
ఫైల్ ఫోటో
కేంద్ర అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ భేటీలో కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్రం కోరనుంది.
సాక్షి, ఢిల్లీ: కేంద్ర అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ భేటీలో కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్రం కోరనుంది. సమావేశానికి వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి హాజరయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు, విశాఖ స్టీల్ప్లాంట్, పోలవరం ప్రాజెక్ట్కు నిధులు, ప్రత్యేక హోదా అంశాలను వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రస్తావించనున్నారు.