మహిపాల్‌ కేసులో మధ్యంతర ఉత్తర్వులకు నో | high court not accepting for giving Interim orders to mahipal reddy case | Sakshi

మహిపాల్‌ కేసులో మధ్యంతర ఉత్తర్వులకు నో

Published Fri, Jan 8 2016 2:47 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

మెదక్ జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(టీఆర్‌ఎస్)కి జీతభత్యాలు చెల్లించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్న బీజేపీ నేత రఘునందన్‌రావు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

సాక్షి, హైదరాబాద్:  మెదక్ జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(టీఆర్‌ఎస్)కి జీతభత్యాలు చెల్లించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్న బీజేపీ నేత రఘునందన్‌రావు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఓ పరిశ్రమ యజమానిని బెదిరించి బలవంతంగా రూ.15 లక్షల చెక్కు రాయించుకున్న కేసులో మహిపాల్‌రెడ్డికి రెండున్నరేళ్ల జైలు శిక్ష, జరి మానా విధిస్తూ సంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసును లోతుగా విచారించాల్సిఉందని, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని కోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement