మంత్రి హరీశ్రావుకు రూ.50 లక్షల చెక్కు అందించిన చైర్మన్ రాజు
హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు గ్లాండ్ ఫార్మా చైర్మన్ వీపీఎన్ రాజు రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆయన శనివారం చెక్కును నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావుకు అందజేశారు. ఈ మొత్తాన్ని మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని మల్కబంధం కొత్తపేట్, అల్లీపూర్లోని పెద్దచెరువుల పునరుద్ధరణకు వినియోగించనున్నారు.
అలాగే సోమయాజి అనే ఎన్ఆర్ఐ మిషన్ కాకతీయకు రూ.లక్ష విరాళం ప్రకటించగా, వికాస్రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూ.10వేల చెక్కును మంత్రికి అందజేశారు. మిషన్ కాకతీయకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోందని, ఇప్పటివరకు రూ.42కోట్ల మేర విరాళాలు అందాయని మంత్రి హరీశ్ తెలిపారు.
మిషన్ కాకతీయకు గ్లాండ్ ఫార్మా విరాళం
Published Sun, May 10 2015 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM
Advertisement
Advertisement