కూసుమంచి (ఖమ్మం): ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఓ వృద్ధురాలు సజీవ దహనం అయ్యింది. ఎస్సీ కాలనీలోని అరవపల్లిలో అప్పమ్మ(90) ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మంటల్లో కాలిపోయింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. రాత్రి సమయం కావడంతో చుట్టుపక్కల వారు గమనించి మంటలు అదుపు చేసేలోపే బాధితురాలు మంటల్లో పూర్తిగా కాలిపోయి చనిపోయింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది.
వృద్ధురాలు సజీవ దహనం
Published Fri, Feb 6 2015 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM
Advertisement
Advertisement