హైదరాబాద్ : ఎస్ఆర్ నగర్ ఆదిత్యా పార్క్ హోటల్లోని రూం. నెంబర్ 310లో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మృతుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన తిర్జీత్ చౌదరి(42)గా గుర్తించారు. కలకత్తాలోని కోలోప్లాస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో రీజినల్ మేనేజర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఓ మీటింగ్ నిమిత్తం నగరానికి వచ్చినట్లు సమాచారం. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.