Old Woman
-
ఎయిరిండియా నిర్వాకం.. ఐసీయూలో వృద్ధురాలు
ఎయిరిండియా విమానయాన సంస్థపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీ ఎయిర్పోర్టులో ఓ వృద్ధురాలికి వీల్ఛైర్ సేవలు నిరాకరించడంతో ఆమె కిందపడి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందుతుండగా.. ‘తప్పనిసరి పరిస్థితుల్లో..’ అంటూ ఆమె మనవరాలు జరిగిందంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యాన్ని ఆమె ఎండగట్టడంతో.. దెబ్బకు ఎయిరిండియా దిగొచ్చింది. రాజ్ పశ్రీచా(82) మాజీ సైనికాధికారి భార్య. తన కుటుంబ సభ్యులతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లడానికి ఎయిరిండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఉన్న ఆమెకు వీల్ఛైర్ కోసం బుక్ చేసుకోగా.. అది కన్ఫర్మ్ అయ్యింది. అయితే గంటసేపైనా ఢిల్లీ ఎయిర్పోర్టులో ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కుటుంబ సభ్యుల సాయంతో ముందుకు వెళ్లారు. కాలు జారి కిందపడి గాయపడ్డారు.ఆమె తలకు గాయం కాగా.. ముక్కు, నోటి నుంచి రక్తం కారింది. అయితే ఆ టైంలోనూ సిబ్బంది ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తామే మెడికల్ కిట్ కొనుక్కొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశామని మనవరాలు పరుల్ కన్వర్(Parul Kanwar) తెలిపారు. ఆపై కాసేపటికి వీల్ఛైర్ వచ్చిందని.. గాయాలతోనే ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చామని తెలిపారు. అయితే.. ఈ మధ్యలో విమాన సిబ్బంది సాయం కోరగా.. బెంగళూరు ఎయిర్పోర్టులో ఆమెకు వైద్య సేవలు అందాయని, తలకు రెండు కుట్లు పడ్డాయని తెలిపారామె. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎడమ వైపు భాగానికి పక్షవాతం సోకిందని, మెదడులో రక్తస్రావం జరిగిందేమోననే అనుమానాలను వైద్యులు వ్యక్తం చేశారని పరుల్ తెలిపారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె.. మనిషి జీవితానికి కొంచెమైనా విలువ ఇవ్వండి అంటూ ఎయిరిండియా సిబ్బందిని ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఈ ఘటనపై డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA), ఎయిరిండియాలకు ఫిర్యాదు చేశామని, చర్యలకు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారామె.అయితే పరుల్ పోస్టుపై ఎయిరిండియా స్పందించింది. ఆమె సోషల్ మీడియా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ నెంబర్, పూర్తి వివరాలను తమకు అందించాలని ఎయిరిండియా ఆమెను కోరింది. అయితే ఘటనపై దర్యాప్తు పూర్తైతేగానీ తాను ఎయిరిండియాతో సంప్రదింపులు జరపబోనని తేల్చారామె. -
చాట్ జీపీటీ బామ్మ..!
చాట్ జీపీటీ బామ్మ బెంగళూరుకు చెందిన 88 ఏళ్ల బామ్మ చాట్జీపీటీతో స్నేహం కట్టింది. అన్ని ప్రశ్నలూ దానినే అడుగుతోంది. ‘నా మనవడు పెళ్లి చేసుకోవడం లేదు. కారణం ఏంటంటావ్’ అనే ప్రశ్నకు చాట్జీపీటీ చెప్పిన జవాబుకు నెటిజన్లు బోలెడు ముచ్చటపడుతున్నారు. మనవడు పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.ఊళ్లలో చాలామంది బామ్మలు టీవీతో కాలక్షేపం చేస్తారు. కాని బెంగళూరు(Bengaluru)కు చెందిన ఈ బామ్మ(Grand mother) ఏకంగా ‘ఏఐ’ చాట్బాట్ అయిన ‘చాట్జీపీటీ’(ChatGPT)తో స్నేహం కట్టింది. వాయిస్ ద్వారా చాట్జీపీటీతో మాట్లాడవచ్చు కనుక బామ్మ తనకున్న సందేహాలన్నిటినీ దానినే అడుగుతూ కాలక్షేపం చేస్తోంది. ఆమె మనవడు శశాంక్ జాకబ్ ఇదంతా వీడియో తీసి ఇన్స్టాలో పెడితే వస్తున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఆ వీడియోలో సంభాషణ ఇలా సాగింది.బామ్మ: హాయ్చాట్జీపీటీ: హాయ్బామ్మ: నా వయసు 88. నా బిపి 165/88 ఉంది. ప్రమాదం అంటావా?చాట్జీపీటీ: సిస్టాలిక్ కొంచెం ఎక్కువుంది. డయస్టాలిక్ నార్మల్గా ఉంది.బామ్మ: నా మనవడు పెళ్లి చేసుకోనంటున్నాడు. కారణం ఏంటి?చాట్జీపీటీ: ఓ ఇది మంచి ప్రశ్న. నీ మనవడు పెళ్లి వద్దనడానికి అనేక కారణాలు ఉంటాయి. కెరీర్ గురించి ఆలోచిస్తుండవచ్చు, ఏవైనా లక్ష్యాలు ఉండవచ్చు లేదా గత అనుభవాల వల్ల కూడా కావచ్చు. బామ్మ మనవడి వైపు తిరిగి: ఏరా.. ఏవైనా గత అనుభవాలు ఉన్నాయా?మనవడు: ఉండొచ్చుబామ్మ: సరే అలా అయితే. నీకు క్లారిటీ రావడానికి కొంత టైమ్ ఇస్తాను...ఇంతటితో ఆ సంభాషణ ముగిసింది. ఇన్స్టాలో ఈ వీడియోను వేల మంది లైక్ చేశారు. బామ్మను చాలా మెచ్చుకుంటున్నారు. బామ్మా.... మనం స్నేహం చేద్దామా అని అడుగుతున్నారు. చాలామంది తమ బామ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. View this post on Instagram A post shared by Shashank Jacob (@shashankjacob)(చదవండి: మహిళా ఉద్యోగిని ఆ సాకుతో జాబ్లోంచి తీసేశారు..! కట్చేస్తే..) -
‘అమ్మా’నవీయం!
గన్నవరం/కొమరోలు: కన్న తల్లులే బిడ్డలకు భారమవుతున్నారు. నవ మాసాలు మోసి కనీపెంచిన అమ్మలను అమానవీయంగా వదిలించుకుంటున్నారు. గన్నవరం సమీపంలో ఎముకలు కొరికే చలిలో శనివారం రాత్రి ఓ తల్లిని వదిలి వెళ్లగా, ప్రకాశం జిల్లా కొమరోలులో ఓ తల్లి వారం రోజులుగా నడిరోడ్డుపై నరకయాతన అనుభవిస్తున్నా.. కుమారుల మనసు కరగలేదు. ఎముకలుకొరిచే చలిలో 85 ఏళ్ల అవ్వ కృష్ణా జిల్లా గన్నవరం శివారు ఆల్ఫా హోటల్కు సమీపంలో శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కారులో 85 ఏళ్ల ఓ వృద్ధురాలిని కొంత మంది వ్యక్తులు తీసుకొచ్చారు. కిందికి దింపి అక్కడో ఓ కుర్చీలో కూర్చోబెట్టి వెళ్లిపోయారు. చలికి గజగజ వణుకుతున్న ఆ వృద్ధురాలిని కొంతమంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన గన్నవరం పోలీసులు అక్కడికి చేరుకుని వృద్ధురాలి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె మాట్లాడలేని స్థితిలో ఉండడంతో స్థానిక బీకేఆర్ వృద్ధాశ్రమానికి తరలించారు. ఆమె వద్ద లభ్యమైన ఆధార్ కార్డులోని వివరాల ప్రకారం ఆమె గన్నవరం మండలం కొండపావులూరుకు చెందిన నక్కా లక్ష్మీకాంతంగా గుర్తించారు. ఆ వివరాల ఆధారంగా పోలీసులు ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులను పిలిపించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. దుప్పటి కూడా లేక నడిరోడ్డుపైనే 75 ఏళ్ల అమ్మ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం వెన్నంపల్లికి చెందిన కలిగవిన వెంకటలక్ష్మమ్మ(75) భర్త కొంత కాలం కిందట మృతిచెందాడు. అనంతరం ఆమె ముగ్గురు కుమారుల వద్ద ఉంటూ కాలం గడుపుతోంది. ఆస్తుల పంపకాల అనంతరం తల్లిని మాత్రం వారు పట్టించుకోవడం మానేశారు. ఏడాది కాలంగా ఓ గుడిసెలో వదిలేశారు. ప్రతినెలా వచ్చే వృద్ధాప్య పింఛన్ను కూడా వారే బలవంతంగా తీసుకెళుతున్నారు. వెంకట లక్ష్మమ్మ నివాసం ఉంటున్న గుడిసె కూడా శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో ఇటీవల కుమారులు తల్లిని ఇళ్లకు తీసుకెళ్లి.. మళ్లీ వారం కిందట వెన్నంపల్లెలో నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వారం రోజులుగా చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ నానా యాతనపడుతోంది.కట్టుబట్టలు తప్ప కనీసం దుప్పటి కూడా లేకపోవడంతో ఆ అమ్మ కష్టాలు వర్ణనాతీతం. గ్రామస్తులే అన్నం పెడుతున్నారు. వృద్ధురాలి దీన స్థితిని చూసి చలించిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొమరోలు ఎస్ఐ వెంకటేశ్వర్లునాయక్కు గ్రామానికి చేరుకుని కుమారులతో ఫోన్లో మాట్లాడారు. తల్లి బాగోగులు చూసుకోవాలని లేకుంటే.. అనాథాశ్రమానికి తరలిస్తామని చెప్పారు. -
93 ఏళ్ల బామ్మ.. 34 ఏళ్లుగా జైల్లోనే
రాయచూరు రూరల్: క్షణికావేశంలో చేసిన తప్పిదానికి 34 ఏళ్లకు పైబడి శిక్ష అనుభవిస్తున్న వృద్ధురాలికి ఉపశమనం కలిగింది. ఉప లోకాయుక్త ఆదేశాలతో ఆమెకు విముక్తి లభించింది.శిక్ష మూడేళ్లు మాత్రమేవివరాలు.. కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకావాసి నాగమ్మ 1995 లో వరకట్న వేధింపుల కేసులో నిందితురాలిగా జిల్లా కేంద్ర జైలుకు వచ్చారు. ఆనాటి నుంచి జైల్లో శిక్ష అనుభవిస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 93 ఏళ్లు. ఆమెకు విధించిన శిక్ష 3 ఏళ్లు మాత్రమే. కానీ పట్టించుకుని బెయిలు ఇప్పించేవారు లేకపోవడంతో కటకటాలే పుట్టినిల్లయింది. ఇటీవల ఉప లోకాయుక్త బి.వీరప్ప జైలును సందర్శించి ఆమె కథను విని చలించి పోయారు. సుప్రీం కోర్టు రిజస్ట్రార్ జనరల్ శశిధర్ శెట్టితో ఫోన్లో మాట్లాడారు. నాగమ్మకు పూర్తిగా అశక్తురాలని, ఆమెను వదిలివేయాలని ఉప లోకాయుక్త సూచించారు. జైలు సూపర్నెంటు అనిత పెరోల్ ఇవ్వడంతో బంధువులు ఆమెను తీసుకెళ్లారు.34 ఏళ్లుగా జైల్లో.. పాపం నాగమ్మ! -
పాపం నాగమ్మ!
రాయచూరు రూరల్: క్షణికావేశంలో ఏదో తెలిసీ, తెలియక చేసిన తప్పిదానికి 34 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఉప లోకాయుక్త చొరవతో కలబుర్గి చెరసాల నుంచి 93 ఏళ్లున్న వృద్ధురాలి విడుదలకు ప్రతిపాదనలు సిద్ధమైన ఘటన చోటు చేసుకుంది. కలబుర్గి జిల్లా కేంద్ర కారాగారాన్ని రాష్ట్ర ఉప లోకాయుక్త న్యాయమూర్తి బి.వీరప్ప సందర్శించారు. వయస్సు మీరిన వారిని చెరసాలలో ఉంచరాదనే విషయం తెలుసుకున్న వీరప్ప కలబుర్గి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవా ప్రాధికార సభ్యుడు శ్రీనివాస నవలిని సుప్రీం కోర్టుకు అప్పీలు చేసి విడుదలకు అనుమతి కోరాలన్నారు. కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకాకు చెందిన నాగమ్మపై 1995లో వరకట్నం కేసులో నిందితురాలిగా కేసు పెట్టారు. నాటి నుంచి నేటి వరకు శిక్షను అనుభవిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఉప లోకాయుక్త బి.వీరప్ప చలించి పోయారు. సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ జనరల్ శశిధర్ శెట్టిని ఫోన్లో సంప్రదించి మాట్లాడారు. పండు వృద్ధురాలు నాగమ్మకు నడవడం కూడా చేత కాదని, ఆరోగ్య సమస్యలను జైల్ అధికారులు, సిబ్బంది అంతగా పట్టించుకోవడం లేదు కనుక ఆమెను చెరసాల నుంచి విడుదల చేసి విముక్తి కల్పించాలని కోరారు. -
బాంబుల బామ్మ
-
పెన్షన్ కోసం 2 కిలోమీటర్లు పాక్కుంటూ వెళ్లిన 80 ఏళ్ల బామ్మ
కియోంఝర్(ఒడిశా): వృద్ధాప్య పెన్షన్ కోసం పండుటాకులాంటి బామ్మ పడరాని పాట్లు పడుతున్న దృశ్యం ఒడిశాలో కనిపించింది. పెన్షన్ కావాలంటే పంచాయతీ ఆఫీస్దాకా వచ్చి నువ్వే తీసుకో అని అధికారులు తెగేసి చెప్పడంతో 80 ఏళ్ల బామ్మ 2 కి.మీ.లు పాక్కుంటూ వెళ్లింది. శనివారం జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ కావడంతో అధికారులపై అందరూ మండిపడుతున్నారు. ఒడిశా రాష్ట్రంలోని సీఎం మోహన్ చరణ్ మాఝీ సొంత జిల్లా కియోంఝర్లోని రైసాన్లో ఘటన జరిగింది. గ్రామంలోని పథూరీ దేహరీ అనే బామ్మ నడవలేని దుస్థితి. ఇలాంటి వృద్ధులకు ఇంటి వద్దే పెన్షన్ అందజేయాలని ఉత్తర్వులు ఉన్నాయి. కానీ వాటిని అమలుచేసిన నాథుడే లేడు. శనివారం గ్రామ పంచాయతీలో పెన్షన్లు ఇస్తున్న విషయం తెల్సుకుని బామ్మ బురద ఉన్న ఎర్రమట్టి బాట గుండా పాకుతూ వచ్చి పెన్షన్ తీసుకున్నారు. వృద్ధురాలు ఇంత కష్టపడి కార్యాలయానికి వస్తుంటే పట్టించుకోరా? అని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ గీతా ముర్మును కొందరు నిలదీశారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఇకపై బామ్మకు ఇంటి వద్దే పెన్షన్ ఇస్తామని మాటిచ్చారు. ఆమెకు ఒక చక్రాల కుర్చీని సైతం అందజేశారు. ఇకపై ఇంటి వద్దే రేషన్ సైతం అందిస్తామని స్పష్టంచేశారు. -
'సరిపోదా శనివారం ట్రైలర్ ఈవెంట్' .. స్పెషల్ అట్రాక్షన్గా 70 ఏళ్ల బామ్మ!
