
నందిగామ: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ కమ్లేశ్ డీ పటేల్ (దాజీ) మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం సోమవారం ఉదయం నుంచే పలు దేశాల నుంచి అభ్యాసీలు తరలివస్తున్నారు. హైదరాబాద్ జంట నగరాల్లోని అన్ని డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment