మతిస్థిమితం లేని యువతి అదృశ్యం | insane young woman disappears in hyderabad | Sakshi

మతిస్థిమితం లేని యువతి అదృశ్యం

Feb 27 2017 3:39 AM | Updated on Aug 1 2018 2:15 PM

మతిస్థిమితం లేని యువతి అదృశ్యం - Sakshi

మతిస్థిమితం లేని యువతి అదృశ్యం

ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన ఓయూ పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది.

హైదరాబాద్‌: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన ఓయూ పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. హబ్సిగూడలో ఉండే అన్నపూర్ణ కుమార్తె జన్ను మానస(19)కు మతిస్థిమితం లేదు. ఆమె శనివారం సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ప్రధాన రహదారిపై ఓ ఆటో ఎక్కిన ఆమెను...  ఎక్కడకు వెళ్లాలని ఆటో డ్రైవర్‌ అడిగాడు. సరైన సమాధానం చెప్పక పోవడంతో ఆటో డ్రైవర్‌ ఆమెను అక్కడే రోడ్డుపై వదిలిపెట్టి వెళ్లిపోయాడు.

ఎంత వెతికినా మానస కనిపించకపోవడంతో అన్నపూర్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీ సులు తెలిపారు. కాగా, మానస ఇటీవల మరణించిన ‘సాక్షి’ టీవీ రిపోర్టర్‌ జె.శ్రీనివాసులు(జెస్సీ) కుమార్తె. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లినపుడు పసుపు రంగు పంజాబీ డ్రెస్‌ వేసుకుంది. ఆచూకీ తెలిసిన వారు ఓయూ పోలీసుస్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement