ముగ్గురు గల్ఫ్ నకిలీ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు.
మెట్పల్లి(కరీంనగర్): ముగ్గురు గల్ఫ్ నకిలీ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలో పలువురి నుంచి వేల రూపాయలు వసూలు చేసిన వీరిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వీరిని ఈ రోజు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 266 పాస్పోర్టులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.