'రేవంత్ తరచూ ఓ ఫైనాన్షియర్ తో మాట్లాడేవారు' | ACB reveals that revanth always talks with a financier | Sakshi

'రేవంత్ తరచూ ఓ ఫైనాన్షియర్ తో మాట్లాడేవారు'

Jun 26 2015 11:14 AM | Updated on Aug 29 2018 7:31 PM

'రేవంత్ తరచూ ఓ ఫైనాన్షియర్ తో మాట్లాడేవారు' - Sakshi

'రేవంత్ తరచూ ఓ ఫైనాన్షియర్ తో మాట్లాడేవారు'

ఓటుకు కోట్లు కేసులో నిందితుడుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సంబంధించిన మరికొన్ని వాస్తవాలు వెల్లడవుతున్నాయి.

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితుడుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సంబంధించిన మరికొన్ని వాస్తవాలు వెల్లడవుతున్నాయి. రేవంత్ తరచుగా అమీర్పేటకు చెందిన ఓ ఫైనాన్షియర్ తో  ఫోన్లో మాట్లాడేవారని ఏసీబీ వెల్లడించింది. తమ వద్ద ఉన్న కాల్ లిస్టు సమాచారంతో తెలంగాణ ఏసీబీ ఈ విషయాన్ని ధృవీకరించింది. కాగా, ఆ ఫైనాన్షియర్ కృష్ణా జిల్లాకు చెందిన వారని పోలీసులు భావిస్తున్నారు.

ఓటుకు కోట్లు కేసు విచారణలో భాగంగా రేవంత్ కు సన్నిహితుడైన ఆ ఫైనాన్షియర్ ను ప్రశ్నించాలని ఏసీబీ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కొనేందుకు రేవంత్ కు నగదు ఏమైనా ఇచ్చాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement