హయాత్నగర్: రంగారెడ్డి జిల్లాలోని ఓ కిరాణాషాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హయత్ నగర్ మండల పరిధిలోని మునగనూరు రహదారిపై ఉన్న కిరాణకొట్టులో గురువారం మద్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. కాలినీకి చెందిన లక్ష్మయ్య కిరాణాషాపు పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. అగ్నిప్రమాదంతో జీవనోపాధి కోల్పోయానని లక్ష్మయ్య వాపోతున్నాడు. ప్రమాదంలో సూమారు రూ. 30 వేల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ఆయన తెలిపారు.
కిరాణాషాపులో అగ్నిప్రమాదం
Published Thu, Aug 6 2015 1:53 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement