center
-
మోసాల రమణ నిండా ముంచాడు
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు సహకారంతోనే ఎదిగానని ఇండియన్ ఆర్మీ కాలింగ్ నిర్వాహకుడు బసవ రమణ ప్రచారం చేసుకున్నాడు. ఆయనతో తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఫేస్బుక్లు, వాట్సాప్లోనూ పెట్టి తనకున్న అనుబంధాన్ని, సంబంధాలను అందరికీ తెలియజేశాడు. ఆర్మీ కాలింగ్ సెంటర్లో చేరిన విద్యార్థులను రామ్మోహన్నాయుడు హాజరయ్యే కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేవాడు. సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ కంచరాన అవినాష్ వంటి అధికారులను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్కు తీసుకొచ్చి వారితో విద్యార్థులకు అవగాహన కల్పించాడు. తనకు ఎంతో పలుకుబడి ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. దానికోసం ముందస్తుగా పోస్టర్లు, ఫ్లెక్సీల ద్వారా విస్తృత ప్రచారం చేశాడు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇండియన్ ఆర్మీ కాలింగ్ రమణ మోసాలు తిలాపాపం..తలా పిడికెడు అన్నట్టుగా కనిపిస్తున్నాయి. పెద్దలతో ఏ మాత్రం పరిచయం ఏర్పడినా దాన్ని తన వ్యాపారాన్ని పెంచుకునే అస్త్రంగా రమణ వాడుకున్నాడు. కేంద్రమంత్రిని.. ‘అన్నా’ అని సంబోధిస్తూ, ఆయన అండతోనే ఎదిగానని చెబుతూ, ఆయన ఆశీస్సులుంటే మరింత ఎదుగుతానని ఫొటోలు, వీడియోలతో సహా చూ పించిన దృశాలు, రక్షణ రంగంలోని అధికారులతో నిర్వహించిన సమావేశాలు, కలెక్టర్లు, జేసీలతో చేపట్టిన కార్యక్రమాలు, ఎమ్మెల్యే, వారి కుటుంబీకులతో నిర్వహించిన ప్రైవేటు కార్యక్రమాలు, నగరంలో జరిపిన పలు ఈవెంట్లతో రమణను పలుకుబడి గల వ్యక్తిగా నమ్మించాయి. ఇదే విద్యార్థుల కొంప ముంచింది. అసలు నిజం ఇదీ.. రాజకీయ ప్రముఖులు, ఆర్మీ అధికారులు, ఉన్నతాధికారులతో పరిచయాలను చూపించి విద్యార్థులను నిలువునా ముంచేశాడు. మాజీ మేజర్ జనర ల్ తన సంస్థకు ప్రెసిడెంట్గా ఉన్నారని నమ్మబలికి నిరుద్యోగ యువతను ట్రాప్ చేశాడు. ఈ ప్రచారం చూసే విద్యార్థులు ఆకర్షితులై ఉద్యోగాల కోసం రూ.3లక్షల నుంచి రూ.10లక్షల వరకు ముట్ట చెప్పేశారు. అంతటితో ఆగకుండా శిక్షణ, వసతి అని చెప్పి రూ.లక్షల్లో గుంజేశాడు. మోసం బట్టబయలు కావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. శ్రీకాకుళం కేంద్రంగానే కాదు జులుమూరు కేంద్రంగా కూడా మోసం చేశాడు. రోజూ ఆయన చేతిలో మోసపోయిన వారు బయటకి వస్తూనే ఉన్నారు. ఎంత మొత్తంలో వసూలు చేశాడో లెక్క కట్టడం కూడా కష్టమవుతోంది. జిల్లాకు వచ్చే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఐఎఫ్ఎస్ అధికారులు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితరులను మర్యాద పూర్వకంగా కలిసి, వారిని మచ్చిక చేసుకుని, పలు కార్యక్రమాలకు ఆహా్వనించేవాడు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో మోటివేషన్ కార్యక్రమాలను నిర్వహించాడు. అధికారికంగా జరిగే ఈవెంట్లకు, ప్రైవేటు కార్యక్రమాలకు తన దగ్గర శిక్షణ పొందుతున్న విద్యార్థులను తన సైన్యంగా తీసుకెళ్లి బల నిరూపణ చేసేవాడు. ఈవెంట్ల పేరుతో పెద్ద ఎత్తున శాఖల వారీగా, ప్రైవేటు సంస్థల నుంచి నిధుల సమీకరణ కూడా చేసేవాడు. ⇒ పలువురు జర్నలిస్టులతో కూడా వెంకటరమణ చేతులు కలిపారు. వారికున్న పత్రికల్లో స్పాన్సర్ కథనాలు వండి వార్చారు. అవసరం వచ్చినప్పుడల్లా అండగా నిలిచారు. ఉన్నత స్థాయి వ్యక్తులను కలిసేందుకు ఓ జర్నలిస్టును రిఫరెన్స్గా వాడుకునే వాడు. పోలీసు శాఖలో పనిచేసిన కొందరు అధికారులు కూడా ఆయనకు అండగా నిలిచారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఫిర్యాదులొస్తే పట్టించుకోకుండా వెంకటరమణకే వత్తాసు పలికిన ఉదంతాలున్నాయి. భారత రక్షణ వ్యవస్థ మేజర్గా ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న మేజర్ పెంటకోట రవికుమార్ను కలిసిన ఫొటోలను చూపించి, తనకు అధికారిక పలుకుబడి ఉందని నమ్మించాడు. ఐఏఎఫ్ గ్రూప్ కెపె్టన్ పి.ఈశ్వరరావు వంటి వారితో మోటివేషన్ క్లాసులు ఇప్పించాడు.జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్యే సతీమణి జీ.స్వాతిని ఆహా్వనించి హడావిడి చేశాడు. అకృత్యాలు.. వికృత చేష్టలు.. ⇒ శిక్షణ, ఉద్యోగాల పేరుతో మోసం చేయడమే కాకుండా తన ఆర్మీ కాలింగ్ సెంటర్లో చేరిన విద్యార్థులను హింసించాడు. ⇒ ఏకంగా కాళ్లతో తన్ని, డేటా కేబుల్ వైర్తో కొడుతూ చాలామందికి నరకం చూపించాడు. ⇒ శిక్షణలో చేరిన అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు. ⇒ రకరకాల మెసెజ్లు, మాటలతో ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు. ⇒ అంతటితో ఆగకుండా అమ్మాయిలున్న వసతి గృహంలో, వాష్ రూమ్ల్లో, పరుపులు ఉన్న రూమ్ల్లో సీసీ కెమెరాలు పెట్టాడు. ⇒ ఒకసారి దొరికిపోయాక అది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అనుమతితోనే పెట్టానని నమ్మించే ప్రయత్నం చేశాడు. ⇒ ∙సీసీ కెమెరాల గుట్టు బయటకు రాకుండా ఉండటానికి అమ్మాయిలను కూడా భయపెట్టాడు. ⇒ బయటకు చెబితే వీడియోలు బయటకు వస్తాయని, అసభ్యకర ఫొటోలు వెలుగు చూస్తాయని బెదిరించినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. ⇒ రమణ కోసం ఒక్క మాటలో చెప్పాలంటే రక్షణ రంగంలో ఉద్యోగాల పేరుతో ఓ నియంతలా.. సైకోలా వ్యవహరించాడనే విషయం బాధితుల మాటల్లో స్పష్టమవుతోంది. -
హైదరాబాద్లో ఇండిజీన్ కొత్త సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లైఫ్ సైన్సెస్ కమర్షియలైజేషన్ కంపెనీ ఇండిజీన్ తమ అంతర్జాతీయ డెలివరీ కార్యకలాపాలను పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లో కొత్త సెంటర్ను ప్రారంభించింది.నూతన ఉత్పత్తులను ఆవిష్కరించడం, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారడానికి సంబంధించి ఫార్మా పరిశ్రమపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వాటికి సహాయం అందించడంలో ఈ సెంటర్ కీలక పాత్ర పోషించగలదని కంపెనీ తెలిపింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియావ్యాప్తంగా తమకు 6 హబ్లు, 18 కార్యాలయాలు ఉన్నట్లు వివరించింది. -
14 రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల చేసిన కేంద్రం
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం రూ.5,858.60 కోట్లు వరద సాయం నిధులను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్) నుంచి 14 రాష్ట్రాలకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిధులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, మిజోరాం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, మణిపూర్ రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు.. నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదిక మేరకు తక్షణసాయంగా ఈ నిధులు కేటాయించింది.అత్యధికంగా మహారాష్ట్రకు 1,492 కోట్ల వరద సాయం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్కు రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416. కోట్లు మంజూరు చేసింది. అయితే కేంద్ర బృందాల నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు హోంశాఖ పేర్కొంది. Ministry of Home Affairs releases ₹ 5858.60 crore to 14 flood-affected as a central share from the State Disaster Response Fund (SDRF) and an advance from the National Disaster Response Fund (NDRF)Government stands shoulder to shoulder with the states affected by natural…— PIB India (@PIB_India) October 1, 2024 -
కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు NDA సిద్ధం
-
గెలుపు, ఓటములు సహజం.. నంబర్స్ గేమ్ కొనసాగుతుంది: మోదీ
లోక్సభ ఎన్నికల ఫలితాలతో కేంద్రంలో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్. అయితే గత రెండు పర్యాయాల్లోనూ (2014, 2019) సొంతంగా మెజార్టీ సాధించిన కాషాయ పార్టీ.. ఈసారి మెజార్టీ(272) కంటే తక్కువ స్థానాలకే పరిమితమైంది. కేవలం 240 సీట్లను గెలుచుకున్న బీజేపీ.. ఎన్డీయే కూటమి మిత్రపక్షాల సాయంతో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో బుధవారం మోదీ 2.0లో చివరి కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని అన్నారు. అయితే నంబర్స్ గేమ్ మాత్రం కొనసాగుతుందని పేర్కొన్నారు. ‘గత పదేళ్లలో ఎన్నో మంచి పనులు చేశాం. అదే మంచిని ఇక ముందు కూడా కొనసాగిస్తాం. గెలుపు, ఓటములు రాజీకీయాల్లో భాగం నంబర్స్ గేమ్ కొనసాగుతుంది’ అని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్లోని మంత్రుల పనితనాన్ని మొచ్చుకున్నారు. పదేళ్లుగా ఎంతో కష్టపడి పనిచేసినందుకు, తమ విలువైన సేవలను అందించి ప్రభుత్వానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రధాని పదవికి రాజీనామా సమర్పించేందుకు రాష్ట్రపతి భవన్కు మోదీ బయలుదేరారు. మోదీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. అలాగే కొత్త ప్రభుత్వం కొలువు దీరేవరకు వరకు కొనసాగవలసిందిగా మోదీ, మంత్రిమండలిని కోరినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం మూడోసారి ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
మళ్లీ సంకీర్ణ యుగంలోకి కేంద్ర సర్కారు
లోక్సభ ఎన్నికల ఫలితాలు దేశాన్ని మరోసారి సంకీర్ణ రాజకీయాల యుగంలోకి తీసుకెళ్లాయి. పదేళ్ల తర్వాత ఓటర్లు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకుండా తీర్పు చెప్పారు. దాంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈసారి ఓటర్లు బీజేపీకి 240 సీట్లే కట్టబెట్టడంతో కొంత నిరాశ ఎదురైనా ఎన్డీఏకు మెజారిటీ రావడంతో కమలనాథులు సంతృప్తి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ సొంతంగా 272 సీట్ల మెజారిటీకి మార్క్ చేరుకోలేకపోయినా, ఎన్డీఏ కూటమిగా 292 సీట్లు సాధించింది. దాంతో సునాయాసంగా కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయబోతోంది. అయితే 2014, 2019 ప్రభుత్వాలకు భిన్నంగా నరేంద్రమోడీ తన పాలనలో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా మారిన టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ, షిండే శివసేన, ఎన్సీపీ తదితర పార్టీల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వాన్ని నడపాల్సిందే. అయితే బీజేపీకి మెజారిటీ మార్క్ దాటకపోవడానికి గల కారణాలపైనా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రధానంగా యూపీలో ఠాకూర్లు, గుజ్జర్లు బీజేపీకి అండగా నిలబడలేదని తెలుస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను మారుస్తారనే విపక్షాల ప్రచారం ఠాకూర్లకు ఆగ్రహం తెప్పించడం వల్లే బీజేపీకి సీట్లు తగ్గాయని అంటున్నారు. అలాగే మహారాష్ట్రలో శివసేన, న్సీపీ పార్టీలను చీల్చడ మహారాష్ట్ర ఓటర్లకు ఆగ్రహన్ని తెప్పించాయి. దాని ఫలితంగా బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. వీటికి తోడు బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి చేసిన ప్రచారం దెబ్బ హిందీ రాష్ట్రాలలో బిజెపి స్ట్రయిక్ రేటును తగ్గించింది.ఇటు ఇండియా కూటమి అనూహ్యాంగా పుంజుకుని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఇండియాకు 234 సీట్లు తెచ్చుకుని మెజారిటీ మార్క్కు దూరంగా ఆగిపోయింది. అయితే విపక్షంలో ఉండాలా? అధికారం కోసం ప్రయత్నించాలా అన్న దానిపై ఆ పార్టీలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. విపక్షంలో కూర్చుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించకపోవడంతో, ఆ కూటమి అధికారం కోసం ప్రయత్నిస్తుందనే చర్చ జరుగుతోంది. మెజారిటీకి 38 సీట్లు తక్కువగా ఉండడంతో నితీష్, చంద్రబాబు మద్దతు కోసం ఇండియా కూటమి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. ఏ పార్టీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో అస్థిరత కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రింగా ఇప్పటివరకు పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని నడిపారు. తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించబోతున్న నరేంద్రమోదీ ఆ దిశగా పట్టువిడుపులతో, భాగస్వాముల ఆకాంక్షలను సంతృప్తి పరుస్తూ పాలనను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
వారం క్రితమే వివాహం.. గేమింగ్ జోన్లో అగ్నికి ఆహుతై..
గుజరాత్లోని రాజ్కోట్ గేమింగ్ జోన్ ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. వినోదం కోసం వచ్చిన జనం ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో కొత్తగా పెళ్లయిన జంట అక్షయ్ ధోలారియా, ఖ్యాతి ఉన్నారు. ఈ జంటకు వారం క్రితమే వివాహం జరిగింది. ఈ నేపధ్యంలో వారు ఆనందంగా గేమింగ్ జోన్కు వచ్చారు. అయితే ఊహించని విధంగా సంభవించిన అగ్నిప్రమాదానికి వారిద్దరూ బలయ్యారు. 24 ఏళ్ల అక్షయ్ తన తల్లిదండ్రులతో కలిసి కెనడాలో ఉంటున్నాడు. ఖ్యాతి(20)ని వివాహం చేసుకునేందుకు కొద్దిరోజుల క్రితమే రాజ్కోట్కు వచ్చాడు. గత శనివారం వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లయిన ఏడు రోజులకే ఈ జంట లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. వారి శరీరాలు గుర్తించలేని విధంగా అగ్నికి మాడిపోయాయి. వేలికి ధరించిన ఉంగరం ఆధారంగా అక్షయ్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ దంపతుల మృతదేహాలను డీఎన్ఏ పరీక్షలకు తరలించారు.ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నామని, విచారణ తర్వాతే ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసు అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండానే ఈ వినోద కేంద్రం నడుస్తున్నదని విచారణ అధికారులు చెబుతున్నారు. మరోవైపు టీఆర్పీ గేమింగ్ జోన్ యజమానిని పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కోరినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మీడియాకు తెలిపారు. -
నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!
మే 20: అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి అన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నాట్స్ సహకారంతో అవని ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని బాపు నూతి ప్రారంభించారు. విద్యార్ధులు మల్టీ స్కిల్స్ నేర్చుకుంటే వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు. డిజిటల్ యుగంలో టెక్నాలజీ నైపుణ్యం ఎంతో కీలకమని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. బేసిక్స్, లాంగ్వేజస్ పై పట్టు సాధించి సరికొత్త టెక్నాలజీ కోర్సులు చేస్తే యువత ఉపాధి అవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదని బాపు నూతి భరోసా ఇచ్చారు. గతంలో నాట్స్ సహకారంతో కంప్యూటర్ కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందించారు.ఈ కార్యక్రమంలో బాపు నూతికి అలిశెట్టి ప్రభాకర్ కవిత పుస్తకాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ డల్లాస్ కో ఆర్డినేటర్ రవి తాండ్ర, రామానంద తీర్థ గ్రామీణ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషోర్ రెడ్డి , స్పర్శ ఫౌండేషన్ సిఇవో పంచముఖి, సీనియర్ జర్నలిస్ట్ కొండూరు వీరయ్య, తెలంగాణ బుక్ ట్రస్ట్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, ఏఐటీయూసీ నాయకులు బాలకాశి తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉపయోగపడే ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన నాట్స్ నాయకులను నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.(చదవండి: మేడం టుస్సాడ్.. మన శిల్పసంపద కంటే ఎక్కువా?) -
ఐవీఎఫ్ ట్రీట్మెంట్పై కేంద్రం ఫైర్!
పంజాబ్ ర్యాపర్, దివంగత సింగర్ సిద్దు మూసేవాలా 2022లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఒక్కగానొక్క కొడుకు మరణం జీర్ణించుకోలేని సిద్దు తల్లిదండ్రులు తమ కొడుకును మళ్లీ చూసుకోవాలని ఆరాటపడ్డారు. ఈ క్రమంలోనే సిద్దూ మూసేవాలే తల్లిదండ్రులు మరోసారి అమ్మనాన్నలయ్యారు. సిద్దూ బల్కౌర్ సింగ్ తండ్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమకు ఒక బాబు పుట్టాడని, తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు కూడా పేర్కొన్నారు. అయితే ఇక్కడ సిద్దూ తల్లి 58 ఏళ్ల చరణ్ సింగ్ ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) టెక్నిక్ ద్వారా బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఇప్పుడూ ఈ అంశం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వయసులో పిల్లలను కనడం కరెక్టేనా అని ప్రశ్న లేవనెత్తింది. నిజానికి ఇలా ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనడానికి గల వయో పరిమితిపై ఆరా తీసింది. అంతేగాదు సిద్దు మూస్ వాలా తల్లి చరణ్ సింగ్క ఐవీఎఫ్ చికిత్సపై కూడా నివేదిక ఇమ్మని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్, 2021లోని సెక్షన్ 21(జీ)(i) ప్రకారం..21 నుంచి 50 ఏళ్లలోపు వయోపరిమితి ఉన్నవాళ్లు మాత్రమే ఐవీఎఫ్ ద్వారా బిడ్డకి జన్మనివ్వడం సురక్షితం అని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పంజాబ్ ప్రభుత్వం సిద్దూ మూసే వాలే తండ్రిని శిశువుకి సంబంధించిన పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో సిద్దూ తండ్రి బల్కౌర్ సింగ్ ఇన్స్టాగ్రామ్ వీడియోలో.." జిల్లా అధికారులు నన్ను వేధిస్తున్నారు. చిన్నారికి సంబంధించిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేశాను. అయినా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యమంత్రి, అధికారులు జోక్యం చేసుకోవాలి. ట్రీట్మెంట్ జరిగేంత వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. కావాల్సినప్పుడల్లా నేను అందుబాటులోనే ఉంటాను. లీగల్ డాక్యుమెంట్స్ని కచ్చితంగా సబ్మిట్ చేస్తాను" View this post on Instagram A post shared by Balkaur Singh (@sardarbalkaursidhu) (చదవండి: దిగ్గజ ర్యాపర్ మళ్లీ పుట్టాడు.. 58 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి -
ఫ్యామిలీ పెన్షన్ నామినేషన్ : మహిళా ఉద్యోగులకు భారీ ఊరట
మహిళా ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ పెన్షన్ కోసం మహిళా ఉద్యోగులు, పెన్షనర్లు నామినేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అర్హులైన వారికి కుటుంబ పింఛను మంజూరు చేసేందుకు వీలు కల్పిస్తూ 2021 కేంద్ర పౌర సేవల (పెన్షన్) రూల్స్, 2021కి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (DoPPW) సవరణను ప్రవేశపెట్టింది. ఈ కేంద్ర సిబ్బంది సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఒక ప్రకనటలో తెలిపారు దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగినులు పెన్షన్ నామినీగా భర్తకు బదులుగా కుమార్తె లేదా కుమారుడి పేరును సైతం సూచించవచ్చంటూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు భర్తలను మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఉండేది. మృతి చెందిన ఉద్యోగి లేదా పింఛనుదారు జీవిత భాగస్వామికి మాత్రమే కుటుంబ పింఛను అందించేవారు. భాగస్వామి అనర్హులైన, మరణించిన సందర్భాల్లో మాత్రమే ఇతర కుటుంబ సభ్యులకు పింఛను అర్హత ఉండేది. -
బిక్షాటన రహిత భారత్గా..! ఇక ఆ నగరాల్లో బిచ్చగాళ్లు ఉండరు!
నగరాల్లోనూ ట్రాఫిక్ల వద్ద బిచ్చగాళ్లు కనిపిస్తుంటారు. అందులోనూ చారిత్రక ప్రదేశాల వద్ద, ఆలయాల వద్ద మరి ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎందుకంటే ఆయా ప్రదేశాల్లో మనుషుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బిచ్చగాళ్లకు కూడా యాచించడం ఈజీ అవుతుంది. దివ్యాంగులు, అనాథలుగా అవ్వడం, వృద్ధాప్యం తదితర కారణాలతో ఈ యాచక వృత్తిలోకి వస్తుంటారు. ఐతే దీని వెనుక పెద్ద మాఫియా కూడా ఉంది. ఇలా రోజంతా యాచించిన సొమ్మును తీసుకు రాకపోతే వాళ్లను చిత్రహింసలు పెట్టే ముఠా కూడా ఉన్నారు. వారి సమస్యలకు చెక్పెట్టేలా కేంద్రం ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే గాక బిచ్చగాళ్లు లేని దేశంగా మార్చనుంది. ఎలా చేస్తున్నారు? ఈ కార్యచరణ ముఖ్యోద్దేశం తదితరాల విశేషాలేంటో చూద్దామా! కేంద్రం బిచ్చగాళ్ల డేటాపై ఓ నివేదక రూపొందించింది. ముందుగా యాచకులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాను సర్వే చేయించింది. ఆ తర్వాత దీనికి చెక్పెట్టేలా భారత్ను యాచక రహితంగా మార్చే ప్రణాళికతో ముందుకొచ్చింది. అందులో భాగంగా కీలక 30 నగరాలను ఎంపిక చేసింది. ఈ మేరకు ఉత్తరాదిలో అయోధ్య నుంచి తూర్పున గువహటి.. పశ్చిమాన త్రయంబకేశ్వరం నుంచి దక్షిణాన తిరువనంతపురం వరకూ 30 నగరాల్లో భిక్షాటన చేస్తున్నవారు ముఖ్యంగా మహిళలు, పిల్లల గురించి సర్వే చేయించి, వారందరికి పనరావసం కల్పించనున్నట్లు ప్రభుత్వ నివేదిక పేర్కొంది. ఈ నగరాల్లోని హాట్స్పాట్లు గుర్తించి 2022 నాటికి బిచ్చగాళ్ల రహిత నగరాలుగా మార్చడమే ధ్యేయంగా కేంద్ర సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ పెట్టుకుంది. అందుకోసం సదరు జిల్లా మున్సిపల్ అధికారులు తోడ్పాటు అందించాలని పేర్కొంది ప్రభుత్వం. అంతేగాదు వచ్చే రెండేళ్ల మరిన్ని నగరాలు ఈ జాబితాలోకి చేరే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఇలా మతపరమైన , చారిత్రక లేదా పర్యాట ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల్లో స్వయం ఉపాధి పథకం అమలు చేసి, వాటికింద వారికి జీవనోపాధి కల్పించనుంది. అంతేగాదు 'భిక్షా-వృత్తి ముక్త్ భారత్' (భిక్షాటన రహిత భారతదేశం) లక్ష్యాన్ని చేరుకునేలా పూర్తి స్థాయిలో సర్వే చేయించి ఆయా నగరాల్లోనే వారందరికీ పునరావసం కల్పించనుంది. ఈ కార్యక్రమ మార్గదర్శకాల ప్రకారం బిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి రియల్టైమ్ అప్డేషన్ అయ్యేలా ఫిబ్రవరి నాటికల్లా జాతీయ పోర్టల్, మొబైల్ యాప్ని ప్రారంభించనుంది. అలాగే సర్వే, పునరావాసం కోసం ఎంపిక చేసిన నగరాల్లో కూడా అధికారులు మొబైల్ యాప్లో షెల్టర్లు, నైపుణ్యాలు, విద్య, పునరావాసాలు తదితర పురోగతి నివేదికను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ బిచ్చగాళ్లకు పునరావసం కల్పించనున్న 10 మతపరమైన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాల్లో అయోధ్య, కాంగ్రా, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, సోమనాథ్, పావగఢ్, త్రయంబకేశ్వర్, బోధగయ, గౌహతి మధురై తదితరాలు ఉన్నాయి. అలాగే పర్యాటక ప్రదేశాలలో విజయవాడ, కెవాడియా, శ్రీ నగర్, నంసాయి, కుషినగర్, సాంచి, ఖజురహో, జైసల్మేర్, తిరువనంతపురం,పుదుచ్చేరి ఉండగా, అమృత్సర్, ఉదయ్పూర్, వరంగల్, కటక్, ఇండోర్, కోజికోడ్, మైసూరు, పంచకుల, సిమ్లా, తేజ్పూర్ వంటివి చారిత్రక నగరాల జాబితాలో ఉన్నాయి. ఈ బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించడంలో నగర పాలక సంస్థ తోపాటు సంబంధిత మతపరమైన ట్రస్ట్ లేదా పుణ్యక్షేత్రం బోర్డు కూడా పాలుపంచుకుంటుంది. ఇక ఎంపిక చేసిన ఈ 30 నగరాల్లో దాదాపు 25 సిటీలు కార్యాచరణ ప్రణాళిక అందుకోగా..కాంగ్రా, కటక్, ఉదయ్పూర్, కుషినగర్ వంటి నగరాల అనుమతి కోసం వేచి ఉంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే..ఈ ప్రాంతంలో భిక్షాటన చేసే వ్యక్తులు ఎవరూ లేరని, అందువల్ల వేరే నగరాన్ని పరిగణించాలని సాంచి అధికారులు కేంద్రానికి తెలియజేశారు. కోజికోడ్, విజయవాడ, మదురై, మైసూరులో ఇప్పటికే సర్వే పూర్తయింది. ఈ కార్యచరణ అమలు చేస్తున్న సదరు జిల్లా మున్సిపల్ అధికారుల కోసం కేంద్ర సామాజిక సాధికారికత మంత్రిత్వ శాఖ నిధులు విడుదల చేస్తుంది. ఎంపిక చేసిన నగరాల రోడ్ మ్యాప్లో సర్వే, సమీకరణ, రెస్క్యూ, నివాసం, విద్య ద్వారా సమగ్ర పునరావాసం, నైపుణ్యం అభివృద్ధి, ఉపాధి ద్వారా జనజీవన స్రవంతితో ఏకీకరణ చేయడం, సమగ్ర పునరావాసం తదితరాలు ఉన్నాయి. (చదవండి: ప్రాణ ప్రతిష్టలో ఉపయోగించిన టన్నుల కొద్ది పువ్వులను ఏం చేస్తున్నారో తెలుసా!) -
కోచింగ్ సెంటర్లకు కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: విద్యార్థుల ఆత్మహత్యలు, సౌకర్యాల లేమి, టీచర్ల కొరత, అధిక ఫీజులు వంటి సమస్యలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. 16 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న విద్యార్ధులను కోచింగ్ సెంటర్లో చేర్చుకోరాదని వెల్లడించింది. సెకండరీ పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న తరువాత మాత్రమే విద్యార్ధులను చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది. చదవండి: Gujarat: పడవ బోల్తా.. 13 మంది విద్యార్థులు మృతి ►శిక్షణ కేంద్రాల్లో విద్యార్హత కలిగిన సిబ్బందిని నియమించుకోవాలి. వారు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ కంటే తక్కువ అభ్యసించిన వారిని సిబ్బందిగా నియమించుకోరాదు. ►విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా.. ర్యాంకులు, మార్కుల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకూడదు. సిబ్బంది అర్హత, కోచింగ్ సెంటర్ వివరాలు, శిక్షణ అందించే కోర్సులు, వసతి సౌకర్యాలు, ఫీజు రిఫండ్ గురించిన సమాచారం వెబ్సైట్లో పొందుపరచాలి. ►కోచింగ్ సెంటర్లో ఇచ్చే శిక్షణకు సంబంధించి, అక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు సాధించిన ఫలితాల గురించి మోసపూరిత ప్రకటనలు చేయకూడదు. ► కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు సరిపోయే స్థలం కేటాయించి కనీస సౌకర్యాలు(విద్యుత్, వెంటిలేషన్, లైటింగ్, స్వచ్ఛమైన తాగునీరు,భద్రతా చర్యలు’ ఏర్పాటు చేయాలి. ► అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం నివారించేందుకు భద్రతా ప్రమాణాలు పాటించాలి. ► శిక్షణ ఇచ్చే వ్యక్తి లేదా సంస్థ కోచింగ్ ప్రారంభించిన మూడు నెలల వ్యవధిలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ► ఒకవేళ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్వహిస్తుంటే.. గుర్తింపు రద్దవుతుంది. ► ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆయా బ్రాంచ్లను రిజిస్ట్రేషన్ చేయాలి. ► కోచింగ్ తీసుకునే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్తో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ►న్యాయమైన, సహేతుకమైన ఛార్జీలు, రుసుము రసీదులు, వాపసు విధానాలు వివరంగా ఉండాలి. -
కేంద్రం కీలక నిర్ణయం.. రూ.25కే కిలో బియ్యం?
న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న బియ్యం ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భారత్ రైస్ పేరుతో కిలో బియ్యాన్ని రాయితీ కింద రూ. 25కే ఇవ్వాలనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు పలుజాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు పెరుగుతున్న నిత్యావసర ఆహార పదార్థాల ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో సగటున కిలో బియ్యం ధర రూ. 43గా ఉంది. ఇది కిందటి ఏడాదితో పోలిస్తే 14.1శాతం పెరిగింది. దీంతో అందుబాటు ధరలో బియ్యాన్ని అందించేందుకు కేంద్రం.. ‘భారత్ రైస్’ను తీసుకురానున్నట్లు వినికిడి. రాయితీ ధరతో అందించనున్న బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), కేంద్రీయ భండార్ అవుట్లెట్, మొబైల్ వ్యాన్లు వంటి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విక్రయించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే దేశంలో ఆహార పదార్థాలను సామాన్యులకు అందుబాటు ధరల్లో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్’ బ్రాండ్ పేరుతో పప్పు, గోధుమ పిండిని రాయితీ ధరలకు విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కిలో గోధుమ పిండిని రూ. 27.50, కిలో శనగ పప్పును . 60 చొప్పున వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఉత్పత్తులు 2,000 కంటే ఎక్కువ రిటైల్ పాయింట్లలో పంపిణీ చేస్తున్నారు. వీటిలాగే ‘భారత్ రైస్’ విక్రయాలు కూడా చేపట్టనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా.. దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ఇటీవల కేంద్రం పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. అటు బాస్మతి బియ్యంపైనా ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. టన్ను ధర 1200 డాలర్లకంటే తక్కువ ధర ఉన్న బాస్మతి బియ్యం ఎగుమతులను నిషేధించింది. -
డీ అడిక్షన్ సెంటర్ నుంచి 13 మంది యువతులు పరార్..
హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లాకు చెందిన పర్వానూలో డీ అడిక్షన్ సెంటర్ (మత్తు పదార్థాల వినియోగం నుంచి విముక్తి కల్పించే సంస్థ) నుంచి 13 మంది యువతులు పారిపోయారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది. అనంతరం బాలికలను అడవిలో గుర్తించి, రక్షించారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పర్వానూలోని ఖాదిన్ గ్రామంలో డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ ఉంది. ఇక్కడ మొత్తం 17 మంది బాలికలు చికిత్స పొందుతున్నారు. శనివారం 13 మంది బాలికలు సెంటర్లోని కిటికీ అద్దాలు పగులగొట్టుకుని, బయటపడి సమీపంలోని అడవిలోకి పారిపోయారు. అయితే డి-అడిక్షన్ సెంటర్ సిబ్బంది పోలీసుల సహకారంతో ఈ యువతులను వెదికిపట్టుకుని తిరిగి సెంటర్కు తరలించారు. ఈ ఘటన డీ అడిక్షన్ సెంటర్ల పనితీరుపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. ఈ సెంటర్లో పంజాబ్ హర్యానాలకు చెందిన యువతులు చికిత్స పొందుతున్నారు. పంజాబ్లో డీ-అడిక్షన్ సెంటర్లపై నిషేధం విధించిన తర్వాత మత్తుమందు బాధితులు చికిత్స కోసం హర్యానా, హిమాచల్లకు వస్తున్నారు. అయితే హిమాచల్లో డీ అడిక్షన్ సెంటర్లు ప్రారంభించినప్పటి నుండి ఈ సెంటర్లలో పలు అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. కాగా డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ల నుంచి పారిపోయిన యువతులు.. పోలీసుల విచారణలో తమకు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా కల్పించడం లేదని అందుకే పారిపోయామని ఫిర్యాలు చేశారు. ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్నట్లు స్థానిక ఎస్పీ సోలన్ తెలిపారు. ఇది కూడా చదవండి: కొత్త ఏడాదిలో నూతన ఎక్స్ప్రెస్వే.. నాలుగు రాష్ట్రాలకు నజరానా! -
అన్ని అంశాలపై చర్చకు సిద్ధం: ప్రహ్లాద్ జోషి
ఢిల్లీ: అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఈ సెషన్ లో 21 బిల్లులు తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. జనవరిలో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం నేడు ముగిసింది. ఈ సమావేశానికి 23 పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ప్రహ్లాద్ జోషి మాట్లాడారు. పేదల కోసం అనేక అద్భుత పథకాలు తెచ్చాం.. అయిదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని ప్రహ్లాద్ జోషి తెలిపారు. పూర్తి స్థాయిలో జరగాల్సిన చివరి సెషన్.. స్వల్ప కాలిక చర్చకు వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విపక్షాలదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నేడు(శనివారం) నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ సమావేశాన్ని ఈ రోజు ఏర్పాటు చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో రెండు జమ్మూకశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. వివాదాస్పద ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లును కూడా ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రవేశపెట్టనుంది. #WATCH | Delhi: An all-party meeting is underway at the Parliament Library building, ahead of the winter session of Parliament. The winter session of Parliament, 2023 will begin from December 4 and continue till December 22. pic.twitter.com/PSwDtGFyPk — ANI (@ANI) December 2, 2023 శీతాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకు రానుంది. దీనివల్ల కశ్మీర్ నుంచి వలస వెళ్లినవారికి, శరణార్థులకు, ఎస్టీలకు చట్టసభలో ప్రాతినిథ్యం లభించనుంది. ఈ బిల్లులతోపాటు 2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమావేశాల్లో చర్చ, ఓటింగ్ జరగనుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఐపిసి , సీఆర్పీసీలను మారుస్తూ కొత్త బిల్లులను తీసుకురానున్నారు. మోడీ 2.0 ప్రభుత్వానికి ఇవి చివరి శీతాకాల సమావేశాలు గమనార్హం. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష నేతలు సిద్ధమవుతున్నారు. ఇదీ చదవండి: Rajasthan Exit Poll Analysis: కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు? ఓడితే బాధ్యులెవరు? -
చైనాలో పెరుగుతున్న కేసులు..ఆరు రాష్ట్రాల్లో అలర్ట్!
చైనాలో కొత్తగా నిమోనియా కేసులు పెరుగుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. ముఖ్యంగా చైనాలోని చిన్నారులే ఈ నిమోనియా వ్యాధి బారిన పడటంతో సర్వత్రా తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది. తమ పరిధిలో ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో అనే ఆరోగ్య సంసిద్ధతపై సమగ్రస్థాయిలో సమీక్ష నిర్వహించుకోవాలని ప్రకటన చేసింది. దీంతో దాదాపు ఆరు రాష్ట్రాలు తమ పరిధిలోని ఆరోగ్య మౌలిక సదుపయాలను అప్రమత్తం చేశాయి. ఈ మేరకు రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు తదితర రాష్ట్రాల ఆరోగ్య శాఖ శ్వాసకోసశ సంబంధిత సమస్యలతో వచ్చే రోగులకు సత్వరమే వైద్యం అందించేలా సంసిద్ధంగా ఉండేటమేగాక ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించుకోవాలని ఆస్పత్రులను, సిబ్బందిని కోరింది. నిజానికి సీజనల్గా వచ్చే ఫ్లూ వంటి వ్యాధుల పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆరోగ్య శాఖ పేర్కొంది. అలాగే కాలానుగుణంగా ఈ వ్యాధుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే గైడ్లైన్స్లు కూడా వారికి అందించాలని పేర్కొంది. ఇక రాజస్థాన్ ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం..ప్రస్తుతం పరిస్థితి ఏమీ అంత ఆందోళనకరంగా లేదని తెలిపింది. అయినప్పటికీ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి, అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడం తోపాటు పీడియాట్రిక్ యూనిట్లతో సహా మెడిసిన్ విభాగాలలో తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. అలాగే గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేశ్ మాట్లాడుతూ..ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ఉన్న ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలన్నింటిని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడూ ఆయా ప్రభుత్వ ఆస్పత్రులన్నీ తమ ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించాలని ఆరోగ్య అధికారులను కోరారు. అదేవిధంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా శ్వాసకోశ వ్యాధులపై నిఘా పెంచాలని ఆరోగ్య అధికారులను ఆదేశించింది. పైగా ఉత్తరాఖండ్లోని దాదాపు మూడు జిల్లాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను మరింత కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. హర్యానా రాష్ట్రం ప్రభుత్వం ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులను శ్వాసకోస సమస్యకు సంబంధించిన కేసు వస్తే వెంటనే నివేదించాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. తమిళనాడు ఆరోగ్య శాఖ కూడా ఇదే విధమైన ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటి వరకు పిల్లలకు సంబంధించిన న్యూమోనియో కేసులు నమోదు కానప్పటికీ ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ. ఒకవేళ ఏ కేసు అయినా నమోదైతే వెంటనే పరిష్కరించేలా ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించుకునేలా అధికారుల అప్రమత్తంగా ఉండేందుకు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు పేర్కొంది. ఆ కరోనా మహమ్మారి వచ్చిన నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా చైనాలో పిల్లలో ఈ కొత్త తరహ నిమోనియా కేసులు నమోదవ్వడంతో ప్రపంచదేశాలన్ని ఉలిక్కిపడ్డాయి. అదీగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడూ పరిస్థితి గురించి వెల్లడించాలని చైనాను ఆదేశించడంతో ప్రపంచదేశాలన్నీ కలవరపాటుకు గురయ్యాయి. చైనా మాత్రం శీతకాలం తోపాటు వివిధ వ్యాధి కారకాల వల్లే ఈ వ్యాధి ప్రబలినట్లు వివరణ ఇచ్చుకుంది. పైగా ఇది కోవిడ్-19 మహమ్మారి సమయం నాటి తీవ్రత కాదని కూడా స్పష్టం చేసింది చైనా. (చదవండి: శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమిదే : చైనా) -
‘అమెరికా’ ఏం చదువుతోంది?
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) అమెరికాలో విద్యనభ్యసించడం వివిధ దేశాలకు చెందిన ఎన్నో లక్షల మంది విద్యార్థుల స్వప్నం. ఎన్నో కష్టాలు పడి, వివిధ పరీక్షలు రాసి అమెరికాకు పరుగులు తీస్తుంటారు. అక్కడే గ్రాడ్యుయేషన్లు, పోస్ట్గ్రాడ్యుయేషన్లు చేసి.. ఉద్యోగాలు కూడా సంపాదించి స్థిరపడిపోతుంటారు. కానీ అసలు అమెరికా విద్యార్థులు ఏం చేస్తున్నారు? ఏఏ కోర్సులు ఎక్కువగా చదువుతున్నారు? ఏఏ రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారు? అనే ప్రశ్నలు మనలో తలెత్తుతుంటాయి. ఈ అంశాలపై అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ (ఎన్సీఈఎస్) అధ్యయనం చేసి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పలు ముఖ్యమైన కోర్సులపై అధ్యయనం చేసింది. 2010–11 విద్యా సంవత్సరంలో వివిధ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్యతో.. సరిగ్గా దశాబ్దం తర్వాత అంటే 2020–21లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్యతో పోల్చి గణాంకాలు రూపొందించింది. కంప్యూటర్ సైన్స్కే పట్టం అమెరికాలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుకే విద్యార్థుల నుంచి విశేష ఆదరణ దక్కింది. దశాబ్దకాలం తర్వాత కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లు 144 శాతం పెరిగారు. 2010–11లో 43,066 మంది కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, 2020–21లో ఈ రంగం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్య 1,04,874కు పెరిగింది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందుబాటులో ఉండటం, భవిష్యత్ను శాసించే శక్తి ఉందని యువత భావించడం వల్లే దీనిపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైద్య రంగంలోనూ భారీ వృద్ధి: వైద్య, ఆరోగ్య రంగంలోని విస్తృత అవకాశాలు కూడా అమెరికా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. 2010–11తో పోలి్చతే.. 2020–21 విద్యా సంవత్సరంలో 87 శాతం వృద్ధితో 2.6 లక్షల మంది విద్యార్థులు ఈ రంగంలో పట్టాలు అందుకున్నారు. అమెరికాలోని మొత్తం గ్రాడ్యుయేట్లలో వైద్య, ఆరోగ్య రంగంలో పట్టభద్రులైన విద్యార్థుల సంఖ్య దాదాపు 13 శాతం. అలాగే బయోమెడికల్ సైన్స్లోనూ 46 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్ సంక్షోభం తర్వాత ఈ విభాగంలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వన్నె తగ్గని ఇంజనీరింగ్ కోర్సులు కంప్యూటర్ సైన్స్ను మినహాయించి మిగతా బ్రాంచ్లను ఇంజనీరింగ్ కింద పరిగణించారు. దశాబ్దకాలంలో 65 శాతం వృద్ధితో 1.26 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 2020–21లో కాలేజీల నుంచి పట్టాలతో బయటకు వచ్చారు. ఏటా లక్ష డాలర్లకు తగ్గని వేతనాలు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదనే భరోసా.. ఈ రంగం వైపు విద్యార్థులు ఆకర్షితులవ్వడానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్ ఎంటర్ప్రెన్యూర్స్గా మారుతున్న వారిలో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారి శాతమే ఎక్కువ. దాదాపు 4 లక్షల మంది.. అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్కు ఆదరణ ఏటా పెరుగుతూనే ఉంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న వారిలో అత్యధికులు ఈ రంగం వారే. 2020–21లో దాదాపు 4 లక్షల మంది ఈ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పడిపోతున్న ‘ఆర్ట్స్’ అమెరికాలో పలు ఆర్ట్స్ గ్రూప్లకు ఆదరణ తగ్గుతోంది. సామాజిక శా్రస్తాలు, భాషలు, చరిత్ర లాంటి 17 సబ్జెక్టుల్లో గత దశాబ్దకాలంలో విద్యార్థుల చేరికలు తగ్గినట్లు తేలింది. ఇంగ్లిష్, చరిత్ర తదితర సబ్జెక్టుల్లో దశాబ్దకాలంలో 35 శాతం విద్యార్థుల సంఖ్య పడిపోయింది. పాకశాస్త్రంలో తగ్గుదల 50 శాతానికిపైగా ఉంది. ఉపాధి అవకాశాలున్నా.. తగ్గిన చేరికలు అమెరికాలో ఎడ్యుకేషన్ రంగంలో గ్రాడ్యుయేషన్ చేసే వారి సంఖ్య తగ్గుతోంది. టీచర్ల వేతనాలు పెద్దగా పెరగకపోవడం ఈ రంగంలోకి విద్యార్థులు రాకపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. టీచర్ల కొరత ఉన్నందున ఉద్యోగవకాశాలు సులభంగా దక్కే అవకాశం ఉన్నా.. ఇతర రంగాల వైపే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దశాబ్దకాలంలో 16 శాతం మేర చేరికలు తగ్గాయి. అలాగే మారుతున్న ప్రపంచంలో పరిశ్రమలు స్పెషలైజేషన్ను కోరుకుంటుండటంతో విద్యార్థులు కూడా లిబరల్ ఆర్ట్స్వైపు ఆసక్తి చూపించం లేదు. దీంతో విద్యార్థుల సంఖ్య దశాబ్దకాలంలో 10 శాతం తగ్గింది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఇంగ్లిష్దీ ఇదే పరిస్థితి. -
Global maritime india summit 2023: సముద్ర వాణిజ్య ఆర్బిట్రేషన్ కేంద్రంగా భారత్!
ముంబై: సముద్ర వాణిజ్య అంశాలు, వివాదాల పరిష్కారానికి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం భారత్లో ఏర్పడాలన్న ఆకాంక్షను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు. ఇందుకు తగిన సామర్థ్యాలు, న్యాయ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆమె ఉద్ఘాటించారు. దేశ నౌకానిర్మాణ సామర్థ్యాన్ని పెంచడానికి ఫైనాన్సింగ్, బీమా, మధ్యవర్తిత్వం, మరిన్ని విభిన్న సౌలభ్యాల సృష్టి అవసరమని కూడా అన్నారు. ముంబైలో జరిగిన గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్, 2023 ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. సరఫరాలు, సరఫరాల భద్రతలో అంతరాయాలు, సరఫరాల చైన్ విచి్ఛన్నం వంటి పలు సవాళ్లు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమయంలో జరిగిన ఈ సదస్సుకు కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సు సందర్భంగా ‘మారిటైమ్ ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఆర్బిట్రేషన్’ అన్న అంశంపై నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... సెషన్లో ప్రసంగించారు. ► లండన్ లేదా సింగపూర్ లేదా దుబాయ్లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ (ఆర్బ్రిట్రేషన్) కేంద్రాలలో చాలా మంది భారతీయులు పనిచేస్తున్నప్పటికీ, వారంతా అక్కడి సీనియర్ న్యాయవాదులకు సహాయం చేస్తున్నారు తప్ప, ఒక కేసును స్వయంగా చేపట్టి, పరిష్కరించడంలేదు. ఈ ధోరణి మారాలి. ► మన మధ్యవర్తిత్వ ప్రక్రియలు, చట్టాలను మెరుగుపరచడం, బలోపేతం చేయడం అవసరం. తద్వారా అవి ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. మనం ఈ దిశలో ఒక వ్యవస్థను అభివృద్ధి చేసినప్పుడు, మధ్యవర్తిత్వ కేంద్రాన్ని కూడా కలిగి ఉండవచ్చు. ► భారత్ మధ్యవర్తిత్వంలో తన బలాన్ని మెరుగుపరచుకుంటోంది. అయితే అంతర్జాతీయ ఆంక్షలు– ఒత్తిళ్లను తగ్గించుకునే దిశలో దేశం పూర్తి స్థాయి భారత్–ఆధారిత రక్షణ, నష్టపరిహార (పీఅండ్ఐ) సంస్థను కలిగి ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఇది షిప్పింగ్ కార్యకలాపాల లో మరింత వ్యూహాత్మక సౌలభ్యాన్ని అందిస్తుంది. తీరప్రాంత, లోతట్టు జలాల్లో పనిచేసే నౌక లకు తగిన రక్షణాత్మక చర్యలను అందిస్తుంది. ► ప్రధాన వస్తువుల ఎగుమతులు కొన్నిసార్లు అవాంతరాలకు గురవుతాయి. ఫలితంగా ఆహార అభద్రత శక్తి అభద్రత వంటి అంశాలు తీవ్రతరమవుతాయని. దీనితో ద్రవ్యోల్బణం సమస్యా తలెత్తవచ్చు. కోవిడ్ సవాళ్ల నుండి బయటకు వస్తున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుతం ఈ సవాలును ఎదుర్కొంటున్నాయి. ఈ సవాళ్లను ప్రపంచవ్యాప్త పరస్పర సహకారంతో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ► సముద్ర రంగానికి ఫైనాన్సింగ్ను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. బలమైన బ్యాలెన్స్ షీట్ ఉన్నప్పటికీ, బ్యాంకులు ఈ రంగానికి నిధులు సమకూర్చడంలో పెద్దగా ఉత్సాహం చూపడం లేదు. ఈ రంగానికి సంబంధించిన అధిక నష్టాల అవకాశం దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో సముద్రరంగం పట్ల మరింత సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. ► భారత్– మిడిల్ ఈస్ట్–యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఇప్పుడు కీలకం. మేము యూరప్, మధ్య ఆసియాలను సముద్రం అలాగే భూ మా ర్గం ద్వారా చేరుకోవాలని చూస్తున్నాము. తద్వా రా లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రణాళికలను రూపొందించడం జరుగుతోంది. ► కోవిడ్–19 తర్వాత సముద్ర వాణిజ్యానికి మద్దతుగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), దేశీయ బీమా కంపెనీల మద్దతుతో ‘‘మెరైన్ కార్గో పూల్’’ ఆవిష్కరణ జరిగింది. ► 12 ప్రభుత్వ ఓడరేవుల్లో తొమ్మిదింటిలో 35 ప్రాజెక్టులను మానిటైజేషన్ కోసం గుర్తించడం జరిగింది. అన్నీ సవ్యంగా జరిగితే నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్లైన్లో భాగంగా రూ. 14,483 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోనటైజ్ చేయవచ్చు. ప్రభుత్వ ఆస్తులను దీర్ఘకాలంపాటు లీజుకు ఇవ్వడం తద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందడం నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్లైన్ ప్రధాన ఉద్దేశం. గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్, 2023 సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు జ్ఞాపికను బహూకరిస్తున్న ఓడరేవులు, షిప్పింగ్,జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి టి.కె. రామచంద్రన్ -
‘ఒంటె సిద్ధాంతా’నికి విరుగుడు..‘గుర్రం’ స్టెప్పు!
కాస్త ఊపిరాడేలా, కొద్దిగా గాలీ–వెలుతురూ వచ్చేలా..కూసంత ‘‘సౌకర్యంగా’’ ఉండే ఓ గుడారాన్ని అడుగుతాడు ఓటరు. ఈ ‘సౌకర్యం’ అనే మాట ఏలినవారికి ‘విశాలం’ అనేలా ధ్వనిస్తుంది. ‘కోర్కెలు అనంతాలూ..వనరులు పరిమితాలు’ అనే ఎకనమిక్స్ సిద్ధాంతం ఇటు ఓటరుకూ, అటు పాలించేవారికీ అడ్డుపడుతుంది.గుడారం సైజు పెంచలేం. కాబట్టి దాంట్లోకి ఒంటెను వదలమంటారు ప్రభువులవారు. ఒక్కసారిగా కాదు. మెల్లమెల్లగా. మొదట తల, మెడ, తర్వాత సగం వరకు..అటు పిమ్మట మొత్తం ఒంటె దేహాన్ని. ఆ పైన ఒంటెను కొద్దిగా బయటకు తెచ్చినా..ఆ చర్య ఇచ్చే కాస్తంత వెసులుబాటూ ఎంతో గొప్పగా, మరెంతో ‘విశాలం’గా, ఇంకెంతో ‘సౌకర్యంగా’ అనిపిస్తుంటుంది. ఇదీ ఒంటె సిద్ధాంతం. ఈ సిద్ధాంతం అన్నది ఆల్వేస్ బ్రహ్మాండంగా వర్కవుట్ అవుతుందని కనిపెట్టినవారు రాజకీయవేత్తలే. అందుకే ‘సైంటిస్టు’ల సంక్లిష్ట సూత్రాల కన్నా..మన పొలిటికల్ లీడర్ల ప్రాక్టికల్ సిద్ధాంతాలే మిన్న. ఈ సిద్ధాంతం అమల్లో కేంద్రంలోని పాలకులు ఇంకా గ్రేట్. వారు ఒకటీ, అరా కాకుండా ఏకంగా రెండుమూడు ఒంటెల్ని గుడారంలోకి ఒకేసారి ప్రవేశపెడతారు. వాటితో చాలాసేపు సహజీవనం చేయిస్తారు. ఆ తర్వాత ఒక్క ఒంటెను కాస్తంత బయటకు తెచ్చినా చాలు..అదే పదివేలు అనేలా సర్దుకుపోతాడు ఓటరు. కేంద్రంలోని పాలకులు ఈ ఒంటె సిద్ధాంతాన్ని అనేక విషయాల్లో అమలు చేస్తున్నారూ..చేస్తుంటారు. అన్నీ చెప్పుకోవడం కుదరదు కదా. మచ్చుకు గ్యాస్ సిలిండరును ఉదాహరణగా తీసుకుందాం. దాదాపు రూ.400 దగ్గరున్న సిలెండరు చకచకా రూ.1200 వరకు వెళ్తుంది. కానీ ఎన్నికలప్పుడు కేవలం రూ.200 మాత్రమే తగ్గుతానంటుంది. ఘనత వహించిన బీఆర్ఎస్వారు ఒంటె సిద్ధాంతానికి బ్రహ్మాండమైన ఓ విరుగుడు కనిపెట్టారు. వారి వాగ్దానం ప్రకారం... సిలిండర్ ధరను ఒకేసారి పదేళ్ల కిందటి ధరకు నెడతామంటున్నారు. దాంతో జేబుగలిగిన ప్రతి మారాజుకూ, కిచెన్ గలిగిన ప్రతి మహారాణికీ ఒక్కసారిగా ఎంతో భారం తొలగుతుందీ. మరెంతో భాగ్యం కలుగుతుంది. టైమ్–మెషీన్లో ఒకేసారి పదేళ్ల వెనక్కు వెళ్లడమంటే మాటలా! ప్రజలందరికీ మూకుమ్మడిగా పదేళ్ల కిందినాటి వయసూ, యౌవనమూ, పదేళ్ల కిందటి విగరూ, పొగరూ పునర్–ప్రాప్తించిన ఫీలింగ్ కలగదా? విగరూ, పొగరూ పాలితులకూ!... ‘పవరు’పాలకులకు!! చదరంగంలో ‘గుర్రం’ స్టెప్పు ఒకటుంటుంది. దాన్ని ప్రయోగిస్తే..ఏకకాలంలో అది రెండు ‘ఫోర్సు’లకు ఎసరు పెడుతుంది. ఇక్కడ సిద్ధాంతపు ‘ఒంటె’ సిద్ధాంతాన్ని దెబ్బకొట్టడానికి ‘గుర్రం’ స్టెప్పు వేశారు..వ్యూహాల్లో దిట్ట అయిన కేసీఆర్వారు. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు. ఒక పిట్ట..కేంద్రంలో గ్యాస్ సిలిండరు ధరను మూడు రెట్లు పెంచేసిన పార్టీ! మరో పిట్ట..పొరుగు రాష్ట్రంలోలా ఇక్కడా మహిళా సోదరీమణుల్ని బస్సుల్లో ఉచితంగా తిప్పాలనుకుంటున్న పార్టీ. ఎప్పుడో ఓసారి చేసే ‘ప్రయాణం’ కంటే రోజూ కిచెన్లో చేసే ‘వంట’కే కదా ప్రయారిటీ!! ఇక... మూడో పిట్ట గురించి వేరే చెప్పాలా..ఇతర పిట్టలు తప్పించుకున్నా..ఇప్పటికిప్పుడు వేటకూ, వేటుకూ గురితప్పకుండా గురయ్యే ‘ఓటరు’ పిట్ట!!! -
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం
సాక్షి, అమరావతి: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని గతంలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయనను క్రైస్తవ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్న విషయం మీకు కూడా తెలిసిందేనన్నారు. కాగా చాలాచోట్ల శ్మశాన వాటికల సమస్య ఉందని.. దీన్ని పరిష్కరించాలని క్రైస్తవ ప్రతినిధులు సీఎంకు విన్నవించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ శ్మశాన వాటికలపై ఇప్పటికే ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుందని చెప్పారు. సచివాలయాల వారీగా ఎస్సీలకు శ్మశానవాటికలు లేనిచోట ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవ ప్రతినిధులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలతో నిరుపేదలకు మేలు జరుగుతోందని కొనియాడారు. పారదర్శకంగా, వివక్షలేకుండా పథకాలు అందుతున్నాయన్నారు. డీబీటీ వల్ల చివరి లబ్ధి దారుడికి సైతం పథకాల మేలు లభిస్తోందని ప్రశంసించారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి సహాయకారిగా నిలిచారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్చిల ఆధ్వర్యంలోని స్కూళ్లకూ, సేవా భవనాలకు మున్సిపల్ పన్నును మినహాయించాలని విన్నవించారు. జిల్లా కేంద్రాల్లో కమ్యూనిటీ హాళ్లను నిర్మించాలని సీఎంను కోరారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల కోసం న్యాయపోరాటం చేస్తున్నామని.. దీనికి తోడుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. -
తిరుపతి పద్మావతిలో మరో గుండె మార్పిడి
తిరుపతి తుడా(తిరుపతి జిల్లా)/పెనమలూరు: తిరుపతిలోని శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ వైద్యులు మరోసారి గుండె మార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం రాత్రి 39 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి చేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డి నేతృత్వంలో వైద్యులు అతడి ప్రాణాలను కాపాడారు. 39 ఏళ్ల యువకుడికి 49 ఏళ్ల వ్యక్తి గుండె ఏలూరు జిల్లా, దొండపూడికి చెందిన మత్తి సురేష్బాబు (49) ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని విజయవాడలోని క్యాపిటల్ ఆసుపత్రిలో చేర్చారు. బ్రెయిన్ డెడ్ కావడంతో, కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఈక్రమంలో ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన 39 ఏళ్ల యువకుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇందుకోసం అవయవదాన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ శ్రీనాథ్రెడ్డి సీఎంఓకు సమాచారం అందించారు. అన్ని అనుమతులు రావడంతో యువకుడికి 49 ఏళ్ల వ్యక్తి గుండెను అమర్చారు. డాక్టర్ శ్రీనాథ్రెడ్డితోపాటు డాక్టర్ గణపతిలతో కూడిన ఏడుగురు వైద్యులు, టెక్నీషియన్ల బృందం ఆదివారం దాదాపు 6 గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స విజయవంతం చేశారు. మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం వైఎస్ జగన్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. గుండె తరలింపునకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు. చికిత్సకు అవసరమైన రూ.12 లక్షల నిధులను సీఎం రిలీఫ్ ఫండ్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా వెంటనే మంజూరు చేశారు. గుండె తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎంఓను ఆదేశించారు. విజయవాడ నుంచి తిరుపతి చేరుకున్న అనంతరం విమానాశ్రయం నుంచి గుండె తరలింపునకు అధికారులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేవలం 23 నిమిషాల్లో పద్మావతి కార్డియాక్ ఆసుపత్రికి గుండెను తరలించారు. దారిపొడవునా పోలీసులు ప్రొటోకాల్ పాటించి, కట్టుదిట్టమైన భద్రత ఇచ్చారు. నలుగురికి పునర్జన్మ ఏలూరు జిల్లా దొండపూడికి చెందిన మాతి సురేష్బాబు (49) ఈనెల ఆరో తేదీన భవనం పైనుంచి పడిపోవడంతో బలమైన గాయాలు అయ్యాయి. బ్రెయిన్ డెడ్ అవడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో కృష్ణాజిల్లా, పెనమూరులోని క్యాపిటల్ ఆస్పత్రి, జీవన్దాన్ స్వచ్ఛంద సేవాసంస్థ సహకారంతో కావాల్సిన ఏర్పాట్లు చేశారు. గుండెను శ్రీ పద్మావతి కార్డియాక్ ఆస్పత్రిలోని 39 ఏళ్ల వ్యక్తికి అమర్చారు. కాలేయం, మూత్రపిండం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి, మరో మూత్రపిండం విజయవాడలోని క్యాపిటల్ ఆస్పత్రికి తరలించడంతో సురేష్బాబు నలుగురికి పునర్జన్మ ఇచ్చినట్లయింది. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను, బంధువులను ఏపీ జీవన్దాన్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ కె.రాఘవేంద్రరావు, జీవన్దాన్ సంస్థ ప్రధాన వైద్యుడు డాక్టర్ కె.రాంబాబు ప్రత్యేకంగా అభినందించారు. -
గూగుల్ క్రోమ్ యూజర్లూ తస్మాత్ జాగ్రత్త! కేంద్రం హై రిస్క్ వార్నింగ్
Google Chrome Users High Risk Warning గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూజర్లూ బీ అలర్ట్. గూగుల్ క్రోమ్ వర్షన్ అప్ డేట్ చేసుకోకపోతే మీ కీలక సమాచారం చోరీ అయ్యే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. అప్డేట్ చేసుకోకపోతే సెక్యూరిటీ పరమైన సమస్యలు తప్పవంటూ యూజర్లకు హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. భారతదేశంలో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తాజాగా గుర్తించిన లోపాలను హై-రిస్క్గా వర్గీకరించింది. ముఖ్యంగా WebPలో హీప్ బఫర్ ఓవర్ఫ్లో ఎర్రర్, కస్టమ్ ట్యాబ్లు, ప్రాంప్ట్లు, ఇన్పుట్, ఇంటెంట్లు, పిక్చర్ ఇన్ పిక్చర్, ఇంటర్స్టీషియల్స్ లోపాలను గుర్తించినట్టు తెలిపింది. అలాగే డౌన్లోడ్లు, ఆటోఫిల్లో వాటిల్లో పాలసీ సరిగ్గా అమలు కాలేదని తెలిపింది. గూగుల్ క్రోమ్ ఈ లోపాలను బాధితుడి సిస్టమ్కు అనధికారిక యాక్సెస్ని అందించేలా సైబర్ నేరగాళ్లకు అవకాశం ఉంటుందని CERT-In వెల్లడించింది. ఈ నేపథ్యంలో గూగుల్ క్రోమ్ వినియోగదారులు తమ సిస్టమ్ ప్రొటెక్షన్ కోసం అప్డేట్ చేసుకోవడంఉత్తతమని సూచించింది. Google Chromeఅప్డేట్ చేసుకోవడం ఎలా? Chrome విండోను ఓపెన్ చేసి కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల చిహ్నంపై క్లిక్ చేయాలి. డ్రాప్డౌన్ మెను నుండి, హెల్ప్ ఆప్షన్ ఎంచుకోవాలి. " About Google Chrome"పై క్లిక్ చేయండి. అప్డేట్పై క్లిక్ చేసి, బ్రౌజర్ని రీస్టార్ట్ చేస్తే చాలు. -
6 పాయింట్లలో సునీతా విలియమ్స్ లైఫ్ స్టోరీ!
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ నేడు 57వ వసంతంలోకి అడుగుపెట్టారు. సునీతా విలియమ్స్ 1965,సెప్టెంబర్ 19న ఒహియోలోని యూక్లిడ్ నగరంలో జన్మించారు. భారత సంతతికి చెందిన సునీత 195 రోజులకు పైగా అంతరిక్షంలో ఉండి ప్రపంచ రికార్డు సృష్టించారు. 1 సునీతా విలియమ్స్ కుటుంబం సునీతా విలియమ్స్ తండ్రి డాక్టర్ దీపక్ ఎన్. పాండ్యా ఆయన భారతదేశంలోని గుజరాత్కు చెందినవారు. తల్లి బోనీ జలోకర్ పాండ్యా.. స్లోవేనియాకు చెందినవారు. సునీతకు ఏడాది వయసున్నప్పుడు ఆమె తండ్రి అహ్మదాబాద్ నుండి యూఎస్ఏలోని బోస్టన్కు వలస వచ్చారు. సునీతా విలియమ్స్కు అన్నయ్య జై థామస్ పాండ్యా, అక్క డయానా ఆన్ పాండ్యా ఉన్నారు. సునీత మైఖేల్ జెని వివాహం చేసుకున్నారు. అతను సునీతా విలియమ్స్ క్లాస్మేట్. 2 ప్రాథమిక విద్య సునీతా విలియమ్స్ మసాచుసెట్స్లోని నీధమ్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆమె యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ డిగ్రీని అందుకున్నారు. 3 అంతరిక్ష ప్రయాణ శిక్షణ సునీతా విలియమ్స్ 1987లో యూఎస్ నేవీలో చేరారు. ఆరు నెలల తాత్కాలిక నియామకం తర్వాత ఆమె ప్రాథమిక డైవింగ్ అధికారిగా నియమితులయ్యారు. సునీతా విలియమ్స్ 1998లో అంతరిక్ష యాత్రలో శిక్షణ మొదలుపెట్టారు. 4 195 రోజులు అంతరిక్షంలో గడిపిన రికార్డు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన రెండో మహిళ సునీతా విలియమ్స్. వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 195 రోజుల పాటు ఉండి రికార్డు సృష్టించారు. 5 సునీతా విలియమ్స్ సాధించిన విజయాలు సునీతా విలియమ్స్ 1998, జూన్లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు ఎంపికై అక్కడ శిక్షణ తీసుకున్నారు. సునీత అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ‘నాసా’ (1998) మిషన్ ఎస్టీఎస్ 116, ఎక్స్పెడిషన్ 14, ఎక్స్పెడిషన్ 15, ఎస్టీఎస్ 117, సోయుజ్ టీఎంఏతో సహా 30 వేర్వేరు అంతరిక్ష నౌకల్లో మొత్తం 2770 విమానాలను నడిపారు. 6 పద్మభూషణ్తో సత్కారం సునీతా విలియమ్స్కు 2008లో భారత ప్రభుత్వం సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. ఇదేకాకుండా ఆమె మానవతా సేవా పతకం, నేవీ అండ్ మెరైన్ కార్ప్ అచీవ్మెంట్ మెడల్, నేవీ కమెండేషన్ మెడల్లను అందుకున్నారు. ఇది కూడా చదవండి: జోడియాక్ కిల్లర్ ఎవరు? సీరియల్ హత్యలు చేస్తూ, వార్తాపత్రికలకు ఏమని రాసేవాడు? -
ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మరణించారని ఆ జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అయితే వారు గుండె జబ్బులు, ఊపి రితిత్తుల సమస్యలు, జాండిస్, సికిల్ సెల్ అనీమి యా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్నట్టు వివరించారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఉన్నతాధికారు లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రజా రోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్లు, టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా వైద్యాధికారులు డెంగీ మరణాలపై మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకొచ్చారు. వారం రోజుల్లోనే 10 మంది మరణించారంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి జిల్లాలో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు. జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు... రాష్ట్రంలో అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. పిల్లల జ్వరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్న అంశాలను మంత్రి వివరించారు. డెంగీ కేసులు పెరుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఫీవర్ కేసులు ఆందోళనకర స్థాయిలో లేవని హరీశ్రావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదన్నారు. జ్వర బాధి తుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్లో నమో దు చేయాలని, ఆ డేటా ఆధారంగా డీఎంహెచ్ వోలు హైరిస్క్ ఏరియాలను గుర్తించి జాగ్రత్త చర్య లు చేపట్టాలన్నారు. జిల్లాల్లో 24 గంటల కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారం అందించాలని చెప్పారు. మీడియా సమావేశాలు నిర్వహించి సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మలేరియా విభాగం అడిషనల్ డైరెక్టర్ను కొత్తగూడెం పంపి, అక్కడి పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. -
సర్టీఫికెట్ల తనిఖీకి ప్రత్యేక సెంటర్!
సాక్షి, హైదరాబాద్: గురుకుల కొలువుల నియామకాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్ఈఐఆర్బీ) ఏర్పా ట్లు చకచకా చేస్తోంది. ఇప్పటికే అర్హత పరీక్షలన్నీ నిర్వహించిన బోర్డు... మెజార్టీ సబ్జెక్టు లకు సంబంధించి తుది కీలను సైతం విడుదల చేసింది. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ కేట గిరీలకు సంబంధించి కోర్టు పరిధిలో కేసులుండటంతో ఆయా పరీక్షల తుది కీలను ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఫైనల్ కీలు ఖరారు చేసిన సబ్జెక్టులకు సంబంధించి మెరిట్ జాబితాలను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తోంది. 9,210 పోస్టుల భర్తీకి.. గురుకుల విద్యా సంస్థల్లో ప్రధానంగా 9 విభాగాల్లో 9,210 పోస్టుల భర్తీకి టీఆర్ఈఐ ఆర్బీ 9 రకాల ప్రకటనలు జారీ చేసింది. ఇందులో 61 సబ్జెక్టుల్లో ఈ పోస్టులున్నాయి. ఈ క్రమంలో ఒక్కో పోస్టుకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేస్తూ మెరిట్ జాబితాలు విడుదల చేస్తారు. 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టీఫికెట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెరిఫికేషన్ సెంటర్కు హాజరై పరిశీలన ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. తొలుత జిల్లాల వారీగా పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడం... మరోవైపు రెండు వారాల పాటు పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తుండడంతో హైదరాబాద్లో ఒక కేంద్రం ఏర్పాటు చేస్తే సరిపోతుందని బోర్డు అధికారులు అంచనాకు వచ్చారు. ఈమేరకు పరిశీలన కేంద్రం ఏర్పాటు, నిర్వహణపైన కసరత్తు చేస్తున్నారు. ఆన్లైన్లో తేదీల ఎంపిక... వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థి ముందుగా టీఆర్ఈఐఆర్బీ వెబ్సైట్లో ఆన్లైన్ పద్ధతిలో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశించిన తేదీల్లో అభ్యర్తికి అనుకూలంగా ఉన్న ఒక రోజును ఎంపిక చేసుకుని ఆమేరకు పరిశీలనకు హాజరుకావాలి. ఈనెల మూడో వారం నాటికి మెరిట్ జాబితాలు రెడీ చేసేలా బోర్డు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మెరిట్ జాబితాలు ఖరారైన తదుపరి వారంలోనే పరిశీలన ప్రక్రియ ప్రారంభించనుంది. -
కేంద్రం మరో సంచలనం: భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
దేశ ప్రజలకు రక్షాబంధన్ గిప్ట్ అందించిన కేంద సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోనుందా అంటే.. అవుననే అంటున్నాయి తాజా రిపోర్టులు. 2024 ఎన్నికలకు ముందు కేంద్రం మోటార్ ఇంధన ధరలపై దృష్టి పెట్టే అవకాముందని సిటీ గ్రూప్ నివేదించింది. ఎల్పీజీ సిలిండర్ల రేటును తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ద్రవ్యోల్బణం దాదాపు 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గనుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో మరో కీలకమైన పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తగ్గించే దేశ ప్రజలకు ఊరట కల్పించనుందని అంచనా వేస్తున్నారు. వంట గ్యాస్ ధరల్ని తగ్గిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం ద్రవ్యోల్బణాని చెక్ పెట్టడమేకాకుండా, కొన్ని ప్రధాన పండుగలు, కీలక ఎన్నికలకు ముందు గ్యాసోలిన్, డీజిల్ ధరల తగ్గింపు వైపు దృష్టి సారించనుందని సిటీ గ్రూప్ తన కథనంలో పేర్కొంది. ఎల్పీజీ తగ్గింపుతో ద్రవ్యోల్బణం దిగి వస్తుందని ఆర్థికవేత్తలు సమీరన్ చక్రవర్తి, ఎం. జైదీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు టొమాటో ధరల తగ్గుదల, తాజా చర్యతో సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం 6శాతం దిగువకు చేరే అవకాశం ఉందన్నారు. జులైలో 15 నెలల గరిష్ట స్థాయికి చేరిన రిటైల్ ధరలను చల్లబరచడానికి అధికారులు చురుకైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎల్పీజీ సిలిండర్ల ధరలను 14.2 కిలోగ్రాముల గ్యాస్ను 200 రూపాయలు తగ్గింపుతో దాదాపు 300 మిలియన్ల వినియోగ దారులకు కొంత ఉపశమనం కలిగించింది. ఆహార ధరలను తగ్గించడానికి గృహ బడ్జెట్లను అదుపులో ఉంచడానికి భారతదేశం ఇప్పటికే బియ్యం, గోధుమలు , ఉల్లిపాయలు వంటి ప్రధాన వస్తువుల ఎగుమతులను కఠినతరం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడితోపాటు, కే- ఆకారపు రికవరీ నేపథ్యంలో, గ్యాస్ ధర తగ్గింపు వినియోగదారుల సెంటిమెంట్కు సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సెప్టెంబర్లో డిమాండ్-సరఫరా కొరత కారణంగా ఉల్లి ధర పెరుగుతుందన్న అంచనాలను గమనించాలన్నారు.అలాగే గ్లోబల్ క్రూడ్ ధరలలో అస్థిరత ఉన్నప్పటికీ, గత ఏడాదినుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరగలేదనీ, ఈ నేపథ్యంలో ఎక్సైజ్ డ్యూటీ కోతద్వారా ఇంధన ధరలను తగ్గించవచ్చని, ఎన్నికల ముందు ఈ అంశాన్ని తోసి పుచ్చలేమని వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ, మిజోరం రాజస్థాన్, మధ్యప్రదేశ్ ,ఛత్తీస్గఢ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఈ ఏడాది చివరల్లో జరగ నున్నాయి. ఆ తర్వాత 2024 ప్రారంభంలో జాతీయ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కేంద్రంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించు కోవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
పవర్గ్రిడ్ చెస్ టోర్నీ విజేత కార్పొరేట్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇంటర్ రీజినల్ చెస్ టోర్నమెంట్లో మహిళల టీమ్ విభాగంలో కమలేశ్ భూరాణి, హిమాన్షిలతో కూడిన కార్పొరేట్ సెంటర్ (సీసీ) జట్టు విజేతగా నిలిచింది. కార్పొరేట్ సెంటర్ జట్టు ఆడిన మూడు మ్యాచ్ల్లో గెలిచి అజేయంగా నిలిచింది. పవర్గ్రిడ్ సదరన్ రీజియన్–1 ఆధ్వర్యంలో మూడు రోజులపాటు హైదరాబాద్లో జరిగిన ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. మహిళల టీమ్ విభాగంలో ఈస్టర్న్ రీజియన్–1కు రెండో స్థానం, నార్తర్న్ రీజియన్–2కు మూడో స్థానం లభించాయి. పురుషుల టీమ్ విభాగంలో బిశ్వజ్యోతి దాస్, అరుణ్ తివారీ, హృషికేశ్ సింగ్, బిజిత్ శర్మలతో కూడిన నార్త్ ఈస్టర్న్ రీజియన్ చాంపియన్గా నిలిచింది. నార్తర్న్ రీజియన్–1కు రెండో స్థానం, కార్పొరేట్ సెంటర్కు మూడో స్థానం దక్కాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలో అంజన్ సేన్ (కార్పొరేట్ సెంటర్), బిశ్వజ్యోతి దాస్, గౌరవ్ కుమార్ (నార్తర్న్ రీజియన్–1) వరుసగా తొలి మూడు స్థానాల్లో... మహిళల వ్యక్తిగత విభాగంలో మీనాక్షి మలిక్ (నార్నర్త్ రీజియన్–1), హిమాన్షి, కమలేశ్ భూరాణి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పవర్గ్రిడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.శ్రీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ, అలోక్ కుమార్ శర్మ (సీజీఎం–అసెట్ మేనేజ్మెంట్), సంజయ్ కుమార్ గుప్తా (సీజీఎం–ప్రాజెక్ట్స్), హరినారాయణన్ (సీజీఎం–హ్యూమన్ రిసోర్సెస్) తదితరులు పాల్గొన్నారు. -
శ్రీసిటీలో ‘కెర్రీ ఇండెవ్’ లాజిస్టిక్స్ కేంద్రం ప్రారంభం
సత్యవేడు (తిరుపతి జిల్లా): భారత్లోని ప్రముఖ ఇంటిగ్రేటివ్–3పీఎల్ (థర్డ్ పార్టీ లాజిస్టిక్స్) సేవల సంస్థ కెర్రీ ఇండెవ్ లాజిస్టిక్స్ నెట్వర్క్, శ్రీసిటీలో 3 లక్షల చ.అ విస్తీర్ణంలో నిర్మించిన నూతన అత్యాధునిక లాజిస్టిక్స్ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించింది. మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇండియా ఆపరేషన్స్ కోసం ఇది పనిచేయనుంది. పరిశ్రమ ఆవరణలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో మిత్సుబిషి ఎలక్ట్రిక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)ఒబాటా మసకాజు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కెర్రీ ఇండెవ్ చైర్మన్ డాక్టర్ గ్జావియర్ బ్రిట్టో మాట్లాడుతూ..వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ వ్యాపార సంస్థలకు శ్రీసిటీ అత్యంత అనువైన వ్యూహాత్మక స్థానమని చెప్పారు. తమ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన శ్రీసిటీ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఒబాటా మసకాజు మాట్లాడుతూ నూతన ప్లాంట్ ఏర్పాటులో కెర్రీ ఇండెవ్ లాజిస్టిక్స్, ఇండోస్పేస్ బృందాల అత్యుత్తమ కృషిని అభినందించారు. శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ..ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో లాజిస్టిక్, వేర్హౌసింగ్ సేవల ప్రాముఖ్యతను వివరించారు. మిత్సుబిషి ఎలక్ట్రిక్ ప్లానింగ్ హెడ్ గణపతి శంకర్ తదితరులు పాల్గొన్నారు -
ఏపీలోని యూపీహెచ్సీల్లో ప్రజారోగ్య సౌకర్యాలకు కేంద్రం ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీహెచ్సీల్లో) రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రజారోగ్య సౌకర్యాల పట్ల కేంద్రం ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. పట్టణ ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రజారోగ్య సౌకర్యాల్లో నాణ్యతా ప్రమాణాల్ని స్వయంగా పరిశీలించిన కేంద్ర బృందం గుంటూరులోని ఇందిరానగర్ పట్టణ ఆరోగ్య కేంద్రానికి(యూపీహెచ్సీ)ఎన్ క్యూఎఎస్ ప్రోగ్రాం కింద 96.2 శాతం స్కోర్ ఇస్తూ నాణ్యతా ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది. అన్ని రకాలుగా ఆయా వైద్య విభాగాలు సంతృప్తికరమైన వైద్య సేవలందిస్తూ నాణ్యతా ప్రమాణాల్ని పాటించినందుకుగాను అభినందించింది. గుంటూరు పట్టణంలోని ఇందిరానగర్ అర్బన్ పీహెచ్సీల్లో కల్పించిన నాణ్యమైన వైద్య సేవలకుగాను కేంద్రం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం అత్యుత్తమ స్కోర్ను సాధించి రాష్ట్రంలోనే మొట్టమొదటి యూపీహెచ్సీగా గుర్తింపు పొందింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి విశాల్ చౌహాన్ ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎం.టి క్రిష్ణబాబును అభినందిస్తూ లేఖ రాశారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో దాదాపు 100 పట్టణ ఆరోగ్య కేంద్రాలు కేంద్రం గుర్తింపును సాధించేందుకు కార్యాచరణను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన అధికారుల బృందాలు మే నెల 19,20 తేదీలలో గుంటూరు పట్టణంలోని ఇందిరానగర్ యూపీహెచ్సిని సందర్శించి అక్కడి అన్ని విభాగాల పనితీరును పరిశీలించాయి. చదవండి: మీ మనసు నొప్పించేలా ఈ ప్రభుత్వం వ్యవహరించదు: సీఎం జగన్ ఇందిరా నగర్ యూపీహెచ్సీలో మొత్తం 12 వైద్య విభాగాల్లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించినందుకు గాను 96.2 శాతం స్కోరును సాధించాయని విశాల్ చౌహాన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. యూపిహెచ్ సీల్లో వైద్య సేవల్ని మరింత మెరుగుపర్చుకునేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించుకుని రాష్ట్ర నాణ్యతా ప్రమాణాల నియంత్రణా విభాగానికి అందజేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళిక అమలు తీరును పరిశీలించాక నివేదికలను ఎన్హెచ్ఎస్ఆర్సీ ధ్రువీకరణ విభాగానికి అందచేయాల్సి ఉంటుందని లేఖలో వివరించారు. -
ఈటల, అర్వింద్కు భద్రత పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: తెలంగాణలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్రం భద్రతను పెంచింది. హుజురాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్లకు ఇకపై కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి. ఈటల రాజేందర్కు కేంద్రం వై ప్లస్, అర్వింద్కు వై కేటగిరి సెక్యూరిటీ కేటాయించింది. ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో కూడా భద్రత కల్పించింది. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్తో పాటు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు సెక్యూరిటీ కల్పించనున్నారు. ఇక అర్వింద్కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణ కల్పించనున్నాయి. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసానికి సీఆర్పీఎఫ్ అధికారులు చేరుకున్నారు. కేంద్రం భద్రత పెంపుపై అర్వింద్ స్పందిస్తూ.. వై కేటగిరీ సెక్యురిటీ కేటాయింపుపై సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. తనకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. తనపైపై పదే పదే దాడులు జరిగిన తర్వాత రిటైర్డ్ ఎన్ఎస్జీతో ప్రైవేట్ సెక్యురిటీ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. భద్రత లోపలపై అధికారులు తన వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కాగా ఇప్పటికే ఈటల రాజేందర్కు తెలంగాణ సర్కార్ వై ప్లస్ భద్రత కల్పించిన విషయం తెలిసిందే ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయన హత్యకు ప్లాన్ జరుగుతోందంటూ వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఎమ్మెల్యేకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సహా 16 మంది సెక్యూరిటీని కేటాయించింది. చదవండి: ఆ ఫలితం నమ్మితే మోదీ భ్రమపడ్డట్టే! కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసే ‘బండి’ తొలగింపు ఎందుకు? -
ఢిల్లీని నడుపుతోంది కేంద్రమే..ఇతర రాష్ట్రాల్లో కూడా..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ రాజధానిలో సేవల నియంత్రణపై ఆర్డినెన్స్ విషయమై కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీపై కేంద్ర తొలి దాడి జరిగింది, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు ఇలాంటి ఆర్డినెన్స్లే వస్తాయని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన రాంలీలా మైదానంలో జరిగిన ఆమ్ఆద్మీ పార్టీ మహా ర్యాలీలో పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై ఈ విధంగా వ్యాఖ్యానించారు. కేంద్రం ఆర్డినెన్స్తో నగర ప్రజలను అమానిస్తోందన్నారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం ఉందని ఆ ఆర్డినెన్స్ చెబుతోందంటూ ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. సాక్షాత్తు లెఫ్టినెంట్ గవర్నరే ప్రజలు ఎవరికీ కావాలంటే వారికి ఓటు వేయవచ్చు, కానీ ఢిల్లీని కేంద్రమే నడుపుతుందని చెబుతున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ..దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నా..ఢిల్లీ ప్రజలు ఒంటరిగా లేరని వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పారు. భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు తమ వెంట ఉన్నారని ఆయన ధీమాగా చెప్పారు. ఈ సందర్భంగా ఆప్ నేత మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ల అరెస్టుల గురించి మాట్లాడుతూ..దేశ రాజధానిలో పనులు నిలిపివేయడానికే వారిని అరెస్టు చేశారన్నారు. అయినప్పటికీ తమ వద్ద వందమంది సిసోడియాలు, జైనులు ఉన్నారని, వారు తమ పనిని కొనసాగిస్తారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కూడా హాజరయ్యారు. (చదవండి: అందుకే అతడిని పార్టీకి అధ్యక్షుడిగా ఎంపిక చేయలేదు) -
ఆ విషయమై రాహుల్ గాంధీని కలవనున్న అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ బ్యూరోక్రాట్ల నియంత్రణ అంశమై కేంద్రంపై జరుగుతున్న పోరు విషయమై మద్దతును అభ్యర్థించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను కలిసిందుకు అవకాశం ఇవ్వాలని ఢ్లిల్ల సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థించారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఈ అంశంపై కేంద్ర ప్రవేశ పెట్టిన బిల్లు వీడిపోయేలా తగినంత మద్దతు పొందడం కోసం వివిధ నాయకులతో ఇప్పటికే సమావేశమయ్యారు. ఇటీవల సుప్రీం కోర్టు బ్యూరోక్రాట్ బదిలీల నియామకాలపై కేంద్రం కాదు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వమే నియంత్రణ కలిగి ఉంటుందని ఆదేశాలిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఐతే ఈ తీర్పును పూర్వపక్షం చేసేలా ఆర్డినెన్స్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ శీతకాల సమావేశంలో ఆమెదించిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకురావాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీని, మల్లిఖార్జున్ ఖర్గేని కలిసి, సమావేశమయ్యేందుకు సమయం కావాలని కోరినట్లు ట్వీట్ చేశారు. ఆ సమావేశంలో.. బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన అప్రజాస్వామిక రాజ్యంగ విరుద్ధమైన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా పార్లమెంటులో కాంగ్రెస్ మద్దతు కోరడానికి, అలాగే సమాఖ్య నిర్మాణంపై సాధారణ దాడి, ప్రస్తుతం రాజకీయ పరిస్థితులె తదితరాలపై చర్చించనున్నట్లు తెలిపారు అరవింద్ కేజ్రీవాల్. కాగా, ఈ అంశంపై ఆప్కి మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై తమ ప్రాంతీయ నేతలతో సంప్రదింపులు జరుపుతామని కాంగ్రెస్ తెలిపింది. Sought time this morning to meet Cong President Sh Kharge ji and Sh Rahul Gandhi ji to seek Cong support in Parl against undemocratic n unconstitutional ordinance passed by BJP govt and also to discuss general assault on federal structure and prevailing political situation — Arvind Kejriwal (@ArvindKejriwal) May 26, 2023 (చదవండి: తీవ్ర అనారోగ్యం.. ఆప్ సత్యేందర్ జైన్కు మధ్యంతర బెయిల్) -
ONDC తక్కువ రేట్లతో దూకుడు: స్విగ్గీ, జొమాటోకు దబిడి దిబిడే!
సాక్షి,ముంబై: ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోకు పోటీగా ప్రభుత్వ సంస్థ దూసుకుపోతోంది. తక్కువ ధరలతో ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్డీసీ జొమాటో, స్విగ్గీలకు సవాల్ విసురుతోంది. చిన్న స్థాయి సంస్థలకు టెక్నాలజీ పరంగా ఆశించిన స్థాయిలో సేవలు అందకపోవడంతో కేంద్రం ఓపెన్ సోర్స్డ్ మెథడాలజీతో ఈ నూతన ఒపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూర్ ఢిల్లీ సహా 240 నగరాల్లో తన సేవల్లో దూసుకుపోతోంది. ఆహారంతోపాటు నిత్యావసర సరుకుల రోజువారీ డెలివరీల సంఖ్య 10 వేల దాటేసింది. డిజిటల్ కామర్స్ ఇన్ ఇండియాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే లక్క్ష్యంతో ఈ ప్రాజెక్ట్ను గత ఏడాది ఏప్రిల్లో కేంద్రం ప్రారంభించింది. ఓఎన్డీసీ ప్రత్యేకత ఏంటి? వాణిజ్య మంత్రిత్వ శాఖకు కెందిన పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం (DPIIT) ప్రవేశపెట్టిన ఓపెన్ ఇ-కామర్స్ ప్రోటోకాల్. థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా నెట్వర్క్లోని క్రయ విక్రయ దారులు చేసుకోవచ్చు. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకారం, ఓఎన్డీసీ చిన్న రిటైల్ సంస్థలు పెద్ద టెక్-ఆధారిత ఇ-కామర్స్ కంపెనీల దాడిని తట్టుకుని నిలబడేలా సహాయం చేస్తుంది. అలాగే పేమెంట్ సిస్టంలో సంచలనాలకు యూపీఐ ఎలా ఉపయోగపడిందో ఇ-కామర్స్ రంగంలో ఇది పెను మార్పులకు దారితీయనుంది. కొనుగోలుదారులు వివిధ బ్రాండ్లు, లోకల్ వ్యాపారవేత్తలనుంచి విస్తృత ఉత్పత్తులను సెర్చ్ చేయవచ్చు. కొనుగోలు చేయవచ్చు. ఆహారం, పానీయాలు, బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ, హోం డెకరేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫ్యాషన్తో సహా పలు ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. పేటీఎం మీషో, స్పైస్ మనీ, క్రాఫ్ట్స్విల్లా మేజిక్ పిన్, పిన్కోడ్, లాంటి ఇతర ఆన్లైన్ స్టోర్లనుండి కూడా కస్టమర్లు ONDC ద్వారా ఆర్డర్ చేయవచ్చు. ప్లాట్ఫారమ్కు ప్రస్తుతం అంతర్గత డెలివరీ భాగస్వాములు లేరు. eKart, Dunzo, Delhivery మొదలైన థర్డ్ పార్టీల ద్వారా డెలివరీ చేస్తుంది. సోషల్మీడియాలో కస్టమర్ల పోస్ట్లు చక్కర్లు స్విగ్గీ, జొమాటోతో పోలిస్తే ఓఎన్డీసీ 3 శాతం కమీషన్ను వసూలు చేస్తుంది. స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ యాప్లు 25 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు ఓఎన్డీసీని ఎంచుకుంటున్నారు. దీంతో గత వారం రోజులుగా ఓఎన్డీసీ ఫుడ్ ఆర్డర్ల ధరలను పోల్చుతూ అనేక పోస్ట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పోస్ట్లలో చాలా వరకు, ఫుడ్ డెలివరీ యాప్లతో పోలిస్తే, తక్కువకే, కొన్ని సందర్భాల్లో సగం రేటుకే లభిస్తోందంటూ యూజర్లు సంబర పడుతున్నారు. సేమ్ ఆర్డర్, సేమ్ ప్లేస్, సేమ్ టైం అంటూ ధరలను కంపేర్ చేస్తుండటం గమనార్హం. ఇది లాభాపేక్ష లేని ప్లాట్ఫారమ్ అని మధ్యవర్తి లేకపోవడం దీనికి పెద్ద ఎసెట్ అని ఇన్ఫోసిస్ కోఫౌండర్, ఓఎన్డీసీ సలహా మండలి సభ్యుడు నందన్ నీలేకని గతం లోనే ప్రకటించారు. నేరుగా విక్రేతకు చెల్లించడం గొప్పవిషయం, యాప్ కమీషన్ లేకపోవడంతో తక్కువ చార్జీలతో కస్టమర్ల ఆదరణ లభస్తుందన్నారు. There are over 29,000+ Merchants from 236 Cities in India on ONDC Seller Network Currently You can search for the Listed Merchants & City here - https://t.co/xelXMQJYTx pic.twitter.com/dZ6JJt4LNq — Ravisutanjani (@Ravisutanjani) May 8, 2023 Now you know the ONDC impact! Same order, same place and same time. The difference are clearly visible. pic.twitter.com/JG7xpjN8NB — Ankit Prakash (@ankitpr89) May 4, 2023 A very interesting find. Same pizza store but one is 20% cheaper. ONDC 👇 Zomato 👇 pic.twitter.com/pWWPjvHJFt — Udit Goenka (@iuditg) May 3, 2023 -
రాజద్రోహం చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటులో బిల్లు..!
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజద్రోహం చట్టంపై పునర్ సమీక్ష చేస్తామని కేంద్రం చెప్పింది. వచ్చే వర్షాకాల సమావేశాల్లో రాజ ద్రోహం చట్టం సవరణ బిల్లును పార్లమెంటు ముందుకు తెస్తామని సూచన ప్రాయంగా తెలిపింది. దీంతో రాజద్రోహం కింద నమోదైన కేసులను ఆగస్టు రెండో వారంలో విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కాగా.. బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ చట్టం చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ సహా మొత్తం 16 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపాలని గతేడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజద్రోహం చట్టం, దీని కింద నమోదైన కేసులపై స్టే విధిందించి. అయితే ఈ చట్టాన్ని పునర్ పరిశీలించేందుకు మరింత గడువు కావాలని కేంద్రం గతేడాది అక్టోబర్ 31న కోరింది. ఇప్పుడు మళ్లీ మరింత సమయం కావాలని అడిగింది. దీంతో తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. చదవండి: ఆర్నెళ్లు ఆగక్కర్లేదు.. విడాకులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు -
‘రింగు’ భూమి కేంద్రం ఖాతాలోకి ..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి ఎన్హెచ్ఏఐ అలైన్మెంట్ ఖరారు చేసి గుర్తించిన భూములు ఇక కేంద్ర ప్రభుత్వ పరమైనట్టే. వాటిపై ఇంతకాలం వాటి యజమానులకు ఉన్న హక్కులు రద్దయ్యాయి. ఈ మేరకు కేంద్రప్రభుత్వ భూసేకరణ చట్టంలోని సెక్షన్ 3డీ ప్రకారం గుర్తిస్తూ కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల సంస్థ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉత్తర భాగం పరిధిలో.. భూసేకరణకు ఎనిమిది అథారిటీ(కాంపిటెంట్ అథారిటీ ఫర్ లాండ్ అక్విజిషన్–కాలా)లు ఉండగా, ఈనెల 18వ తేదీతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్, సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్–జోగిపేట కాలాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం.. ముక్కున వేలేసుకున్న కార్యకర్తలు రీజినల్ రింగ్రోడ్డు ఉత్తరభాగంలో 1,58.62 కి.మీ. నిడివికి గాను దాదాపు 2 వేల హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందుకు రూ.5,170 కోట్ల వరకు ఖర్చవుతుందని జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఐఏ) ఈ ప్రాజెక్టు బడ్జెట్లో అంచనా వేసింది. అందులో సగ భాగాన్ని రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంది. రూ.2,585 కోట్లు భూసేకరణకు, రూ.363.43 కోట్లు స్తంభాలు వంటి వాటిని తరలించేందుకు అయ్యే వ్యయంగా జమ చేయాలంటూ ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోశ్కుమార్ యాదవ్ గతేడాది రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశారు. సాధారణంగా 3డీ గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాక అవార్డ్ పాస్ చేసే సమయంలో ఈ మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుందని, అడ్వాన్సుగా చెల్లించటమెందుకంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించింది. అయినా, ఎన్హెచ్ఏఐ లేఖలు రాస్తూనే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటంతో 3డీ గెజిట్ విడుదలలో జాప్యం జరిగింది. గతేడాది ఏప్రిల్లో మూడు, ఆగస్టులో ఐదు కాలాలకు 3ఏ గెజిట్ విడుదల చేసిన ఎన్హెచ్ఏఐ, నెలలు గడుస్తున్నా భూసేకరణ ప్రక్రియలో కీలకమైన 3డీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీంతో కేంద్ర–రాష్ట్రప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం వరకు వెళ్లి ఒకదశలో ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. తెలంగాణ: మహిళలకు లక్కీ చాన్స్! గురుకుల కొలువుల్లో వారికే అధికం ఈ తరుణంలో ఇటీవల కేంద్ర–రాష్ట్రప్రభుత్వాల మధ్య దీని విషయంలో ఎట్టకేలకు రాజీ కుదిరింది. ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులతో రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులు చర్చించి ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టు కోసం రూ.500 కోట్లు కేటాయించామని, దాన్ని దశలవారీగా విడుదల చేస్తామని, ముందుగా రూ.100 కోట్లు డిపాజిట్ చేస్తామన్న రాష్ట్రప్రభుత్వ అధికారుల ప్రతిపాదనను ఎన్హెచ్ఐ అధికారులు సానుకూలంగా స్వీకరించారు. దీంతో ఎన్హెచ్ఐఏ 3 డీ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. పట్టాదారు పేర్లతో.. రీజినల్ రింగురోడ్డు నిర్మించే అలైన్మెంట్ పరిధిలోకి వచ్చే భూములను గుర్తించి గతంలోనే సర్వే చేసిన అధికారులు.. తాజా గెజిట్ నోటిఫికేషన్లో ఊరు, సర్వే నంబరు, భూమి విస్తీర్ణం, పట్టాదారు పేరు.. ఇలా పూర్తి వివరాలను గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించారు. వచ్చే నెల 9వ తేదీ వరకు అభ్యంతరాలను అందించవచ్చని నోటిఫికేషన్లో వెల్లడించారు. ఇంతకు ముందు ప్రాథమిక నోటిఫికేషన్ల సమయంలో అభ్యంతరాలను స్వీకరించి, పరిశీలించి చివరకు వాటిని అనుమతించలేదంటూ తాజా నోటిఫికేషన్లో వెల్లడించటం గమనార్హం. నిర్ధారిత భూమి పూర్తిగా కేంద్రప్రభుత్వ అధీనంలోకి వచ్చిందంటూ కొత్త నోటిఫికేషన్లో పేర్కొన్నందున, ఇప్పుడు కొత్తగా వచ్చే అభ్యంతరాల ప్రభావం ఎంతుంటుందనేది ప్రశ్నార్థకమే. ఇక అవార్డు పాస్ చేయటమే.. చట్టంలోని 3డీ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనందున ఇక అవార్డు పాస్ చేయటమే తరువాయి. ఇప్పటికే ఊళ్ల వారీగా సర్వేనెంబర్లతో పట్టాదారుల పేర్లను, భూ విస్తీర్ణాన్ని గుర్తించి సర్వే చేసిన అధికారులు.. వాటిని మరోసారి వెరిఫై చేసి నోటీసులు జారీ చేయనున్నారు. పట్టాదారు బ్యాంకు ఖాతాల్లో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. అభ్యంతరాలతో.. దాన్ని తీసుకునేందుకు నిరాకరించే వారి పేరుతో సంబంధిత కోర్టులో ఆ మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. కాలాల వారీగా ఊళ్లు..సేకరించే భూ విస్తీర్ణం ఇలా.. యాదాద్రి–భువనగిరి రోడ్డులో 98వ కి.మీ. నుంచి 118 కి.మీ. వరకు దీని పరిధి ఇందులో సేకరించే మొత్తం భూమి విస్తీర్ణం 184.961 హెక్టార్లు ఊళ్లు: వీరారెడ్డిపల్లె, ఇబ్రహీంపూర్, కోనాపురం, దత్తాయపల్లె, వేల్పులపల్లె, మల్లాపూర్, దాతర్పల్లె ఆందోల్–జోగిపేట రోడ్డు నిడివిలో 9.56 కి.మీ. నుంచి 18.18 కి.మీ. పరిధి మొత్తం భూ విస్తీర్ణం 94.38 హెక్టార్లు ఊళ్లు: శివంపేట, వెండికోల్, అంగడి కిష్టాపూర్, లింగంపల్లె, కోర్పోల్ చౌటుప్పల్ రోడ్డు నిడివిలో 133.17 కి.మీ. నుంచి 158.64 కి.మీ. వరకు మొత్తం సేకరించే భూ విస్తీర్ణం 225.02 హెక్టార్లు గ్రామాలు: పహిల్వాన్పూర్, రెడ్లరేపాక, పొద్దటూరు, వెర్కట్పల్లె, గోకారం, నేలపట్ల, చిన్నకొండూరు, చౌటుప్పల్, తలసింగారం, లింగోజిగూడ. (చదవండి: రైతన్న ఆశలు ఆవిరి) -
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై మరోసారి రోడ్డెక్కిన ఉద్యోగులు
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదు
-
ఐఏఎస్,ఐపీఎస్ బదిలీపై అత్యవసరంగా విచారించాలన్న కేంద్రం
-
2013లో లీటర్ పెట్రోల్ రూ.76.. ఇప్పుడేమో 110.. క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటోందని ఫైర్ అయ్యారు. ఈ దోపిడీకి అంతర్జాతీయ ముడిచమురు ధరలను బూచిగా చూపించి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందన్నారు. ఈమేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. '2013లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం 76 రూపాయలు. కానీ నేడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయినా.. అంటే 66 డాలర్లకు తగ్గినా, ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ కు 110 రూపాయలు ఉండడమే ఇందుకు నిదర్శనం. అందుకే దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోడీ నిర్ణయించిన చమురు ధరలేనని మనం గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. కేవలం ముడి చమురును ఒక బూచిగా చూపించి తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకు మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురులు ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా దేశంలో పెట్రోల్ ధరను అమాంతం పెంచుకుంటూ పోతున్నది. పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల దేశంలోని పేద, సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 45% పైగా పెట్రో ధరల పెంపు వల్ల సరుకు రవాణా భారమై, సామాన్యుడు కొనుగోలు చేసే ప్రతి సరుకు ధర భారీగా పెరిగింది. నిత్యావసర వస్తువులు, కూరగాయల నుంచి మొదలుకొని పప్పు ఉప్పు వరకు అన్ని రకాల ప్రాథమిక అవసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. భారీగా పెరిగిన డీజిల్ ధరల వలన ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచున చేరుతోంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల గత నలభై ఐదు సంవత్సరాలలో ఎప్పుడు లేనంత ద్రవ్యోల్భనం దేశాన్ని పట్టిపీడిస్తోంది. ఇన్నాళ్లు అంతర్జాతీయ ముడి చమురు ధరల ప్రస్తావన లేదా ఉక్రెయిన్- రష్యా యుద్ధం పేరు చెప్పి దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని మోడీ ప్రభుత్వం చేసింది. కానీ ఒకవైపు రష్యా నుంచి అత్యంత తక్కువ ధరకు చమురు దేశానికి భారీగా దిగుమతి చేసుకుంటున్నామని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు తక్కువ ధరకు ముడిచమురు అందుబాటులో ఉన్నా, ప్రజల జేబుల నుంచి పెట్రోల్ ధరల పేరుతో చేస్తున్న దోపిడీకి మాత్రం సమాధానం చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 35 వేల కోట్ల రూపాయల ముడిచమురు పొదుపు ప్రయోజనమంతా కేవలం ఒకటి రెండు ఆయిల్ కంపెనీలకే దక్కిందన్నది వాస్తవం. ఈ ధరల పెరుగుదల అంశం పార్లమెంటులో చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. అయితే దేశ ప్రజలు మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ పెట్రో దోపిడీని గమనిస్తున్నారు. పెరిగిన పెట్రోల ధరల తాలూకు దుష్పరిణామాలను అనుభవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే ఒక దోపిడీదారుగా మారి ప్రజల జేబులో నుంచి దోచుకుంటున్న పెట్రో భారం తగ్గాలంటే, భారతీయ జనతా పార్టీని వదిలించుకోవడమే ఏకైక మార్గం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ దోపిడీని ఆపాలి, లేకుంటే ప్రజల చేతిలో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు.' అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. చదవండి: రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్.. -
భోపాల్ గ్యాస్ దుర్ఘటన.. సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: దాదాపు 40 ఏళ్లనాటి భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటన కేసులోని బాధితులకు పరిహారం విషయంలో సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. 1984 భోపాల్ గ్యాస్ లీక్ ప్రమాదానికి కారణమైన యూనియన్ కార్బైడ్ నుంచి అదనపు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. గ్యాస్ లీక్ బాధితులకు అదనపు పరిహారంగా రూ. 7,844 కోట్లు ఇప్పటించాలని అమెరికాకు చెందిన యూనియన్ కార్భైడ్ కార్పొరేషన్ కంపెనీలను ఆదేశించాలని కోరుతూ కేంద్రం 2010లో క్యూరేటివ్ పిటిషిన్ దాఖలు చేసింది. 1989లో సెటిల్మెంట్ సమయంలో ప్రజల జీవితాలకు, పర్యావరణానికి జరిగిన వాస్తవ నష్టాలను సరిగా అంచనా వేయలేమని చెబుతూ.. ఈ కేసును రీ ఓపెన్ చేయాలని కేంద్రం కోరింది. దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని సంజీవ్ ఖన్నా, అభయ్ ఓకా, విక్రమ్నాథ్, జేకే మహేశ్వరిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. కేవలం మోసం కారణంగా మాత్రమే సెటిల్మెట్ను పక్కన పెట్టవచ్చని.. అయితే ఈ అశంపై కేంద్రం వాదించలేదని పేర్కొంది. అంతేగాక రెండు దశాబ్దాల తర్వాత ఈ సమస్యను లేవనెత్తడానికి ఎలాంటి హేతుబద్ధత అందించనందుకు కేంద్ర ప్రభుత్వంతో తాము సంతృప్తి చెందలేదు కోర్టు పేర్కొంది. యునియన్ కార్బైడ్ సంస్థపై అదనపు భారాన్ని విధించడం సరికాదని, ఆ కేసును రీఓపెన్ చేయడం వల్ల మరిన్ని సమస్యల్ని సృష్టించడమే అవుతుందని ధర్మాసనం తెలిపింది. భోపాల్ గ్యాస్ బాధితులకు ఇప్పటికే ఆరుసార్లు నష్టపరిహారాన్ని ఇచ్చారని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న రూ. 50 కోట్ల మొత్తాన్ని పెండింగ్లో ఉన్న పరిహారం క్లెయిమ్లను క్లియర్ చేయడానికి ఉపయోగించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం వేసిన క్యూరేటివ్ పిటిషన్పై జనవరి 12వ తేదీన సుప్రీం తన తీర్పును రిజర్వ్ చేయగా.. నేడు తిరస్కరించింది. కాగా డిసెంబర్ 2,1984న భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీకైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 3,000 మందికి పైగా మరణించారు. లక్ష మందికి పైగా ప్రభావితమయ్యారు. ప్రపంచంలోని అతి దారుణమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా దీనిని పరిగణించారు. యూనియన్ కార్బైడ్ను సొంతం చేసుకున్న ప్రస్తుతం డౌ కెమికల్స్ 1989లో సెటిల్మెంట్ కింద రూ. 715 కోట్ల హరిహారం చెల్లించింది. అప్పటి యూనియన్ కార్బైడ్ చైర్మన్ వారెన్ ఆండర్సన్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నప్పటికీ విచారణకు హాజరు కాలేదు. 1992లో భోపాల్ కోర్టు అతను పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. 2014లో ఆయన మరణానికి ముందు రెండు నాన్-బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. అయితే జూన్ 7, 2010న భోపాల్ కోర్టు యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెట్కు చెందిన ఏడుగురు ఎగ్జిక్యూటివ్లకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. చదవండి: 'ఎన్నిసార్లు ఇలానే చేస్తారు.. స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్ను మార్చుకోండి' -
'ఏపీలో పీడీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థపై కేంద్రం ప్రశంసలు'
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో పీడీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థను కేంద్రం ప్రశంసించిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. జియో ట్యాగ్ సిస్టం ద్వారా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేసినట్లు పేర్కొన్నారు. స్మార్ట్ పీడీఎస్ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. 'రైస్ మిల్లులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బియ్యం రీసైకిల్ కాకుండా చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు డబ్బులు మూడు రోజులలో రైతుల ఖాతాలలో వేస్తున్నాం. రూ.1,702 కోట్ల పాత బకాయిలు చెల్లింపునకు కేంద్రం అంగీకారం తెలిపింది. కేరళ కోసం జయ బొండం బాయిల్డ్ రైస్కు కేంద్రం 5 లక్షల మెట్రిక్ టన్నులు ఆర్డర్ ఇచ్చింది. ఒక లక్ష అంత్యోదయ కార్డుల మంజూరుకు కేంద్రం ఒప్పుకుంది. రైతులకు ధాన్యం డబ్బులు ఎప్పటికప్పడు ఇస్తున్నాం. కేంద్రం సకాలంలో చెల్లింపులు చేస్తోంది. రేషన్ కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి కూడా ఇస్తున్నాం. వచ్చే రెండు నెలల్లో జొన్నలు, రాగులు కూడా పీడీఎస్ కింద సరఫరా చేస్తాం. పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా దాడులు చేస్తున్నాం. రేషన్ కార్డులు తొలగించం. పార్టీలు, కులాలు చూడకుండా పథకాలు ఇస్తున్నాం.' అని కారుమూరి పేర్కొన్నారు. చదవండి: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్పై కేటీఆర్ ట్వీట్ -
అదానీ వెనుక శక్తుల గురించి ప్రజలకు తెలియాలి: రాహుల్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్పై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రూ.లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యవహారంలో నిజానిజాలు దేశ ప్రజలకు తెలియాలని అన్నారు. అదానీపై చర్చించేందుకు కేంద్రం నిరాకరిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా తాను ఈ విషయం గురించి గళమెత్తుతూనే ఉన్నానని రాహుల్ అన్నారు. దేశంలో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందని, దేశ మౌలిక సదుపాయాలను ఒక వ్యక్తి హైజాక్ చేశారని పరోక్షంగా అదానీని ఉద్దేశించి అన్నారు. 'అదానీ గ్రూప్ వెనకాల ఉన్న శక్తుల గురించి ప్రజలకు కచ్చితంగా తెలియాలి. కేంద్రం భయపడుతోంది. అందుకే చర్చకు అంగీకరించడం లేదు. అదానీపై చర్చ జరగకుండా ప్రధాని మోదీ అన్ని ప్రయత్నాలు చేస్తారు.' అని రాహుల్ విమర్శించారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన మరునాటి నుంచి రాజ్యసభ, లోక్సభలో కార్యకలాపాలు సజావుగా సాగడం లేదు. అదానీ గ్రూప్ వ్యవహారంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతుండగా.. కేంద్రం మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. దీంతో సోమవారం కూడా ఉభయసభలు ఎలాంటి చర్చా లేకుండానే మంగళవారానికి వాయిదాపడ్డాయి. చదవండి: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం.. -
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా మరో ఐదుగురు న్యాయమూర్తులు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం గతంలోనే సిఫారసు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పేర్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. అనంతరం ఈ ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపింది. ప్రెసిడెంట్ ద్రౌపదిముర్ము కూడా దీనిపై సంతకం చేయడంతో సుప్రీంకోర్టుకు కొత్త న్యాయమూర్తుల నియామక ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. సుప్రీంకోర్టుకు కొత్తగా నియమించిన న్యాయమూర్తులు వీరే. జస్టిస్ పంకజ్ మిత్తల్, రాజస్థాన్ హైకోర్టు సీజే. జస్టిస్ సంజయ్ కరోల్, పాట్నా హైకోర్టు సీజే. జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, మణిపూర్ హైకోర్టు సీజే. జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, పాట్నా హైకోర్టు జడ్జి. జస్టిస్ మనోజ్ మిశ్రా, అలహాబాద్ హైకోర్టు జడ్జి. కొలీజియం సిఫారసు మేరకు ఐదుగురు నూతన న్యాయమూర్తులను త్వరలోనే నియమిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు శుక్రవారమే తెలిపింది. ఆ మరునాడే నియామక ప్రక్రియ పూర్తి చేసింది. కేంద్రం కావాలనే న్యాయమూర్తలు నియామక ప్రక్రియను ఆలస్యం చేస్తోందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో త్వరలోనే పక్రియ పూర్తి చేస్తామని కేంద్రం చెప్పింది. చదవండి: పెండింగ్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్.. కట్టేందుకు ఎగబడ్డ జనం -
భారత్లో కరోనా కొత్త వేరియంట్లు లేవు.. భయాందోళన వద్దు.. కానీ..!
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కొత్త వేరియంట్లేమీ వెలుగు చూడలేదని కేంద్రం వెల్లడించింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇప్పటివరకు వెలుగు చూసిన వేరియంట్లు ప్రమాదకరం ఏమీ కాదని, రోగులు ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా రాలేదని స్పష్టం చేసింది. ఈమేరకు కోవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ ఎన్కే అరోరా తెలిపారు. కరోనా వేరియంట్ల గురించి ఆందోళన లేనప్పటికీ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహిరిస్తోందని అరోరా స్పష్టం చేశారు. ఐరోపా, ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా దేశాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని వివరించారు. అందుకే ఎయిర్పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లకు పంపిస్తున్నట్లు చెప్పారు. భారత్లో ప్రస్తుతం కరోనా కేసులు నమోదవుతన్నప్పటికీ, వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా లేదని కేంద్రం వివరించింది. అనేక నమూనాలను పరీక్షించినా కొత్త వేరియంట్లు కన్పించలేదని చెప్పింది. వచ్చే వారం కూడా కేసులు పెరిగే సూచనలు లేవని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందవద్దని, కానీ కరోనా జగ్రత్తలు పాటిస్తేనే మంచిదని సూచించింది. చదవండి: ఆయిల్ పైప్ లైన్ను కట్ చేసిన దుండగులు.. పెట్రోల్ కోసం ఎగబడ్డ జనం -
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ను రిలీవ్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ను రిలీవ్ చేసింది కేంద్రం. గురువారంలోగా ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈమేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సీఎస్గా సోమేష్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసిన మరునాడే కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ను కేంద్రం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును కేంద్రం ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పునిచ్చింది. చదవండి: సీఎస్ సోమేష్కుమార్ క్యాడర్ కేటాయింపు రద్దు.. టీఎస్ హైకోర్టు కీలక ఆదేశాలు -
స్వలింగసంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశంలో స్వలింగసంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గే మ్యారేజెస్కు చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకే బదిలీ చేశారు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్. వీటిపై ఫిబ్రవరి 15లోగా స్పందన తెలపాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి మార్చిలో విచారించనున్నట్లు పేర్కొన్నారు. పిటిషనర్లు ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో వాదనలు విన్పించే పరిస్థితి లేకపోతే.. వారు ఉన్న చోటు నుంచే వర్చువల్గా అయినా వాదించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్వలింగ సంపర్క వివాహాలపై పిటిషనర్లు, కేంద్రం చర్చించి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని చెప్పింది. పిటిషన్లలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్టకుండా అన్నింటీని పరిశీలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. భారత్లో స్వలింగసంపర్క వివాహాలకు చట్టబద్దత లేదు. ఇద్దరు పురుషులు లేదా స్త్రీలు పెళ్లి చేసుకుంటే చట్టపరంగా చెల్లదు. అయినా చాలా మంది స్వలింగసంపర్కులు తమ భాగస్వాములను పెళ్లి చేసుకుంటున్నారు. భారీఎత్తున సెలబ్రేట్ చేసుకుని ఒక్కటైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గే మ్యారేజెస్కు చట్టబద్ధత కల్పించాలని దేశంలోని వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వీటన్నింటిని కలపి సుప్రీంకోర్టే విచారిస్తానని చెప్పింది. చదవండి: 'నేను అమ్మనయ్యాను..' కూతుళ్ల కోసం లింగాన్ని మార్చుకున్న తండ్రి.. -
గుడ్న్యూస్.. మరో ఏడాది పాటు రేషన్ బియ్యం ఫ్రీ..!
సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత కార్డుదారులకు శుభవార్త. మరో ఏడాది పాటు ఉచిత రేషన్ అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్Œఎఫ్ఎస్ఏ) కింద పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో జనవరి నుంచి కూడా ఉచితంగానే రేషన్ బియ్యం పంపిణీ కానున్నాయి. కేంద్రం కోటాకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కలిపి ఉచితంగా పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ కోటాపై నిర్ణయం తీసుకోలేదు. ఉచిత కోటాతో ఆరి్థక భారంపై తర్జనభర్జన పడుతోంది. దీంతో కేవలం కేంద్రం కేటాయించే యూనిట్కు 5 కిలోలు మాత్రమే వర్తింపజేస్తుందా..లేక గతంలో మాదిరిగా అదనంగా మరో ఐదు కిలోలు కలిపి 10 కిలోలు వర్తింప చేస్తుందా ? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. 2020 నుంచి ఉచితంగానే.. కేంద్ర ప్రభుత్వం కరోనా ఆర్థిక సంక్షోభం నేపధ్యంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజికేఎవై) పథకం కింద 2020 ఏప్రిల్ నుంచి యూనిట్æ(ఒక్కొక్కరికి) ఉచితంగా 5 కేజీల చొప్పున బియ్యం కోటా కేటాయిస్తూ వచి్చంది. అప్పటి నుంచి పలు పర్యాయాలుగా ఈనెల 31 దాకా పొడిగిస్తూ వచి్చంది.తాజాగా ఎన్ఎఫ్ఎస్ఏతో పీఎంజీకేఏవైని విలీనం చేసి ఆహార భద్రత చట్టం కింద ఉచితంగా అందించాలని నిర్ణయించింది. సగం కార్డుదారులు... మహానగర పరిధిలోని ఆహార భద్రత కార్డులు కలిగిన కుటుంబాల్లో సగానికి పైగా అనర్హత కలిగిన కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా ఉచిత బియ్యం 70 నుంచి 80 శాతం కుటుంబాలు ప్రతి నెలా డ్రా చేస్తున్నారు. మిగిలిన 20నుంచి 30 శాతం మాత్రం కార్దులు రద్దు కాకుండా రెండు నెలలకు ఒకసారి సరుకులు డ్రా చేస్తూ వస్తున్నారు. మొత్తం మీద బియ్యం డ్రా చేసే కుటుంబాల్లో 10 శాతం మంది డీలర్లకే కిలో ఒక్కంటికి రూ. 8 నుంచి 10 లకు విక్రయిస్తుండగా, మిగిలిన 20 శాతం కటుంబాలు కిరాణం, ఇడ్లీ బండి, చిరు వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చదవండి: తల్లి హీరాబెన్ పాడె మోసిన ప్రధాని మోదీ -
8 ఏళ్లలో రూ. 4 లక్షల కోట్లు.. డిజిన్వెస్ట్మెంట్తో కేంద్రం ఆదాయం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కార్ 2014లో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్మెంట్) ద్వారా కేంద్రానికి రూ.4.04 లక్షల కోట్లు వచ్చాయి. 59 సంస్థల్లో ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో వాటాల విక్రయంతో అత్యధికంగా రూ.1.07 లక్షల కోట్లు ఖజానాకు సమకూరినట్లు ఆర్థిక శాఖ మంగళవారం వెల్లడించింది. ఎయిరిండియాతో పాటు 10 కంపెనీల్లో వాటాల విక్రయంతో గత 8 ఏళ్లలో ప్రభుత్వానికి రూ. 69,412 కోట్లు వచ్చాయి. 45 కేసుల్లో షేర్ల బైబ్యాక్ కింద రూ.45,104 కోట్లు లభించాయి. 2014–15 మధ్య 17 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు లిస్టయ్యాయి. వీటితో కేంద్రానికి రూ.50,386 కోట్లు వచ్చాయి. వీటిలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా అత్యధికంగా రూ. 20,516 కోట్లు లభించాయి. అటు పారదీప్ ఫాస్ఫేట్, ఐపీసీఎల్, టాటా కమ్యూనికేషన్స్లో తనకు మిగిలి ఉన్న వాటాలను కేంద్రం మొత్తం రూ. 9,538 కోట్లకు విక్రయించింది. చదవండి: కేంద్రం సంచలన నిర్ణయం..! ఆ కార్ల తయారీ నిలిపివేత? -
తెలంగాణకు రూ.5,238.93 కోట్లు.. పార్లమెంటులో చెప్పిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ద్వారా ఆరు జాతీయ జలమార్గాలు వెళ్తున్నాయని అందులో గోదావరి– కృష్ణానది మినహా మిగతా ఐదు జాతీయ జలమార్గాలైన భీమా, మంజీరా, పెన్గంగ–వార్ధా, తుంగభద్ర, పెన్గంగ–ప్రాణహిత నదుల వ్యవస్థ జాతీయ జలమార్గాలు షిప్పింగ్, నావిగేషన్ కోసం సాంకేతిక–వాణిజ్యపరంగా ఆచరణీయం కాదని అధ్యయనంలో తేలిందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ప్రస్తుతం నల్లగొండలోని సిమెంట్ పరిశ్రమల నుంచి సిమెంట్ తరలింపు కోసం ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దుకు సమీపంలో ఉన్న ముక్త్యాల టెర్మినల్ను ఉపయోగించవచ్చా అని బీఆర్ఎస్ ఎంపీ డి.దామోదర్రావు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు. జాతీయ జలమార్గం–4 ఫేజ్–1లో భాగంగా కృష్ణా నదిపై ముక్త్యాల–విజయవాడ స్ట్రెచ్ (82 కి.మీ.) దశలవారీ పనుల అభివృద్ధికి ఇన్ల్యాండ్ భారత జలమార్గాల ప్రాధికార సంస్థ రూ.96 కోట్లు కేటాయించిందని వివరించారు. రాష్ట్రానికి రూ.5,238.93 కోట్లు.. తెలంగాణలో 2014–15 నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం వరకు జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.5,238.93 కోట్లు విడుదల చేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. కాగా, రాష్ట్ర వాటాతో కలిపి రూ.8,584.98 కోట్లు వాడినట్లు వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 2014లో 668 ఉండగా, 2020లో 863కు చేరిందని బీఆర్ఎస్ ఎంపీ డి.దామోదర్రావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గ్రామ సడక్ యోజన కింద 2,427.50 కి.మీ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన–3 కింద 2,427.50 కి.మీ రహదారి నిర్మాణానికి కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి తెలిపారు. కాగా ఇందులో డిసెంబర్ 14 నాటికి 2,395.84 కి.మీ పొడవుతో 356 రోడ్డు పనులు ఇప్పటికే రాష్ట్రానికి మంజూరు చేశామని బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్రెడ్డి, మాలోత్ కవిత అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి బదులిచ్చారు. 45 దరఖాస్తుల ఆమోదం ఆంధ్రప్రదేశ్ నుంచి 47, తెలంగాణ నుంచి 42 ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటుకు దరఖాస్తులు అందగా అందులో ఏపీకి చెందిన 26, తెలంగాణకు చెందిన 19 దరఖాస్తులను ఆమోదించామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. చదవండి: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇష్టం వచ్చినట్లు సీట్ల పెంపు కుదరదు -
మోదీ మిత్రుల కోసమే పన్ను తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామాన్యుల కోసం కాకుండా కార్పొరేట్ల కోసమే పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పన్నులు, సెస్సుల రూపంలో పెట్రో ఉత్పత్తుల ధరలను అడ్డగోలుగా పెంచేసిన కేంద్రం.. కార్పొ రేట్ చమురు కంపెనీలకు మాత్రం విండ్ఫాల్ టాక్సులు తగ్గించడం ఏమిటని నిలదీశారు. ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెట్రో ఉత్పత్తులపై సెస్సులు, పన్నులు తగ్గించకుండా.. జనం జేబులకు చిల్లుపెట్టడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. కార్పొరేట్ చమురు కంపెనీలకు మిగులుతున్న సొమ్ములు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. వాస్తవానికి తెలంగాణ వంటి రాష్ట్రాలు 2014 నుంచి పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ను ఏమాత్రం పెంచలేదని.. అయినా రాష్ట్రాలే వ్యాట్ తగ్గించడం లేదంటూ మోదీ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. సెస్ల పేరుతో రూ.30లక్షల కోట్లు కొల్లగొట్టి, రాష్ట్రాల పన్నుల వాటాను ఎగవేసిన కేంద్రం.. పైగా రాష్ట్రాలపైనే నిందలు వేస్తోందని విమర్శించారు. కేంద్రం సెస్సుల రూపంలో దోచుకున్న రూ.30 లక్షల కోట్లను వినియోగంలోకి తెస్తే.. లీటర్ పెట్రోల్ రూ.70, డీజిల్ను రూ.60కే అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీల లాభం కోసమే.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపి బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలను దోచుకుందని కేటీఆర్ ఆరోపించారు. రష్యా నుంచి తక్కువ ధరకు ముడిచమురు కొంటున్నట్టు మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పిందని.. కానీ ఆ చమురును దేశీయ అవసరాలకు వాడకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసి కార్పొరేట్ కంపెనీలు భారీగా లాభం ఆర్జించాయని వివరించారు. ఇలా కంపెనీలకు అప్పనంగా వచ్చిన సొమ్ముపై మోదీ ప్రభుత్వం పన్నులు తగ్గించిందని.. దీని వెనుక మోదీ కార్పొరేట్ మిత్రులకు చెందిన రెండు కంపెనీలకు లబ్ధి చేకూర్చే ఉద్దే శం ఉందని ఆరోపించారు. చవక చమురు లాభం దేశ ప్రజలకు అందకుండా పోయిందన్నారు. బీజేపీవి క్షుద్ర రాజకీయాలు మోదీప్రభుత్వం దేశప్రగతి, ప్రయోజనాలను పట్టించుకోకుండా క్షుద్ర రాజకీయాలతో కాలం గడుపుతోందని కేటీఆర్ విమర్శించారు. పెట్రో ధరల తగ్గింపు విషయంలో సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టాలని.. ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. పన్నులు, సెస్సులతో పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచిన కేంద్రం.. ఈ నెపాన్ని తెలంగాణ వంటి రాష్ట్రాలపైకి నెట్టడాన్ని ఆపాలని సూచించారు. (చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందుపై మరో చీటింగ్ కేసు ) -
వర్క్ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు
న్యూఢిల్లీ: వర్క్ ఫ్రం హోం వెసులుబాటునుంచి ఆఫీసులకు వెడుతున్న పలు స్పెషల్ ఎకనామిక్ జోన్ల(సెజ్)లో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దేశంలోlr ప్రత్యేక ఆర్థిక మండళ్ల యూనిట్లలో ఉన్న ఐటీ, ఐటీ ఆదారిత కంపెనీల్లోని 100 శాతం మంది ఉద్యోగులకు ఇంటి నుండి పూర్తి పనిని అనుమతించింది. వచ్చే ఏడాది డిసెంబరు (2023 డిసెంబర్) వరకు ఇంటినుంచే పనిచేసుకోవచ్చు. దీనికి సంబంధించి వాణిజ్య మంత్రిత్వ శాఖ కొన్ని షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఒక యూనిట్ తన ఉద్యోగులను ఇంటి నుండి లేదా సెజ్ వెలుపల ఏ ప్రదేశం నుండైనా పనిచేసుకోవడానికి అనుమతించవచ్చు. ప్రస్తుతానికి సెజ్లలో మొత్త ఉద్యోగుల్లో సగం మంది, గరిష్టంగా ఒక సంవత్సరం పాటు ఇంటి నుండి పని చేయడానికి అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. సెజ్లలోని యూనిట్ యజమానులు సంబంధిత జోన్ల డెవలప్మెంట్ కమిషనర్కు సమాచారం అందించి సంబంధిత ఆమోద పత్రం పొందాలి. భవిష్యత్తులో ఇంటి నుండి పని ప్రారంభించాలనుకునే యూనిట్లు ఇంటి నుండి పని ప్రారంభించే తేదీకి లేదా ముందు మెయిల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎవరెవరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారనేది బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు.ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడానికి ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు లేదా ఇతర పరికరాలను అందించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సదరు యూనిట్ ఉత్పత్తి చేసే ఉత్పత్తుల ఎగుమతి ఆదాయాన్ని సంబంధిత యూనిట్ ఉద్యోగి నిర్ధారించాల్సి ఉంటుందని కూడా మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. -
రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 2024 చివరి నాటికి 10,000 సినిమా హాళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ నిర్ణయించింది. ఇందుకోసం అక్టోబర్ సినిమాస్తో చేతులు కలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక లక్ష చిన్న థియేటర్లను నెల కొల్పాలన్నది లక్ష్యం. ఒక్కో కేంద్రం 100-200 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు కానుంది. సీఎస్సీని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ప్రమోట్ చేస్తోంది. 2024 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 సినిమా హాళ్లను ప్రారంభించనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 100-200 సీటింగ్ కెపాసిటీ ఉన్న 1 లక్ష చిన్న సినిమా థియేటర్లను తెరవాలనే లక్ష్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సీఎస్ఈ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ రాకేష్ వెల్లడించారు. (ప్రావిడెంట్ ఫండ్:నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే కోటి రూపాయలు) 2024 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 10,000 సినిమా హాళ్లు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నామని అక్టోబర్ సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ దేశాయ్ తెలిపారు. వీడియో పార్లర్ సినిమా లైసెన్సు ఉన్న ఈ సినిమా హాళ్లను నడపాలంటే దాదాపు రూ.15 లక్షల పెట్టుబడి అవసరమన్నారు. గ్రామీణ స్థాయి వ్యాపారులకు కొత్త అవకాశాలను ఈ థియేటర్లు కల్పిస్తాయని సీఎస్సీ భావిస్తోంది. సీఎస్సీ కార్యకలాపాలకు ఇవి కేంద్రాలుగా మారతాయని ఆశిస్తోంది. (కస్టమర్లకు షాకిస్తున్న బంగారం, వెండి: ఆరు నెలల్లో తొలిసారి!) -
దొంగతనానికి వచ్చి..డోర్లో తల ఇరుక్కుని చనిపోయాడు
ఒక ఇంటిలో దొంగతనం చేసేందుకు వచ్చిన ఒక దొంగ ఏమి దొరక్కా.. ఆ ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన మరువక మునేపే అలాంటి మరో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. చోరీ చేసేందుకు వచ్చి డోర్లో తల ఇరుక్కుని చనిపోయాడు ఒక దొంగ. ఈ ఘటన వారణాసిలో సార్నాథ్ ప్రాంతంలోని డానియాల్పూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలపిని కథనం ప్రకారం....నిజాం అనే వక్తి విద్యుత్ యంత్రాలతో పనిచేసే మగ్గం సెంటర్లోకి చోరబడేందుకు యత్నించాడు. వాస్తవానికి ఆ సెంటర్ సరైన పని లేక గత రెండు రోజులుగా మూతబడి ఉంది. ఐతే ఈ దొంగ ఆ సెంటర్లో చోరీ చేసేందుకు వచ్చాడు. ఐతే ఆ సెంటర్ను బద్దలుగొట్టే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్న తలుపుల్లో దొంగ తన తలను పెట్టడంతో అతడి తల ఇరుక్కుపోయింది. ఆ తలుపులు పైన తాళం వేసి ఉందని తెలియక చోరబడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతని తల రెండు డోర్ల మధ్య ఇరుక్కుపోయింది, అతడి మిగతా శరీర భాగం బయటవైపు ఉండిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృదొ చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తిని పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న 30 ఏళ్ల జావేద్గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: మహిళ చేతివాటం.. మాటల్లో దింపి రూ.10 లక్షల నెక్లెస్ కొట్టేసింది) -
దిగుబడి అబద్ధం, అనారోగ్యం నిజం