హాయ్ నాన్న మూవీ తర్వాత నాని హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంతకుముందెన్నడు కనిపించని పాత్రలో నాని నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సరిపోదా శనివారం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 70 ఏళ్ల భామ తన అభిమాన హీరో నాని చూసేందుకు వచ్చింది. ఆమెను గమనించిన హీరో నాని సంతోషం వ్యక్తం చేశారు. మీ మనవడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ బామ్మను హీరో నాని పలకరించాడు. ఈ ఈవెంట్లో మీరు ఎంతో స్పెషల్ అని ఆయన అన్నారు. అనంతరం అభిమానులతో సెల్ఫీ తీసుకున్నారు. కాగా.. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్ కానుంది. 70 years old lady cheers got #Nani at #SaripodhaaSanivaaram Grand Trailer Launch Event💥 #NaturalStarNani #SaripodhaaSanivaaramTrailer pic.twitter.com/jouQRl0L1L— YouWe Media (@MediaYouwe) August 13, 2024 -
పెన్షన్ అందక 90 ఏళ్ల వృద్ధురాలి ఆవేదన
-
మిస్ టెక్సాస్ అందాల పోటీలో పాల్గొన్న 71 ఏళ్ల వృద్ధురాలిగా రికార్డు..! (ఫొటోలు)
-
ఏ పాము కరిచిందని అడుగుతారని..
రాయపర్తి(వరంగల్): తన పెద్దమ్మ పాముకాటుకు గురికాగా, ఆస్పత్రికి వెళితే వైద్యులు ఏ పాము కరిచిందనే ప్రశ్నలు వేస్తారని ముందుగానే ఊహించిన వరుసకు కుమారుడయ్యే వ్యక్తి ఆ పామును చంపి మరీ ప్లాస్టిక్ సంచిలో వేసుకొచ్చాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన వృద్ధురాలు మేరుగు ఎల్లమ్మ వరండాలో కూర్చోగా, వీపుపై పాము కాటువేసింది.దీంతో ఆమె కేకలువేయడంతో రమేశ్ అక్కడికి చేరుకుని పామును చంపేశాడు. వెంటనే ఎల్లమ్మను చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చాడు. అనంతరం వైద్యులు ఎల్లమ్మకు వైద్యం అందించారు. ప్రస్తుతం ఎల్లమ్మ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. -
డేరింగ్ దాది
బకుళాబెన్ పటేల్ను సూరత్లో అందరూ ‘డేరింగ్ దాదీ’ అని పిలుస్తారు. 80 ఏళ్ల వయసులో నదుల్లో, సముద్రంలో ఆమె చేపలా ఈదడమే కాదు ఈత పోటీల్లో వందల మెడల్స్ సాధించడమే కారణం. 57 ఏళ్ల వయసులో మొదలెట్టిన ఈత తనకు ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అంటోంది బకుళాబెన్. పెద్ద వయసు వారికి పెద్ద స్ఫూర్తి ఆమె.సూరత్లోని తాపి నది ఒడ్డున ఏ ఉదయాన ఐదు, ఆరు గంటల మధ్యన వెళ్లినా డేరింగ్ దాది అని ఆ ఊళ్లో పిలుచుకునే బకుళా బెన్ కనిపిస్తుంది. 80 ఏళ్ల వయసులో ఆమె దినచర్య గమనించదగ్గది. తెల్లవారు జామున 4 గంటలకు లేస్తుంది. ఒక గంటసేపు ఇంట్లో తేలికపాటి యోగా చేస్తుంది. ఆ తర్వాత జాగింగ్కు వీలైన దుస్తుల్లోకి మారి సూరత్ దారుల గుండా కనీసం గంటసేపు జాగింగ్ చేస్తుంది. ఆ తర్వాత తాపి ఒడ్డున ఈత దుస్తుల్లోకి మారి నదిలోకి దూరి దాదాపు రెండు గంటల సేపు ఈత కొడుతుంది. ఆ తర్వాతే ఆమె ఇంటికి చేరుతుంది. ‘నేను రోజులో ఒక పూట భోజనం అయినా లేకుండా ఉంటాను కాని ఏ రోజూ ఈత కొట్టకుండా ఉండలేను’ అంటుంది బకుళా బెన్.కొత్త జీవితంబకుళా బెన్ది అందరు సగటు ఆడవాళ్ల జీవితం వంటిదే. పెళ్లి, పిల్లలు... ఆమెకు నలుగురు సంతానం. వారిని పెంచి పెద్ద చేయడంలో జీవితం గడిచిపో యింది. ఆమెకు 50 ఏళ్లు ఉండగా భర్త మరణించాడు. కొన్నాళ్లకు ఆమెకు జీవితం బోరు కొట్టింది. ‘ఏదో ఒకటి చేయాలి’ అని క్రీడల వైపు ఆసక్తి కనపరిచింది. ‘నాకు చిన్నప్పుడు నీళ్లంటే భయం. ఈత నేర్చుకోలేదు. కాని ఎన్నాళ్లు నీళ్లకు దూరంగా జరుగుతాను. ఈత నేర్చుకుందాం అనుకున్నాను.ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నా వయసు 58’ అని తెలిపింది బకుళా బెన్. కాని ఆమె ఈత నేర్చుకోవడం అంత సులువు కాలేదు. బంధువులు, ఇరుగు పొరుగు వారు ‘హవ్వ’ అని నోరు నొక్కుకున్నారు. హేళన చేస్తూ వెనుక మాట్లాడుకున్నారు. ‘అవన్నీ నా చెవిన పడుతున్నా ఈత నేర్చుకోవడం మానలేదు’ అంటుంది బకుళ. ఇలా నవ్విన వారే తాపీనదిలో చేపలా ఈదుతున్న బకుళను చూసి ఆశ్చర్యపో యారు. హేళన స్థానంలో గౌరవం వచ్చింది.అన్నీ భిన్నమేపిల్లలు సెటిల్ కావడం వల్ల దొరికిన తీరుబడిని బకుళ సంపూర్ణంగా జీవించదలుచుకుంది. ‘నేను నా 60వ ఏట బి.ఏ. కట్టాను. పాఠాలు చదవడం గుర్తు పెట్టుకోవడం కష్టమైంది. రోజుకు 10 గంటలు చదివేదాన్ని. అలాగే ఎప్పుడో వదిలేసిన రాత కూడా ప్రాక్టీసు చేసి పరీక్షలు రాసి డిగ్రీ ΄పొందాను. అలాగే యోగా నేర్చుకున్నాను. 80 ఏళ్ల వయసులో శీర్షాసనం వేయగలను. 75 ఏళ్ల వయసులో నాకు భరతనాట్యం నేర్చుకోవాలనిపించింది. మన దేశంలో ఆ వయసులో భరతనాట్యం చేసి అరంగేట్రం చేసింది నేనొక్కదాన్నే. ఆ ఆరంగేట్రం చూసి చాలామంది మెచ్చుకున్నారు’ అంటుంది బకుళ.500 మెడల్స్‘నన్ను చూసి అందరూ స్ఫూర్తి పొందాలని ఇన్ని పనులు చేస్తున్నాను. సమాజంలో మహిళల పట్ల వివక్ష ఉంది. ఆ వివక్షను ఎదిరించాలంటే ఇలాంటి కృషి చేయాలి. నేను జాతీయ అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ ఈత పో టీల్లో ఇప్పటివరకు 500 మెడల్స్ గెలుచుకున్నాను. అట్లాంటిక్, పసిఫిక్, బంగాళాఖాతాల్లో ఈత కొట్టాను. అమెరికా, ఆస్ట్రేలియా, కెనెడా, మలేసియా దేశాల్లో ఈతపో టీల్లో పాల్గొన్నాను. ఇంగ్లిష్ చానల్ ఈది గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చేరాలని నా కోరిక. ఇప్పటికి 400 మందికి ఈత నేర్పాను. ఈతలో ఉన్న ఆరోగ్యం, ఆనందం అంతా ఇంతా కాదు’ అంటుంది బకుళా బెన్. -
పూర్వకాలంలో అరటిపండ్లను అలా ముగ్గబెట్టేవారా!నెటిజన్లు ఫిదా
