జయరాం హత్య కేసు.. రహస్య ప్రాంతంలో విచారణ | Jayaram murder case police investigation | Sakshi
Sakshi News home page

జయరాం హత్య కేసు.. రహస్య ప్రాంతంలో విచారణ

Feb 11 2019 7:43 PM | Updated on Feb 11 2019 7:44 PM

Jayaram murder case police investigation - Sakshi

సాక్షి, హైదరాబాద్ : వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పని మనిషి, వాచ్ మెన్, స్నేహితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. శిఖా చౌదరి, జయరాం మధ్య ఉన్న సంబంధాల పై విచారణ సాగినట్లు సమాచారం. ఓ రహస్య ప్రాంతంలో వీరందరినీ పోలీసులు విచారించారు. త్వరలోనే శిఖా చౌదరికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశం ఉంది.

మరోవైపు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లని నాంపల్లి కోర్టు జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యడీషియల్‌ రిమాండ్‌ విధించింది. వీరిద్దరిని చంచల్‌ గూడ జైలుకు తరలించారు. రేపు పోలీసులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌ల కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. నిందితులిద్దరిపై వారం రోజుల కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement