రోడ్డు ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి | infosis employee dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి

Apr 28 2015 7:54 AM | Updated on Aug 30 2018 3:56 PM

రోడ్డు ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి

నగరంలోని ఔటర్ రింగ్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి చెందింది.

హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి చెందింది. ఈ సంఘటన శంషాబాద్ సమీపంలోని హిమాయత్‌సాగర్ సమీపంలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. నజియా సుల్తానా అనే ఇన్ఫోసిస్ ఉద్యోగిని కారులో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేందుకు విమానాశ్రయానికి వెళుతుండగా మార్గమధ్యలోనే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.

 

దాంతో నజియా సుల్తానా అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు కాగా కారు డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement