రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి | Child killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

Dec 26 2015 2:27 PM | Updated on Apr 3 2019 7:53 PM

కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం పెక్కెర్ల గ్రామంలో ట్రాక్టర్‌పై నుంచి పడి చిన్నారి మృతి చెందాడు.

కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం పెక్కెర్ల గ్రామంలో ట్రాక్టర్‌పై నుంచి పడి చిన్నారి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. జెవిడి పవన్ (11) ట్రాక్టర్ మట్టితో వెళుతున్న ట్రాక్టర్‌పై కూర్చున్నాడు. మూలమలుపు వద్ద జారి కింద పడిపోవడంతో అతడి తలపై నుంచి ట్రాక్టర్ ముందుకు వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో డ్రైవర్ లక్ష్మీనారాయణ అక్కడి నుంచి పరారై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాచారం అందించాడు. పవన్ విజ్ఞాన భారత్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement