ఆలంపూర్ (మహబూబ్నగర్) : బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలంపూర్ మండలం గుండిమల్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శైలజ(28) తన కూతురు మాధురి(2)పై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పంది.
ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రగాయాలతో మృతిచెందారు. కుటుంబకలహాలే ఆత్మహత్యకు కారణమని సమాచారం. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య
Published Thu, Oct 15 2015 6:35 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement