'లంబాడీలను తొలగించాల్సిందే' | Adivasi Garjana in Hyderabad | Sakshi
Sakshi News home page

'లంబాడీలను తొలగించాల్సిందే'

Published Sat, Dec 9 2017 4:18 PM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

నగరంలోని సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో శనివారం ఆదివాసీల ఆత్మగౌరవ సభ ప్రారంభమైంది.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో శనివారం ఆదివాసీల ఆత్మగౌరవ సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కొమురం భీం మనువడు కొమురం సోలేవాల్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లంబాడీలను ఆదివాసీల నుంచి తొలగించాల్సిందేనన్నారు.

కొమురం భీం పోరాట స్పూర్తితో ముందుకెళ్దామన్నారు. ఆదివాసీలకంటూ ప్రత్యేక రిజర్వేషన్‌ కావాలని  సోలేవాల్‌ డిమాండ్‌ చేశారు. కాగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి వేలాది మంది ఆదివాసీలు సభకు హాజరయ్యారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధాన డిమాండ్ తో ఆదివాసీలు సభ నిర్వహిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement