మహబూబ్నగర్ : పాలమూరు జిల్లాలో దారుణం జరిగింది. ఇటిక్యాల మండలంలో ఓ విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హతమార్చారు.
పుటాన్దొడ్డి గ్రామానికి చెందిన కిష్టన్న, జయమ్మ దంపతుల కుమారుడు నరేష్ గద్వాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్నాడు. అతడిని సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వెంటాడి నరికి చంపారు. తలను, చేతులను వేరు చేసి మొండాన్ని సమీపంలోని రైలు పట్టాలపై పడేశారు. మంగళవారం ఉదయం స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
డిగ్రీ విద్యార్థిని వెంటాడి చంపారు..
Published Tue, Mar 29 2016 3:31 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
Advertisement
Advertisement