జన్యుమార్పిడి ఆవాల విత్తన వినియోగానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని అక్టోబర్ 31 నాడు మూడు జాతీయ వ్యవసాయ శాస్త్ర సంస్థల (ఐసీఎంఆర్, ఎన్ఏఎస్ఎస్, టీఏఎస్ఎస్) అధిపతులు ప్రకటించారు. జన్యుమార్పిడి ఉత్పత్తుల వరదకు గేట్లు తెరవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తోంది. జన్యుపరంగా మార్పుచేసిన ఆహార పంటల వాణిజ్య సాగును అనుమతించడం వల్ల కలిగే తీవ్రమైన పర్యవసానా లను ప్రభుత్వం అర్థం చేసుకోలేదు. జన్యుమార్పిడి విత్తనాలు దిగుబడులు తేకపోగా, అనారోగ్యానికి కారణం అవుతాయని గత అనుభవాలు చెబు తున్నాయి. అయినా అవాంఛిత, హానికరమైన సాంకేతిక పరిజ్ఞాన వాడకానికి ప్రపంచంలోనే అతిపెద్ద చెత్తబుట్టగా భారత్ మారడానికి సిద్ధమవుతోంది. యూరోపియన్ యూనియన్ జన్యు మార్పిడి (జీఎం) పంటలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడుతున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ వ్యతిరేకత తరువాత, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా జన్యు మార్పిడి పంటలను అనుమతించబోనని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పాలన ఉన్నప్పటికీ చైనా కూడా ప్రమాదకరమైన సాంకేతిక పరిజ్ఞానం పట్ల అప్రమత్తంగా ఉంది. ఈ తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో జన్యు మార్పిడి విత్తన రంగం మరెక్కడకు మారగలదు, భారతదేశం తప్పితే. సాంకేతిక ఆవిష్కరణ పేరిట, జన్యుమార్పిడి ఆవాల (డీఎంహెచ్–11 రకం) వాణిజ్య సాగుకు ఆమోదం ఇవ్వవలసి వస్తే, శాస్త్రీయ నిబంధనల ప్రక్రియ ఎంత అశాస్త్రీయంగా మారిందో అర్థమవుతుంది. జన్యు ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జీఈఏసీ) జీఎం ఆవాలకు ఆమోదం మంజూరు చేసిన పద్ధతి అన్ని శాస్త్రీయ నిబంధనలను ఉల్లంఘిస్తుంది. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్క రించడానికి జన్యు మార్పిడి టెక్నాలజీని ప్రవేశపెట్టాలని నీతి ఆయోగ్ చేసిన సిఫారసును ధ్రువీకరించడానికి జీఈఏసీ తన నియంత్రణను బలహీనపరిస్తే, విధాన రూపకర్తలు వ్యవసాయ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయినట్లే. జన్యు మార్పిడి ఆవాలు 30 శాతం ఎక్కువ దిగుబడిని ఇస్తాయి, అందువల్ల రూ.1,71,000 కోట్ల వంటనూనె దిగుమతి బిల్లును తగ్గించడానికి అవకాశం లభిస్తుందని ఒక అసంబద్ధ వాదన చేస్తు న్నారు. ఆమోదించిన డీఎంహెచ్–11 రకం అధిక దిగుబడినిచ్చేది కాదు. దీని ఉత్పాదకత ప్రస్తుతం వాడుతున్న మూడు ఇతర నాన్– జీఎం రకాల కంటే తక్కువ. అన్ని శాస్త్రీయ నిబంధనల ప్రకారం, ఇది అసలు పరిశీలించాల్సిన రకం కూడా కాదు. అధిక ఉత్పాదకతతో ఇప్పటికే నాలుగు ఆవాల రకాలు ఉన్నాయని ఒక శాస్త్రవేత్త సెంటర్ ఫర్ జెనెటిక్ మానిప్యులేషన్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ సౌత్ క్యాంపస్లో జరిగిన సమావేశంలో చెప్పారు. మూడు రకాలు ఒకే డీఎంహెచ్ శ్రేణిలో ఉన్నాయి. సంప్రదాయ రకం అయిన డీఎంహెచ్–4, జన్యుమార్పిడి ఆవాల కంటే 14.7 శాతం అధిక దిగు బడి ఇస్తుంది. రెండు విత్తన కంపెనీల (పయనీర్, అడ్వాంటా ఉత్పత్తి చేసిన) మరో రెండు రకాలు కూడా 30 శాతం అధిక దిగుబడిని ఇస్తాయి. కాబట్టి వంటనూనెల దిగుమతులను తగ్గించేందుకే అను మతి ఇస్తున్నారన్న వాదనలో అర్థం లేదు. 2016–17లో భారతదేశం గణనీయ స్థాయిలో ఆవాలను పండించింది. అధిక ఉత్పత్తి నేపథ్యంలో ధరలు పడిపోయినాయి. రైతులకు సగటున క్వింటాలుకు రూ.400–600 వరకు ధరలు తగ్గాయి. దాదాపు 65 లక్షల హెక్టార్లలో సాగయ్యే ఆవాల పంట, దిగు బడి సమస్యలను ఎన్నడూ ఎదుర్కోలేదు. ఉన్న సమస్య కనీస మద్దతు ధర గానీ, గిట్టుబాటు ధర గానీ రాకపోవడం. నీతి ఆయోగ్ రైతులకు భరోసా ధర కల్పించే ప్రయత్నం చేయకుండా, దిగుబడి మాత్రమే సమస్య అన్నట్లుగా, అధిక దిగుబడితోనే అధిక ఆదాయం వస్తుందనే భావన కల్పిస్తున్నది. 1985లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం వంటనూనెల దిగుమతులను తగ్గించడం ద్వారా విదేశీ మారకంలో లోటును తగ్గిం చాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ఆయిల్ సీడ్ టెక్నాలజీ మిషన్ ప్రారంభమైంది. ఫలితంగా, 1993–94 నాటికి భారత్ దాదాపు స్వయం సమృద్ధి సాధించింది. వంటనూనెల ఉత్పత్తి 97 శాతం దేశీయం కాగా, కేవలం 3 శాతం మాత్రమే దిగుమతి చేసుకున్నారు. కానీ ఈ ‘ఎల్లో రివల్యూషన్’ ఎక్కువ కాలం నిలవలేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాలు క్రమంగా దిగుమతి సుంకాలను తగ్గించాయి. భారతదేశం విధించగల 300 శాతం దిగుమతి సుంకాల పరిమితికి వ్యతిరేకంగా, సుంకాలు దాదాపు సున్నాకు తగ్గిపోయాయి. చౌక నూనె దిగుమతులు పెరిగినాయి. ప్రధా నంగా పామాయిల్ దిగుమతులు దేశీయ మార్కెట్లను ముంచెత్తాయి. కేవలం 3 శాతం దిగుమతుల నుంచి, మళ్లీ 60 శాతానికి పైగా దిగు మతి చేసుకోవడం మొదలైంది. ఫలితంగా, వర్షాధార భూములలో ఎక్కువగా పండించే నూనెగింజల రైతులు ఇతర పంటలకు మార వలసి వచ్చింది. దేశీయ వంటనూనె పరిశ్రమ నష్టాల్లోకి పోయింది. కొన్ని భారతీయ కంపెనీలు శ్రీలంకకు కూడా తరలివెళ్లాయి. వంట నూనెల దిగుమతి ఖర్చును తగ్గించడమే లక్ష్యం అయితే, మొదట దేశీయ నూనె ఉత్పత్తికి అనుకూల వాతావరణాన్ని కల్పిం చాలి. దిగుమతి సుంకాలను పెంచకపోతే, విదేశీ మారకంలో తరు గును తగ్గించే ఏ చర్య అయినా అర్థరహితం అవు తుంది. ఈ విషయం నీతి ఆయోగ్కు తెలుసు. వంటనూనె ఉత్పత్తిని దేశీయంగా పెంచాలనే ఉద్దేశం ఉంటే భారతదేశం ‘పసుపు విప్లవం’ మార్గంలో నడవవలసి ఉంటుందని దానికి తెలుసు. అయినా కొన్ని విత్తన కంపెనీల వ్యాపార అభివృద్ధికే జన్యుమార్పిడి ఆవాల అనుమతి ఇచ్చారు. జన్యుమార్పిడి ఆవాల రకం వాస్తవానికి రసాయన కలుపు నాశిని తట్టుకునే పంట. కానీ జీఈఏసీ దీనిని ఖండించింది. కాకపోతే, ఖరీదైన కలుపు నాశక రసాయనాలను రైతులు కొనలేరు కనుక వాటిని వాడే అవసరం ఉండదని వాదిస్తున్నారు. ఇది అశాస్త్రీయ వాదన. జన్యుమార్పిడి ఆవాల రకం అనుమతి వెనుక కలుపునాశక రసాయ నాల కంపెనీల వ్యాపార విస్తరణ కూడా ముడిపడి ఉంది. ఇప్పటికే, హెచ్టీ బీటీ ప్రత్తి గింజలకు అనుమతి లేకున్నా చట్ట వ్యతిరేకంగా వేల ఎకరాలలో సాగు అవుతోంది. ఈ పంట కోసం గ్లాయిఫోసేట్ రసాయన వినియోగం పెరిగింది. ఇటీవల దాని ఉపయోగం అత్యంత ప్రమాదకరం అని గుర్తించిన ప్రభుత్వం, రైతులు కాకుండా, రసాయన పిచికారీ కంపెనీలు మాత్రమే చేయాలని నిబంధన తెచ్చింది. జన్యు మార్పిడి ఆవాల రకాన్ని అనుమతి ఇచ్చిన కొద్దీ రోజులలోనే ఆ నిబంధన తేవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ రెండు అనుమతులు ఒకదానికొకటి సంబంధం లేనట్లు ఉన్నా, జన్యు మార్పిడి విత్తనాలు ఈ కలుపునాశక రసాయనం తట్టుకునే రకాలు కావడం విశేషం. అంటే, జన్యుమార్పిడి ఆవాల రకం విత్తనాలు రైతులు వాడితే తప్పనిసరిగా కలుపునాశక రసాయనం కొనవలసిందే. అవి వాడి రైతులు మరణిస్తే, మొత్తం ప్యాకేజికే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి గ్లాయిఫోసేట్ రసాయన వినియోగం రైతులు కాకుండా ప్రత్యేక కంపెనీలు పిచికారీ చేసే విధంగా నిబంధన తెచ్చారు. దీని వలన, రెండు ప్రయోజనాలు: గ్లాయిఫోసేట్ రసాయన వినియోగం చట్ట బద్ధం అవుతుంది, జన్యుమార్పిడి పంటల విస్తీర్ణం పెరుగుతుంది. భారత దేశంలో గ్లాయిఫోసేట్ రసాయన వినియోగం కేవలం తేయాకు తోటలలోనే చేయాలి. ఇంకెక్కడైనా చేస్తే అది చట్టవిరుద్ధం. ప్రత్యేకంగా ఆహార పంట మీద చేయడానికి వీలు లేదు. జన్యు మార్పిడి ఆవాల ద్వార హానిచేసే రసాయన అవశేషాలు కూడా విని యోగదారులకు అందుతాయి. జన్యుపరంగా మార్పు చేసిన విత్తనాలు ప్రమాదకరమైనవి. ఆహార పదార్థాల జన్యు నిర్మాణం పక్కదారి పట్టినట్లయితే, జీవ క్రియలు, బయోకెమిస్ట్రీ ప్రభావితమవుతాయి. దాని వలన అలర్జీలు, అనేక ఇతర వ్యాధులు రావచ్చు. ఏ1, ఏ2 పాల నుండి లాక్టోస్ అలర్జీ, గోధుమల నుండి గ్లూటెన్ అలెర్జీ వంటి వాటిని ఇప్పటికే చూస్తున్నాం. బహుళజాతి కంపెనీల లాభాపేక్ష ఆధారంగా విధానాలు రూపు దిద్దుకుంటున్నాయి. విత్తనాల మీద రైతుల హక్కులు తగ్గుతున్నాయి. బీటీ పత్తికి అనుమతి ఇచ్చిన 20 ఏళ్ళలో రైతుల పరిస్థితి మెరుగు పడకపోగా ఆత్మహత్యలు, అనారోగ్యం పెరిగినాయి. జన్యు మార్పిడి పంటల వల్ల లాభపడేది రైతులు, వినియోగదారులు కాదు. విత్తన కంపెనీలు మాత్రమే. భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని భారత పౌరులు జీఎం ఆవాలను వ్యతిరేకించాలి. డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ విధాన విశ్లేషకులు -
ఐఏఎస్ అధికారి జీతేంద్ర నారాయణ్ను సస్పెండ్ చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారి జీతేంద్ర నారాయణ్ను సస్పెండ్ చేసింది కేంద్ర హోంశాఖ. ఓ మహిళను ఆయన లైంగికంగా వేధించారనే ఆరోపణల నేపథ్యంలో నివేదికను పరిశీలించిన అనంతరం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. జేతేంద్రపై సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి(యూటీ డివిజన్) అశుతోష్ అగ్నిహోత్రి ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ఆదేశాలు జారీ చేశారు. 1990 బ్యాచ్కు చెందిన జీతేంద్ర నారాయణ్ అండమాన్ నికోబార్లో ఓ మహిళను వేధించారని ఇటీవల అరోపణలు వచ్చాయి. దీనిపై అక్కడి పోలీసుల నుంచి నివేదిక కోరింది కేంద్ర హోంశాఖ. జీతేంద్రపై వచ్చిన ఆరోపణలు నిజమే అని ఆదివారం అందిన నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఆ మరునాడే చర్యలకు ఉపక్రమించింది కేంద్రం. జీతేంద్రను సస్పెండ్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఉన్నత హోదాలో ఉండి అధికార దుర్వినియోగానికి, ప్రత్యేకించి మహిళలపై వేధింపులకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇలాంటి విషయాల్లో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. జీతేంద్ర నారాయణ్పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పోలీసులతో పాటు, ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. చదవండి: కాంగ్రెస్ కొత్త సారథి ఎవరైనా గాంధీల సలహాలు కచ్చితంగా తీసుకోవాలి -
ఆ ఉద్యోగులకు దీపావళి కానుక.. 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. పండగ సందర్భంగా 78 రోజుల బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈమేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. అయితే ఇది పర్మామెన్స్ ఆధారిత బోనస్ అని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 11.27లక్షల మంది రైల్వే ఉద్యోగులు గరిష్ఠంగా రూ.17,951 పొందుతారని వివరించారు. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పర్మామెన్స్ ఆధారిత ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు కేంద్రం ఇదివరకే తెలిపింది. అలాగే ఆయిల్ సంస్థలకు రూ.22వేల గ్రాంట్ను మంజూరు చేయనున్నట్లు ఠాకూర్ తెలిపారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్(సవరణ)బిల్లు-2022కి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. చదవండి: శశి థరూర్తో నన్ను పోల్చకండి.. మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు -
వానాకాలం సీఎంఆర్పై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్)పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీఎంఆర్ గడువు ముగిసి మూడు రోజులైనా పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. యాసంగి సీఎంఆర్కు సెప్టెంబర్ 30 వరకు ఉన్న గడువును నెలరోజులపాటు పొడిగించిన కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ.. వానకాలం సీఎంఆర్ గురించి ఊసెత్తలేదు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు, మిల్లర్లు అయోమయంలో పడిపోయారు. 60 శాతమే పూర్తయిన వానాకాలం సీఎంఆర్ వానాకాలం సీజన్కు సంబంధించిన సీఎంఆర్ ఇప్పటివరకు 60 శాతమే పూర్తయింది. వానాకాలం సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 70.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని మిల్లర్లు సీఎంఆర్ కింద 47 ఎల్ఎంటీ మేర ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు సుమారు 30 ఎల్ఎంటీ బియ్యాన్ని మాత్రమే ఎఫ్సీఐకి ఇచ్చినట్లు సమాచారం. అంటే 60 శాతం సీఎంఆర్ మాత్రమే పూర్తయింది. మిగతా సీఎంఆర్తో పాటు యాసంగి సీఎంఆర్ పూర్తి చేసేందుకు మరో నెల గడువు పెంచాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే కేంద్రం మాత్రం కేవలం యాసంగి సీఎంఆర్కు సంబంధించిన గడువును మాత్రం అక్టోబర్ 31 వరకు పెంచుతూ గతనెల 27న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ఈ లేఖలో ముగిసిన వానకాలం సీజన్కు సంబంధించిన సీఎంఆర్ గురించి ప్రస్తావించలేదు. గత కొంతకాలంగా సీఎంఆర్ ఆలస్యం ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా సీఎంఆర్ అప్పగించడంలో ఆలస్యమవుతోంది. ఈ విషయంపై ఏడాదిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మిల్లింగ్లో అవకతకవలు, పీడీఎస్ బియ్యం పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహించిన ఎఫ్సీఐ.. జూన్ 7వ తేదీ నుంచి 40 రోజుల పాటు సీఎంఆర్ తీసుకోలేదు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. జూలై నెలాఖరు నుంచి మిల్లింగ్కు అవకాశం ఇచ్చినప్పటికీ వర్షాల కారణంగా మిల్లుల్లో ధాన్యం తడిసిపోవడం, మిల్లులు నిలిచిపోయినప్పుడు కూలీలు, హమాలీలు సొంతూర్లకు వెళ్లిపోవడం వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో మిల్లింగ్ జరగలేదు. దీంతో సెప్టెంబర్ నెలాఖరు వరకు 60 శాతమే సీఎంఆర్ పూర్తయింది. ఈ విషయమై మంత్రి కమలాకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ గత నెల చివరివారంలో సమావేశమై సీఎంఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరు కొనసాగితే ధాన్యాన్ని మిల్లింగ్ కోసం ఇతర రాష్ట్రాలకు పంపాలని కూడా నిర్ణయించి, ఎఫ్సీఐ అనుమతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మిల్లింగ్ వేగం పెరిగింది. కానీ సెపె్టంబర్ 30 తరువాత గడువు పొడిగించకపోవడంతో వానకాలం సీఎంఆర్పై నీలినీడలు కమ్ముకున్నట్లయింది. చదవండి: మునుగోడు దంగల్: కమలదళ కదనోత్సాహం.. ఫుల్జోష్తో బీజేపీ రెడీ -
తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్న కేంద్రం: హరీశ్
సాక్షి, సిద్దిపేట: ఎంతమంది ముఖ్య మంత్రులు, ప్రధాన మంత్రులు మారినా ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోయారని, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయ కత్వంలోనే తెలంగాణా శరవేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కేవలం మూడున్నరేళ్లలో మిషన్భగీరథ పథకం కింద తెలంగాణలో ఇంటింటికీ తాగునీరు అందించారని ఇదే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ కో జల్‘, మిషన్కాకతీయ తరహాలో అమృత్ సరోవర్ పేరిట కాపీ కొట్టిందన్నారు. ఇదొక్కటే కాదనీ, ఇలా చాలా సంక్షేమ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. సోమవారం సిద్దిపేటలో పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 26 శాతం నిరుద్యోగత ఉందన్నారు. బీజేపీ ఏటా లక్ష ఉద్యోగాలు ఇస్తా మని చెప్పి భర్తీ చేయకపోవడంతో ఇప్పటికే 16 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, పైగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఇష్టారాజ్యంగా కేంద్రం ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్వద్ద ఉన్న మైదానంలో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారి పర్యవేక్షణలో ఆయుత చండీ అతిరుద్ర యాగం జరగనుంది. ఈ నేపథ్యంలో స్వరూపానంద స్వామి సిద్దిపేటకు వచ్చి మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి వారిని మంత్రి హరీశ్రావు కలిసి ఆశీస్సులు తీసుకు న్నారు. ఎగ్జిబిషన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీరంగనాయక స్వామి కాలేజ్ ఆప్ బీఫార్మసీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చదవండి: నగరంపై ‘కారు’ మబ్బులు! -
ప్రాజెక్టులకు సహకరించని రాష్ట్ర సర్కారు..కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కోసం కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల ఏర్పాటు విషయంలో ఏమాత్రం సహకరించట్లేదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడే టీఆర్ఎస్ నాయకులు.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఇప్పటివరకు ఎందుకు తిరిగి ప్రారంభించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు నాణ్యత సరిగా లేకనే కేంద్రం అక్కడ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు విముఖత చూపుతోందని చెప్పారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. భూసేకరణలో రాష్ట్ర సర్కారు విఫలం రాష్ట్రానికి కేంద్రం ప్రాజెక్టులు కేటాయించినా.. అవసరమైన భూమిని సేకరించి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమౌతోందని కిషన్రెడ్డి విమర్శించారు. ఎట్టకేలకు వరంగల్ జిల్లాలోని ములుగులో గిరిజన వర్సిటీకి స్థలాన్ని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్ సైన్స్ సిటీతో పాటు వరంగల్లో సైనిక్ స్కూల్కు భూమి కేటాయించలేదని ఆరోపించారు. ఎంఎంటీఎస్ అభివృద్ధికీ సహకరించట్లేదన్నారు. చర్లపల్లిలో రైల్వే మూడో టెరి్మనల్ కోసం భూకేటాయింపు చేయలేదన్నారు. గిరిజనబంధు కూడా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత దళిత బంధు పథకానికి అతీగతీ లేదని.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ తెరపైకి తెచి్చన గిరిజన బంధు పథకానికి కూడా ఉప ఎన్నిక తర్వాత అదే గతి పడుతుందని విమర్శించారు. కర్తవ్యపథ్లో బతుకమ్మ సంబురాలు ఆజాదీకా అమృత్ మహోత్సవ్, హైదరాబాద్ విమోచన దినోత్సవంలో భాగంగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దనున్న కర్తవ్యపథ్లో మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు కిషన్రెడ్డి వెల్లడించారు. చదవండి: రాజస్థాన్ సంక్షోభంపై రాహుల్ సమీక్ష -
పాస్పోర్ట్ కోసం... ఆన్లైన్లోనే పీసీసీ దరఖాస్తు
న్యూఢిల్లీ: పాస్పోర్ట్ మంజూరులో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) జారీ జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర హోం శాఖ కొత్త విధానాన్ని ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో పాస్పోర్ట్ దరఖాస్తుదారులే నేరుగా పీసీసీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితంగా పాస్పోర్ట్ కార్యాలయం అధికారులు వివరాలను స్థానిక పోలీసులకు పంపించి వాకబు చేసే అవసరం తగ్గి సమయం ఆదా అవుతుంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. చదవండి: అన్యాయంపై పోరాటానికే.. జోడో యాత్ర: రాహుల్ -
షిప్పింగ్ కార్ప్ విక్రయానికి సిద్దమవుతున్న రంగం: త్వరలోనే బిడ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ) ప్రయివేటీకరణకు ఈ ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో ఫైనాన్షియల్ బిడ్స్ను ఆహ్వానించే వీలుంది. ఇందుకు వీలుగా ప్రభుత్వం కంపెనీకి చెందిన కీలకంకాని, భూమి సంబంధ ఆస్తుల విడదీతను ప్రారంభించింది కూడా. ఈ ప్రక్రియ తుది దశకు చేరినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. రానున్న మూడు నెలల్లోగా పూర్తికావచ్చని అంచనా వేశారు. దీంతో జనవరి-మార్చి(క్యూ4)కల్లా అర్హతగల కంపెనీల నుంచి ఫైనాన్షియల్ బిడ్స్కు ఆహ్వానం పలికే వీలున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది మే నెలలో కీలకంకాని ఆస్తుల విడదీతకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా షిప్పింగ్ హౌస్, ముంబై, మ్యారిటైమ్ ట్రయినింగ్ ఇన్స్టిట్యూట్, పోవైసహా ఎస్సీఐ ల్యాండ్ అండ్ అసెట్స్ లిమిటెడ్(ఎస్సీఐఎల్ఏఎల్)ను విడదీయనుంది. తద్వారా ఎస్సీఐఎల్ఏఎల్ పేరుతో విడిగా కంపెనీ ఏర్పాటుకు తెరతీయనుంది. -
కేంద్ర ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపిస్తాం! మమత స్ట్రాంగ్ వార్నింగ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు ఎక్కువైపోతున్నాయంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మండిపడ్డారు. దీన్ని సహించేదిలేదని తేల్చి చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ అధికారుల పై విచారణ జరిపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు మమతా తమ పార్టీ విద్యార్థి విభాగం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ... తనపై కూడా సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయని, అలాగే బెంగాల్లోని ఇతర కేంద్ర ప్రభుత్వాధికారుల పై కూడా కేసులు ఉన్నాయని చెప్పారు. కేంద్రం తమ అధికారులను ఢిల్లీకి రప్పిస్తే మీ అధికారులను ఇక్కడకు పిలిపిస్తాను అని హెచ్చరించారు. రాష్ట్రంలో సుమారు ఎనిమిది మంది కేంద్ర ప్రభుత్వాధికారులపై కేసులు ఉన్నాయని మమతా తెలిపారు. కేంద్రం సీబీఐ దాడులతో తమ నాయకులను అరెస్టులు చేస్తోందని విరుచుకుపడ్డారు. ఎడ్యుకేషన్ స్కాంలో పార్థ ఛటర్జీపై సీబీఐ జరిపిన దాడులు గురించి ప్రస్తావిస్తూ...ఆ కేసులో ఏదీ రుజువుకాలేదని, కేవలం రాజకీయపార్టీలను మీడియా, న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని బీజేపీ భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపణలు చేశారు. ఈడీ, సీబీఐ దాడులతో తమ నాయకుల డబ్బులను కొల్లగొడుతోందని చెప్పారు. అంతేకాదు బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్నవారిని గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ కింద విడుదల చేయడాన్ని కూడా తప్పుపట్టారు. ఆ దోషుల పై కఠిన చర్యలు తీసుకునేలా తమ పార్టీ టీఎంసీ కోల్కతాలో 48 గంటల పాటు ధర్నా నిర్వహిస్తుందని మమతా బెనర్జీ తెలిపారు -
టమాటో ఫ్లూపై కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు కీలక సూచనలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో టమాటో ఫ్లూ వ్యాధి నాలుగు రాష్ట్రాలకు వ్యాపించింది. ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, హర్యానా, ఒడిశాలో ఈ కేసులు వెలుగుచూశాయి. 100మందికిపైగా చిన్నారులు ఈ వ్యాధి బారినపడి ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. వ్యాధిని నియంత్రించేందుకు రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ► హ్యాండ్, ఫుట్, మౌత్ డీసీజ్(హెచ్ఎఫ్ఎండీ) వ్యాధినే టమాటో ఫ్లూ అంటారు. ఇది 10 ఏళ్లలోపు చిన్నారులకు ఎక్కువగా వ్యాపిస్తుంది. పెద్దలకు కూడా వ్యాపించే అవకాశముంది. ► టమాటో ఫ్లూ వ్యాధి గురించి చిన్నారులకు అవగాహన కల్పించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దాని వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా వివరించాలని పేర్కొంది. ► టమాటో ఫ్లూ లక్షణాలు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లలాగే ఉంటాయి. ఈ వ్యాధి సోకిన చిన్నారుల్లో జ్వరం, అలసట, ఒంటి నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. ► టమాటో ఫ్లూకు కోవిడ్, మంకీపాక్స్, డెంగ్యూ, చికున్గున్యా వంటి వ్యాధులతో ఎలాంటి సంబంధం లేదు. ► అపరిశుభ్ర ఉపరితలాన్ని తాకడం, పండ్లు, వస్తువులను శుభ్రం చేయకుండా నేరుగా నోట్లో పెట్టుకోవడం వంటి కారణాలతో ఈ వ్యాధి సోకవచ్చు. ► టమాటో ఫ్లూ సోకిన, లక్షణాలు కన్పించిన చిన్నారులను ఐదు రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచాలి. ► జ్వరం, దద్దుర్లు ఉన్న చిన్నారులు ఇతరులను తాకడం, కౌగిలించుకోవడం చేయవద్దని తల్లిదండ్రులు చెప్పాలి ► నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న పిల్లలకు దాన్ని మాన్పించాలి. ► ఎప్పుడూ వేడి నీటితోనే పిల్లలకు స్నానం చేయించాలి. పోషక పదార్థాలున్న ఆహారాన్నే ఇవ్వాలి. ► పిల్లలకు విశ్రాంతి, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. చదవండి: దారుణం.. చావు ఇంట్లో నవ్వులు.. ఫ్యామిలీ ఫోటోపై ట్రోలింగ్.. -
TS: ‘పవర్’ నిషేధం ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల విద్యుత్ బకాయిలు, కొనుగోళ్లపై నిషేధం అంశంలో కేంద్ర ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకుంది. నిర్దేశిత గడువు ముగిసినా.. విద్యుదుత్పత్తి కంపెనీలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు బకాయిలు చెల్లించలేదన్న ప్రకటనను వెనక్కి తీసుకుంది. గడువులోగానే చెల్లింపులు చేశామన్న తెలంగాణ వాదనను అంగీకరించింది. ఎనర్జీ ఎక్సేంజ్ల ద్వారా విద్యుత్ క్రయవిక్రయాలు జరపకుండా రాష్ట్ర డిస్కంలపై విధించిన నిషేధాన్ని శనివారం ఎత్తివేసింది. కేంద్రం నిషేధాన్ని సడలించిందని, ఎనర్జీ ఎక్సేంజ్ల నుంచి విద్యుత్ కొనుగోళ్లను పునః ప్రారంభించామని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కోల సీఎండీ డి.ప్రభాకర్రావు తెలిపారు. మూడుసార్లు మాట మార్చి.. నిర్దేశిత గడువు ముగిసినా విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించలేదంటూ.. తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 29 డిస్కంలను కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. ఈ డిస్కంలు ఎనర్జీ ఎక్స్ఛేంజీల ద్వారా క్రయవిక్రయాలు జరపకుండా గురువారం అర్ధరాత్రి నుంచి నిషేధం విధించింది. ఇందులో తెలంగాణ డిస్కంలు రూ.1,380 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్టు పేర్కొంది. అయితే తెలంగాణ, ఏపీ సహా చాలా రాష్ట్రాలు తాము గడువులోగానే బకాయిలు చెల్లించామని కేంద్ర ప్రభుత్వానికి వివరించాయి. దీనితో మరుసటి రోజు శుక్రవారమే ఏపీ సహా పలు రాష్ట్రాలపై నిషేధాన్ని కేంద్రం సడలించింది. తెలంగాణ బకాయిలను పునః సమీక్షించి రూ.52 కోట్లే చెల్లించాల్సి ఉందని పేర్కొంది. మళ్లీ తెలంగాణ డిస్కంలు సంప్రదింపులు జరిపి, బకాయిలు చెల్లించేసిన ఆధారాలను చూపాయి. తిరిగి పరిశీలన జరిపిన కేంద్రం రాష్ట్ర బకాయిలు రూ.7 కోట్లేనని సరిదిద్దుకుంది. ఈ బకాయిని రాష్ట్ర డిస్కంలు వెంటనే చెల్లించేయడంతో నిషేధాన్ని సడలించింది. ప్రైవేటు కంపెనీల కోసం అనవసర జోక్యం! కేంద్ర విద్యుత్ శాఖ కొత్తగా అమల్లోకి తెచ్చిన లేట్ పేమెంట్ సర్చార్జీ రూల్స్–2022 ప్రకారం.. డిస్కంలు విద్యుదుత్పత్తి కంపెనీలకు 45రోజుల గడువులోగా బిల్లులు చెల్లించాలి. ఆ గడువు దాటి మరో నెల గడిచినా చెల్లించకుంటే.. ఆ తర్వాతి రోజును ‘డిఫాల్ట్ ట్రిగ్గర్ డేట్’గా పరిగణిస్తారు. అంటే ఆ రోజు నుంచి 75 రోజుల్లోగా బకాయిలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కొనుగోళ్లు జరపకుండా సదరు డిస్కంలను కట్టడి చేసే నిబంధనను కేంద్రం తెచ్చింది. ఈ అధికారాన్ని జాతీయ గ్రిడ్ నిర్వహణను పర్యవేక్షించే ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (పోసోకో)’కు కట్టబెట్టింది. దీనిని తెలంగాణ సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. కేవలం ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలకు ప్రయోజనం కల్పించడానికే కేంద్రం ఈ నిబంధనలు తెచ్చిందని ఆరోపిస్తున్నాయి. నిజానికి గడువులోగా బకాయిల చెల్లింపులో డిస్కంలు విఫలమైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లోని నిబంధనల ప్రకారం.. విద్యుదుత్పత్తి కంపెనీలు చర్యలు తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కంపెనీలు విద్యుత్ సరఫరాను నిలిపివేయొచ్చని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చని, కోర్టుకు వెళ్లవచ్చని అంటోంది. అయినా కేంద్రం అనవసరంగా జోక్యం చేసుకుంటోందని మండిపడుతోంది. బకాయిల చెల్లింపుతో నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్ఎల్డీసీ)కి ఏ సంబంధం లేకపోయినా రాష్ట్రాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసే అధికారం దానికి కట్టబెట్టడం సరికాదని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. చదవండి: ఇవి పార్టీల ఎన్నికలు కావు.. మన బతుకుదెరువు ఎన్నికలు -
‘అమెరికా మీడియా ప్రశంసిస్తే.. ఇక్కడ సీబీఐ దాడులు చేయిస్తున్నారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై జరుగుతున్న సీబీఐ దాడులు గురించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలోని విద్యా విధానంపై అమెరికాలోని ప్రఖ్యాత వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్ మనీష్ సిసోడియాను ప్రశంసలతో ముంచెత్తుతూ ఫ్రంట్ పేజీలో ఆర్టికల్ రాస్తే, అలాంటి వ్యక్తిని మన కేంద్ర ప్రభుత్వం సీబీఐ దాడులతో సత్కరిస్తోందంటూ ఎద్దేవా చేశారు. సీబీఐ దర్యాప్తు సంస్థ శుక్రవారం ఢిల్లీ డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా నివాసంతో సహా సుమారు 10 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. అయినా తాము సీబీఐని స్వాగతిస్తామని, తాము నిజాయితీపరులమని కేజ్రీవాల్ అన్నారు. తాము లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామని, ఇలాంటి మంచి పనులు చేసేవారిని వేధించడం దురదృష్టకరం అని ఆవేదనగా అన్నారు. బహుశా అందుకేనేమో మన దేశం ప్రపంచంలోనే నెంబర్వన్గా మారలేదు అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వాస్తవానికి గతనెలలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఎక్సూక్యూజ్ పాలసీ 2021-22 అమలులో అవతవకలపై సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. ఐతే ఆయన మనీష్ సిసోడియా కూడా ఈ పాలసీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ... సీబీఐతో విచారణ జరిచాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు ఢిల్లీ సీఎం గతంలో కూడా సీబీఐ దాడులు జరిగాయని అప్పుడు కూడా ఏమీ కనుగొనబడలేదని చెప్పారు. అంతేగాదు తనపై కూడా చాలా కేసులు నమోదయ్యాయని, వాటిలో ఏది నిజం అని తేలలేదు కాబట్టి ఇప్పుడూ కూడా ఏం జరగదని ధీమాగా అన్నారు. जिस दिन अमेरिका के सबसे बड़े अख़बार NYT के फ़्रंट पेज पर दिल्ली शिक्षा मॉडल की तारीफ़ और मनीष सिसोदिया की तस्वीर छपी, उसी दिन मनीष के घर केंद्र ने CBI भेजी CBI का स्वागत है। पूरा cooperate करेंगे। पहले भी कई जाँच/रेड हुईं। कुछ नहीं निकला। अब भी कुछ नहीं निकलेगा https://t.co/oQXitimbYZ — Arvind Kejriwal (@ArvindKejriwal) August 19, 2022 (చదవండి: కేజ్రీవాల్ ఎఫెక్ట్.. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట సీబీఐ రైడ్స్) -
మీ వారసున్ని సిఫార్సు చేయండి.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐని సిఫార్సు చేయాల్సిందిగా కేంద్రం ఆయన్ను కోరింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం జస్టిస్ రమణకు లేఖ రాసింది. ఆయన పదవీకాలం ఆగస్టు 26తో ముగియనుంది. పదవీ విరమణ చేసే సీజేఐ తన వారసునిగా సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి పేరును సూచించడం సంప్రదాయంగా వస్తోంది. సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్ రమణ తర్వాత న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఉన్నారు. అయితే ఆయన పదవీకాలం నవంబర్ 8 వరకే ఉంది. సీజేఐగా ఎంపికైతే రెండున్నర నెలలే పదవిలో కొనసాగుతారు. -
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం మళ్ళీ పాత పాట
-
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం మళ్లీ పాత పాట
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని హామీలు చాలావరకు అమలు చేశామని, మిగతా కొన్ని అంశాలు అమలులో వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, విద్యా సంస్థల ఏర్పాటుకు చట్టంలో పదేళ్ల కాల వ్యవధిని నిర్దేశించారన్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంబంధిత మంత్రిత్వ శాఖలు/డిపార్ట్మెంట్లతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చట్టంలోని వివిధ నిబంధనల అమలు పురోగతిని సమీక్షిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 28 సార్లు సమీక్షా సమావేశాలు జరిగాయని కేంద్రమంత్రి వెల్లడించారు. మరోవైపు పద్నాలుగవ ఆర్థిక సంఘం (ఎఫ్ఎఫ్సి) రాష్ట్రాల మధ్య పన్నుల సమాంతర పంపిణీలో సాధారణ కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల మధ్య ఎటువంటి వ్యత్యాసాన్ని చూపలేదన్నారు. ఎఫ్ఎఫ్సి సిఫారసుల ప్రకారం, 2015–20 కాలానికి రాష్ట్రాలకు నికర భాగస్వామ్య పన్నుల వాటాను 32% నుంచి 42%కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. అంతేగాక 2020–21, 2021–26 కాలానికి పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ కూడా 41% వద్ద అలాగే కొనసాగించిందని తెలిపారు. కాగా పన్నుల పంపిణీ ద్వారా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వనరుల అంతరాన్ని సాధ్యమైనంత వరకు భర్తీ చేయడమే దీని ఉద్దేశ్యమన్నారు. అలాగే, డెవల్యూషన్ మాత్రమే అంచనా వేసిన అంతరాన్ని పూడ్చలేని రాష్ట్రాలకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు గ్రాంట్లు అందించినట్లు టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి బదులిచ్చారు. చదవండి: మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు: ఎంపీ వంగా గీత -
కోర్టును సందర్శించనున్న పార్లమెంటరీ కమిటీ
విశాఖ లీగల్: కేంద్ర పార్లమెంట్ వ్యక్తిగత, ప్రజా సమస్యల లా అండ్ జస్టిస్ కమిటీ ఈ నెల 23న నగరంలో పర్యటించనుంది. ఈ మేరకు విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వైద్యుల నవీంద్ర ప్రసాద్, సీనియర్ న్యాయవాది నాదెళ్ల వెంకటసుమన్ మంగళవారం కమిటీ సభ్యులను కలిశారు. కమిటీలో సునీల్కుమార్ మోదీ(బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి), కమిటీ చైర్మన్ కనకమేడల రవీంద్ర కుమార్లు ఉన్నారు. పార్లమెంటరీ కమిటీ ఈ నెల 23న విశాఖ జిల్లా కోర్టును సందర్శిస్తారు. కోర్టులో మౌలిక సదుపాయాలు, భవనాలు, ఇరత అంశాలను పరిశీలించి పార్లమెంట్కి నివేదిక సమర్పిస్తారు. (చదవండి: దర్జీ సంతసం) -
వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారా?: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: నీట్ పీజీ–21 కౌన్సిలింగ్లో ఏకంగా 1456 సీట్లు ఖాళీగా మిగిలిపోవడంపై సుప్రీంకోర్టు విస్మయం వెలిబుచ్చింది. దేశమంతా డాక్టర్ల కొరతతో అల్లాడుతుంటే ఇదేం నిర్వాకమంటూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) తీరును తూర్పారబట్టింది. మెడికల్ పీజీ ఖాళీల భర్తీకి ప్రత్యేక కౌన్సిలింగ్ చేపట్టేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, అనిరుద్ధ బోస్లతో కూడిన వెకేషన్ బెంచ్ బుధవారం విచారించింది. ‘‘ఒక్క సీటు మిగిలినా దాన్ని ఖాళీగా పోనీయొద్దు. అది మెడికల్ కౌన్సిల్ బాధ్యత. కానీ ఏటా ఇదే సమస్య పునరావృతమవుతోంది. ఇన్ని సీట్లు ఖాళీగా మిగిలిపోతే ఎలా?’’ అంటూ తూర్పారబట్టింది. సీట్ల సంఖ్య, అడ్మిషన్ల సంఖ్య వెల్లడికి కటాఫ్ డేట్ ఉండాలని మేం గతంలోనే తీర్పు ఇచ్చాం. అయినా కౌన్సెలింగ్ మధ్యలో సీట్లను ఎందుకు జోడిస్తున్నారు? ఇలాంటి చర్యలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఎంతటి ఒత్తిడి పడుతుందో ఆలోచించారా? స్టూడెంట్ల భవిష్యత్తుకు సంబంధించిన విషయమిది. అహర్నిశలూ పట్టుదలగా చదివి పరీక్ష రాయాలి. 99 శాతం తెచ్చుకున్నా చివరికిలా అడ్మిషన్ సమస్యలు! ఇలాంటి పరిస్థితి వారినెంతటి నరకంలోకి నెడుతుందో మీకు అర్థమవుతోందా?’’ అని ప్రశ్నించింది. కేంద్రం తరఫున వాదించాల్సిన అదనపు సొలిసిటర్ జనరల్ బల్బీర్సింగ్ వ్యక్తిగత సమస్యతో రాలేకపోయినందున వాయిదా ఇవ్వాలన్న విజ్ఞప్తికి తిరస్కరించింది. ‘‘ఇది వైద్య విద్యార్థుల హక్కులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం. పైగా సుప్రీంకోర్టులో కేంద్రానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఒక్క ఏఎస్జీ మాత్రమే లేరుగా!’’ అని పేర్కొంది. మొత్తం సీట్లు, ఖాళీలు, అందుకు కారణాలతో 24 గంటల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని, ఎంసీసీని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. అడ్మిషన్ల వ్యవహారాలు చూసే డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ గురువారం హాజరవాలని ఆదేశించింది. విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకుంటే వారికి పరిహారమివ్వాల్సిందిగా ఆదేశాలిస్తామని పేర్కొంది. చదవండి: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆహుతైన కార్లు, బైక్లు, రిక్షాలు, ఫొటోలు వైరల్ -
రెండు నెలల పాటు 'హర్ ఘర్ దస్తక్' కరోనా వ్యాక్సిన్ ప్రచారం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి దేశం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. అందువల్ల మళ్లీ ఆ మహమ్మారి దరిదాపుల్లోకి రాకుండా ముందస్తు చర్యగా మరోసారి సమర్ధవంతమైన కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఆ దిశగా జూన్ నుంచి రెండు నెలల పాటు 'హర్ ఘర్ దస్తక్' ప్రచారం 2.0 కోసం ప్లాన్ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. అంతేకాదు ఇంకా మెదటి, రెండు డోసుల వ్యాక్సిన్ను తీసుకోవల్సిన వారందరికీ వ్యాక్సిన్లు వేయడమే కాకుండా అందరూ వ్యాక్సిన్లు తీసుకునేలా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. "ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రజలందరికీ మొదటి, రెండు డోసుల, బూస్టర్ డోస్లు వేయడం, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, కళాశాలలోని వారందరూ వ్యాక్సిన్లు తీసుకునేలా దృష్టిసారించడం తదితరాలు హర్ ఘర్ దస్తక్ 2.0' ప్రధాన లక్ష్యాలని తెలిపింది. వ్యాక్సిన్ డ్యూ-లిస్ట్ల ఆధారంగా సమర్ధవంతంగా పర్యవేక్షించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఆసుపత్రులలో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారందరికి వ్యాక్సిన్ డోస్లు అందేలే సమీక్షించాలని తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రకియను సమర్ధవంతంగా నిర్వహించేలా కమ్యూనికేషన్ వ్యూహాన్ని అనుసరించాలని స్పష్టం చేసింది. అలాగే కరోనా వ్యాక్సిన్ అమూల్యమైన జాతీయ వనరు అని, అది వృధా కాకుండా చూసుకోవాలని ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ నొక్కి చెప్పారు. ఫస్ట్ ఎక్స్పైరీ ఫస్ట్ అవుట్ సూత్రం ఆధారంగా గడువు ముగిసిపోనున్న బ్యాలెన్స్ వ్యాక్సిన్ మోతాదులను త్వరితగతిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వినియోగించిలే క్రియాశీలక పరివేక్షణ చేపట్టాలన్నారు. డిసెంబర్ 2021 నుంచి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వారి డిమాండ్కి అనుగుణంగా వ్యాక్సిన్ డోస్లను సరఫరా చేశామని చెప్పారు. (చదవండి: పటియాలా కోర్టులో లొంగిపోయిన సిద్ధూ) -
అంచనాలకు మించి టెట్ దరఖాస్తులు...పరీక్ష కేంద్రాలు బ్లాక్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కోసం పరీక్ష కేంద్రాల ఎంపికకు అవకాశం నిలిచిపోయింది. దరఖాస్తులు సమర్పించేందుకు మరో రెండురోజులు గడువు ఉండగానే హైదరాబాద్– రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం లేకుండా బ్లాక్ అయింది. నగరం నుంచి అంచనాలకు మించి దరఖాస్తులు వస్తుండటంతో పరీక్ష కేంద్రాల జాబితా నుంచి గ్రేటర్ జిల్లాలు తొలగింపునకు గురయ్యాయి. వాస్తవంగా టెట్ పరీక్ష ఎంత మంది రాస్తారన్న అంశంపై సంబంధిత అధికారులు సరిగా అంచనా వేయలేకపోయారు. ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు సంఖ్య అభ్యర్థులను ఇబ్బందుల్లో పడేసింది. టెట్ పరీక్ష కోసం గత నెల 26 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా.. ఈ నెల 12తో గడువు ముగియనుంది. ఫీజు చెల్లింపునకు మాత్రం నేటితో (సోమవారం) ఆఖరిరోజు. పరీక్షకు హజరయ్యేందుకు ఆ¯న్లైన్లో టెట్ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉండగా, సర్వర్ సమస్య, నెట్ సెంటర్లలో రద్దీ తదితర కారణాలతో ఆఖరులో దరఖాస్తు చేసుకోవచ్చని భావించిన వారితో పాటు ఇప్పటికే ఫీజు చెల్లించి అప్లికేషన్ పూర్తి చేయని వారికి సైతం షాక్ తగిలినట్లయింది. లక్ష మందికి పైగా.. మహానగర పరిధిలో సుమారు లక్ష మందికి పైగా బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన, పూర్తి చేస్తున్న అభ్యర్థులు ఉన్నట్లు అంచనా. దీంతో కొత్త, పాత వారితో కలిపి దరఖాస్తులు సంఖ్య ఎగబాగుతున్నట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షలకు నగరంలో కోచింగ్ తీసుకుంటున్న అభ్య ర్థులు సైతం టెట్ పరీక్ష కోసం ఇక్కడి కేంద్రాలను ఎంపిక చేసుకోవడంతో ఊహించిన దానికంటే అధికంగా దరఖాస్తులు నమోదవుతున్నాయి. వాస్తవంగా టీచర్ల పోస్టుల కోసం అయిదేళ్లుగా నోటిఫికేషన్ లేకుండాపోయింది. 2017లో టీఆర్టీ నిర్వహించగా.. ఇప్పటివరకు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడంతో.. ప్రభుత్వం ఎలాగైనా టీచర్ పోస్టులను భర్తీ చేస్తుందనే నమ్మకంతో ఏటా బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 47 ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కాలేజీలుండగా అందులో ప్రతి ఏటా 5,640 మంది విద్యార్థులు బీఈడీ కోర్సు పూర్తిచేస్తూ వస్తున్నారు. 12 డీఈడీ కళాశాలల్లో ఏటా 480 మంది కోర్సులను పూర్తిచేస్తున్నారు. బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసి టెట్ కోసం ఎదురుచూస్తున్న వారితోపాటు పాత అభ్యర్థులు సైతం ఈసారి దరఖాస్తు చేసుకుంటుండంతో సంఖ్య మరింత ఎగబాగుతోంది. సొంత జిల్లాలో చాన్స్ మిస్.. టెట్ పరీక్ష కేంద్రాల జాబితాను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు బ్లాక్ కావడంతో అభ్యర్థులు సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళా అభ్యర్ధులైన గర్భిణులు, చిన్నపిల్లల తల్లులతో పాటు వికలాంగులకు ఇతర ప్రాంతాలకు వెళ్లి పరీక్ష రాయడం మరో పరీక్షగా తయారైంది. ఈసారి బీఈడీ అభ్యర్థులకు రెండు పేపర్లకు చా¯న్స్ ఉండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అవకాశం ఉన్నా.. మహానగర పరిధిలో మరిన్ని పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉన్నా.. జాబితా నుంచి నగర జిల్లాలు తొలగించడం విస్మయానికి గురిచేస్తోంది. నగరం చుట్టూ ఇంజినీరింగ్, ఇతర కాలేజీలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలోనే సగానికిపైగా అభ్యర్థులు నగర పరిధిలోనే పరీక్షలు రాసేవారు. ఈసారి మాత్రం పరీక్ష కేంద్రాలు పరిమితి సంఖ్యలో కేటాయించి బ్లాక్ చేయడం పట్ల అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది. మరోవైపు టెట్ అప్లికేషన్ల సందర్భంలో, ఇతర సమాచారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు కూడా పనిచేయడం లేదు. టెట్ దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్కు అవకాశం లేకుండా పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అప్లికేషన్లలో టెక్నికల్, టైప్ ఎర్రర్స్తో పాటు ఫొటోలూ సరిగా రాలేదు. వాటిని సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ లేక అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. (చదవండి: చదివింపుల్లేవ్.. విదిలింపులే!) -
అధికార కేంద్రంలోనే పుట్టాను...కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ!
న్యూఢిల్లీ: కేంద్రలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన్పటికీ తనకు అధికార పగ్గాల పై ఆసక్తి లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన న్యూఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ...ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ....."వారంతా అధికారం కోసం ప్రయత్నిస్తున్న రాజకీయ నాయకులు. అధికారాన్ని పొందడం గురించే ఆలోచిస్తారు. నేను అధికార కేంద్రంలోనే పుట్టాను కానీ నాకు నిజాయితీగా దానిపై ఆసక్తి లేదు . నేను నా దేశాన్ని అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తాను అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అత్యంత ప్రభావంతమైన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కీలక కాంగ్రెస్ నాయకుడు. ఆయన తాతయ్య, నానమ్మ, తండ్రి కూడా ప్రధానులుగా సేవలందించిన సంగతి తెలిసిందే. అలాగే రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక వాద్రా కూడా భారత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నవారే. అంతేకాదు ఆ ప్రసంగంలో రాహుల్ గాంధీ యూపీ సీనియర్ రాజకీయ నాయకురాలు అయిన బీఎస్సీ అధినేత్రి మాయవతి పై విరుచుకుపడ్డారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఆమె ఎలాంటి ఎఫర్ట్ పెట్టి పనిచేయలేదని ఆరోపించారు. ఈసారి ఆమె దళితుల కోసం పోరాడలేదని విమర్శలు గుప్పించారు. (చదవండి: ఆప్కు భారీ దెబ్బ.. బీజేపీలోకి కీలక చేరికలు! కేజ్రీవాల్ తీరువల్లే..) -
కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ.. ఏమన్నారంటే..?
సాక్షి, హైదరాబాద్: సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోదీ పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. పెట్రో ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్టు పెరిగినా తగ్గినా దేశంలో రేటు పెంచడమే తమ పనిగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందని ధ్వజమెత్తారు. చదవండి: వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్.. ఖమ్మంలో విచిత్ర పూజలు.. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక బీజేపీ అవలంబిస్తున్న అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణం. పన్నులు పెంచడమే పరిపాలనగా భ్రమిస్తోంది. దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాల నుంచి 26.51 లక్షల కోట్ల రూపాయల పెట్రో పన్నును వేసిన పనికిమాలిన ప్రభుత్వం బీజీపిదే. ఒక్కో కుటుంబం నుంచి లక్ష రూపాయాల పెట్రో పన్నును కేంద్రం దోచుకుంది. ప్రతిది దేశం కోసం ధర్మం కోసం అంటారు. ఈ దోపిడీ కూడా... దేశం కోసం.. ధర్మం కోసమేనా?. ఒకవైపు భారీగా పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రం నీతిలేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలన్న వితండ వాదం చేస్తుంది. పెట్రో ధరల పేరిట ప్రజల జేబులను దోచుకుంటున్న పార్టీ బీజేపీ. అందుకే అచ్చేదిన్ కాదు అందర్నీ ముంచే దిన్ అనుకుంటున్నారు. ప్రజలను దోపిడి చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రధానమంత్రి పెట్రో పన్ను యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలను ప్రధాని క్షమాపణ కోరాలి. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజలు తిరస్కరించడం ఖాయం’’ అంటూ కేటీఆర్లో లేఖలో దుయ్యబట్టారు. లేఖలో ఏమన్నారంటే.. ప్రతీ రోజూ ప్రజల రక్తం పీల్చేలా పెంచుతున్న పెట్రో ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వానికి ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఒకవైపు నిరంతరం ధరలను పెంచుతూనే మరోవైపు ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టే ఒక కుటిల ప్రయత్నానికి కేంద్రంలోని బీజేపీ ఒడిగడుతుంది. నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా బలాదూర్గా తిరిగొస్తుంది. అందుకే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీగా పెట్రో రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలు, అది చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకే ఈ లేఖ రాస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోసి, పేదల బాధల పట్ల మొసలి కన్నీరు కార్చిన నరేంద్ర మోదీ, అధికారంలోకి వచ్చినంక ప్రజల్ని లెక్క చేయకుండా, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి పాలిస్తున్నారు. నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తొలినాళ్ల నుంచే తన చేతకానితనం, తమకు అస్సలు తెలియని ఆర్థిక విధానాలతో ప్రజల్ని పీడించుకు తింటున్నది కేంద్ర ప్రభుత్వం. నేనిలా విమర్శించడానికి అడ్డూ అదుపు లేకుండా రోజువారీగా పెరుగుతున్న పెట్రో రేట్లు, ఆకాశాన్ని దాటి అంతరిక్షానికి చేరుకుంటున్న నిత్యావసరాల ధరలే కారణం. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోదీ గారి పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయింది. ధరలను అదుపు చేయడం చేతగాని మోదీ ప్రభుత్వం అందుకు కారణాలుగా చెపుతున్న అంశాలన్నీ శుద్ధ అబద్దాలే. అంతర్జాతీయ ముడి చమురు సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులనీ కొన్నిరోజులు, ముడి చమురు ధరల పెరుగుదల అని ఇంకొసారి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అని ఇంకొన్ని రోజులు బీజేపీ నేతలు కహానీలు చెప్పారు. కాని ఇదంతా నిజం కాదు. అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ లో కూడా ధరలు పెరుగుతున్నాయని చెపుతున్న కేంద్రమంత్రులు అక్కడ లీటర్ పెట్రోల్ రేట్ మనకంటే తక్కువే అన్న సంగతిని కావాలనే దాస్తున్నారు. అంతెందుకు పక్కనున్న దాయాది దేశాలతో పాటు, అర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోనూ ఇప్పటికి అత్యంత చవక ధరకే పెట్రో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. 2014 లో బిజెపి ప్రభుత్వం గద్దెనెక్కిన నాటికి అంతర్జాతీయంగా ఉన్న ముడిచమురు ధర సుమారు 105 డాలర్లు. ఆ తర్వాత వివిధ కారణాల వలన ఒకానొక దశలో సుమారు 40 డాలర్ల దిగువకు ముడిచమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రో ధరలను బీజేపీ ప్రభుత్వం పెంచుతూనే ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలంటే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి కనికరం లేదనడానికి కరోనా సంక్షోభం కాలంలో పెంచిన ఎక్సైజ్ సుంకమే సాక్ష్యం. కరోనా సంక్షోభంలో బ్యారెల్ ముడిచమురు ధర 20 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఫలితంగా దేశంలో భారీగా పెట్రో రేట్లు తగ్గాల్సి ఉండే. కాని కరొనా సంక్షోభంలో వలస కూలీలను వేల మైళ్లు నడిపించిన కనికరంలేని మోడీ ప్రభుత్వం మాత్రం ప్రజలు తగ్గిన ధరల ప్రయోజం పొందకుండా ఎక్సైజ్ సుంకాన్ని 20 రూపాయలు పెంచింది. దీంతో తక్కువ రేటుకు పెట్రో ఉత్పత్తులను మన దేశ ప్రజలు పొదలేకపోయారు. 2014లో సుమారు 70.51 రూపాయలుగా ఉన్న పెట్రోల్ ధరను, రు.53.78 గా ఉన్న డీజిల్ ధరను క్రమంగా పెంచుతూ ఈరోజుకి 118.19 కి, డీజిల్ ను 104.62 కు పెంచింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర 106 డాలర్లుగా ఉన్నది. 2014 లో క్రూడ్ ఆయిల్ కు ఎంత ధర ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. కాని 2014లో మనదేశంలో లీటర్ పెట్రోల్ ఎంత ధరకు దొరికేదో ఇప్పుడు మాత్రం అంతకు దొరకడం లేదు. రేటు రెట్టింపు అయింది. ఇది ఎలా అయింది? ఎందుకు అయింది? ఏ ప్రయోజనాల కోసం ఇలా ధరలను ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక బీజేపీ అవలంబిస్తున్న అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణం. సంపదను సృష్టించే తెలివి లేక, చేతిలో ఉన్న అధికారంతో విపరీతంగా పన్నులు పెంచుతూ దాన్నే సుపరిపాలనగా భావిస్తున్న భావదారిద్ర్యంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఉన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాలపై ఏడున్నర సంవత్సరాలుగా 26.51 లక్షల కోట్ల రూపాయల పెట్రో పన్నును వేసిన పనికిమాలిన ప్రభుత్వం బీజీపిదే. అంటే సగటున ఒక్క కుటుంబం నుంచి లక్ష రూపాయలను దౌర్జన్యంగా పెట్రో ధరల పెంపు పేరుతో లూఠీ చేసింది మోడీ ప్రభుత్వం. ప్రతిది దేశం కోసం ధర్మం కోసం అంటారు. ఈ దోపిడీ కూడా... దేశం కోసం.. ధర్మం కోసమేనా? దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. అంతర్జాతీయంగా చవక ధరలకు పెట్రో ఉత్పత్తులను కొని అధిక ధరలకు దేశ ప్రజలకు అమ్ముకుంటున్న దళారి ప్రభుత్వం నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం. బహిరంగంగా తాను చేస్తున్న దోపిడిని రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టి చేతులు దులుపుకుంటున్న బట్టేబాజ్ సర్కార్ కేంద్రంలో ఉంది. ఒకవైపు భారీగా పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రం నీతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలన్న వితండ వాదాన్ని తీసుకొచ్చింది. ఇందులోని మర్మాన్ని సవిరంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 2014కు ముందుకు పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.9.48గా ఉండేది. అధికారంలోకి వచ్చినంక మోదీ దాన్ని రూ.32.98కి పెంచారు. గతేడాది కాస్త తగ్గించి దాన్ని రూ.27.90 చేశారు. ఈ ఎక్సైజ్ డ్యూటీలో 41 శాతం రాష్ట్రాలకే తిరిగి వస్తుందంటూ కేంద్ర మంత్రులతో పాటు వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ సోషల్ మీడియాలో డప్పు కొడుతున్నది. కాని ఇది పచ్చి అబద్ధం. పెట్రోల్ ధరలో ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న దాంట్లో అన్ని రాష్ట్రాలతో పంచుకునేది బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే. ఇప్పుడున్న పెట్రో ధరలో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఒక రూపాయి 40 పైసలు మాత్రమే. ఇందులో నుంచి 41 శాతాన్ని అంటే అక్షరాల 57 పైసల్ని కేంద్రం, అన్ని రాష్ట్రాలకు పంచుతుంది. ఇందులో తెలంగాణ వాటా 2.133 శాతం. అంటే లీటరుకు 0.01 పైసలు. కానీ 28 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ ముక్కుపిండి వసూలు చేస్తున్న మోదీ సర్కార్, అందులో నుంచి ఆఠాణా మాత్రమే రాష్ట్రాలకు ఇస్తూ ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు గప్పాలు కొట్టుకుంటుంది. రాష్ట్రాలను బలహీనపరిచే కుట్రలను అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి అమలు చేస్తున్న నరేంద్ర మోదీ, పెరుగుతున్న పెట్రో ధరలతో కేంద్ర ప్రభుత్వ ఖజానా మాత్రమే నిండేలా చూసుకుంటున్నారు. అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుంకాల రూపంలో కాకుండా సెస్సుల రూపంలో పెట్రో రేట్లు పెరుగుతున్నాయి. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 18 రూపాయలు, వ్యవసాయ, మౌలిక వసతులు అభివృద్ధి పేరిట రెండున్నర రూపాయలు, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేరిట పదకొండు రూపాయలను ఇలా ప్రతి దానికి ఒక్కో పేరు చెప్పి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీగా 30 రూపాయలకు పైగా సెస్సులను పెట్రో ధరల పేరుతో మోదీ సర్కార్ వసూలు చేస్తోంది.ఇందులో నుంచి రాష్ట్రాలకు దక్కేది గుండు సున్నానే.. ఒక వైపు కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి దాదాపు పెట్రో ధరలను రెట్టింపు చేసినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 2015 నుండి ఇప్పటిదాకా వ్యాట్ టాక్స్ ఒక్క నయాపైసా కూడా పెంచలేదన్న సంగతిని ప్రజలంతా గమనించాలని కోరుతున్నాను. పెట్రో ధరల పేరిట పట్టపగలు ప్రజల జేబులను దోచుకుంటున్న పార్టీ బీజేపీ అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే అచ్చేదిన్ కాదు అందర్నీ ముంచే దిన్ అనుకుంటున్నారు. దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు రావాలి. కానీ బీజేపీ అవకాశవాద, అసమర్థ విధానాలను చూసిన తర్వాత తరచూ ఎన్నికలు వస్తే బాగుంటుందని, అట్లయిన పెట్రోలు ధరల పెంపు ఆగుతుందన్న ఆలోచనల్లోకి ప్రజలు వచ్చారు. పెట్రో ధరల పెంపును ఒక రాజకీయ అంశంగా వాడుకుంటున్న బీజేపీ ఎన్నికల తర్వాత అత్యంత కర్కశంగా వరుసగా పెట్రో ధరలను పెంచుకుంటూ పోవడాన్ని అలవాటుగా మార్చుకుంది. 2017 గుజరాత్ ఎన్నికలు, 2019 సాధారణ ఎన్నికలు, 2020లో 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కొన్ని వారాలు, నెలలపాటు పెట్రో ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. కాని ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి దాదాపు ప్రతీ రోజూ పెట్రో ధరల్ని మోదీ సర్కార్ పెంచుకుంటూ పోతున్నది. గత పదిహేను రోజుల్లో 13 సార్లు పెట్రోల్ ధరలను పెంచి ప్రజలన్నా, ప్రజల కష్టాలన్నా తనకు ఎంత చులకనభావం ఉందో మోదీ సర్కార్ చాటుకుంది. నాలుగు రాష్ట్రాల్లో గెలిపించిన పాపానికి. ప్రజలకు మోదీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదే. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తనకు చేతకాని పాలనను పక్కనపెట్టి కేవలం పెట్రో ధరలను పెంచడాన్నే అలవాటుగా మార్చుకుందంటే అతిశయోక్తి కాదు. పెట్రో ధరలు ఎందుకు పెరుగుతున్నాయని అడిగిన ప్రతీసారి అదరకుండా, బెదరకుండా అబద్దాన్ని చెప్పే దొంగ నేర్పు ప్రస్తుత కేంద్ర మోదీ సర్కార్ కు పుష్కలంగా ఉంది. అందుకే తాజా ధరల పెరుగుదలకు రష్యా, ఉక్రెయిన్ సంక్షోభాన్ని సాకుగా కేంద్ర మంత్రులు చూపిస్తున్నారు. లోక్ సభలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి రామేశ్వర్ తేలి చేసిన ప్రకటన ప్రకారం రష్యా నుంచి కేవలం ఒక్క శాతం కన్నా తక్కువ క్రూడాయిల్ ను మనం దిగుమతి చేసుకుంటున్నాము. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, నైజీరియా, అమెరికా నుంచే మనం అత్యధికంగా పెట్రో ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటున్నాము. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ఈ దేశాల నుంచి మనకు పెట్రో ఉత్పత్తులు రావడంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కాని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఒక్క శాతాన్ని చూపించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్నారు. ఇలా పదే పదే అబద్దాలను వల్లె వేసీ..వేసీ.. బీజేపీ నాయకుల నోట్లోని నాలుకలు కూడా సిగ్గుపడుతున్నాయి. మానవత్వం అస్సలు లేని ప్రభుత్వం దేశ ప్రజల నెత్తి మీద తిష్ట వేసుకుని కూర్చుంది. కరోనా సంక్షోభాన్ని అత్యంత్య దారుణంగా మార్చిన మోదీ సర్కార్, ఆ టైంలో పంపిణీ చేసిన ఆహార ధాన్యాలు, వ్యాక్సిన్ల ఖర్చును పెట్రోల్ ధరలతో వసూలు చేసుకుంటామని సిగ్గులేకుండా ప్రకటించింది. ప్రభుత్వ పరిపాలన అంటే ప్రజలపై భారీగా పన్నులు వసూలు చేయడమే అన్న స్ఫూర్తితోనే నరేంద్ర మోదీ సర్కార్ పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రజలను దోపిడీ చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రధానమంత్రి పెట్రో పన్ను యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందనిపిస్తుంది. సమర్థ విధానాలు, నిర్ణయాలతో సంపదను సృష్టించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ.. సృష్టించిన సంపదను ప్రజలకు పంపిణీ చేయాలి కానీ కేవలం పన్నుల పేరిట ప్రజలను పీల్చిపిప్పి చేయడమే పరిపాలనగా భావిస్తున్న, బీజేపీ ప్రభుత్వాన్ని కచ్చితంగా ప్రజలు సాగనంపే రోజు దగ్గర పడింది. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం ఖాయం పెట్రో రేట్ల పెరుగుదలతో ప్రతీ ఒక్కరి దైనందిత జీవితం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇంట్లో వాడే గ్యాస్, పప్పు, ఉప్పు, ఔషధాల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సామాన్యుడి బతుకు దిన దిన గండంగా మారింది. బీజేపీ హయాంలో గ్యాస్ బండ.. మోయలేని గుదిబండగా మారింది. దీంతో మోడీ చెప్పిన పకోడీలు అమ్ముకుని బతికే పరిస్థితి కూడా లేదు. పెట్రో ధరల పెంపుతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలోకి వచ్చింది. ప్రజలు బైకులు, కారులు వదిలేసే పరిస్ధితి నెలకొంటున్నది. వంట గ్యాస్ వెయ్యి దాటడంతో మళ్లీ కట్టెల పొయ్యే దిక్కైంది. వ్యవసాయ పెట్టుబడివ్యయం పెరిగిపోతున్నది. ఇన్నేళ్ల పాలనలో బీజేపీ సాధించిన ఘనకార్యాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి పెట్రో వాతలు.. ధరల మోతలే.. అధికారంలోకి రావడానికి ముందు పెట్రో ధరల పెంపును రాజకీయాస్త్రంగా మార్చుకున్న నరేంద్ర మోదీ ఆనాటి తన మాటలు, చేతలను ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు పోయి ఆదాయాలు తగ్గి, నిరుద్యోగిత పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో రేట్ల పెంపుతో ప్రజా జీవితం అస్తవ్యస్తం అవుతున్న విషయాన్ని ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించాలి. తన అసమర్థ ప్రభుత్వ పనితీరు, వైఫల్యాల పై వివరణ ఇవ్వాలి. పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలను క్షమాపణ కోరాలి. పెట్రో ధరల పెంపు ధర్మసంకటం అన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాటల్ని ప్రజలు సీరియస్గా పట్టించుకున్న రోజు, ధర్మ సంకటాన్ని వీడి కేంద్ర ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి త్వరలోనే వస్తది. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజాక్షేత్రంలో తిరస్కారం తప్పదు అన్న సంగతిని గుర్తుంచుకుని వెంటనే పెట్రో, గ్యాస్ ధరల పెంపుని ఆపాలి. ప్రజలకు ప్రయోజనం కలిగేలా పెట్రో రేట్లను తగ్గించేందుకు వేంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేశ ప్రజల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. -
మండుటెండలోనూ తప్పని పని.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు కూలీలను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ఇప్పటికే వేసవి భృతి, మజ్జిగ పంపిణీ వంటి అదనపు సౌకర్యాల్లో కోత పెట్టిన కేంద్రం తాజాగా మరో ఇబ్బందికర నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు పూటల పని విధానం అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. దీనిని కూలీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాగైతే పనికి వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి: కలెక్టర్ చెట్టు కింద కూర్చోలేరుగా: సుప్రీంకోర్టు ఇప్పటికే వేసవి భృతి రద్దు జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కూలీలు చేసిన పనిని కొలతలు ఆధారంగా లెక్కించి రోజుకు రూ.245 వేతనం చెల్లించాలి. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నాలుగైదు గంటల పాటు కష్టపడుతున్నా సగటు కూలి రూ.150 నుంచి రూ.190 మధ్యనే లభిస్తోంది. ఎండాకాలంలో పనులు చేసే కూలీలకు వేసవి భత్యం కింద మూడు నెలల పాటు సగటున 25 శాతం వేతనం అదనంగా చెల్లించాలి. అయితే ఈ పథకం కేంద్రం అ«దీనంలోకి వెళ్లినప్పటి నుంచీ వేసవి భృతిని రద్దు చేశారు. దీంతో వేతనం గిట్టుబాటు కావడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు. రెండు పూటలా సాధ్యమా? ఉపాధి పనులు ప్రస్తుతం ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జాబ్ కార్డు కలిగిన కూలీల కుటుంబాల వారికి కేటాయించిన 100 రోజుల పని దినాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విధిగా పనులకు హాజరు కావాలి. ఎంత మంది పనులకు వచ్చారనే విషయాన్ని ఉపాధి హామీ పథకం మేట్లు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం మరోసారి మస్టర్లో నమోదు చేయాలి. ఇప్పటికే స్థానికంగా పనులు లేక కొన్ని గ్రామాల్లోని కూలీలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. చదవండి: జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ కీలక ఆదేశాలు రెండు పూటల పని విధానంతో గ్రామం నుంచి మండల పరిధిలోని నాలుగు కిలోమీటర్ల వరకూ రెండుసార్లు తిరగలేక కూలీలు పని ప్రదేశంలోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ ఉదయం ఉపాధి పనికి వెళ్లినా.. మధ్యాహ్నం నుంచి వ్యవసాయ పనులు, పశువుల పెంపకం ద్వారా వారు కొంత ఆదాయం పొందేవారు. ఇప్పుడు ఆ అవకాశం ఉండదని కూలీలు వాపోతున్నారు. ఈ పరిణామం ఉపాధి పనులకు వచ్చే కూలీలపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విస్తృతంగా పనులు జరుగుతున్న ప్రస్తుత సమయంలో కేంద్రం విధించిన ఇటువంటి నిబంధనలు కూలీలకు శరాఘాతంగా మారనున్నాయి. కేంద్రం కొత్తగా ఇచ్చిన ఈ జీఓను రద్దు చేయాలని కూలీలు డిమాండు చేస్తున్నారు. కేంద్ర నిబంధనలు పాటిస్తున్నాం ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో నడుస్తోంది. కొత్త ఉత్తర్వులను ఏప్రిల్ 1 నుంచి తప్పకుండా అమలు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ఇక నుంచి రెండు పూటలా పని చేయాలి. అప్పుడే కూలీల ఖాతాల్లో పూర్తి వేతనం జమ అవుతుంది. కచ్చితంగా పని చేయాలని మేం బలవంతం చేయడం లేదు. ఉదయం, సాయంత్రం మస్టర్ అంటే కొంత ఇబ్బందే. భవిష్యత్తులో కూలీల సంఖ్య తగ్గే అవకాశం కూడా ఉంటుంది. – ఎ.ముఖలింగం, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా -
మూడు మున్సిపల్ కార్పోరేషన్లు ఒక్కటిగా...ఆమోదం తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మున్సిపల్ కార్పొషన్ ఎన్నికలు ప్రకటించడానికి ఒక గంట ముందు ఎన్నికలను వాయిదా వేయాలంటూ బీజేపీ ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇలా ఎప్పుడూ జరగలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఆయన ఇది దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు అని కూడా వ్యాఖ్యానించారు. అయినా గత ఏడేనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ అప్పడే ఎందుకు మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేయలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా కేంద్రం మంగళవారం మూడు మున్సిపల్ కార్పొరేషన్ల విలీన ప్రతిపాదన బిల్లును ఆమోదించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేగాదు వచ్చేవారం ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనే మూడు పౌర సంస్థలకు బదులుగా ఒకటి మాత్రమే ఉంటుంది. అయితే ఆప్ మాత్రం బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఈ ఎత్తుగడ వేస్తోందంటూ ఆరోపణలు చేస్తోంది. కానీ ప్రభుత్వ వర్గాలు ప్రతి కార్పొరేషన్కి సంబంధించి ప్రాదేశిక విభజనలు, ఆదాయాన్ని ఇచ్చే సంభావ్యత పరంగా కార్పొరేషన్ త్రివిభజన అసమానంగా ఉన్నందున ఈ విలీన బిల్లు చాలా అవసరం అని నొక్కి చెప్పింది. అంతేగాక మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోందని, పైగా అవి ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించలేని స్థితిలో ఉండటం వల్లే ఢిల్లీలోని పౌర సేవల నిర్వహణలో తీవ్రమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయని వివరించింది. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ చట్టం, 1911 ప్రకారం 2011లో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించారు. కానీ ప్రస్తుతం చట్టంలోని సవరణలతో మూడు కార్పొరేషన్లను ఉపసంహరించి ఏకీకృత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీని ఏర్పాటు చేయనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. (చదవండి: ట్విస్ట్ ఇచ్చిన అఖిలేష్.. ‘యోగితో ఇక తాడో పేడో తేల్చుకుంటా’) -
AP: మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రానికి ఐఎస్ఓ గుర్తింపు
పులిచెర్ల(కల్లూరు)/చిత్తూరు జిల్లా: వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలబడాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలను ప్రారంభించింది. సాగుకు సరైన సమయంలో సాయం అందించాలని ఆర్బీకే సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. అన్నదాతలకు అవసరమైన ఎరువులు, పురుగు మందులను సకాలంలో సరఫరా చేయాలని ఆదేశించింది. రైతాంగానికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ తలలో నాలుకగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సర్కారు ఆశయాలను మతుకువారిపల్లె రైతు భరోసా కేంద్రం అందిపుచ్చుకుంది. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ విశేష సేవలందిస్తోంది. క్షేత్రస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచి ఐఎస్ఓ గుర్తింపు సాధించింది. చదవండి: ఇంత చీప్ ట్రిక్స్ ఎందుకు బాబూ? మండలంలోని మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రానికి విశిష్ట గుర్తింపు లభించింది. ఇక్కడ అమలు చేస్తున్న విధానాలు, రైతులకు అందిస్తున్న సేవలకు ఐఎస్ఓ సర్టిఫికెట్ దక్కింది. అన్నదాతలకు అవసరమైన సలహాలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహార మందుల పంపిణీ, పండించిన పంటల మార్కెటింగ్, అత్యుత్తమ నాణ్యతా సౌకర్యాలు భవనం తదితరాలను ఐఎస్ఓ ప్రామాణికంగా తీసుకుంది. విశిష్ట పురస్కారం సాధించిన మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రం సిబ్బందిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సేవలు.. సౌకర్యాలు మతుకువారిపల్లెలో 1,180 మంది రైతులు ఉన్నారు. సుమారు 715 హెక్టార్ల భూమి సాగులో ఉంది. గ్రామంలో అధికంగా మామిడి, మిరప, చెరుకు, వరి, టమాట పంటలను సాగు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వం 2020 మే 30వ తేదీన మతుకువారిపల్లెలో రైతు భరోసా కేంద్రం ప్రారంభించింది. దీని పరిధిలో మూడు పంచాయతీలను చేర్చింది. ఈ ఆర్బీకే భవనంలో డిజిటల్ లైబ్రరీ, వ్యవసాయ సంబంధిత పుస్తకాలు, టీవీ అందుబాటులో ఉంచింది. దీనికితోడు ఆర్బీకేలో విధులు నిర్వర్తిస్తున్న వ్యవసాయ అసిస్టెంటు, వెటర్నరీ అసిస్టెంటు రైతులకు చిత్తశుద్ధితో సేవలందించారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలను పొలాల సందర్శనకు తీసుకువచ్చి రైతులకు సలహాలు అందించేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం పథకాలను పారదర్శంగా అర్హులందరికీ పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా రైతుభరోసా సొమ్ము అన్నదాతలకు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ–క్రాప్ నమోదు చేసి పంటకు రక్షణ కల్పిస్తున్నారు. భూసార పరీక్షలను ఎప్పటికప్పుడు చేయించి ఏ సమయంలో ఏయే పంటలు సాగు చేయాలనే విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తగ్గిన వ్యయం.. పెరిగిన దిగుబడి మతుకువారిపల్లె రైతులు గతంలో ఎరువుల కోసం పీలేరు, సదుం, కల్లూరుకు వెళ్లేవారు. ఇందుకోసం అదనంగా ఒక్కో రైతుకు రూ.200 నుంచి రూ.500 వరకు ఖర్చయ్యేది. అయితే రైతుభరోసా కేంద్రంలోనే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందుబాటులోకి రావడంతో అదనపు వ్యయం తప్పింది. కియోస్క్ మిషన్ ద్వారా ఎరువులు, మందుల వివరాలతోపాటు మార్కెట్ ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకునే వెసులుబాటు లభించింది. ఆర్బీకే సిబ్బంది పనితీరు కారణంగా గ్రామంలోని రైతులు మంచి ఫలితాలను సాధించారు. ఆధునిక పనిముట్ల వినియోగంతో అధిక దిగుబడి పొందుతున్నారు. వ్యవసాయానికి అండగా నిలిచి, అన్నదాతల ఆరి్ధకాభివృద్ధికి సహకరిస్తూ, అత్యుత్తమ సేవలందిస్తున్న మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రాన్ని ఐఎస్ఓ ప్రశంసించింది. ఉత్తమ సరి్టఫికెట్ను ప్రదానం చేసింది. సిబ్బంది కృషిని అభినందించింది. సకాలంలో ఎరువులు వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత మాకు సకాలంలో ఎరువులు అందుతున్నాయి. బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. వ్యవసాయశాఖ అధికారులు అందుబాటులో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు మా పొలాలను సందర్శించి సలహాలు అందిస్తున్నారు. మా ఆర్బీకే ఇప్పుడు ఐఎస్ఓ గుర్తింపు సాధించడం ఆనందంగా ఉంది. – సి.రాణి, రైతు, మతుకువారిపల్లె జగనన్నకు కృతజ్ఞతలు రైతుభరోసా కేంద్రాల ద్వారా మాకు ఇన్ని సేవలందిస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు. ఆర్బీకే సిబ్బంది మాకు ఎప్పడూ అందుబాటులో ఉంటారు. ఒక పర్యాయం రైతుభరోసా సొమ్ము రాకపోతే వెంటనే ఆధార్ అనుసంధానం చేయించి నగదు అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పెట్టుబడి కోసం అప్పు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆధునిక పనిముట్ల వినియోగంపై మాకు అవగాహన కల్పించారు. – పి.తాతప్ప, రైతు, బోడిరెడ్డిగారిపల్లె ఆనందంగా ఉంది మా రైతుభరోసా కేంద్రానికి ఐఎస్ఓ సరి్టఫికెట్ రావడం ఆనందంగా ఉంది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మేం పనిచేశాం. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిన బాటలో నడిచాం. అన్నదాత ఎప్పుడూ నష్టపోకూడదు అనే సంకల్పంతో విధులు నిర్వర్తించాం. ఆర్బీకే ద్వారా సకాలంలో సేవలందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. మా కష్టానికి గుర్తింపు లభించినట్లు భావిస్తున్నాం. –రోహిణి, వ్యవసాయ అసిస్టెంట్, మతుకువారిపల్లె ఆర్బీకే -
పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ పై మంత్రి అవంతి సీరియస్
-
భారత్లో చదువుతామంటూ...‘ఉక్రెయిన్’ విద్యార్థుల పిటిషన్
న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా ఆగిపోయిన తమ వైద్య విద్యను భారత్లో పూర్తి చేసేందుకు అనుమతించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు శనివారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 21న విచారణ జరిగే అవకాశముంది. ‘‘ఉక్రెయిన్ నుంచి 20,000 మంది భారత వైద్య విద్యార్థులు తిరిగి వచ్చారు. యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేనందున వారి చదువుపై అనిశ్చితి నెలకొంది’’ అని వారి తరఫున కేసు వేసిన ప్రవాసీ లీగల్ సెల్ పేర్కొంది. (చదవండి: పార్శిల్లో రూ.4.45 కోట్ల విలువైన వజ్రాలు) -
ఆప్ స్వీప్కి భయపడే బీజేపీ ఈసీకి లేఖ రాసింది
న్యూఢిల్లీ: ఆప్ స్వీప్కు భయపడి కేంద్రం ఒత్తిడి చేయడంతోనే ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల తేదీలను వాయిదా వేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. అంతేకాదు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల (ఎంసీడీ) ఎన్నికల తేదీల ప్రకటనను వాయిదా వేయడం దేశ ప్రజాస్వామ్యానికే ముప్పు అని కేజ్రీవాల్ అన్నారు. కేంద్రం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ఇదే తొలిసారని చెప్పారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ( నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, తూర్పు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లను) కలపాలని కోరుతున్నందున ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్రం ఈసీకి లేఖ రాయండంతోనే ఎన్నికలు వాయిదా పడ్డాయని చెప్పారు. గత ఏడెనిమదేళ్లుగా కేంద్రంలోనే ఉన్న బీజేపీ ఎన్నడూ ఈ మూడు కార్పొరేషన్లను ఎందుకు కలపలేదని ప్రశ్నించారు. కేవలం ఒక గంట ముందు ఈ మూడు కార్పోరేషన్లు కలపాలంటూ లేఖ రాయడం ఏమిటి అని ఆక్రోశించారు. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్రం కోరడం ప్రజాస్వామ్యానిక మంచిది కాదని హితవు పలికారు. అయినా అలాంటి ఒత్తిడికి ఈసీ తలవంచకూడదని అన్నారు. "ఎన్నికలను రద్దు చేయవద్దని నేను ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎన్నికల సంఘాన్ని బలహీనపర్చడమే కాక దేశాన్ని కూడా బలహీనపరుస్తుంది" అని కేజ్రీవాల్ అన్నారు. (చదవండి: ఫలితాలపై మోదీ కీలక వ్యాఖ్యలు.. సాహెబ్ జీ అంటూ కౌంటర్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్)