అక్రమంగా బెల్లం రవాణ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
అక్రమంగా బెల్లం రవాణ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోయలగూడెం గ్రామం నుంచి బెల్లం అక్రమంగా రవాణ చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. ఈ ఘటనలో ట్రాలీతో పాటు.. 18బస్తాల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.