పండ్లు తొందరగా పక్వానికి రావడానికి ఇటీవల కృత్రిమ రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కాల్షియం కార్పైడ్, ఇథలిన్ వంటి రసాయానాలతో పండ్లను మాగబెట్టే యత్నం చేస్తున్నారు. ఇలాంటి రసాయనాలు కారణంగా ప్రాణాంతక వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా రైతులను, విక్రయదారులను ఇలాంటి రసాయనాలు వినియోగించొద్దని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి కూడా. అయితే పూర్వకాలంలో పండ్లను మాగబెట్టడానికి ఒక టెక్నిక్ ఉపయోగించేవారు. అది కూడ సహసిద్ధమైన రీతిలో మాగబెట్టవేరు. అదెలోగా ఓ బామ్మ చేసి చూపించింది. ఎలాగంటే..ఓ బామ్మ అరటి పండ్లను పూర్వకాలంలో ఎలా ముగ్గబెట్టేవారో చేసి చూపించింది. అరటి చెట్టుకి కాసిన గెలను కోసి చక్కగా దాన్ని భూమిలో కొద్దిమేర గొయ్యి తీసి దాంట్లో ఈ అరటి గెలను ఉంచింది. తర్వాత ఓ మట్టి పాత్రలో బొగ్గులను రాజేసి దాన్ని కూడా అరటిపండ్ల గెల ఉన్న చోట పెట్టి పైన ఆరటి ఆకులతో కప్పి ఉంచింది. ఆ తర్వాత పైన మరిన్ని ఎండిన కొబ్బరి ఆకులను మట్టిని కూడా వేసి అలా రెండు రోజులు వదిలేసింది. ఆ తర్వాత రోజు చూస్తే చక్కగా మంచి సువాసనతో ముగ్గిపోయి ఉన్నాయి అరటి పండ్లు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు పండ్లు ముగ్గేంత వరకు చెట్టుకే ఎందుకు ఉంచరు అని ప్రశ్నించగా, మరికొందరు మాత్రం రసాయనాలకు బదులుగా పూర్వకాలంలో ఉపయోగించిన ఈ టెక్నిక్ అద్భుతంగా ఉంది. ఎలాంటి దుష్పభావాలు లేని ఆరోగ్యకరమైన టెక్నిక్ అంటూ ఆ బామ్మపై ప్రశంసల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Eswari S (@countryfoodcooking)(చదవండి: మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో సుబ్బమ్మ జాస్తి భారతదేశపు అత్యంత వృద్ధ మహిళా బిలియనీర్గా నిలిచారు. సుబ్బమ్మ గత నెలలో ఫోర్బ్స్ జాబితాలో అరంగేట్రం చేశారు. ఆమె నికర సంపద 1.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.91.9 వేల కోట్లు) చేరుకుంది.ఎవరీ సుబ్బమ్మ..?సువెన్ ఫార్మాస్యూటికల్స్ సహ వ్యవస్థాపకుడు వెంకటేశ్వరులు జాస్తి తల్లి సుబ్బమ్మ జాస్తి. ఈమె హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఈమె కుమారుడు వెంకటేశ్వరులు 1970, 1980లలో యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్, న్యూజెర్సీలలో ఆరు కమ్యూనిటీ ఫార్మసీల చైన్స్ నడిపేవారు. ఫోర్బ్స్ ప్రకారం, 2022లో సువెన్ ఫార్మాస్యూటికల్స్లో గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్కు గణనీయమైన వాటాను విక్రయించడం ద్వారా ఆమెకు అతిపెద్ద భాగం వచ్చింది.సుబ్బమ్మ భర్త సుబ్బారావు జాస్తి గత ఏడాది ఫిబ్రవరిలో మరణించిన తర్వాత ఆయన ఆస్తులను వారసత్వంగా పొందారు. ప్రపంచంలోని ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ఆమె 2,653 స్థానంలో ఉన్నారు. భారతీయ మహిళా బిలియనీర్ల విషయానికి వస్తే సావిత్రి జిందాల్ 34.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఈమె జిందాల్ గ్రూప్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. -
AP: ఓటు వేసిన 102 ఏళ్ల వృద్ధురాలు
పాలకోడేరు: ఓటు ఎంత విలువైనదో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలం, కుముదవల్లి గ్రామంలో 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు వి.లక్ష్మీ నరసమ్మ శనివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి ఓటు వేయించారు. వయో వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి హోం ఓటింగ్ రెండోరోజైన శనివారం కూడా కొనసాగింది. గొల్లలకోడేరు, మోగల్లు, కోరుకొల్లు, గరగపర్రు గ్రామాల్లోని వారంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
వయసు@ 70..సోలో ట్రావెలర్
‘‘వయసు కాదు ప్రతి ఒక్కరూ తమ హృదయ లయను అర్ధం చేసుకొని, దానిని అనుసరించాలని నమ్ముతాను. ఇతరుల గుండె చప్పుడులో జీవించాలని ఎప్పుడూ అనుకోవద్దు’’ అంటోంది రిటైర్డ్ ప్రోఫెసర్ జైపూర్వాసి నీరూ సలూజా. జీవితం ఎప్పుడూ ఒక కంఫర్ట్ జోన్ బయటే ఉంటుందనే వాస్తవాన్ని గట్టిగా నమ్మే ఈప్రోఫెసర్ డెభ్లై ఏళ్ల వయసులో సోలో ట్రావెలర్గా 80 దేశాలు చుట్టొచ్చింది. భిన్న సంస్కృతులను, పర్యావరణాన్ని అర్థం చేసుకోవడానికి, ఎంతో మందిని కలుసుకొని కొత్త ఉత్తేజాన్ని ΄పొందడానికి ఈ ప్రయాణం ఎంతగానో తోడ్పడింది అని చెబుతుంది. ‘‘ఫసిపిక్లోని గాలా పాగోస్ దీవుల నుండి అట్లాంటిక్ మంచుతో నిండిన క్షితిజాల వరకు చేసిన పర్యటనల ద్వారా ఎన్నో స్మారక చిహ్నాలను సేకరించాను. వాటితో అలంకరించిన నా ఇంటిని చూసిన వాళ్లు ప్రపంచ మ్యాప్లా ఉంటుందని అంటారు. ఈ జ్ఞాపకాలు అన్నీ ఇప్పటి వరకు నేను చేసిన సాహసాలను గుర్తుచేస్తాయి. ఇంకా నా ఇంటి గోడలపై మిగిలిన ఖాళీ స్థలాలు రాబోయే చిహ్నాల కోసం నాతో సవాల్ చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. కల వెనకాల రహస్యం నాకు ప్రయాణాల పట్ల ఆసక్తి కలగడానికి స్కూల్ రోజుల్లోనే బీజం పడింది. స్కూల్కి సైకిల్పై వెళుతుండగా ప్రమాదానికి గురై ఎడమ కాలు విరిగింది. ఫిజియోథెరపీ సెషన్లతో పాటు నెలల తరబడి బెడ్రెస్ట్లో ఉండిపోయాను. ఇతర పిల్లలు స్కూల్లో ఉంటే నేను గదికి పరిమితం అయ్యాను. అప్పుట్లో వినోదానికి టీవీ లాంటి ఏ సాధనమూ లేదు. దీంతో పడకగదిలోని కిటికీలోంచి బయటకు చూస్తూ గంటల తరబడి కాలం గడపవలసి వచ్చింది. అక్కడ నుంచి ఆకాశం కేసి చూస్తూ ఉండేదాన్ని. ప్రపంచాన్ని అన్వేషించాలనుకునేదాన్ని. దాదారు ఆరు దశాబ్దాల తరువాత అలా నా కల నిజమైంది. ప్రేమ వారసత్వం కాలేజీలోప్రోఫ్రెసర్గా ఉద్యోగ నిర్వహణ, భార్యగా విధులు, తల్లిగా బాధ్యతలు, ఇంటి నిర్మాణం.. అన్నీ నిర్వర్తించాను. నా పిల్లలు స్థిరపడ్డారు. నా భర్తతో కలిసి చాలా టూర్లకు వెళ్లేవాళ్లం. ఆయన నాకు భర్త మాత్రమే కాదు నా ట్రావెలర్ ఫ్రెండ్ కూడా. 2010లో ఆయన మరణించడంతో మా ప్రేమ వారసత్వాన్ని నేను కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. స్నేహితులు, కుటుంబ సభ్యుల రాక కోసం ఎదురుచూస్తూ ఉండలేను. ఆ విధంగా ఎనభైకి పైగా దేశాలను చుట్టొచ్చాను. ప్రపంచాన్ని అన్వేషించగలగడం ఒక అదృష్టంగా భావించకూడదు. అదొక ప్రయాణం. దృష్టి కోణాన్ని మార్చింది మొదటి ఒంటరి ప్రయాణం మాత్రం నాకు ఒక సాహసమే అని చెప్పగలను. 2014లో యూరప్ క్రిస్మస్కి క్రూయిజ్ ద్వారా వెళ్లాను. ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. ఒంటరిగా ప్రయాణించడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ యాత్రతో నాకు అర్ధమైంది. నిరుత్సాహమైనదని కొందరు అంటుంటారు. కానీ, నేనది అంగీకరించను. ప్రయాణ ప్రణాళికను బాగా ΄్లాన్ చేసుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముందు తెలుసుకున్నాను. మనతో ఒకరు తోడు కావాలనుకుంటే మాత్రం మార్గంలో ఎంతో మంది కొత్త స్నేహితులు కలుస్తారు. కాబట్టి నిజంగా ఒంటరిగా ఉన్నాననే ఆలోచనే రాదు. ఈ యాత్ర నా దృష్టి కోణాన్ని పూర్తిగా మార్చింది. ఒంటరిగా ప్రయాణించడం, గన్యాలను, ప్రయాణ మార్గాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇదే ఒక సమూహం, కుటుంబ పర్యటన అయితే ఒక సమయపాలనకు కట్టుబడి ఉండాలి. ఆ గ్రూప్లో ఎవరు ఏం చేస్తారో మీరూ అదే చేయాల్సి ఉంటుంది. కానీ, ఒంటరి యాత్రికుల విషయంలో అలాంటి డిమాండ్స్ ఏవీ ఉండవు. అడుగడుగునా ఉత్సుకత నా జీవితంలో అతి ఎక్కువగా గుర్తుండిపోయేది 2017 చలికాలంలో స్వీడన్ పర్యటన. నార్తర్న్ లైట్స్కు ప్రసిద్ధి చెందిన స్టాక్ హోమ్ నుండి అబిస్కోకు రైలు ఎక్కడం ద్వారా ఇది ప్రారంభమైంది. మన దేశం రైళ్లకు, అక్కడి రైళ్లకు ఏ మాత్రం పోలిక లేదు. బోర్డింగ్లో ప్రతి వ్యక్తికీ వాష్రూమ్కి ఒక కీ ఇస్తారు. అదొక ఖరీదైన హోటల్ లాంటిది. అక్కడి బాత్రూమ్లో ఒక గంట సమయం గడపాలనుకున్నాను. తిరిగి కంపార్ట్మెంట్కు వచ్చినప్పుడు అది లాక్ అయిపోయింది. ఎవరూ సాయం చేసేవాళ్లు లేరు. కంగారు పడ్డాను. కానీ, చివరకు మార్గాన్ని కనుక్కోగలిగాలను. ఇలాంటి ఎన్నో ఉత్కంఠలు, ఉత్సుకతలు, సాహసాలు.. ఒక్కరోజులో చెప్పలేను. అబిస్కోలో ఒక మంచు గదిలో బస. అక్కడ అది ఎంతో అందంగా, సహజంగా ఉంది. కానీ, బాత్రూమ్లు లేవని ఆలశ్యంగా తెలసింది. అక్కడ పడిన పాట్లు ఒక్క మాటలో చెప్పలేను. మాస్కో నుండి బీజింగ్ వరకు ట్రాన్స్ –సైబీరియన్ రైలు ప్రయాణం.. అదొక ప్రపంచం. మెల్బోర్న్లో 12 వేల అడుగుల నుండి స్కై డైవింగ్ చేయడం అత్యంత ఉత్కంఠను కలిగించింది. ఇలా చెబుతూ పోతే ఎన్నో జ్ఞాపకాలు. ఒక స్వేచ్ఛ విహంగమై చేస్తున్న ప్రయాణం నాకు ఎన్నో తీరాలను పరిచయం చేస్తోంది’’ అని వివరిస్తుంది ఈ ట్రావెలర్. -
Hansaji Yogendra: వయసు 76..ఉత్సాహం 16
మన దేశంలో యోగా గురువులంటే పురుషులే కనిపిస్తుంటారు. కాని హన్సా యోగేంద్ర యోగా గురువుగా చేసిన కృషి ఎవరికీ తక్కువ కానిది. ముఖ్యంగా వయోవృద్ధులలో నైరాశ్యం తొలగి జీవన ఉత్సాహం ఏర్పడాలంటే ఏం చేయాలో ఆమె వీడియో పాఠాల ద్వారా తెలియచేస్తుంది. ఆలోచన, ఆహారం, ఆరోగ్యం ఈ మూడింటికీ మార్గదర్శి హన్సా యోగేంద్ర. ముందు మనం హన్సా యోగేంద్ర రోజువారీ జీవితం చూద్దాం. ఆమె ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తారు. కాసేపు మంచం మీదే పవన ముక్తాసన వంటి ఒకటి రెండు ఆసనాలు వేస్తారు. కొన్ని నిమిషాల ప్రాణాయామం చేస్తారు. ఓంకార ధ్వని చేస్తారు. ‘ఇది సృష్టిలోని శక్తిని మీకు అనుసంధానిస్తుంది’ అంటారు. అప్పుడు ‘మార్నింగ్ డ్రింక్’ తాగుతారు. అంటే టీ, కాఫీ కాదు. రాత్రంతా వెండిగ్లాసులో ఉంచిన నీటిని కాచి దానిలో ఉసిరి, అల్లం, మిరియాలు, పసుపు, అశ్వగంధ మిశ్రమాల ΄పొడిని కొద్దిగా కలిపి కాస్త నిమ్మకాయ పిండి ఆ కషాయాన్ని తీసుకుంటారు. ‘ఇది జఠరాగ్నికి చాలా మంచిది’ అంటారామె. ఆ తర్వాత కాసేపు మత్సా్యసనం, భుజంగాసనం, శలభాసనం వేస్తారు. సరిగ్గా 8.30 అల్పాహారం తీసుకుంటారు. అల్పాహారం అంటే రాత్రి నానబెట్టిన డ్రైఫ్రూట్స్. చివరలో పాలు. ఆ తర్వాత ఆమె యోగా వీడియోలు రికార్డు చేస్తారు. లేదంటే తమ మానసిక శారీరక బాధలు చెప్పుకోవడానికి వచ్చే అనుయాయుల సమస్యలు విని కౌన్సెలింగ్ చేస్తారు. మధ్యాహ్నం భోజనంలో ఒక రోటీ, పప్పు, ఏదైనా కూర. ‘నేను భోజన బల్ల మీద నీళ్ల గ్లాస్ పెట్టుకోను. మజ్జిగ గ్లాసు పెట్టుకుంటాను. నీళ్ల కంటే మజ్జిగ మన జీర్ణక్రియకు మంచిది’ అంటారామె. ఆ తర్వాత పనిలో పడతారు. సాయంత్రం కాసేపు వాకింగ్ చేస్తారు. ఉడకబెట్టిన పప్పులేవైనా తీసుకుంటారు. రాత్రి సూప్తోపాటు, ఇడ్లీ సాంబార్ లాంటివి భుజిస్తారు. రాత్రి సరిగ్గా 10.30కు నిద్ర ΄ోతారు. ‘జీవితం ప్రశాంతంగా గడవాలంటే సిస్టమేటిక్గా ఉండాలి’ అంటారామె. యోగా గురువు హన్సా యోగేంద్ర ముంబైలో పుట్టి పెరిగింది. చిన్న వయసులోనే యోగా పట్ల ఆకర్షితురాలైంది. బిఎస్సీ, ఎల్ఎల్బీ చేసినా మనసు యోగా వైపుకు లాగడంతో ప్రఖ్యాత యోగా గురువు యోగేంద్ర స్థాపించిన ‘ది యోగా ఇన్స్టిట్యూట్’కు తరచూ వెళ్లేది. అక్కడే ఆమె యోగేంద్ర కుమారుడు జయదేవ యోగేంద్ర దగ్గర యోగా నేర్చుకుంది. ఆ తర్వాత జయదేవను వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి ఆమెవైపు పెద్దలు అంగీకరించలేదు. కాని తన జీవితాన్ని యోగాకు అంకితం చేయాలన్న నిశ్చయంతో ఆమె జయదేవను వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి యోగా కేంద్రాన్ని వృద్ధిలోకి తెచ్చింది. ఇప్పుడు ఆమె 76 సంవత్సరాలు. గత ముప్పై, నలభై ఏళ్లలో ఆమె సంస్థ ద్వారా తయారైన యోగా టీచర్లు, ఆమె ద్వారా కనీసం లక్షమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇవాళ ఆమె చేసే వీడియోలు లక్షల్లో చూస్తున్నారు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి యోగా ఉత్తమ మార్గం అంటారామె. అలవాట్లు.. ఆలోచనలు ఆలవాట్లు. ఆలోచనల మీద నియంత్రణ అన్నది జీవితాన్ని అదుపులో ఉంచుతుందని అంటారు హన్సా. అర్థవంతంగా జీవించడం ప్రతి ఒక్కరి అవసరం అని చెబుతారు. విపరీతమైన పరుగులాట, వేళకాని వేళ భోజనం, వేళకాని వేళలో నిద్ర... ఇవి జీవితానికి, ఆరోగ్యానికి ప్రధాన శత్రువులంటారామె. ఇవే అనవసర వృద్ధా΄్యాన్ని తెస్తున్నాయని అంటారు. ప్రకృతిలో దొరికే అందరికీ తెలిసిన పదార్థాలతోనే అకాల వృద్ధా΄్యాన్ని నిరోధించవచ్చంటారు. కాఫీ, టీ వంటివి కూడా శరీరానికి అక్కర్లేదని అవి అలవాటుగా మారి నాడీ వ్యవస్థను డీలా పరుస్తాయంటారు. ‘ఐదు ముఖ్యమైన ఉదయపు అలవాట్లు’,‘మంచినీరు తాగాల్సిన పద్ధతి’, ‘ప్రతి స్త్రీ వేయాల్సిన ఐదు ఆసనాలు’, ‘స్నానం చేయాల్సిన పద్ధతి’,‘ఎలాంటి ఆహారం తీసుకోవాలి’, ‘జబ్బులు రానివ్వని ఐదు ముద్రలు’... ఆమె చేసిన ఇలాంటి వీడియోలన్నీ పెద్దఎత్తున ఆదరణ ΄పొందాయి. సాత్విక ఆహారం గురించి ‘ది సాత్విక్ కిచెన్’ అనే పుస్తకం రాశారామె. ‘ఆ«ధ్యాత్మికత, ఆసనాలు మన జీవితానికి మార్గం చూపుతాయి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. తెలుసుకొని ఆధ్యాత్మికంగా మీ బలహీనతలను జయించండి’ అంటారు హన్సా. ‘జీవితం విసిరే సవాళ్లకు సిద్ధంగా ఉండి రిస్క్ తీసుకునైనా నిజాయితీగా ΄ోరాడితే జీవితం కచ్చితంగా మీకు సంతోషాలనే ఇస్తుంది. జీవితాన్ని అనవసర జంజాటాల్లో పడేయకండి’ అంటారామె. హన్సా కుమారుడు రిషి జయదేవ్ యోగేంద్ర కూడా యోగ సాధనలో ఉన్నాడు. ‘అతన్ని చూసి నేను గర్విస్తున్నాను’ అంటారామె. -
చంద్రబాబు పేరు ఎత్తగానే అవ్వ రియాక్షన్...
-
డ్రైవింగ్ మణి @ 71
వయసు అరవై దాటిందంటే చాలు ‘ఇంకా ఏం పనులు చేస్తావు, విశ్రాంతి తీసుకో..’ అనే సలహాలు ఇస్తుంటారు. కొందరు ఆ సలహాలను కూడా సవాళ్లుగా తీసుకుంటారు. కొన్ని అభిరుచులను జీవితకాల సాధనగా మార్చుకుంటారు. ఈ మాటలను నిజం చేస్తోంది 71 ఏళ్ల రాధామణి. ఇప్పటివరకు 11 హెవీ వాహనాల లైసెన్స్లను పొంది మూస పద్ధతులను బద్దలు కొట్టి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అందరూ మణి అమ్మ అని పిలుచుకునే రాధామణి కేరళవాసి. సాధనమున ఏవైనా సమకూరుతాయి అని నిరూపిస్తున్న రాధామణి ఇప్పుడు ఇంజినీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ ఈ రంగంలో ఎదగడానికి చేస్తున్న కృషి అందరికీ ఓ స్ఫూర్తి మంత్రం. 1984లో కేరళలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన రాధామణి ఇప్పటికీ ‘వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు’ అని, అందుకు తన జీవితమే ఓ ఉదాహరణగా చూపుతుంది. స్కూటర్ నుంచి జేసీబీ వరకు సాధారణంగా మహిళలు స్కూటర్, కార్ డ్రైవింగ్తో సరిపెట్టేస్తారు. రాధామణి మాత్రం అంతటితో ఆగలేదు. డ్రైవింగ్ పట్ల తనకు ఆసక్తి కలగడానికి ప్రోత్సాహాన్నిచ్చిన భర్తను గర్తుచేసుకుంటూ ‘‘1981లో మొదటిసారి ఓ అంబాసిడర్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఐదేళ్లలోపు ఫోర్ వీలర్ లైసెన్స్ పొందాను. ఆ విధంగా కేరళలో హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా కూడా గుర్తుంపు పొందాను. ఎ టు జెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ అనే డ్రైనింగ్ స్కూల్నుప్రారంభించాను’ అని వివరిస్తుంది. ఈ వెంచర్ను రాధామణి భర్త పదేళ్లకు ముందుగానే ప్రారంభించాడు. అక్కడ నుంచే ఈ జంట డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ రాధామణి పేరుతో లైసెన్స్ పొందడానికి స్కూల్ రిజిస్టర్ చేయడానికి కష్టంగా మారింది. దీంతో రాధామణి హెవీ డ్రైనింగ్ లైసెన్స్లు పొందాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్నేళ్ల న్యాయ ΄ోరాటం తర్వాత ఈ జంట కేరళలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లెర్నింగ్ స్కూల్ను రాధామణి పేరుతో రిజిస్టర్ చేయగలిగారు. సంకల్పంతో నిలబెట్టింది.. రాధామణి భర్త 2004లో మరణించాడు. ఆ తర్వాత ఈ వెంచర్ మరింతప్రాముఖ్యతను నింపుకుంది. మణి అమ్మ సంకల్పం ఆ ట్రైనింగ్ స్కూల్ను నిలబెట్టడం ఒక్కటే కాదు, దానిని ఒక సంస్థగా మార్చేందుకు కృషి చేయడం కూడా! అందుకే ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏ రంగమైనా హెవీ డ్రైవింగ్ అంటే ముందు పురుషులే గుర్తుకు వస్తారు. అలాంటి ఆలోచనకు తావు ఇవ్వకుండా, వయసు నింబధనలను కూడా ధిక్కరిస్తూ ఈ డ్రైవింగ్ స్కూల్ను రాధామణి నడుపుతోంది. అందుకు మరింతగా ఎదగడానికి కావాల్సిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇంజనీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. రికార్డ్ల చక్రం ఆమె అద్భుతమైన నైపుణ్యాలు, అంకితభావాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ‘ఇన్సి ్పరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని ఇచ్చి తనను తాను గౌరవించుకుంది సంస్థ. రాధామణి అంతటితో ఆగలేదు. సోషల్ మీడియాలో కూడా తన ఉనికిని చాటుతోంది. అక్కడ ఆమె తన డ్రైవింగ్ అనుభవాలను పంచుకుంటుంది. వయసు లేదా జెండర్తో సంబంధం లేకుండా కలలను పండించుకునేందుకు తగిర ప్రేరణను ఇస్తోంది రాధామణి. సోషల్ మీడియాలో.. రాధామణి ఇన్స్టాగ్రామ్ పేజీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. జేసీబీలు, ఫోర్క్లిఫ్ట్లు, క్రేన్లు, ఫెరారీలు, పడవలు, ట్యాంకర్లు, జిప్సీ, పెద్ద పెద్ద ట్రక్కుల వరకు ప్రతి వాహనాన్ని డ్రైవ్ చేస్తూ కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో తన డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కు ఉన్న 19కె ఫాలోవర్లు మణి అమ్మను ప్రశంసిస్తుంటారు. ఎంతోమంది చేత సత్కారం పొందుతుంటారు. చాలా మంది మహిళలకు హెవీ డ్రైవింగ్ పరికరాల గురించి చెప్పడం, నేర్పడం చూడచ్చు. రాధామణి అమ్మ అంటే ఆవేశం, పట్టుదల, శక్తికి నిదర్శనం. ఆమె కేవలం రోడ్డుపైనే కాదు అడ్డంకులను ఛేదించి చక్రాన్ని చేరుకోవడానికి తగిన స్ఫూర్తిని ఇచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. -
మనుమరాలిని విషనాగు నుంచి కాపాడి.. కన్నుమూసిన బామ్మ!
ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లోని అందరినీ కంటతడి పెట్టించే ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి షాహ్గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్గుపూర్ కాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తున్న బామ్మ, మనవరాలి మంచంపైకి ఒక భారీ నాగుపాము చేరింది. ఆ పాము మనుమరాలి వైపు కదులుతున్న విషయాన్ని గమనించిన బామ్మ దానిని చేత్తో పట్టుకుంది. వెంటనే ఆ విషనాగు బామ్మను కాటేసింది. ఈ సమయంలో బామ్మ ఆర్తనాదాలను విన్న కుటుంబ సభ్యులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే బామ్మను సమీపంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్హోమ్కు తరలించారు. అయితే ఆ బామ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా పామును చేత్తో పట్టుకుని, మనుమరాలిని కాపాడున్న బామ్మ సాహసానికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వీక్షకులు బామ్మ సీతాదేవి(72) తెగువకు సెల్యూట్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆమె మనుమరాలు(24)కు ఎటువంటి హాని జరగలేదు. కాగా పాము కాటుకు బామ్మ మృతిచెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయకుండా ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. -
వందేళ్ల ఫ్రాన్స్ బామ్మగారికి పద్మశ్రీ!
యోగా అనేది మన దేశానికి చెందినది. అయితే మన దేశంలో కూడా అంతలా శ్రద్ధగా చేసేవాళ్లు తక్కువే. యోగా చేస్తున్న అతి పెద్ద వయసు వృద్ధులు లేరు కూడా. కానీ ఫ్రాన్స్కి చెందిన ఓ బామ్మ మాత్రం అతి పెద్ద వయసు యోగా టీచర్. ఆమె ఫ్రాన్స్లో యోగా విప్లవాన్నే తీసుకొచ్చి ఎనలేని కృషి చేసింది. అందుకుగానే భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్న పురస్కారం ఆమెను పద్శ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నలుగురు ఫ్రెంచ్ జాతీయులకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. వారిలో ఈ బామ్మ కూడా ఉన్నారు. గతేడాది ఫ్రాన్స్ బాస్టిల్ డే పరేడ్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లినప్పుడూ తొలిసారిగా పారిస్లో షార్లెట్ చాపిన్ను కలిశారు. ఆమె చాలా చురుకుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఇంత పెద్దావిడి అంతలా ఎలా చలాకీగా ఉన్నారని ఆరా తీశారు మోదీ. అప్పుడే తెలిసింది మోదీకి ఆమె ఒక యోగా గురవని. ఈ విషయాన్నే ఆయన మనకీబాత్లో ప్రస్తావిస్తూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ చాపిన్ ఈ యోగా విద్య ఎలా నేర్చుకుందో వింటే ఆశ్చర్యపోతారు. ఆమెకు ఏడేళ్ల వయసులో భారత్కు వచ్చినప్పుడూ ఈ యోగా విద్య గురించి తెలిసుకుందంట. అక్కడ కొందరూ మగపిల్లలు ఈ యోగాసనాలు వేయడం చూసి, తాను అలా వేయగలనా? అని మనసులోనే అనుకుందట ఆ బామ్మ. అయితే ఆమె తర్వాత ఫ్రాన్స్ వెళ్లిపోవడంతో...ఆ ఆసనాల సంగతి మర్చిపోయి బాల్ రూమ్ డ్యాన్సర్గా కెరియర్ని మొదలుపెట్టింది. ఈ డ్యాన్స్ని చేసేటప్పుడు అయిన గాయాల వల్ల మూడుసార్లు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీలను చేయించుకుంది. వాటి నుంచి కోలుకొనే క్రమంలోనే చిన్నప్పుడు తాను చూసిన యోగాని తిరిగి 50 ఏళ్ల వయసులో మొదలుపెట్టారు. ‘అప్పట్నుంచీ యోగమార్గమే నా జీవితం అయ్యింది. యాభై ఏళ్లుగా నేను చేస్తూ, ఎంతో మందితో చేయిస్తున్నా. లెక్కల ప్రకారం చూస్తే నాకిప్పుడు వందేళ్లు. కానీ పాతికేళ్లే అనుకుంటారు. యోగావల్లనే ఆ హుషారు, ఉత్సాహం’ అనే చాపిన్ ఫ్రాన్స్లో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతున్నారు. అంతేగాదు ఆమె పలు టీవీ షోలు కూడా చేస్తున్నారు. ఈ యోగాసనాలతో గిన్నిస్ రికార్డునీ కూడా సొంతం చేసుకున్నారు. వయసు మీరడం వల్ల ఆమె మాట ముద్దగా ఉంటుందేమో కానీ... ఆమె వేసే యోగాసనాల్లో మాత్రం వణుకూ లేకపోవడం విశేషం. ఇక మోదీ ఆమెను చూసి యోగా కేవలం పశ్చిమ దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలకు చేరుకుంటుంది. అది కేవలం షార్లెట్ వంటి వారి కృషి వల్లే జరుగుతుందంటూ ఆ బామ్మపై పొగడ్తల వర్షం కురిపించారు మోదీ. (చదవండి: ఇంజనీరింగ్ రంగంలో అత్యంత సంపన్న మహిళ..ఏకంగా 30 వేల కోట్ల..) -
Hyderabad: దోమలగూడలో దారుణం
సాక్షి, హైదరాబాద్: దోమలగూడలోని గగన్మహల్ రాధామదన్నివాస్లో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఇంటి యజమానులు లేని సమయంలో కారు డ్రైవర్గా పనిచేసే వ్యక్తి ఆమె చేతులు కాళ్లు కట్టేసి ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. మృతురాలు స్నేహలత దేవి (61)కు భర్త మహేష్ కుమార్.. కుమారుడు పవన్ కుమార్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహేష్ కుమార్ పవన్ కుమార్ గోషామాల్లో ప్లైవుడ్ వ్యాపారం చేస్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం వ్యాపార నిమిత్తం తండ్రి కొడుకు ప్లైవుడ్ షాప్కు వెళ్లారు. ఆ సమయంలో కారు డ్రైవర్ మహేష్.. స్నేహలత దేవి కాళ్లు చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కి ఇంట్లో ఉన్న నగదు బంగారు ఆభరణాలతో పరారైనట్లు దోమలగూడ పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్కు చెందిన మహేష్ రెండు నెలల క్రితమే వీరి వద్ద కారు డ్రైవర్గా విధుల్లో చేరాడని తెలిపారు. సాయంత్రం ఐదున్నర గంటలకు పోలీసులకు సమాచారం రావడంతో స్నేహలత దేవిని హుటాహుటిన హైదర్గూడాలోని అపోలో ఆసుపత్రి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాల ధ్రువీకరించాయి. ముఖానికి ప్లాస్టర్ వేయటంతో ఊపిరడకపోవటం వల్లే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నామని దోమలగూడ పోలీసులు తెలిపారు. గాంధీనగర్ ఏసీపీ కే రవి కుమార్, దోమలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం వివరాలు సేకరిస్తోంది. చదవండి: TSRTC: కండక్టర్పై మహిళ దాడి.. సజ్జనార్ సీరియస్ కామెంట్స్ -
కర్ణాటకలో పింఛన్ కష్టం..
