ఇవేం పిల్ల చేష్టలు? | kcr takes on chandrababu over cancellation of ppas | Sakshi

ఇవేం పిల్ల చేష్టలు?

Jun 19 2014 1:18 AM | Updated on Aug 15 2018 9:20 PM

ఇవేం పిల్ల చేష్టలు? - Sakshi

ఇవేం పిల్ల చేష్టలు?

‘‘ఇవేం పిల్ల చేష్టలు?! తెలంగాణ విద్యుత్ కోటాను అడగకుండా కేంద్రం నుంచి అదనపు కోటాను తెచ్చుకుంటానన్న చంద్రబాబు, ఇప్పుడు తెలంగాణ విద్యుత్‌పై కన్నేశారు. ఇదేం సమన్యాయం?’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు

ఆంధ్రప్రదేశ్ తీరుపై కేసీఆర్ గరం  
పీపీఏల రద్దును వ్యతిరేకిస్తూ రంగంలోకి
కేంద్ర విద్యుత్ మంత్రితో చర్చలు
విభజన చట్టం ప్రకారం జోక్యానికి వినతి
అవసరమైతే ప్రధానితో మాట్లాడతా: సీఎం
కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శికి సీఎస్ లేఖ


హైదరాబాద్: ‘‘ఇవేం పిల్ల చేష్టలు?! తెలంగాణ విద్యుత్ కోటాను అడగకుండా కేంద్రం నుంచి అదనపు కోటాను తెచ్చుకుంటానన్న చంద్రబాబు, ఇప్పుడు తెలంగాణ విద్యుత్‌పై కన్నేశారు. ఇదేం సమన్యాయం?’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మండిపడ్డారు. జెన్‌కో ప్లాంట్లతో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) రద్దు చేసుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాన్ని ఆయన గర్హించారు. దీనిపై బుధవారం సచివాలయంలో ఇంధన శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ‘‘ఏదేమైనా తెలంగాణకు నష్టం జరగకుండా అన్ని చర్యలూ తీసుకుందాం. అవసరమైతే ప్రధానితో నేరుగా మాట్లాడతాను. ఇప్పటికే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో మాట్లాడాను. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా పీపీఏలు కొనసాగాల్సిందేనని స్పష్టం చేశాను. జోక్యం చేసుకోవాలని కూడా కోరా. ఆయన సానుకూలంగా స్పందించారు’’ అని వివరించారు. పీపీఏల రద్దుతో తెలంగాణకు జరిగే విద్యుత్ నష్టాన్ని నివారించే చర్యలకు ప్రభుత్వం తెర తీసింది. పీపీఏలు రద్దవకుండా చూడాలని కోరుతూ కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం లేఖ రాశారు. ప్రస్తుతమున్న విద్యుత్ సరఫరాను యథాతథంగా కొనసాగించాలని కోరుతూ విద్యుత్ సరఫరాను నియంత్రిస్తున్న బెంగళూరులోని దక్షిణ ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ)కు ఇంధన శాఖ కార్యదర్శి సురేశ్ చందా కూడా లేఖ రాశారు.

మరోవైపు అదనపు విద్యుత్ పొందే చర్యలకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ)కి చెందిన ఝజ్జర్ ప్లాంటు నుంచి అదనంగా సుమారు 300 మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని కోరుతూ ఎన్టీపీసీ చైర్మన్‌కు ట్రాన్స్‌కో సీఎండీ లేఖ రాశారు. ఇందుకాయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. మార్కెట్ నుంచి అదనపు విద్యుత్ కొనుగోలుకు కూడా చర్యలు ప్రారంభించారు. మరోవైపు పీపీఏలను రద్దు చేయాలంటూ ఏపీ జెన్‌కో రాసిన లేఖను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సునిశీతంగా పరిశీలిస్తోంది. దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తెలిసింది.
 సెక్షన్ 92 ప్రకారం జోక్యం చేసుకోండి!
 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం పీపీఏల రద్దుపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు లేఖ కూడా రాసినట్టు తెలిసింది. విద్యుత్, బొగ్గు, చమురు అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఈ సెక్షన్‌లో పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రానికి ఈ సెక్షన్‌ను గుర్తుచేస్తూ జోక్యం చేసుకోవాలని విన్నవించినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
 మనం హుందాగా ఉందాం: కేసీఆర్
 ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్‌టీపీపీ), విజయవాడలోని నార్లతాతరావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టీటీపీఎస్)లకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా అవుతుంది. పీపీఏల రద్దుకు ఆ రాష్ట్రం నిర్ణయించిన నేపథ్యంలో రెండు స్టేషన్లకు బొగ్గు సరఫరా ఆపేద్దామని కొందరు అధికారులు ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే, ‘మనం హుందాగా ప్రవర్తిద్దాం. చిన్న పిల్లల చేష్టలు మనకొద్దు’ అంటూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement