పనిచేస్తున్న కంపెనీకే కన్నం | Hyderabad Police arrest two in Robbery case | Sakshi
Sakshi News home page

పనిచేస్తున్న కంపెనీకే కన్నం

Published Tue, Jun 16 2015 3:48 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Hyderabad Police arrest two in Robbery case

జీడిమెట్ల (హైదరాబాద్) :  ఒకరు కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి, మరొకరు అదే కంపెనీలో పని చేసి మానేసిన వ్యక్తి. ఇద్దరూ కలసి ఓ రాత్రి వేళ కంపెనీలోకి చొరబడి రూ.7 లక్షల విలువైన వస్తువులను చోరీ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను జీడిమెట్ల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఫేజ్-3లో ఉన్న ఆక్వాగార్డు కంపెనీలో కొన్ని రోజుల క్రితం చోరీ జరిగింది. కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు రాజ్‌కుమార్ ప్రసాద్ సింగ్ (19)తో పాటు ఆ కంపెనీ మాజీ కార్మికుడు రాజేష్ (23)లను మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7 లక్షల విలువైన డ్రిప్ ఇరిగేషన్ పరికాలను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement