ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని దహెగావ్ మండలంలోని కేస్లాపూర్ గ్రామానికి చెందిన అర్కం మల్లేశ్(45) అనే మేకల కాపరి ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతి చెందాడు. మల్లేశ్ స్నానం చేద్దామని చెరువులోకి దిగి ప్రమాదవశాత్తూ మునిగి పోయాడు.
మల్లేశ్ ను గమనించిన స్థానికులు వెంటనే బయటకు తీశారు. అయితే కొన ఊపిరితో ఉన్న మల్లేశ్ను ఊర్లోకి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. కాగ మృతుడు మల్లేశ్కు ఈత రాదని తెలిసింది.
చెరువులో స్నానానికి వెళ్లి గొర్రెల కాపరి మృతి
Published Sat, Mar 14 2015 7:53 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement
Advertisement