
అరటి పంటను దున్నేస్తున్న రైతులు
అరటి.. లాభదాయకమైన పంట. నిరంతర ఆదాయం.. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం.. వ్యాపారులే చేనుకు వచ్చి తీసుకెళతారు..
దుగ్గొండి: అరటి.. లాభదాయకమైన పంట. నిరంతర ఆదాయం.. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం.. వ్యాపారులే చేనుకు వచ్చి తీసుకెళతారు.. ఇది ఆరునెలల క్రితం మాట. ఇప్పుడు నాణ్యంగా ఉన్న కాయలను కూడా కొనే నాథు డు లేడు. దీంతో చేసేది లేక చేతికందే దశలో ఉన్న తోటలను దున్నేస్తున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని పలు గ్రామాల్లో 400 ఎకరాలలో ఈ యేడు అరటి పంట సాగయింది. గత సంవత్సరం అరటి రైతులకు ఎకరాకు 2 నుంచి 3 లక్షల లాభం రావడంతో ఈ ఏడాది కూడా ఎక్కువ మంది ఈ పంటను సాగు చేశారు. దీంతో డిమాండ్ పడిపోయింది. ఏడాది క్రితం కిలో అరటి కాయలకు రూ.10 నుంచి 20 పలికితే.. ఇప్పుడు 3 నుంచి 5 రూపాయలు మాత్రమే వస్తున్నారుు. ఎకరాకు రూ. లక్ష పెట్టుబడి పెట్టిన రైతులకు రూ.20 వేలు కూడా రావడం లేదు. దీర్ఘకాలిక పంట కావడంతో ఏడాది కాలంలో మరో పంట వేసే అవకాశం లేదు. దీంతో చేసేది లేక రైతులు గెలలు వేసిన అరటి తోటను ట్రాక్టర్ రోటోవేటర్తో దున్ని ఇతర పంటల వైపు చూస్తున్నారు.
లాభం లేదని దున్నేశా..
గతేడాది 1.10 ఎకరాల్లో అరటి సాగు చేశా. మొక్కలు, నేల తయారీ, ఇతర పెట్టుబడి ఖర్చు రూ.లక్ష వరకు అరుుంది. గెలలు బాగానే రావడంతో ఆదాయానికి డోకా లేదని సంబరపడ్డా. వ్యాపారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ ముందుకు రాలేదు. చిల్లర వ్యాపారులకు కొన్ని గెలలు అమ్మితే రూ.20 వేలు వచ్చాయి. ఇక లాభం లేదని కన్నీళ్లు దిగమింగుకుంటూ అరటి తోటను ఆదివారం దున్నేశా. - బుడిగొండ చంద్రయ్య, రైతు, గిర్నిబావి