
'టీఆర్ఎస్ ... దొరల పార్టీ'
మెదక్: టీఆర్ఎస్ దొరల పార్టీ, కుటుంబ పార్టీ అని ఎమ్ఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అభివర్ణించారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం వచ్చిన ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్యను కేసీఆర్ అవమానించారని ఆరోపించారు. అందుకు నిరసనగా రేపటి నుంచి 10 రోజులపాటు నిరసనలు చేపడుతున్నట్లు మందకృష్ణ మాదిగ ప్రకటించారు.