అంధాదున్ రీమేక్ను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. -
మిస్టర్ బచ్చన్ పాండే
నాన్చాక్ పట్టుకుని ‘నేను రెడీ’ అంటున్నారు బచ్చన్ పాండే. అక్షయ్ కుమార్ నటించనున్న తాజా చిత్రానికి ‘బచ్చన్ పాండే’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలోని అక్షయ్ లుక్తో పాటు సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్కు విడు దల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వీరమ్’కి (తెలుగులో ‘కాటమరాయుడు’ గా రీమేక్ అయ్యింది) హిందీ రీమేక్ అని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం లక్ష్మీబాంబ్, సూర్యవన్షీ సినిమాలతో బిజీగా ఉన్నారు అక్షయ్. అలాగే ఆయన నటించిన ‘మిషన్ మంగళ్’ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
మరో రెండు!
బాలీవుడ్లో తెలుగు సినిమాల రీమేక్ల హవా ఇంకా కొనసాగేలా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి నాని నటించిన ‘జెర్సీ’, సందీప్కిషన్ తాజా చిత్రం ‘నిను వీడని నీడను నేనే’ చిత్రాలు చేరాయి. ‘జెర్సీ’ చిత్రాన్ని సితార ఎంటరై్టన్మెంట్స్తో కలిసి నిర్మాతలు అల్లు అరవింద్, ‘దిల్’ రాజు హిందీలో రీమేక్ చేస్తారని సమాచారం. అలాగే ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం హిందీ రీమేక్స్ రైట్స్ను దర్శకుడు రాజ్ అండ్ డీకే దక్కించుకున్నారు. తెలుగులో ‘డి’ ఫర్ దోపిడి, హిందీలో షోర్ ఇన్ ది సిటీ, హ్యాపీ ఎండింగ్ వంటి చిత్రాలకు దర్శకత్వంలో వహించారు. అలాగే నిర్మాతలుగా గత ఏడాది రాజ్, డీకే తీసిన ‘స్త్రీ’ భారీ విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తెలుగు హిట్ చిత్రాలు ‘ఎఫ్ 2’, ‘ఓ బేబి’, ‘హుషారు’ హిందీలో రీమేక్ కాబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ‘టెంపర్’ (హిందీలో ‘సింబ’), ‘అర్జున్రెడ్డి’ (హిందీలో ‘కబీర్సింగ్’) చిత్రాలు హిందీలో రీమేక్ అయి, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. -
అమితాబ్గా హృతిక్?
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటించిన తాజాచిత్రం ‘సూపర్ 30’. బీహార్కు చెందిన గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. దీంతో హృతిక్ నెక్ట్స్ సినిమా ఏంటి? అనే ప్రశ్న బీటౌన్లో మొదలైంది. 1982లో అమితాబ్ బచ్చన్, హేమ మాలిని నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సత్తే పే సత్తా’ (1982) రీమేక్లో హృతిక్ రోషన్ నటించబోతున్నారని ఖబర్. ఈ సినిమాకు ఫర్హా ఖాన్ దర్శకత్వం వహిస్తారట. దర్శకుడు రోహిత్ శెట్టి ఈ సినిమాను నిర్మిస్తారట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఈ సినిమాలో హృతిక్ సరసన దీపికా పదుకోన్ హీరోయిన్గా నటించనున్నారని టాక్. -
డ్రీమ్ గాళ్తో రానా!
ప్రస్తుతం ముంబై నుంచి హైదరాబాద్ వరకూ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ రానా. ప్రాంతీయ హద్దులను తన స్టోరీ సెలక్షన్స్తో చెరిపేస్తున్నారు. యాక్టర్గా కొత్త కొత్త కథలను చెబుతున్న రానా నిర్మాతగా మారి మరిన్ని కథలను స్క్రీన్ మీదకు తీసుకురావాలని అనుకుంటున్నారని తెలిసింది. ఆల్రెడీ సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన కొన్ని సినిమాలకు రానా సమర్పకుడిగా వ్యవహరించారు. ఇప్పుడు పూర్తిస్థాయి నిర్మాతలా మారి, రాజ్ తరుణ్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్రెడీ జరుగుతోందని తెలిసింది. ఇది హిందీ ‘డ్రీమ్ గాళ్’ చిత్రానికి రీమేక్ అని కూడా సమాచారం. -
బాహుబలి రీమేకా.. అయ్యే పనేనా?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ విజువల్ వండర్ బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుతం తెలుగుతో పాటు ఉత్తరాదిలోనూ ఘనవిజయం సాధించింది. బాలీవుడ్ సినిమాలకు కూడా సాధ్యం కాని రికార్డ్లను కొల్లగొట్టి బిగెస్ట్ ఇండియన్ మూవీగా చరిత్ర సృస్టించింది. అసలు బాహుబలి సినిమా చూడని మూవీ లవర్ఉండడంటే అతిషయోక్తి కాదు. అలాంటి భారీ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. వందకోట్ల బడ్జెట్తో ఆర్కా మీడియా సంస్థ తెరకెక్కించిన బాహుబలి చిత్రాన్ని గుజరాతీ భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే నిర్మాతలు నితిన్ జానీ, తరుణ్ జానీ రీమేక్ హక్కులను కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే హిందీలోనూ చాలా సార్లు టీవీలో వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు రీమేక్ చేస్తే బిజినెస్ పరంగా వర్క్ అవుట్ అవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒక వేళ రీమేక్ చేసిన ఒరిజినల్ వర్షన్తో పోటి పడగలరా..? అంత సమయం కేటాయించి, అంత ఖర్చు పెట్టి, ఆ స్థాయిలో గ్రాఫిక్స్ అవుట్పుట్ సాధ్యమేనా అంటున్నారు విశ్లేషకులు. కొందరైతే మరొ అడుగు ముందుకేసి బాహుబలిని రీమేక్ చేయటం తుగ్లక్ చర్య అని కామెంట్ చేస్తున్నారు. నితిన్, తరుణ్ లు మాత్రం గుజరాతీ స్టైల్, కాస్త తక్కువ బడ్జెట్లో బాహుబలిని రీమేక్ చేస్తే వర్క్ అవుట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారట. -
రెండోసారి...
హృతిక్ రోషన్ కెరీర్లో పెద్ద హిట్స్లో ఒకటైన ‘అగ్నిపథ్’ చిత్రం అదే పేరుతో చేసిన అమితాబ్ బచ్చన్ చిత్రానికి రీమేక్ అనే సంగతి తెలిసిందే. తాజాగా మరో అమితాబ్ సినిమా రీమేక్లో హృతిక్ నటించబోతున్నాడని బాలీవుడ్ సమాచారం. అమితాబ్ హీరోగా 1982లో వచ్చిన ‘సట్టే పే సట్టా’ చిత్రాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ఫరాఖాన్ రీమేక్ చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట. ఈ సినిమాలో నటించడానికి హృతిక్ అంగీకారాన్ని తెలిపారని తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్లో ఉందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన రానుంది. రోహిత్శెట్టితో కలసి ఫరాఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. -
తమిళ్, మలయాళంలో ‘C/o కంచరపాలెం’ రీమేక్
గతేడాది విడుదలైన చిన్న బడ్జెట్ చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. ఇప్పుడీ సినిమా తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ కానుంది. దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళంలో ఘనవిజయం సాధించిన ‘శైవం’తో పాటు తెలుగులో ‘కలర్స్’ స్వాతి, నవీన్ చంద్ర ముఖ్య తారలుగా ‘గీతాంజలి’ ఫేమ్ రాజకిరణ్ దర్శకత్వంలో ‘త్రిపుర’ చిత్రాన్ని నిర్మించిన యమ్. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. రేపు (బుధవారం) తన పుట్టిన రోజు సందర్భంగా రాజశేఖర్ రెడ్డి తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా షిరీడీ సాయి మూవీస్ పతాకంపై తాను నిర్మించనున్న చిత్రాల గురించి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ‘స్ట్రయిట్ చిత్రాలు నిర్మించడంతో పాటు గతంలో విజయ్ ఆంటోనీని తెలుగు తెరకు పరిచయం చేసిన ‘నకిలీ’, అలాగే ‘ప్రేమలో పడితే’, తమిళ చిత్రాలను తెలుగులోకి డబ్బింగ్ చేశాను. అలాగే తెలుగులో సిద్ధార్థ్, శ్రుతీహాసన్, హన్సిక కాంబినేషన్లో రూపొందిన ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రాన్ని తమిళంలో ‘శ్రీధర్’ పేరుతో అనువదించి, విడుదల చేశాను. గతంలో నేను హోటల్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ రంగాలలో అనేక బిజినెస్లు చేశాను. ఎన్ని బిజినెస్లు చేసినా నాకు తృప్తినిచ్చేది సినిమా మాత్రమే. అందుకే మంచి సినిమాలు తీయాలనే నిర్ణయంతో నా పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఈ మధ్య నేను చూసిన బెస్ట్ సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. ఆ సినిమాలోని చాలా సన్నివేశాలకు నేను కనెక్ట్ అయ్యాను. సినిమా చూడగానే డైరెక్ట్గా సురేశ్బాబు దగ్గరికెళ్లి ఫ్యాన్సీ రేట్ చెల్లించి ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రం తమిళ, మలయాళ రైట్స్ను సొంతం చేసుకున్నాను. సినిమా రైట్స్ సొంతం చేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేశాం. తమిళంలో పేరు పొందిన నటీనటులు ఈ సినిమాలో నటిస్తారు. మలయాళ వెర్షన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తాం. జూన్ నెల చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇది కాకుండా తెలుగులో మంచి పేరున్న నటీనటులతో ఓ సినిమా చేయబోతున్నాను. ఆ సినిమా వివరాలు త్వరలో ప్రకటిస్తాను’ అని చెప్పారు. -
తారే చైనా పర్
తారే జమీన్ పర్. 2007లో రిలీజైన ఆమిర్ ఖాన్ చిత్రం. అంతేనా... ఆమిర్ ఖాన్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం. అంతేనా... 2007లో ఆస్కార్ రేస్లో పోటీ పడిన చిత్రం. తల్లిదండ్రుల కోసం తీసిన పిల్లల చుట్టూ తిరిగే కథ ఇది. ఆలస్యమైనా చెప్పాల్సిన కథ వెళ్లాల్సిన చోటుకు వెళ్తుందటారు. ‘తారే జమీన్ పర్’ సినిమా పన్నెండేళ్ల తర్వాత చైనీస్ భాషలో రీమేక్ కాబోతోంది. చైనాలో ఆమిర్ ఖాన్కు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ‘పీకే, దంగల్’ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ నమోదు చేశాయి. మరి.. ఎంచక్కా డబ్బింగ్ చేసుకునేదానికి ఎందుకీ రీమేక్ అంటే.. రెండేళ్లు పైబడిన సినిమాల రిలీజ్ చైనాలో నిషేదం. దాంతో చైనీస్ లోకల్ స్టార్స్తో ఈ ప్రాజెక్ట్ను రీమేక్ చేస్తున్నారు. మా డ్యుయో ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. విశేషమేటంటే చైనాలో పైరసీలో ఎక్కువ శాతం మంది వీక్షించిన చిత్రం కూడా ‘తారే జమీన్ పర్’ చిత్రమే. -
బాలీవుడ్కు సూపర్ డీలక్స్
ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్గా నిలిచిన చిత్రాల్లో ‘సూపర్ డీలక్స్’ ఒకటి. త్యాగరాజ కుమారరాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, ఫాహద్ ఫాజల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. విజయ్ సేతుపతి, సమంత పోషించిన పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్లో రీమేక్ కానుంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా రైట్స్ తీసుకుందని టాక్. ఈ రీమేక్ను కూడా త్యాగరాజ కుమారరాజానే డైరెక్ట్ చేస్తారని తెలిసింది. ఈ రీమేక్లో బాలీవుడ్ టాప్ స్టార్స్ కనిపిస్తారని సమాచారం. -
కామెడీ టు సీరియస్
‘పెళ్లాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు మస్తు తెలుసు’ అంటూ వెంకటేశ్తో కలసి ‘ఎఫ్2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) లో కామెడీ పండించారు వరుణ్ తేజ్. ఇప్పుడు ‘వాల్మీకి’ సినిమా కోసం సీరియస్ మూడ్లోకి మారిపోయారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ఇది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం స్టార్ట్ అయింది. తమిళ చిత్రం ‘జిగర్తండా’కి ఇది అఫీషియల్ రీమేక్. ఇందులో వరుణ్ తేజ్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. తమిళ హీరో అధర్వ కీలక పాత్ర పోషించనున్నారని టాక్. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అయాంక బోస్. -
బాలీవుడ్కి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్
ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘దిల్’ రాజు ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ప్రస్ట్రేషన్) ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వంద కోట్లు వసూలు చేసిన ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్తో కలిసి హిందీలో రీమేక్ చేయనున్నారు ‘దిల్’ రాజు. తెలుగులో విజయవంతమైన ‘రెడీ’ చిత్రాన్ని సల్మాన్ఖాన్, ఆసిన్ జంటగా అదే పేరుతో, ‘పెళ్లాం ఊరెళితే’ చిత్రాన్ని ‘నో ఎంట్రీ’ గా హిందీలో తెరకెక్కించి, విజయం సాధించిన అనీస్ బజ్మీ ‘ఎఫ్ 2’కి దర్శకత్వం వహిస్తారు. నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు. ∙‘దిల్’ రాజు ∙బోనీకపూర్ -
తీన్ మార్?
కొత్త సినిమా కోసం రవితేజ మళ్లీ ఖాకీ డ్రెస్ వేసి లాఠీ చేతపట్టి పోలీస్గా మారిన సంగతి తెలిసిందే. ఈ తాజా చిత్రానికి ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘కనకదుర్గ’ అనే మాస్ టైటిల్ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తమిళంలో హిట్ సాధించిన విజయ్ ‘తేరీ’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉన్నట్లే తెలుగులోనూ ఇద్దరి హీరోయిన్స్ ఉన్నారు. ‘క్యాథరీన్’ ఒక హీరోయిన్గా చాన్స్ కొట్టేశారు. ఇప్పుడు మరో కథానాయికగా కాజల్ అగర్వాల్ను టీమ్ ఎంపిక చేసిందని సమాచారం. ఇంతకుముందు ‘వీర, సారొచ్చారు’ చిత్రాల్లో రవితేజ–కాజల్ జంటగా నటించారు. ఇప్పుడు కొత్త సినిమాలో ‘తీన్’ మార్ స్టెప్పులేయబోతున్నారన్నమాట. ఈ చిత్రం విజయవాడ నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. రవితేజ కెరీర్ బ్లాక్బస్టర్ మూవీ ‘కృష్ణ’ విజయవాడ నేపథ్యంలోనే ఉంటుందని గుర్తుండే ఉంటుంది. ఇంతకుముందు ‘విక్రమార్కుడు, మిరపకాయ్, పవర్’ వంటి హిట్ చిత్రాల్లో పోలీస్ పాత్రలో నటించి, మెప్పించారు రవితేజ. -
సౌత్కి బదాయి హో
బాలీవుడ్ యువనటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘బదాయి హో’ చిత్రం గతేడాది అక్టోబర్లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడి తొలి సినిమా ‘తేవర్’కు బోనీకపూర్ నిర్మాత. ఇలా అమిత్శర్మను ఇండస్ట్రీకి పరిచయం చేసింది బోనీ కపూర్నే. ఇప్పుడు అమిత్ శర్మ తెరకెక్కించిన ‘బదాయి హో’ చిత్రాన్ని సౌత్కి చూపించాలనుకుంటున్నారు బోనీకపూర్. ఈ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కులను ఆయన దక్కించుకున్నారు.‘‘బాలీవుడ్లో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. అదే ఆదరణ సౌత్లోనూ ఉంటుందని ఆశిస్తున్నాను. అయితే ఈ సినిమాను ముందుగా తెలుగులో నిర్మించాలా? లేక తమిళంలో సెట్స్పైకి తీసుకుని వెళ్లాలా? అనే విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదు’’ అని పేర్కొన్నారు బోనీ కపూర్. -
సౌత్లో మరో బాలీవుడ్ సూపర్ హిట్
దక్షిణాదిలో ఘన విజయం సాధించిన సినిమాలు ఉత్తరాదిలో.. అక్కడ సక్సెస్ అయిన సినిమాలు సౌత్లో రీమేక్ అవ్వటం తరుచూ జరుగుతుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్లు క్వీన్, పింక్ సినిమాలు సౌత్లో రీమేక్ అవుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్లో మరో సూపర్ హిట్ సినిమా చేరింది. గత ఏడాది బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ‘బదాయి హో’. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బదాయి హో ఘన విజయం సాధించటమే కాదు, 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా సౌత్ రీమేక్ హక్కులు సొంత చేసుకున్న బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, దక్షిణాదిలో అన్ని భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అమిత్ షా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా దక్షిణాదిలో హీరోగా ఎవరు నటిస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది. -
బ్యాక్ టు బ్యాక్
కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి కొంచెం గ్యాప్ ఇచ్చిన మాస్రాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ సినిమా షూటింగ్ షురూ చేశారు. దీంతోపాటు ‘తేరీ’ రీమేక్ కూడా మొదలుపెట్టనున్నారని సమాచారం. విజయ్ నటించిన ‘తేరీ’ చిత్రాన్ని ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శివన్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెలుగులో రీమేక్ అవుతోంది. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత షూటింగ్కు బ్రేక్ ఇచ్చారు. లేటెస్ట్గా ఏప్రిల్ రెండో వారం నుంచి షూటింగ్ కంటిన్యూ చేయడానికి రెడీ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తారు. ఇందులో కేథరిన్ కథానాయిక. తమిళ చిత్రాన్ని తెలుగు నేపథ్యానికి సరిపడేలా దర్శకుడు సంతోష్ శివన్ చాలా మార్పులు చేశారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిచనున్న ఈ చిత్రాన్ని దసరా స్పెషల్గా రిలీజ్ చేయనున్నారు. -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ఆరంభం
-
నేనే తప్పుకున్నాను
‘‘దర్శకుడు బాలా రూపొందించిన ‘వర్మ’ చిత్రం మాకు సంతృప్తికరంగా లేదు. సినిమాను మళ్లీ మొదటి నుంచి చిత్రీకరించాలనుకుంటున్నాం’’ అని ‘అర్జున్ రెడ్డి’ తమిళంలో రీమేక్ చేస్తున్న ఈ4 ఎంటర్టైన్స్మెంట్స్ సంస్థ పేర్కొంది. అయితే బాలా లాంటి దర్శకుడుని తప్పించడమేంటి? అనే కామెంట్స్ వినిపించాయి. ఈ విషయంపై బాలా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘నిర్మాతలు ఇచ్చిన అబద్ధపు స్టేట్మెంట్ల వల్ల నేను వివరణ ఇవ్వాల్సివస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలన్నది నా సొంత నిర్ణయమే. ధృవ్ విక్రమ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేద్దామని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ‘వర్మ’ కొత్త ప్రాజెక్ట్ను దర్శకుడు గౌతమ్ మీనన్ టేకప్ చేస్తారని టాక్. -
ఆ వార్తలు నిజమే
‘‘అజిత్ కొత్త సినిమాలో నేను హీరోయిన్గా చేస్తున్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం అని చెప్పడానికి సంతోషిస్తున్నా’’ అని హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ తమిళంలో అజిత్ హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపికైనట్టు పేర్కొన్నారు శ్రద్ధా. ‘‘ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం కోసం ఇన్ని రోజులు మౌనంగా ఉండటం కష్టంగా అనిపించింది. అజిత్ సార్తో నటించడం సంతోషంగా ఉంది. నా కెరీర్లో చాలెంజింగ్ రోల్ ఇది. హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్గారు నిర్మిస్తారు. ప్రస్తుత సమాజానికి చెప్పాల్సిన కథ ఇది. హిందీలో తాప్సీ పోషించిన పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు శ్రద్ధా. ఈ చిత్రం మే 1న రిలీజ్ కానుంది. -
తమిళ ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్లో అత్తారింటికి దారేది ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సగం సినిమా పైరసీ ద్వారా బయటకు వచ్చినా.. కలెక్షన్లలో ఈ మూవీ రికార్డులు సృష్టించింది. ఈ చిత్రాన్ని తమిళంలో శింబు హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ మూవీ (‘వంత రాజవథాన్ వరువెన్’) టీజర్ను చిత్రయూనిట్ విడుదల చేయగా.. ‘అత్తారింటికి దారేది’ని ఉన్నది ఉన్నట్టుగా దించేశారని కామెంట్స్ వినిపించాయి. ఈ మూవీని ఫిబ్రవరి ఒకటో తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, కేథరిన్ థెరిసాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుందర్.సి దర్శకత్వం వహించగా.. హిప్ హాప్ తమీజా సంగీతాన్నిఅందించారు. మరి ఈ చిత్రం.. అక్కడ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. -
కటౌట్లు పెట్టొద్దు
ఏ హీరో అయినా తన సినిమా రిలీజ్ రోజు థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఉండాలని కోరుకుంటాడు. ఎన్ని కటౌట్లుంటే అంత స్టార్డమ్ ఏర్పరచుకున్నట్టు లెక్క. కానీ తమిళ నటుడు శింబు మాత్రం తన తర్వాతి సినిమా నుంచి కటౌట్లు ఏర్పాటు చేయొద్దని ఫ్యాన్స్ని కోరారు. ‘అత్తారింటికి దారేది’ చిత్రం రీమేక్ ‘వందా రాజావాదాన్ వరువేన్’ సినిమాలో నటì ంచారు శింబు. ఈ చిత్రానికి సుందర్ సి. దర్శకుడు. మేఘా ఆకాశ్, కేథరీన్ థెరీసా కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ను ఉద్దేశిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు శింబు. ‘‘నా సినిమా రిలీజ్ అని పెద్ద పెద్ద కటౌట్లు, బ్యానర్లు కట్టి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృథా చేయకండి. దానికి బదులు మీ ఇంట్లో వాళ్లకు కొత్త దుస్తులు కొనండి, చిన్నపిల్లలకు చాక్లెట్లు కొనండి. అప్పుడు నేనింకా హ్యాపీగా ఫీల్ అవుతాను’’ అని శింబు పేర్కొన్నారు. -
నా కళ్లు తెరిపించింది
2018 బాలీవుడ్ బాగా కలిసొచ్చింది తాప్సీకి. మూడు హిట్స్ అందుకోవడమే కాకుండా నటిగా అద్భుతమైన మార్కులు సంపాదించారామె. లేటెస్ట్గా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్తో కలసి ‘పతీ పత్నీ అవుర్ వో’ అనే చిత్రం రీమేక్లో నటించడానికి అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కావాలి. అయితే చివరి నిమిషంలో ఈ సినిమాలో హీరోయిన్ తాప్సీ కాదని చిత్రబృందం అనౌన్స్ చేయడంతో ఆమె షాక్ అయ్యారు. ఈ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ –‘‘ఈ సినిమా కోసం నా షెడ్యూల్ అంతా సెట్ చేసుకొని వాళ్లకు డేట్స్ ఇచ్చాను. నేను హీరోయిన్ కాదని తెలియడంతో షాక్ అయ్యాను. దర్శక–నిర్మాతలను అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఈ విషయంపై ఎంత క్లారిటీ తెచ్చుకుందామనుకున్నా జవాబు చెప్పకుండా మాట దాటేస్తున్నారు. ఈ విషయం కొంచెం ముందే తెలిసినా ఈ సినిమా కోసం సర్దుబాటు చేసిన డేట్స్ వేరే సినిమాలకైనా ఇచ్చేదాన్ని. ఈ సంఘటన వల్ల ఇకనుంచైనా జాగ్రత్తగా ఉండాలనే విషయం అర్థం అయింది. ఒక విధంగా చెప్పాలంటే జరిగిన సంఘటన నా కళ్లు తెరిపించింది’’ అని తాప్సీ పేర్కొన్నారు. -
తమిళంలో రీమేక్కు ‘హుషారు’
తెలుగు చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాదించిన హుషారు ఇప్పుడు తమిళంలో పునర్నిర్మాణం కానుంది. తెలుగులో అందరూ కొత్త వారు నటించిన చిత్రం హుషారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణను పొందింది. ఆ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలో రీమేక్ చేయడానికి దర్శకుడు వీవీ.కదిర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈయన ఇంతకు ముందు నటుడు జీవా కథానాయకుడుగా తెనావట్టు చిత్రానికి దర్శకత్వం వహించారు. 14 ఏళ్ల తరువాత మళ్లీ మోగాఫోన్ పట్టి ఈ తెలుగు చిత్రం హుషారు రీమేక్ను తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు.ఈ చిత్రాన్ని కాస్మోస్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై జే.ఫణీంద్రకుమార్ నిర్మించనున్నారు. ఈయన ఇంతకు ముందు ప్రభుసాల్మన్ దర్శకత్వంలో లాడన్ అనే సక్సెస్ఫుల్ చిత్రాన్ని నిర్మించారు. హుషారు చిత్రం తెలుగులో రూ.3.50 కోట్లతో రూపొంది సుమారు రూ. 20 కోట్లు వసూలు చేసిందని నిర్మాత తెలిపారు. ఈ చిత్ర రీమేక్ హక్కులను గట్టి పోటీ మధ్య ఫ్యాన్సీ ఆఫర్తో దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే చిత్రాన్ని సెట్పైకి తీసుకెళ్లనున్నట్లు, నూతన, ప్రముఖ తారలు నటించనున్న ఈ చిత్రానికి తెలుగులో సంగీతాన్ని అందించిన రథన్నే పనిచేయనున్నట్లు తెలిపారు. -
తమిళ హిట్ మూవీ రీమేక్లో యంగ్ హీరో!
పక్క భాషల్లో హిట్ అయిన సినిమాలను తెరకెక్కించడానికి అందరూ ముందుంటారు. అయితే ఈ ఏడాది తమిళ్లో సూపర్ హిట్ అయిన రాచ్చసన్ మూవీని తెలుగులో కూడా రీమేక్ చేయడానికి సిద్దమయ్యారు. అయితే ఈ సినిమా హక్కులను నితినే కొన్నాడని, ఆయనే హీరోగా నటించనున్నాడని అప్పట్లో టాక్ వినిపించింది. అయితే దీనికి సంబంధించిన మరో విషయం ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఇటీవలె కవచం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ రీమేక్లో నటించనున్నాడనే వార్త వినిపిస్తోంది. క్రైమ్ నేపథ్యంలో సినిమాలను తెరకెక్కించాలనే లక్ష్యంతో డైరెక్టర్గా ట్రై చేస్తూ ఉండే యువకుడు.. తప్పని పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసర్గా మారడం.. మిస్టరీగా మారిన ఓ కేసును చేధించే కథతో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట రికార్డులు సృష్టించింది. మరి ఇదే కథ తెలుగు ప్రేక్షకులకు ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. -
రీమేక్ ? చేయాలా? వద్దా?
2018 బాలీవుడ్లో మంచి హిట్ సాధించి, టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచిన చిత్రం ‘అంథాధూన్’. శ్రీరామ్ రాఘవన్ రూపొందించిన ఈ థ్రిల్లర్లో ఆయుష్మాన్ ఖురాన, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇప్పుడీ సూపర్హిట్ చిత్రం సౌత్లో రీమేక్ కానుంది. ఈ రీమేక్ను సిద్ధార్థ్తో చేయాలనుకున్నారు దర్శక–నిర్మాతలు. బాల్ ఆయన కోర్ట్లో ఉంది. వెంటనే సిద్ధార్థ్ ‘‘అంథాధూన్’ లాంటì అద్భుతమైన చిత్రం రీమేక్లో నన్ను ఎంతమంది చూడాలనుకుంటున్నారు? సీరియస్గా అడుగుతున్నాను చెప్పండి’’ అంటూ ట్వీటర్లో అడిగేశారు. చాలా మంది ఫ్యాన్స్ చేయండి అంటూ సమాధానాలిచ్చారు. ఒరిజినల్లో యాక్ట్ చేసిన ఆయుష్మాన్ ఖురాన కూడా ‘చెయ్ మచ్చా (మావా)’ అని రిప్లై చేశారు. మరి ఈ రీమేక్లో సిద్ధార్థ్ కనిపిస్తారో లేదో చూడాలి. -
కోర్టుకు టైమ్ అయ్యింది!
అమ్మాయిలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి లాయర్గా మారనున్నారు అజిత్. ‘ఖాకి’ ఫేమ్ హెచ్. వినోద్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందనున్న సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. బాలీవుడ్ హిట్ ‘పింక్’ చిత్రానికిది రీమేక్. ఇందులో అమితాబ్ పోషించిన లాయర్ పాత్రలో నటించడానికి అజిత్ రెడీ అవుతున్నారు. అంటే.. లాయర్గా కోర్టులోకి దిగటానికి టైమ్ అయ్యిందన్నమాట. బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. అంతేకాదు అజిత్ నెక్ట్స్ చిత్రానికి కూడా బోనీ కపూర్నే నిర్మాత. ‘‘పింక్’ రీమేక్ కాకుండా అజిత్ నెక్ట్స్ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాను. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలైలో ప్రారంభిస్తాం. ‘పింక్’ని వచ్చే ఏడాది మే 1న, అజిత్తో నిర్మించాలనుకుంటున్న మరో చిత్రాన్ని 2020 ఏప్రిల్ 10న రిలీజ్ ప్లాన్ చేశాం’’ అని పేర్కొన్నారు బోనీ కపూర్. ఇక అజిత్ నటించిన తాజా చిత్రం ‘విశ్వాసం’ జనవరి 10న విడుదల కానుందని కోలీవుడ్ టాక్. -
‘99’ పేరుతో ‘96’
సెన్సేషనల్ కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, సీనియర్ హీరోయిన్ త్రిష జంటగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ 96. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అద్భుతమైన రివ్యూస్ రావటంతో పాటు కలెక్షన్ల పరంగా కూడా రికార్డ్లు సృష్టించింది. దీంతో ఇతర భాషల్లో 96ను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు రీమేక్ హక్కులు సొంతం చేసుకోగా గోపిచంద్ హీరోగా నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. కన్నడ దర్శకనిర్మాతలు మరో అడుగు ముందుకేసి ఈ రీమేక్ ప్రీ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. గణేష్, భావన హీరో హీరోయిన్లుగా ప్రీతం గబ్బి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 99 అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
అత్తారింటికి దారేది.. దించేశారు
తెలుగులో ఘనవిజయం సాధించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాను కోలీవుడ్లో ‘వంత రాజవథాన్ వరువెన్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరిగరాసింది. ఈ సినిమా తమిళ్ రీమేక్లో పవన్కల్యాణ్ పాత్రలో శింబు నటించనుండగా.. ఆయనకు జోడీగా మేఘాఆకాష్, కేథరిన్ థెరీసా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన అత్త పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సుందర్.సి దర్శకుడు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. తొలిసారి సుందర్- శింబు జతకట్టడంతో ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఫన్, సెంటిమెంట్, ఎమోషన్స్తో తెలుగులో బ్లాక్బస్టర్ హిట్ సాధించిన అత్తారింటికి దారేది.. విమర్శకులచే ప్రశంసలు అందుకుంది. ‘వంత రాజవథాన్ వరువెన్’ టీజర్లోనూ అవే ఎలిమెంట్స్తో, కథ కథనంలో ఎలాంటి మార్పులు చేయకుండానే చిత్రాన్ని తెరకెక్కిచ్చినట్టు కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. ఇందులోని సీన్స్ చాలా భాగం తెలుగు వర్షన్ మాదిరిగానే ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రభు, నాజర్, యోగిబాబు, మోట్టా రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నారు. -
సరికొత్త సవాల్!
‘‘చాలా ఆసక్తికరమైన పాత్ర కోసం సిద్ధమవుతున్నాను. ఈ పాత్రలో నటించడానికి చాలా భయపడుతున్నానని నా మనసుకి అర్థమవుతోంది. చాలా చాలా నెర్వస్గా కూడా అనిపిస్తోంది. కానీ ఇప్పటివరకు ఏ సవాల్నూ నేను స్వీకరించకుండా ఉండలేదు. చాలాసార్లు మీ గురించి మీరు ఆలోచించినదాని కంటే మీరు బలవంతులు. కొత్త ప్రయాణం మొదలైంది’’ అని తానెంత స్ట్రాంగ్ హింట్ ఇస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు సమంత. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఆమె కథానాయికగా రూపొందనున్న ఓ లేడీ ఒరియేంటెడ్ సినిమా కోసమే పై మాటలను సమంత చెప్పారని తెలుస్తోంది. ఇది కొరియన్ మూవీ మిస్.గ్రానీకి రీమేక్. ఈ చిత్రం కోసం సమంత కరాటే నేర్చుకుంటున్నారట. ఇంతకుముందు తమిళ చిత్రం ‘సీమరాజా’ కోసం ఆమె కర్ర సాము నేర్చుకున్నారు. -
28 ఏళ్లు వెనక్కి!
ఎంత ఖరీదు ఉంటుంది? అగ్రకథానాయిక సమంత చీర కొంటే... వేలల్లో! లక్షల్లో! ఇలా ఊహించడం కష్టం. మరి... స్టార్లు కట్టే చీరలంటే మాటలా? పైగా డిజైనర్ శారీస్ అంటే ఖరీదు ఎక్కువే. అయితే సమంత ఇప్పుడు చూస్తున్నది డిజైనర్ శారీస్ కాదట. 1980–90 రోజుల్లో ఉండే చీరలు కట్టుకోవాలనుకున్నారు. దానికోసం ఒకటి రెండు కాదు.. ఏకంగా డజనుకుపైగా చీరలను సెలక్ట్ చేయాలనుకుంటున్నారట. ఎందుకు? అంటే ఆమె తర్వాతి చిత్రం ‘మిస్. గ్రానీ’ రీమేక్ కోసమట. సమంత ప్రధాన పాత్రలో నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం వచ్చిన కొరియన్ మూవీ ‘మిస్.గ్రానీ’ చిత్రానికి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా కాస్ట్యూమ్స్ సెలక్షన్స్లో సమంత పాల్గొంటున్నారని సమాచారం. పాత్ర పరంగా 1990నాటి చీరలను రెడీ చేస్తున్నారట కాస్ట్యూమ్ టీమ్. కొరియన్ సినిమాలో కథానాయిక యువతిగానే కాదు 70 ఏళ్ల వృద్ధురాలిగానూ కనిపించింది. సో.. సమంత కూడా అలా కనిపిస్తారని ఊహించవచ్చు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం. సురేశ్బాబు నిర్మించనున్నారు. ప్రస్తుతం భర్త నాగచైతన్యతో కలిసి ‘మజిలీ’అనే సినిమాలో నటిస్తున్నారు సమంత. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివనిర్వాణ ఈ సినిమాకు దర్శకుడు. -
జనవరి నుంచి జిగర్తండా!
‘డిజే’ సినిమా రిలీజ్ అయిపోయి ఏడాదిన్నర కావస్తున్నా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో తెలియజేయలేదు దర్శకుడు హరీశ్ శంకర్. ‘దాగుడుమూతలు’ అనే మల్టీస్టారర్ చిత్రం కోసం కొన్ని రోజులు వర్క్ చేశారు. ఇప్పుడు తమిళ హిట్ చిత్రం ‘జిగర్తండా’ (కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సిద్ధార్థ్ హీరో)ని రీమేక్ చేసే పనిలో పడ్డారు హరీశ్. ‘‘ఈ సినిమా జనవరిలో స్టార్ట్ కానుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తారు. హీరో ఇంకా ఫైనలైజ్ కాలేదు’’ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘దబాంగ్’ రీమేక్ ‘గబ్బర్సింగ్’తో దర్శకుడిగా పెద్ద సక్సెస్ అందుకున్నారు హరీశ్. మరి ఈ రీమేక్ ఏ రేంజ్ సక్సెస్ తెచ్చిపెడుతుందో చూడాలి. ఈ ప్రాజెక్ట్లో హీరోగా వరుణ్ తేజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. -
‘ఆర్ఎక్స్ 100’ రీమేక్లో స్టార్ వారసుడు
టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన బోల్డ్ లవ్ స్టోరి ఆర్ఎక్స్ 100. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్పుత్లు హీరో హీరోయిన్లుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇతర భాషలనుంచి రీమేక్ హక్కుల కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే కన్నడలో ఈ సినిమా రీమేక్ పనులు ప్రారంభమయ్యాయి. హిందీ రైట్స్ను కూడా ప్రముఖ నిర్మాత సాజిద్ నదియావాల సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ సినిమాకు హీరోను కూడా ఫైనల్ చేశారు. ఒకప్పటి బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి వారసుడు అహన్ శెట్టి, ‘ఆర్ఎక్స్ 100’ రీమేక్తో బాలీవుడ్కు పరిచయం కానున్నాడు. మిలన్ లూత్రియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. IT'S OFFICIAL... Sajid Nadiadwala ropes in director Milan Luthria for Ahan Shetty’s debut... An official remake of #Telugu hit #RX100. pic.twitter.com/AliZIgcFCS — taran adarsh (@taran_adarsh) 15 November 2018 -
మంచి చేసే మాస్టర్
‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘బ్లఫ్ మాస్టర్’. మా సంస్థ ఈ సినిమాని సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది రీమేక్ చిత్రమే అయినప్పటికీ, చాలా మార్పులు చేసి, గోపి బాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరినీ ఆయన ఏరికోరి ఎంపిక చేసుకున్నారు’’ అని శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. సత్యదేవ్, నందితా శ్వేత, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, పృథ్వి, సిజ్జు, చైతన్యకృష్ణ, ‘టెంపర్’ వంశీ, ‘దిల్’ రమేశ్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో రమేష్.పి.పిళ్లై నిర్మించారు. శ్రీదేవి మూవీస్పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘బ్లఫ్ మాస్టర్’ కథకు సత్యదేవ్ పక్కాగా న్యాయం చేశారు. సినిమా విజయం పట్ల మేం చాలా నమ్మకంగా ఉన్నాం. డిసెంబర్ ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మన సినిమా ద్వారా సమాజానికి ఎంతో కొంత మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. సమాజంలో బ్లఫ్ మాస్టర్లు చాలా ఎక్కువయ్యారు. మా సినిమా చూశాక సమాజంలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను’’ అని గోపీ గణేష్ పట్టాభి అన్నారు. ‘‘ఈ సినిమాకి ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యాను. నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఈ చిత్రంతో లభించింది’’ అన్నారు సత్యదేవ్. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, సినిమాటోగ్రాఫర్ దాశరది శివేంద్ర పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: హెచ్. వినోద్, అడిషనల్ డైలాగ్స్: పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.కృష్ణకుమార్ (కిట్టు). ∙ -
భామనే.. బామ్మనే!
సమంత.. అందాల భామ. స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అయిపోతారు. ‘ఎంత సక్కగున్నవే..’ అంటూ పాట పాడేసుకుంటారు. ఇప్పుడు ఈ అందాల భామ.. బామ్మగా మారబోతున్నారట. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ముఖ్య పాత్రలో కొరియన్ మూవీ ‘మిస్ గ్య్రానీ’ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారని ఫిల్మ్నగర్ టాక్. అనూహ్య సంఘటనలతో 70 ఏళ్ల బామ్మ 20 ఏళ్ల అమ్మాయిగా ఎలా మారింది? ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న సంఘటనలు, భామగా ఆ బామ్మ పడ్డ కష్టాలు ఏంటి? అన్న కథాంశమే ఈ చిత్రకథ. ఈ సినిమాలో సమంత 70 ఏళ్ల బామ్మగా కనిపించే సాహసం చేయడానికి రెడీ అయ్యారు. డిసెంబర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. -
రీమేక్ మీద కన్నేసిన బన్నీ..!
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో షాక్ తిన్న అల్లు అర్జున్ కొత్త సినిమాను ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అయి చాలా రోజులు అవుతున్నా బన్నీ ఇంత వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. తమిళ దర్శకుడు లింగుసామితో ఒక సినిమా, విక్రమ్ కుమార్తో మరో సినిమా చర్చల దశలో ఉన్న ఏ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా అల్లు అర్జున్ ఓ రీమేక్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల బాలీవుడ్లో రిలీజ్ అయిన సోను కే టిటు కీ స్వీటీ సినిమాను బన్నీ తెలుగులో చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
సూపర్ హిట్ రీమేక్కు హరీష్..!
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. దాగుడు మూతలు పేరుతో ఈ కాంబినేషన్లో ఓ సినిమా దాదాపుగా ఫైనల్ అయినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాకపోయినా దిల్ రాజు బ్యానర్లో మరో సినిమాకు హరీష్ దర్శకత్వం వహించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 96 సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్ను దిల్ రాజు సొంతం చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. నాని, సమంత జంటగా ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారట. గతంలో గబ్బర్సింగ్తో రీమేక్ను తెరకెక్కించిన అనుభవం ఉన్న హరీష్ 96కు దర్శకత్వం వహించటం దాదాపు కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తోంది. -
మరదలు దొరికింది
అత్తారింటికి దారి కనుక్కునే పనిలో తమిళ హీరో శింబు బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆయనతో ప్రయాణానికి కేథరిన్ కూడా తోడయ్యారట. సుందర్ సి. దర్శకత్వంలో శింబు హీరోగా తెలుగు హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మేఘా ఆకాశ్ ఓ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కేథరిన్ థెరీసా కూడా తోడయ్యారు. దీంతో బావకు ఇద్దరు మరదళ్లు దొరికారు. తెలుగులో సమంత, ప్రణీత కథానాయికలుగా నటించిన విషయం తెలిసిందే. మరి.. మేఘా, కేథరిన్ ఏయే పాత్రలు చేస్తారన్నది ఇంకా బయటకు రాలేదు. అలాగే శింబుకు అత్తగా ఎవరు నటిస్తారన్నది కూడా చిత్ర బృందం వెల్లడించలేదు. ఖుష్బూ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. -
అలియాస్ ప్రీతి
బాలీవుడ్లో ఇప్పుడందరూ కథానాయిక కియారా అద్వానీని ప్రీతీ.. ప్రీతీ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఆమె నెక్ట్స్ సినిమాలో ప్రీతి అనే క్యారెక్టర్ చేయబోతున్నారు. తెలుగులో సూపర్హిట్ సాధంచిన ‘అర్జున్రెడ్డి’ సినిమా హిందీలో రీమేక్ అవ్వనున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ను డైరెక్ట్ చేసిన సందీప్రెడ్డి వంగానే హిందీ రీమేక్ను కూడా తెరకెక్కించనున్నారు. తెలుగులో హీరో విజయ్ దేవరకొండ చేసిన పాత్రను హిందీలో షాహిద్ కపూర్ చేయనున్నారు. అలాగే హీరోయిన్ షాలిని పాండే రోల్ (ప్రీతి)ను ఫైనల్గా కియారా అద్వానీ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది టీమ్. ‘‘హిందీ ‘అర్జున్రెడ్డి’కి హీరోయిన్ దొరికింది. కియారా అద్వానీ అలియాస్ ప్రీతికి స్వాగతం’’ అని షాహిద్ కపూర్ పేర్కొన్నారు. ‘‘వన్నాఫ్ మై ఫెవరెట్ ఫిల్మ్స్లో ‘అర్జున్రెడ్డి’ కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడీ సినిమాను హిందీలో రీక్రియేట్ చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. అమేజింగ్ టీమ్ కుదిరింది. ఈ సినిమాలోని హీరోయిన్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. చాలా ఎగై్జటింగ్గా ఉంది’’ అన్నారు కియారా. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల ప్రారంభం అవుతుందని బాలీవుడ్ టాక్. -
నాని మరో రీమేక్కు ఓకె చెప్పాడా..!
వరుస విజయాలతో సూపర్ ఫాంలో కనిపించిన యంగ్ హీరో నాని ఇటీవల కృష్ణార్జున యుద్ధం సినిమాతో తడబడ్డాడు. ప్రస్తుతం నాగార్జునతో కలిసి దేవదాస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు తరువాత చేయబోయే సినిమాలను కూడా వరుసగా లైన్లో పెట్టేస్తున్నాడు నేచురల్ స్టార్. దేవదాస్ తరువాత పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న జెర్సీలో నటిస్తున్న నాని ఆ తరువాత చేయబోయే సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. తమిళ్లో అక్టోబర్ 4న రిలీజ్ అవుతున్న ‘96’ సినిమాను తెలుగులో నాని హీరోగా రీమేక్గా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. విజయ్ సేతుపలి, త్రిష హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా రీమేక్ హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 96 భారీ మొత్తానికి తీసుకున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గతంలో రీమేక్గా తెరకెక్కిన నాని సినమాలు ఆహా కల్యాణం, భీమిలి కబడ్డి జట్టు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది. -
‘అర్జున్ రెడ్డి’ తమిళ్ టీజర్ వచ్చేసింది!
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన ‘అర్జున్ రెడ్డి’ పలు భాషల్లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోలీవుడ్లో అర్జున్ రెడ్డి రీమేక్ రిలీజ్కు రెడీ అవుతోంది. బాలీవుడ్లో సందీప్ వంగా డైరెక్షన్లో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతోంది. తమిళ్లో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా అర్జున్ రెడ్డిని ‘వర్మ’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను విడుదల చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ బాలా.. ఈ రీమేక్ను తమిళ నేటీవిటికి తగ్గట్టుగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. మరి ఈ రీమేక్ కోలీవుడ్లో సంచలనం సృష్టించి..ధృవ్ని కూడా ఓవర్నైట్ స్టార్ చేస్తుందో లేదో చూడాలి. Teaser of #Varma Introducing #DhruvVikram#Bala Film#E4Entertainment Mukesh R Mehta #VarmaTeaser #HBDDhruvVikram https://t.co/o2cAyAGWQS@e4echennai @filmmakerbala @iammegha_c @raizawilson@radhanmusic @onlynikil pic.twitter.com/MZrdJG6f7u — BARaju (@baraju_SuperHit) 23 September 2018 -
ఇక మాలీవుడ్లోనూ!
విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్రెడ్డి’ సినిమా టాలీవుడ్లో ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆల్రెడీ తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్తో బాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విక్రమ్ తనయుడు ధృవ్ హీరో. అలాగే షాహిద్ కపూర్ హీరోగా హిందీ ‘అర్జున్ రెడ్డి’ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఒరిజినల్ డైరెక్టర్ సందీప్రెడ్డి వంగానే ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పుడు తెలుగు ‘అర్జున్రెడ్డి’ సినిమా మలయాళంలో కూడా రీమేక్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. మల్లూ అర్జున్రెడ్డి ఎవరు? అనే విషయం పై మాలీవుడ్లో చర్చ జరగడం ఖాయం. -
ఆ విషయం ఇంకా గుర్తుంది!
బాలీవుడ్లో ‘గుజారీష్’ సినిమా తర్వాత దాదాపు ఐదేళ్ల గ్యాప్ తీసుకుని హీరోయిన్ ఐశ్వర్యారాయ్ ‘జజ్బా’ సినిమాతో సిల్వర్ స్క్రీన్పైకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఐశ్వర్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచీ అలనాటి క్లాసిక్ ఫిల్మ్ ‘రాత్ ఔర్ దిన్’ రీమేక్లో ఆమె లీడ్ రోల్ చేయనున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయంపై ఐశ్వర్యారాయ్ స్పందించారు. ‘‘కేవలం ‘రాత్ ఔర్ దిన్’ (1967) మూవీ మాత్రమే కాదు, ‘ఓ కౌన్ తీ’ (1964) రీమేక్లోనూ నేను నటించాలనుకున్నాను. రీమేక్స్ ౖరైట్స్ విషయమై చర్చలు జరుగుతున్నాయి. ‘రాత్ ఔర్ దిన్’ రీమేక్లో నర్గిస్ దత్ క్యారెక్టర్ భలేగా ఉంటుంది. దాదాపు 13ఏళ్ల క్రితం ‘శబ్ద్’ సినిమాలో సంజయ్ దత్తో కలిసి నటించాను. అప్పుడు ‘రాత్ ఔర్ దిన్’ రీమేక్ చేస్తే అందులోని మా అమ్మ పాత్రకు నువ్వు అయితే బాగా సూట్ అవుతావు’ అని సంజయ్దత్ అన్నారు. ఆ విషయం ఇంకా గుర్తు ఉంది’’ అన్నారు ఐశ్వర్యారాయ్. నెక్ట్స్ భర్త అభిషేక్ బచ్చన్తో కలిసి ఐశ్వర్య ‘గులాబ్ జామున్’ సినిమాలో నటించనున్నారు. -
దేశీ ఫారెస్ట్ గంప్
‘ఓషో’ స్క్రిప్ట్తో పూర్తిగా సంతృప్తి చెందలేదట బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. దాంతో పారామౌంట్ సంస్థ నిర్మించిన ఓ హాలీవుడ్ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమా ఏంటో తెలిసిపోయింది. 1994లో రిలీజ్ అయిన ‘ఫారెస్ట్ గంప్’ చిత్రాన్ని ఆమిర్ రీమేక్ చేయాలనుకుంటున్నారట. ‘మై నేమ్ ఈజ్ గంప్, ఫారెస్ట్ గంప్’ అంటూ మానసిక వికలాంగుడిగా టామ్ హ్యాంక్స్ నటించిన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’. టామ్ హ్యాంక్స్ నటనకు ఆస్కార్ కూడా లభించింది. ఫారెస్ట్ గంప్ అనే వ్యక్తి జీవిత కథతో ఈ సినిమా సాగుతుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇండియన్ ఆడియన్స్ టేస్ట్కు తగ్గట్టుగా మార్పులు చేయిస్తున్నారట ఆమిర్. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయితే ఆయన తర్వాతి ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. -
లాయర్గా!
ప్రస్తుతం ‘విశ్వాసం’ సినిమాలో హీరోగా నటిస్తున్న అజిత్ షెడ్యూల్స్ గ్యాప్లో కాస్త టైమ్ దొరికితే కోర్టుకు వెళ్లాలనుకుంటున్నారట. ఎందుకంటే నెక్ట్స్ సినిమాలో ఆయన లాయర్గా కనిపించనున్నారని టాక్. అజిత్ హీరోగా ‘చతురంగ వేటై్ట, ధీరమ్ అధికారమ్ ఒండ్రు’ చిత్రాల ఫేమ్ హెచ్.వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. ఇది హిందీ హిట్ ‘పింక్’కి రీమేక్ అని టాక్. అనిరుద్ధరాయ్ భట్టాచార్య దర్శకత్వంలో రూపొందిన ‘పింక్’లో అమితాబ్బచ్చన్, తాప్సీ ముఖ్య తారలుగా నటించిన విషయం తెలిసిందే. అమితాబ్ పాత్రలోనే అజిత్ నటిస్తారట. ఈ సినిమాను శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మిస్తారట. -
జనవరిలో అత్తారింటికి!
అత్తారింటికి అడ్రస్ వెతుకుతున్నారు శింబు. పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయా? అంటే కాదు. తెలుగు సినిమా ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్లో శింబు హీరోగా నటించడానికి వర్క్స్ మొదలయ్యాయి. సుందర్. సి దర్శకత్వం వహించనున్నారు. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ‘‘సుందర్ డైరెక్షన్లో శింబు హీరోగా ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు లైకా ప్రొడక్షన్స్ ప్రతినిథులు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న పొలిటికల్ మూవీ ‘మానాడు’లో నటిస్తున్నారు శింబు. ‘అత్తారింటికి దారేది’ రీమేక్ జనవరిలో రిలీజ్ అంటే.. ఈ రెండు సినిమాల చిత్రీకరణలతో శింబు బిజీగా ఉంటారన్న మాట. -
తమిళ ‘ఆర్ఎక్స్ 100’లో ఆది!
బోల్డ్ కంటెంట్తో భారీ హిట్లు కొడుతున్నారు నూతన దర్శకులు. ఒక్క సినిమాతోనే మోస్ట్ వాంటెడ్ లిస్ట్లోకి వెళ్తున్నారు. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాలతో సందీప్ రెడ్డి వంగా, అజయ్ భూపతి తమ స్టామినా ఏంటో నిరూపించారు. ఈ రెండు సినిమాలు టాలీవుడ్లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే అర్జున్రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఆర్ ఎక్స్ 100 మూవీని కూడా తమిళ్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోగా ఆది పినిశెట్టి నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు దర్శకుడు, ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు హీరోయిన్గా ఎవరు నటించనున్నారన్న వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎందుకంటే ఆర్ఎక్స్ 100తో పాయల్ రాజ్పుత్ తెలుగునాట పాపులర్ అయిన విషయం తెలిసిందే. -
ఆఫీసర్ ఝాన్సీ
దాదాపు ఆరేళ్ల తర్వాత శాండిల్వుడ్ నుంచి రాయ్లక్ష్మీకి మళ్లీ కబురొచ్చింది. 2012లో ఉపేంద్ర నటించిన ‘కల్పన’ చిత్రంతో శాండిల్వుడ్కి ఎంట్రీ ఇచ్చారు రాయ్లక్ష్మీ. రాఘవ లారెన్స్ ‘కాంచన’ చిత్రానికి రీమేక్ ఇది. ఇప్పుడు పీఎస్వీ గురుప్రసాద్ దర్శకత్వంలో రూపొందనున్న కన్నడ చిత్రం ‘ఝాన్సీ’లో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా ఆగస్టు 29న సెట్స్పైకి వెళ్తుందట. ‘‘ఇందులో సొసైటీలోని సమస్యలపై పోరాడే నిజాయతీ గల ఐపీఎస్ ఆఫీసర్ ఝాన్సీ పాత్రలో రాయ్లక్ష్మీ నటించనున్నారు. ఓన్లీ యాక్షన్ మాత్రమే కాదు. లవ్ అండ్ సెంటిమెంట్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కంఫర్ట్ జోన్ని దాటి ఆమె ఈ సినిమాను ఒప్పుకున్నారు’’ అన్నారు. ‘‘కన్నడ ఫిల్మ్ ‘ఝాన్సీ’లో నటించబోతున్నందుకు హ్యాపీ. తొలిసారి ఫుల్ యాక్షన్ రోల్ ట్రై చేయబోతున్నాను’’ అన్నారు రాయ్లక్ష్మీ. ఈ సినిమాకు రాజేష్ కుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. -
RX 100.. ఆత్రేయపురం టూ ముంబై
మౌత్ పబ్లిసిటీతో టాలీవుడ్లో సెన్సేషన్గా మారింది ఆర్ఎక్స్ 100 చిత్రం. ఈ మధ్య రిలీజ్ అయిన చిత్రాల్లో క్రౌడ్పుల్లర్గా నిలిచిన ఈ చిత్రం.. త్వరలో బాలీవుడ్లోకి వెళ్లబోతోంది. ఈ విషయాన్ని విలక్షణ దర్శకుడు రామ్గోపాల్ వర్మ తన ట్విటర్లో తెలియజేశారు. (`ఆర్ఎక్స్ 100` మూవీ రివ్యూ) ‘కంగ్రాచ్యూలేషన్ అజయ్ భూపతి.. నీ సూపర్ బ్లాక్ బస్టర్ ఆర్ఎక్స్ 100 ఆత్రేయపురం నుంచి ముంబైకి చేరుకుంది. హిందీలో ఫాంటోమ్ ప్రొడక్షన్లో మధు మంతెన ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు(అమీర్ ఖాన్ గజిని నిర్మాతల్లో ఒకరు)’ అని వర్మ తెలియజేశారు. అయితే పాత్రధారులు తదితర వివరాలు తెలియాల్సి ఉంది. అన్నట్లు డైరెక్టర్ అజయ్ భూపతి వర్మ శిష్యుల్లో ఒకరు అన్న విషయం తెలిసిందే. కార్తికేయ, పాయల్ రాజ్పుత్ జంటగా రావు రమేశ్, ‘సింధూర పువ్వు’ రాంకీ ముఖ్య పాత్రల్లో అజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. బోల్డ్ కంటెంట్గా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా రూ. 12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్గా నిలిచింది. -
అతిథిలా వచ్చాడు
రేడియో జాకీగా రేడియో స్టేషన్లో ఫుల్ బిజీగా యాంకరింగ్ చేస్తున్నారు జ్యోతిక. ఇంతలో అక్కడికి శింబు గెస్ట్గా వచ్చారు. వెంటనే వాతావరణం అంతా సందడి సందడిగా మారిపోయింది. ఇదంతా తమిళ చిత్రం ‘కాట్రిన్ మొళి’ కోసమే. జ్యోతిక ప్రధాన పాత్రలో హిందీ హిట్ చిత్రం ‘తుమ్హారీ సులు’ రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శింబు అతిథి పాత్రలో కనిపించనున్నారు. దానికి సంబంధించిన సీన్స్ను రీసెంట్గా షూట్ చేశారు. ఈ చిత్రంలో జ్యోతిక బాస్ పాత్రలో మంచు లక్ష్మీ కనిపించనున్నారు. రాధామోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
కష్టాలు ఎదుర్కోడానికి రెడీ
కెరీర్లో తొలి సినిమా రిలీజ్కు టైమ్ దగ్గర పడుతోంది. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఏ కొత్త యాక్టర్కైనా కాస్త టెన్షన్ పెరుగుతుంటుంది. ప్రజెంట్ ఆ ఒత్తిడినే ఫీల్ అవుతున్నారట శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. శశాంక్ కేతన్ దర్శకత్వంలో ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్ జంటగా ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మించిన ‘ధడక్’ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. మరాఠీ చిత్రం ‘సైరాట్’కు రీమేక్ ఇది. ఈ సందర్భంగా ‘మీరు యాక్టర్ అవుతా అన్నప్పుడు మీ ఇంట్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అన్న ప్రశ్నను జాన్వీ ముందు ఉంచితే...‘‘అమ్మానాన్నలు (శ్రీదేవి, బోనీకపూర్) నన్ను చాలా ప్రొటెక్టివ్గా పెంచారు. ఒక సందర్భంలో నేను నటిని కావాలనుకుంటున్న నిర్ణయాన్ని అమ్మకు చెప్పాను. నా నిర్ణయాన్ని మళ్లీ ఆలోచించుకోమన్నారు. అలాగే యాక్టింగ్ అంటే గ్లామరస్గా కనిపించడమో, లేక ఇచ్చిన స్క్రిప్ట్ను చదవడమో కాదని కూడా పరోక్షంగా హెచ్చరించారు. కానీ ఆ తర్వాత సినిమాపై నాకు ఉన్న కమిట్మెంట్, యాక్టింగ్పై నా ప్యాషన్, కాన్ఫిడెన్స్ చూసి ఓకే అన్నారు’’ అని పేర్కొన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ –‘‘అమ్మ ఎంతో కష్టపడి మాకు ఈజీ లైఫ్ను అందిచాలనుకున్నారు. కానీ సినిమా లైఫ్లో అమ్మ ఫేస్ చేసిన గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియ్స్తో పాటు ఆ స్ట్రగుల్స్ను కూడా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు. -
వర్మకి లవర్ దొరికింది
ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా! ఏది అనుకోనమ్మా నీ చిరునామా! ఇదిగో ఆల్మోస్ట్ ఇలాగే విక్రమ్ తనయుడు ధృవ్ సిల్వర్ స్క్రీన్పై తన ప్రియురాలి కోసం ఇన్నాళ్లు పాడుకుని ఉంటారేమో. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే అతనికి ప్రేయసి దొరికేసింది. రీల్ లవర్ గురించి చెబుతున్నాం. బాల దర్శకత్వంలో ధృవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వర్మ’. తెలుగులో సూపర్ హిట్ సాధించిన ‘అర్జున్రెడ్డి’ చిత్రానికి రీమేక్ ఇది. తెలుగులో షాలినీ పాండే కథానాయికగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. తమిళ చిత్రానికి హీరోయిన్గా చాలా మంది పేర్లను పరిశీలించారు. రీసెంట్గా శ్రియా శర్మ పేరు వినిపించింది. ఫైనల్లీ బెంగాలీ మోడల్ మేఘా చౌదరిని కన్ఫార్మ్ చేశారు. సో.. వర్మకి లవర్ దొరికిందన్న మాట. ప్రస్తుతం చెన్నైలో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. -
జాన్వీ.. అర్జున్రెడ్డి ఎలా మిస్సయ్యింది?
టాలీవుడ్ సెన్సేషన్ మూవీ అర్జున్రెడ్డి బాలీవుడ్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. షాహిద్ కపూర్-తార సుటారియా జంటగా మాతృక దర్శకుడు సందీప్ వంగ ఈ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నాడు. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ చిత్రం కోసం తొలుత జాన్వీ కపూర్ పేరును పరిశీలించారన్న వార్త ఒకటి ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ‘నిజానికి జాన్వీ కపూర్నే అర్జున్ రెడ్డి రీమేక్ కోసం తొలుత సంప్రదించారు. అయితే ప్రముఖ దర్శక-నిర్మాత, ఆమె మెంటర్ అయిన కరణ్ జోహర్ అందుకు ఒప్పుకోలేదు. కెరీర్ ప్రారంభంలోనే బోల్డ్ సినిమాలు చేయటం మంచిది కాదని కరణ్.. జాన్వీకి సూచించాడంట. దీంతో జాన్వీ ఈ ప్రాజెక్టు చేసేందుకు విముఖత వ్యక్తం చేశారంట. అంతేకాదు తార పేరును కూడా అర్జున్ రెడ్డి రీమేక్కు సూచించింది కరణే’ అని ఓ ప్రముఖ బాలీవుడ్ మాగ్జైన్ కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జాన్వీ నటించిన ధడక్ ఈ నెలలోనే విడుదల కానుంది. ప్రస్తుతం ఇషాన్, జాన్వీలు చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. శశాంక్ ఖైటన్ దర్శకత్వంలో మరాఠీ హిట్ సైరాట్కు రీమేక్గా తెరకెక్కిన ధడక్ జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కొత్త ప్రయాణం
కొత్త సినిమాను మొదలు పెట్టారు బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్. నాలుగేళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ సినిమాకు ఇది రీమేక్. ఇంతకముందు దర్శకత్వ శాఖలో పనిచేయడం పాటు, నటుడిగాను సినిమాలు చేసిన ముకేశ్ చబ్రా ఈ సినిమాతో దర్శకునిగా మారారు. ‘రాక్స్టార్, హిందీ మీడియం, ఫక్రీ రిటర్స్ ’ సినిమాల్లో కీలక పాత్రలు చేసిన సంజనా సాంఘీ ఈ చిత్రంలో కథానాయిక. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు. ‘‘కొత్త ప్రయాణం మొదలైంది. ముకేశ్ చబ్రా నాకు ఎప్పటి నుంచో తెలుసు. అతనిపై నమ్మకంతో స్క్రిప్ట్ చదవకుండానే సైన్ చేశాను.’’ అని పేర్కొన్నారు సుశాంత్. -
ఆగస్ట్లో సామి!
‘సామి’ మిషన్ కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యారు. కేవలం ఇంకొన్ని రోజుల్లో అప్పగించిన మిషన్ను పూర్తి చేస్తారట. హరి దర్శకత్వంలో విక్రమ్, కీర్తీ సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సామీ స్క్వేర్’. 2003లో రిలీజ్ అయిన ‘సామి’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ చిత్రం ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయిందని కోలీవుడ్ టాక్. ఈ షెడ్యూల్లో ఓ పాటను కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట దర్శకుడు హరి. ఈ షెడ్యూల్తో సినిమా కంప్లీట్ అవుతుంది. ఆగస్ట్కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. -
వన్ మూవీ.. ఫైవ్ గెటప్స్
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఏజ్ ప్రజెంట్ మూడు పదులకు మించి ఉంటుంది. ఆమె అరవై ఏళ్ల వయసులో ఎలా ఉంటారో చూడాలంటే మరో పాతికేళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది వరకు వేచి చూస్తే చాలు. ఎందుకంటే.. ‘భారత్’ అనే సినిమాలో అరవై ఏళ్లున్న పాత్రలో నటించబోతున్నారు ప్రియాంక. అలీఅబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ఖాన్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘భారత్’. కొరియన్ మూవీ ‘ఓడ్ టు మై ఫాదర్’ చిత్రానికి ఇది రీమేక్. 1947 నుంచి 2010 మధ్య కాలం బ్యాక్డ్రాప్లో సినిమా కథనం సాగుతుంది. సల్లూ భాయ్ ఫైవ్ డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నారన్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రియాంకా చోప్రా కూడా ఐదు వైవిధ్యమైన గెటప్స్లో కనిపించనున్నారు. ‘‘సల్మాన్ఖాన్లా ప్రియాంకా చోప్రా కూడా ఈ చిత్రంలో ఫైవ్ డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తారు. 28–60 ఇయర్స్ మధ్యలో సల్మాన్ కనిపిస్తే, 25–65 ఏజ్ గ్రూప్లో ప్రియాంకా ఫైవ్ డిఫరెంట్ గెటప్స్లో దర్శనమిస్తారు. ఇందుకు ప్రోస్థటిక్ మేకప్ వాడతాం. గ్రాఫిక్స్ కూడా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. వచ్చే ఏడాది రంజాన్కు ‘భారత్’ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
షార్ప్ అండ్ స్ట్రాంగ్
బోర్డ్ మీటింగ్లు, లాభనష్టాలు, కంపెనీ డెవలప్మెంట్ డిస్కషన్స్తో ప్రజెంట్ స్కాట్లాండ్లో బిజీగా ఉన్నారట హీరోయిన్ తాప్సీ. సుజోయ్ఘోష్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘బద్లా’. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ‘పింక్’ సినిమా తర్వాత అమితాబ్, తాప్సీ కలిసి నటిస్తున్న ఈ సినిమా స్పానిష్ చిత్రం ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ చిత్రానికి రీమేక్. ప్రస్తుతం అమితాబ్, తాప్సీలపై స్కాట్లాండ్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘గత రెండు నెలలుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా. కానీ షార్ప్ అండ్ స్ట్రాంగ్ బిజినెస్ ఉమెన్ క్యారెక్టర్ చేయలేదు. ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్న క్యారెక్టర్ ఇదే. ఒకవేళ సినిమాలో నా క్యారెక్టర్ ఇంత స్ట్రాంగ్గా లేకపోతే సుజోయ్తో ఈ సినిమా చేయడం అన్ ఫెయిర్’’ అని పేర్కొన్నారు తాప్సీ. మరోవైపు ఆమె నటించిన హిందీ చిత్రాలు ‘సూర్మ’ వచ్చే నెల 13న, ‘ముల్క్’ చిత్రం ఆగస్టు 3న రిలీజ్ కానున్నాయి. అలాగే మరో రెండు బీ టౌన్ మూవీస్ ‘తడ్కా, మన్మర్జియాన్’లతో పాటు ఆమె తెలుగులో నటించిన ‘నీవెవరో’ సినిమాలు రిలీజ్కు రెడీగా ఉన్నాయి. -
ఏబీసీడీలకు వేళాయె
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఏబీసీడీ’ చిత్రాన్ని అల్లు శిరీష్ కథానాయకుడిగా తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రుక్సార్ థిల్లాన్ కథానాయిక. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మధుర శ్రీధర్, బిగ్బెన్ సినిమాస్ బ్యానర్పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి నిర్మాతల అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా మరో నిర్మాత సురేశ్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. పలు చిత్రాల్లో బాల నటుడిగా అలరించిన మాస్టర్ భరత్ ‘ఏబీసీడీ’ చిత్రంలో అల్లు శిరీష్ స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని. -
రూమర్స్పై రాజ్ తరుణ్ క్లారిటీ
ఇటీవల రాజుగాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. కొంత కాలంగా సరైన హిట్స్లేక ఇబ్బందుల్లో ఉన్న ఈ యంగ్ హీరో తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ ఓ కోలీవుడ్ సూపర్హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన నేనూం రౌడీదాన్ చిత్రాన్ని తెలుగులో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా రూపొందిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై రాజ్ తరుణ్ స్పందించాడు. తాను ఏ రీమేక్ సినిమా చేయటం లేదని క్లారిటీ ఇచ్చాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం తను చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉందని వెల్లడించిన ఈ యంగ్ హీరో నటీనటులు, సాంకేతిక నిపుణులను ఇంకా ఫైనల్ చేయలేదని తెలిపారు. దీంతో కొద్ది రోజులు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న నానూం రౌడీదాన్ రీమేక్ వార్తలు రూమర్స్ అని తేలిపోయింది. -
డిజాస్టర్ రీమేక్తో బాలీవుడ్కు మహేష్..?
భరత్ అనే నేను సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న సూపర్ స్టార్ అభిమానులు అవాక్కయ్యే వార్త ఒకటి ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తోంది. మహేష్ బాబు కెరీర్లోనే బిగెస్ట్ డిజాస్టర్లలో ఒకటైన స్పైడర్ సినిమా రీమేక్ లో మహేష్ నటించనున్నారట. తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతోనే మహేష్ కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచిన స్పైడర్ తమిళ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు మురుగదాస్. ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడిన మురుగదా ఈ విషయాన్ని ధృవీకరించారు. స్పైడర్ సినిమా రీమేక్కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని వెల్లడించిన మురుగదాస్.. హీరో ఎవరన్నది కన్ఫామ్ చేయలేదు. దీంతో తెలుగు, తమిళ భాషల్లో మీరోగా నటించిన మహేషే, రీమేక్లోనూ నటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో అనుపమా చోప్రాకు ఇచ్చిన ఇంటర్య్వూలో బాలీవుడ్ ఎంట్రీపై స్పందించిన మహేష్, మంచి కథ దొరికితే హిందీ సినిమాకు రెడీ అన్నారు. దీంతో స్పైడర్ సినిమాతోనే మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలపై మహేష్ స్పందించాల్సి ఉంది. -
హైదరాబాద్లో టెంపర్ రీమేక్ షురు
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన చిత్రం టెంపర్.. ఈ సినిమా నటుడిగా ఎన్టీఆర్ కు ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది. నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను బాలీవుడ్ లో రణవీర్ సింగ్ హీరోగా రీమేక్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సింబా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమాలో రణ్వీర్ సింగ్కు జోడిగా సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ నటిస్తున్నారు. సారా ఈ చిత్రం ద్వారానే బాలీవుడ్లోకి అడుగుపెడుతుంది. ఈ ప్రాజెక్ట్కు ఎప్పుడో రూపకల్పన చేసినప్పటికీ.. పట్టాలెక్కెందుకు చాలా సమయమే తీసుకుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముందుగా అనుకున్నట్టే డిసెంబర్ 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. షూటింగ్ స్పాట్లో రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్, రోహిత్ శెట్టి, కరణ్ జోహర్ కలసి దిగిన ఫొటోను కరణ్ అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా సింబా షూటింగ్కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ROHIT SHETTY is back!!!! @RanveerOfficial as #SIMMBA with #SaraAliKhan produced by @RSPicturez @DharmaMovies @RelianceEnt @apoorvamehta18 releasing 28th DEC 2018 pic.twitter.com/sDSi7eqom9 — Karan Johar (@karanjohar) June 6, 2018 -
అలాంటివి కలగానే మిగిలిపోయాయి..
తమిళసినిమా: ఆశకు అంతం ఉండదంటారు. అదే విధంగా చేసే పనిలో సంతృప్తి పడిపోతే ముందుకు సాగలేం అన్నది ఆర్యోక్తి. నటి కాజల్ ఈ రెండో కోవకు చెందన వ్యక్తి అని ఆమె మాటల్లో వ్యక్తం అవుతోంది. కోలీవుడ్, టాలీవుడ్ల్లో ప్రముఖ కథానాయకులందరితోనూ నటించిన కాజల్అగర్వాల్ ప్రస్తుతం అవకాశాల విషయంలో కాస్త వెనకపడ్డారనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్లో చేతిలో ప్యారిస్ ప్యారిస్ అనే ఒక్క చిత్రమే చేతిలో ఉంది. ఇది హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే.అయినా అగ్రనటీమణుల పట్టికలోనే కొనసాగుతున్న కాజల్అగర్వాల్ ఇంకా ఎలాంటి కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు నిజం చెప్పాలంటే వచ్చిన అవకాశాల్లో నచ్చినవి ఎంపిక చేసుకుని నటిస్తున్నానని చెప్పింది. అయితే యాక్షన్, కామెడీ కథా పాత్రల్లో నటించాలన్న ఆశ ఉందంది. తాను ఇప్పటి వరకూ యాక్షన్ కథా పాత్రల్లో నటించలేదని, అందుకే అలాంటి పాత్రలు కలగానే మిగిలిపోయాయని పేర్కొంది. వ్యక్తిగతంగా తనకు మంచి భావోద్రేక కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలంటేనే ఇష్టం అని చెప్పింది. అదే విధంగా భాషా భేదం లేకుండా అన్ని భాషా చిత్రాల్లోనూ నటించాలన్నది తన నిర్ణయం అని తెలిపింది. నటన వరకూ భాష అడ్డు కాకూడదన్నదే తన అభిప్రాయం అని అంది. నటన అనేది కథా పాత్రను బట్టి ఉంటుందని, అందుకే ఏ భాషా చిత్రం అయినా కథ నచ్చితే నటిస్తానని చెప్పింది. అది అంతర్జాతీయ భాషా చిత్రం అయిన నటించడానికి రెడీ అంటూ కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్లకు మించి తన హాలీవుడ్ ఆశను చెప్పకనే చెప్పేసింది. ఈ అమ్మడు బాలీవుడ్లోనే పెద్దగా సక్సెస్ కాలేదన్నది గమనార్హం. -
స్టార్ట్ టు ఎండ్.. నాన్స్టాప్
సెకండ్ ఇన్నింగ్స్లో జోరు పెంచారు హీరోయిన్ జ్యోతిక. మణిరత్నం రూపొందిస్తున్న ‘చెక్క చివంద వానమ్’ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. అలాగే విద్యా బాలన్ నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘తుమ్హారీ సులూ’ రీమేక్లో కూడా కనిపించనున్నారు జ్యోతిక. ‘కాట్రిన్ మొళి’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 4న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. విశేషం ఏంటంటే.. స్టార్టింగ్ నుంచి సినిమా ఎండ్ వరకూ ఒక్కటే షెడ్యూల్లో షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. ఈ సినిమాలో రేడియో జాకీ పాత్రలో జ్యోతిక కనిపించనున్నారు. అక్టోబర్లో రిలీజ్ కానున్న ఈ సినిమాను ధనుంజయన్, లలిత, విక్రమ్ కుమార్ నిర్మించనున్నారు. -
రూమర్స్పై క్లారిటీ ఇచ్చిన మెగా హీరో
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో అల్లు శిరీష్ సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. కెరీర్ను గాడిలో పెట్టే సక్సెస్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో త్వరలో ఓ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కొద్ది రోజులుగా శిరీష్ చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో రకరకాల వార్తలు ఫిలిం నగర్లో వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై శిరీష్ క్లారటీ ఇచ్చాడు. కొద్ది రోజులుగా తాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాట్టుగా వస్తున్న వార్తలు రూమర్స్ అంటూ కొట్టి పారేశాడు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు శ్రీకాంత్ అడ్డాలను కలవలేదని క్లారిటీ ఇచ్చారు. శిరీష్ ప్రస్తుతం తెలుగులో ఏబీసీడీ రీమేక్తో పాటు సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. -
ఇక స్పీడ్ పెంచుతా
‘‘నా సినిమా కథలు ముందుగా నాన్న వింటారు. సెట్స్కు వెళ్లే ముందు బన్నీ (అల్లు అర్జున్) కూడా వింటాడు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకుంటాను. షూటింగ్ పూర్తి చేసి, ఎడిటింగ్ అయిన తర్వాత కూడా వారికి సినిమా చూపిస్తా’’ అని హీరో అల్లు శిరీష్ అన్నారు. నేడు (బుధవారం) పుట్టినరోజు జరుపుకుంటున్న శిరీష్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో దుల్కర్ సల్మాన్ చేసిన మలయాళ ‘ఏబీసీడీ’ రీమేక్ ఒకటి. సూర్యగారు హీరోగా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో నటిస్తున్నా. ఈ చిత్రంలో మోహన్లాల్గారు కూడా ఉన్నారు. సూర్యగారికి నేను వీరాభిమానిని. ఆయనతో కలిసి పనిచేయడం హ్యాపీ. జూలై 1న లండన్లో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ‘ఏబీసీడీ’ రీమేక్లో మిలియనీర్ కొడుకుగా కనబడతా. సంజీవ్ కొత్త డైరెక్టర్ అయినా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తనపై నాకు నమ్మకం ఏర్పడింది. రీమేక్ చేయడం చాలా కష్టం. రీమేక్ల గురించి మనం ఆలోచించినంతగా ప్రేక్షకులు ఆలోచించరు. వారికి సినిమా నచ్చితే చాలు. ఇలాంటి సినిమాలే చేయాలని హద్దులు పెట్టుకోలేదు. ‘ఒక్క క్షణం’ సినిమా కమర్షియల్గా ఆశించినంత రిజల్ట్ ఇవ్వలేదు. నా వరకు నా కెరీర్లో బెస్ట్ మూవీ అది. ఇతర హీరోల్లా వేగంగా సినిమాలు చేయడం లేదు. మా అన్నయ్య వచ్చి 15 ఏళ్లు అవుతున్నా 17 సినిమాలే చేశాడు. ఒక సినిమాపై ఫోకస్గా ఉంటే క్వాలిటీ బాగుంటుంది అనేది కరెక్టే. కానీ కమర్షియల్గా ముందుకెళ్లాలంటే ఎక్కువ చిత్రాలు చేయాలి. ఇకపై స్పీడ్ పెంచి, ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు. -
అందుకే ఆలస్యమౌతోంది
తమిళ సినిమాల మీద సెటైరికల్గా వచ్చిన పేరడీ చిత్రం ‘తమిళ పడం’. శివ హీరోగా సి.యస్ ఆముదన్ రూపొందించారు. తెలుగులో ‘సుడిగాడు’గా ‘అల్లరి’ నరేశ్ రీమేక్ చేశారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ‘తమిళ పడం 2.0’ రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మొదట మే 25న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ లేట్ అవ్వడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. సినిమా ఆలస్యం గురించి చిత్రబృందం మాట్లాడుతూ – ‘‘తమిళ పడం 2.0’లో భారీ గ్రాఫిక్స్ వర్క్ పని ఉంది. ముఖ్యంగా మా హీరోని కొంచెం అందంగా చూపించడానికి, హీరో కండలు ఇంకా బాగా చూపించడానికి లాస్ ఏంజెల్స్లో స్టూడియోతో, హీరోయిన్ ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు తీసేయడానికి కాలిఫోర్నియాలో మరో స్టూడియోతో కలసి పని చేస్తున్నాం. ఇంతటి వీయఫ్ఎక్స్ పనిఉండటంతో రిలీజ్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. భయపడకండి త్వరలోనే థియేటర్స్లోకి వచ్చేస్తాం’’ అని పేర్కొంది. -
సంజయ్ దత్ ‘ప్రస్థానం’ మొదలవుతోంది..!
‘ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు.. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు , విలన్లు లేరీ నాటకంలో’... ఈ డైలాగ్ ఒక్కటి చాలు ప్రస్థానం సినిమా ఏంటో చెప్పేయడానికి. దేవకట్టా తెరకెక్కించిన ఈ సినిమాకు సాయి కుమార్ తన నటనతో ప్రాణం పోశారు. ఎన్నో అవార్డులను, ఎంతో మంది విమర్శకుల ప్రశంసలను పొందింది ఈ సినిమా. కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా... టాలీవుడ్లో ఈ సినిమాది ప్రత్యేక స్థానమే. ఎందుకంటే ఈ సినిమా రిలీజైన ఇన్నేళ్లకు హిందీలో రీమేక్ అవుతోందంటే ఈ సినిమా స్టామినా ఏంటో అర్థమవుతోంది. ప్రస్థానం సినిమాను రీమేక్ చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నా.. ఇప్పటికి సరైన సమయం వచ్చింది. సంజయదత్ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ను తన తల్లి నర్గీస్ దత్ పుట్టిన రోజైన జూన్ 1న ప్రారంభిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగులో సాయికుమార్ పోషించిన పాత్రను సంజయ్దత్ పోషిస్తున్నట్లుగా తెలిపారు. బాలీవుడ్ నేటివిటికి తగ్గట్లు మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రీమేక్ కూడా దేవకట్టా దర్శకత్వంలోనే తెరకెక్కుతోంది. అలీ ఫజల్, అమైరా దస్తూర్ కీలక పాత్రల్లో నటించనున్నారు. -
హిందీ అర్జున్ రెడ్డి ప్రేయసిగా..
టాలీవుడ్లో ‘అర్జున్రెడ్డి’ చిత్రం సెన్సేషనల్ హిట్. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది. ఈ చిత్రం ద్వారా షాలినీ పాండే కథానాయికగా పరిచయమైన విషయం తెలిసిందే. బాలా దర్శకత్వంలో ఈ చిత్రం తమిళ రీమేక్ ‘వర్మ’ ద్వారా విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కొత్త కథానాయికను తీసుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైనా ఇంకా కథానాయికపై క్లారిటీ రాలేదు. ఇక.. హిందీ రీమేక్ గురించి చెప్పాలంటే.. ఈ సినిమాను సందీప్రెడ్డి వంగానే తెరకెక్కించనుండటం విశేషం. షాహిద్ కపూర్ హీరో. ఈ సినిమాలో కథానాయికగా తారా సితారియా నటించనున్నారని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం ఈ బ్యూటీ కరణ్ జోహార్ నిర్మాణంలో టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతోన్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తున్నారు. ఇదే తారాకు తొలి సినిమా కావడం విశేషం. -
బాలీవుడ్ అర్జున్ రెడ్డికి జోడీగా..!
తెలుగు నాట సంచలన విజయం సాధించిన బోల్డ్ సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళ్లో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వర్మ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుండగా హిందీలో షాహిదీ కపూర్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ వర్షన్ను కూడా సందీపే డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమాకు హీరోయిన్గా బుల్లితెర నటి తారా సుతారియాను ఫైనల్ చేశారట. ఇప్పటికే టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో నటిస్తున్న తారా, అర్జున్ రెడ్డి రీమేక్లో షాహిద్ సరసన నటించనుంది. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను మురద్ ఖేతాని, అశ్విన్ వర్దేలు నిర్మిస్తున్నారు. -
హిందీలో కొత్త ప్రస్థానం
దాదాపు ఎనిమిదేళ్ల కిత్రం శర్వానంద్, సాయికుమార్, సందీప్ కిషన్ ముఖ్య తారలుగా దేవ కట్టా దర్శకత్వంలో వచ్చిన ‘ప్రస్థానం’ సినిమాకు టాలీవుడ్లో మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు హిందీలో ‘ప్రస్థానం’ మొదలు కానుంది. అవును.. తెలుగు ‘ప్రస్థానం’ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. తెలుగు చిత్రాన్ని తెరకెక్కించిన దేవ కట్టానే హిందీ రీమేక్కి దర్శకత్వం వహిస్తారట. శర్వానంద్ చేసిన పాత్రకు హీరో అలీ ఫజల్ను తీసుకున్నారు. సాయికుమార్ ప్లేస్లో సంజయ్దత్ కనిపించనున్నారట. కథానాయికగా అమైరా దస్తూర్ కనిపిస్తారని బాలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే.. తెలుగులో ఈ చిత్రం నిడివి 2గంటల58 నిమిషాలు. కానీ హిందీ చిత్రం నిడివి తక్కువగా ఉంటుంది. జస్ట్ 2 గంటలే ఉంటుందట. సమకాలీన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నారని టాక్. -
నైన్.. లక్కీ సైన్
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ లక్ని నమ్ముతారు. అది కూడా అంకెల్లో వచ్చే అదృష్టాన్ని మాత్రమే. ఈ సూపర్ స్టార్ 9 అంకెను లక్కీగా ఫీల్ అవుతారట. ఫస్ట్ సినిమా ‘ఆనంద్‘ జూన్ 19న రిలీజ్ అయింది. 29 ఏళ్ల వయస్సులో పెళ్లి జరిగింది. అది కూడా మే 19న. ఇలా తనకు కలిసొచ్చిన అన్నింట్లో 9 ఉండే సరికి 9 అంకెను అదృష్టంగా భావించడం మొదలెట్టారట శివరాజ్ కుమార్. ప్రస్తుతం ఆయన ‘కవచ’ సినిమా చేస్తున్నారు. ఇది మలయాళంలో మోహన్లాల్ చేసిన ‘ఒప్పం’ సినిమాకు రీమేక్. విశేషం ఏంటంటే రీమేక్స్లో నటించను అని చెప్పిన ఆయన 15 ఏళ్ల తర్వాత రీమేక్ మూవీ చేయడం విశేషం. -
రీమేక్ మీద మనసుపడ్డ అల్లువారబ్బాయి
మెగా ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. స్టార్ ఇమేజ్ అందుకోవడం కోసం తంటాలు పడుతున్న యువ కథానాయకుడు అల్లు శిరీష్. శ్రీరస్తు శుభమస్తు లాంటి హిట్ సినిమా వచ్చినా అది శిరీష్ కెరీర్కు పెద్దగా ప్లస్ అవ్వలేదు. ఇటీవల ఒక్క క్షణం అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయాడు. దీంతో శిరీష్ తదుపరి చిత్రం విషయంలో ఆలోచనలో పడ్డాడు. శిరీష్.. రిస్క్ తీసుకోకుండా రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాలీవుడ్లో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘ఏబీసీడీ (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ)’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడు. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా మాలీవుడ్లో సంచలన విజయం సాధించటంతో పాటు దుల్కర్కు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమాను మధురా శ్రీధర్ నిర్మాణంలో సంజీవ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించనున్నారు. మరి ఈ రీమేక్ అయిన శిరీష్కు స్టార్ ఇమేజ్ తీసుకువస్తుందేమో చూడాలి. -
నాన్నే నిజమైన హీరో !
సినీరంగంలో మా నాన్నే నా హీరో అని అంటోంది రాజశేఖర్, జీవితల పెద్ద కూతురు శివాని. వైద్యవిద్య చదువుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు హీరోయిన్గా పరిచయం కానుంది. ఇప్పటికే 2స్టేట్స్ హిందీ చిత్ర తెలుగు రీమేక్లో నటించడానికి ఎంపికైన శివాని త్వరలో తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా శివాని ఏమంటుందో చూద్దాం. ‘నా తండ్రి రాజశేఖరే నాకు నటనలో స్ఫూర్తి. ఆయన డాక్టరు వృత్తిని వదిలి పెట్టకుండానే నటనను కొనసాగిస్తున్నారు. నాన్న వద్ద వైద్యం చేయించుకునేవారు ఆయన్ని మ్యాజిక్మ్యాన్ అంటుంటారు. నాకు నచ్చిన రంగాలు రెండు. ఒకటి వైద్యం, రెండు నటన. నేను మంచి డాక్టరుగా, నటిగా అవుతాననే నమ్మకం ఉంది. కుటుంబం, స్నేహితుల ముందు నటిస్తున్నానని భావించు. అప్పుడే కెమెరా ముందు ఎలాంటి భయం లేకుండా నటించగలవు అని నాన్న చెప్పారు. ఆయన మాటల్ని పాఠిస్తున్నాను. నేను కూచిపూడి, కథకళి డాన్స్ నేర్చుకుంటున్నాను. కిక్బాక్సింగ్ విద్యలోనూ శిక్షణ పొందుతున్నాను. చిత్రాల్లో గాయనిగానూ పేరు తెచ్చువాలన్న ఆశ ఉంది. అందుకే కర్ణాటక సంగీతాన్ని నేర్చుకుంటున్నాను. నాన్నే నా సినీ ప్రపంచ హీరో. నేను మా అమ్మలా ఉన్నానంటే సంతోషమే. ఈ తరం హీరోయిన్లలో నటి సమంత నచ్చిన నాయకి’. అని తన అభిరుచులు, అభిప్రాయాలు తెలిపారు. -
భాగ్యరాజ్ పాత్రలో శశికుమార్
తమిళ సినిమా : సీనియర్ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ పాత్రలో నటుడు శశికుమార్ నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా వార్త. గతంలో మంచి విజయం సాధించిన చిత్రాలను పునర్నిర్మించడం చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే ఇటీవల సీక్వెల్స్ నిర్మాణం అధికం కావడంతో పాత చిత్రాల రీమేక్ తగ్గింది. తాజాగా నటుడు శశికుమార్ ఆ ట్రెండ్కు తెరలేపనున్నారు. 1982లో నటుడు కే.భాగ్యరాజ్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం తూరల్ నిండ్రు పోచ్చు. ఇందులో నటి సులోచన కథానాయకిగా నటించారు. ముఖ్య పాత్రలో నంబియాన్ నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రం ఇప్పుడు నటుడు శశికుమార్ కథానాయకుడిగా రీమేక్ కానుంది. ఈ విషయాన్ని నట దర్శకుడు కే.భాగ్యరాజ్ ధ్రువీకరించారు. నటుడు శశికుమార్ కూడా ఈ ప్రచారాన్ని ధ్రువపరిచారు. దీని గురించి ఆయన తెలుపుతూ కే.భాగ్యరాజ్ నటించిన తూరల్ నిండ్రు పోచ్చు చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు తెలిపారు. ఆ చిత్ర కథను నేటి తరానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి పునర్నిర్మాణం జరపనున్నట్లు చెప్పారు.ఇందులో కే.భాగ్యరాజ్ పాత్రను తాను, నంబీయార్ పాత్రలో రాజ్కిరణ్ నటిస్తే బాగుంటుందని భావిస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం శశికుమార్ సముద్రఖని దర్శకత్వంలో నాడోడిగళ్ 2లో నటిస్తున్నారు. మరో చిత్రం అసురవధం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. -
ధనుష్ కాదు శింబు
తమిళసినిమా: ఏ భాషలోనైనా చిత్రం మంచి టాక్ తెచ్చుకుంటే వెంటనే ఆ చిత్ర రీమేక్ హక్కులకు పోటీ సహజం. ఇటీవల తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై మంచి ప్రశంసలను అందుకుంటూ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న చిత్రం నీది నాది ఒకే కథ. వర్థమాన నటుడు శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఇందులో బిచ్చగాడు చిత్రం ఫేమ్ సాట్నా టిటస్ కథానాయకిగా నటించింది. టాలీవుడ్లో ఈమెకిది తొలి చిత్రం. ఊడుగుల వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది. దీంతో కోలీవుడ్ దర్శక, హీరోల దృష్టి ఈ చిత్రంపై పడింది. ఈ చిత్రం నటుడు ధనుష్కు తెగ నచ్చేసిందని, వెంటనే తమిళరీమేక్ హక్కులను ధనుష్ కొనేశారని ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ధనుష్ వెట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై, గౌతమ్మీనన్ దర్శకత్వంలో ఎన్నై నోక్కిపాయుమ్ తూట్టా, బాలాజీ మోహన్ దర్శకత్వంలో మారి 2 చిత్రాల్లో నటిస్తున్నారు. తదుపరి నీది నాది ఒకే కథ రీమేక్లో నటిస్తారని ప్రచారం. అయితే తాజా గా నీది నాది ఒకే కథ చిత్రంలో ధనుష్ను కాదని, సంచలన నటుడు శింబు నటించడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం హల్చల్ చేస్తోంది. అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం ఫ్లాప్తో షాక్ తిన్న శింబు ఆ చిత్రం నిర్మాత నుంచి నష్ట పరిహారం లాంటి డిమాండ్లను ఎదుర్కొన్నారు. చాలా గ్యాప్ తరువాత ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో సెక్క సి వక్క వానం చిత్రంలో నటిస్తున్నారు. -
ధనుష్తో రీమేక్ చేసేందుకు..!
యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన రీసెంట్ హిట్ నీదీ నాదీ ఒకే కథ. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మధ్యతరగతి ప్రజల ఆలోచనలను, భావోద్వేగాలను అద్భుతంగా తెరకెక్కించారు. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమా రీమేక్ కోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నైలో నీదీ నాదీ ఒకే కథ సినిమా చూసిన ప్రముఖ తమిళ నిర్మా కలైపులి థాను ఈ సినిమాలో తమిళ్ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. సినిమాలోని రుద్రరాజు సాగర్ పాత్రకు తమిళ్ లో ధనుష్ అయితే సరిగ్గా సరిపోతాడని.. ధనుష్ అంగీకరిస్తే సినిమా రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ప్రస్తుతానిక ధనుష్ ఈ రీమేక్ లో నటించేందుకు అంగీకరించాడా లేదన్న అన్న విషయం తెలియాల్సి ఉంది. -
మాధురి దీక్షిత్కు నచ్చలేదా?
ముంబై: సినీ లోకంలో ఏక్ దో తీన్... పాట తెలియని ప్రేక్షకులు ఉండరు. ఈ పాటకు మాధురి దీక్షిత్ డ్యాన్స్, గ్రేస్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలీవుడ్లో ఓ పది ఆణిముత్యాల్లాంటి పాటలను తీస్తే... అందులో ఈ సాంగ్ ఉంటుంది. తేజాబ్ (1988) సినిమాలోని ఈ పాట అప్పట్లో ట్రెండ్సెట్టర్. భాగీ2 సినిమా కోసం రీమీక్స్ చేసిన ఈ పాటలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నర్తించింది. మాధురి దీక్షిత్ను ఎవ్వరూ రీప్లేస్ చేయలేరని, తనలా గ్రేస్తో డ్యాన్స్ చేయడం ఎవరికీ కుదరదనీ.. ఈ పాటను ఆమెకే అంకితమిస్తున్నాని జాక్వెలిన్ పేర్కొన్నారు. అయితే దీనిపై మాధురి ఏమాత్రం స్పందించలేదు. గతంలో బద్రినాథ్ కీ దుల్హానియా సినిమాలో మాధురీ సాంగ్ను రీమేక్ చేయగా, వారిని అభినందించి కొన్నిసూచనలు కూడా చేసింది. కానీ, ప్రస్తుతం ఏక్ దో తీన్ సాంగ్పై మాధురి స్పందించ లేదు. ఆమెకు ఈ పాటను రీమీక్స్ చేయడం నచ్చలేదేమోన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. సినిమా విడుదలైన తర్వాతైనా మాధురి మాట్లాడుతుందో, లేదో చూడాలి. ఇప్పటికే విడుదలైన ప్రోమో వీడియో సాంగ్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తేజాబ్ సినిమా డైరెక్టర్ ఎన్. చంద్ర మాట్లాడుతూ... ‘మాధురి ఒక అమాయకత్వంతో కూడిన హావభావాలతో ఎంతో చక్కగా చేస్తే.. ఇప్పుడు దానికి పూర్తి వ్యతిరేకంగా చేశార’ని పేర్కొన్నాడు.