శివాజీనగర: పింఛన్ కోసం కర్ణాటక రాష్ట్రంలో 77 ఏళ్ల ఓ దివ్యాంగ వృద్ధురాలు రెండు కిలోమీటర్లకు పైగా పాక్కుంటూ పోస్టాఫీసుకు వచ్చిన ఘటన అందర్నీ నివ్వెరపరిచింది. పంటిబిగువన నరకయాతన అనుభవిస్తూ పోస్టాఫీసుకు వచ్చిన ఆమెకు తీవ్ర నిరాశే మిగిలింది. అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీ అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్కు, ఇతర రాష్ట్రాలకు ఉన్న తేడాకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీలో ఒకటో తేదీ వచ్చిందంటే.. వలంటీర్లు తెల్లారకముందే తలుపుకొట్టి అవ్వాతాతల చేతుల్లో పింఛను సొమ్ము పెడుతుండడం తెలిసిందే. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కర్ణాటకలో అమలవుతున్న తీరుతో కన్నడిగులు పోలుస్తున్నారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర తాలూకా కుణిబెళకెర గ్రామానికి చెందిన వయో వృద్ధురాలు గిరిజమ్మకు ఎవరూలేరు. ప్రభుత్వం ఇచ్చే పెన్షనే ఆమెకు జీవనాధారం. ప్రతి నెలారంభంలో హరిహర పోస్టాఫీసులో పెన్షన్ తీసుకుంటుంది. గత ఏడాది నవంబరు నుంచి సక్రమంగా అందడంలేదు. ఆటోలో రావడానికి డబ్బులు లేకపోవడంతో వారం రోజుల కిందట గ్రామం నుంచి రెండు కిలో మీటర్లు పాక్కుంటూ పోస్టాఫీసుకు వచ్చింది. 77 year old divyang woman crawls for her unpaid pension in Congress ruled Karnataka. Meanwhile, @INCIndia plays 'Nyay' in the sky. Sickening irony! https://t.co/9RbFUanKd4 pic.twitter.com/KEW4hfeiWG — Anoop Antony (@AnoopKaippalli) January 14, 2024 కానీ, పెన్షన్ ఇంకా రాలేదని సిబ్బంది చెప్పడంతో హతాశురాలైంది. ఆమె కష్టాన్ని కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. అంతదూరం నుంచి పాక్కుంటూ రావడంవల్ల ఒళ్లు చీరుకుపోయి బొబ్బలు వచ్చినా లెక్కచేయలేదు. ‘ఆ పెన్షన్ వస్తేనే నాకు రోజు గడుస్తుంది. అదే లేకపోతే ఏం తినాలి, అందుకే కష్టమైనా పాకుతూనే వచ్చాను..’ అని గిరిజమ్మ దీనంగా చెప్పింది. కాగా, ఈ విషయమై పెద్దఎత్తున విమర్శలు రావడంతో స్థానిక సబ్ కలెక్టర్ అమూల్య పాండా స్పందిస్తూ.. ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేసే సదుపాయం రాష్ట్రంలో లేదనడం గమనార్హం. ఏపీలో వైఎస్ జగన్ సర్కారు ప్రతి నెలా మొదటి తారీఖునే ఇళ్లకే వెళ్లి మరీ అవ్వాతాతలకు రూ.3వేలు చొప్పున ఫించన్ సొమ్ము అందజేస్తుండడం తెలిసిందే. దేశంలో రూ.3 వేల ఫించన్ తోపాటు ఎక్కువ మందికి ఫించన్లు ఇస్తున్న రాష్ట్రం కూడా ఏపీనే కావడం విశేషం. -
90 ఏళ్ల మృత్యుంజయురాలు
టోక్యో: జపాన్లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదం మిగిలి్చంది. వంద మందికిపైగా జనం మరణించారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నారు. 90 ఏళ్లకుపైగా వయసున్న ఓ వృద్ధురాలు శిథిలాల నుంచి ప్రాణాలతో క్షేమంగా బయటపడడం ఆశ్చర్యం కలిగింది. ఇషికావా జిల్లాలోని సుజు సిటీలో భూకంపం వల్ల కూలిపోయిన రెండంతస్తుల భవన శిథిలాలను తొలగిస్తుండగా ఆదివారం సాయంత్రం ఈ వృద్ధురాలు బయటకు వచి్చంది. ఆహారం, నీరు లేక బలహీనంగా మారిన బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స ప్రారంభించారు. ఏకంగా 124 గంటలపాటు ఆమె ఈ శిథిలాల కిందే ఉండిపోయింది. బాధితురాలి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, మాట్లాడగలుతోందని, ఆమె కాళ్లకు గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. జపాన్లో ఆరు రోజుల క్రితం సంభవించిన భూకంపంలో కనీసం 126 మంది మృత్యువాతపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. -
కరీంనగర్: ముసలమ్మ నాకొద్దు!
నవ మాసాలు మోసి కనాలి. పాలిచ్చి పెంచాలి. అడిగివన్నీ చేసి పెట్టాలి. అపురూపంగా చూసుకోవాలి. కానీ, వయసు మీద పడితే.. ఆ తల్లి భారమైపోతుందా?.. అలాగే అనుకున్నాడు ఇక్కడ ఓ కొడుకు.. వృద్ధురాలైన తన తల్లిని చూసుకోలేనంటూ చలిలో రోడ్డు పక్కన పడేశారు. కరీంనగర్ శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన బొల్లం లచ్చమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. భర్తతోపాటు పెద్ద కొడుకు రాజయ్య, ఓ కూతురు కొన్నాళ్ల కిందట చనిపోయారు. వయసు పైబడడంతోపాటు ఇళ్లు పాడుబడి పోయింది. దీంతో ఆమె ఇద్దరు కొడుకుల కుటుంబాలు వంతులవారీగా లచ్చమ్మను చూసుకుంటూ వస్తున్నారు. రాజయ్య కుటుంబం మహారాష్ట్రంలో ఉంటోంది. తమ వంతు ముగియడంతో శుక్రవారం లచ్చమ్మను వాహనంలో తాడికల్ తీసుకొచ్చి దిగబెట్టింది. అయితే తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా చిన్న కొడుకు కుటుంబం అడ్డుకుంది. రాజయ్య కొడుకు వెళ్లిపోయే దాకా చూసి.. ఆటోలో పాత ఇంటి సమీపంలో రోడ్డు పక్కన దించేశాడు. చలిలో రోడ్డు మీద వణుకుతూ కనిపించిన లచ్చమ్మను స్థానికులు చూశారు. డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు చిన్న కొడుకును పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చే యత్నం చేశారు. కానీ, అతను ముసలి అమ్మ వద్దంటూ కరాకండిగా చెప్పేశాడు. కావాలంటే పాత ఇంట్లో ఆమె ఉండొచ్చని.. తిండి కావాలంటే అక్కడికే తీసుకెళ్లి ఇస్తానని చెప్పాడు. దీంతో.. చేసేది ఏం లేక ఆ 80 ఏళ్ల వృద్ధురాలిని పోలీసులు ఆమె పాత ఇంటి వద్ద దిగబెట్టారు. -
Viral Video: ఖవాల్జీత్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా
ప్రస్తుతం కూరగాయలు, పండ్లు కోనుగోలు చేయడానికి జనాలు సూపర్ మార్కెట్లు, డెలివరీ యాప్స్ను వాడుతున్నారు. అక్కడక్కడా రోడ్డుపై బండ్లు పెట్టుకొని అమ్మెవారి వద్ద కూడా కొనుకున్నా.. కొంతమేరకు తగ్గిందనే చెప్పాలి!. అయితే తాజాగా ఓ వ్యక్తి చేసిన పనికి సోషల్మీడియాలో పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఆయన చేసిన ఏంటని అనుకుంటున్నా?. పంజాబ్లోని లూథియాకు చెందిన ఖవాల్జీత్ సింగ్ పండ్లు కొందామని రోడ్డు పక్కన ఓ వృద్దురాలి పండ్ల బండి వద్దకు వెళ్లాడు. 62 ఏళ్లు ఉన్న ఆ వృద్దురాలతో వద్ద పండ్లు కొనుగోలు చేస్తూ ఆమె వ్యాపారం గురించి అడిగి తెలుకున్నాడు. 12 గంటలు కష్టపడి పండ్లు అమ్మినా తన వద్ద పండ్లు ఎవరూ కొనడంలేదని ఆమె వాపోయింది. దీంతో ఖవాల్జీత్.. ఆమె బండిపై ఉన్న సుమారు రూ.3000 విలువగల అన్ని పండ్లను ఒకేసారి కొన్నాడు. View this post on Instagram A post shared by Kawaljeet Singh (@kawalchhabra) ‘నేను పండ్లు కొనడాకి వెళ్లినప్పుడు.. వాటిని అమ్మె వృద్దురాలు ధీనంగా కూర్చుని ఉంది. ముందు రోజు కూడా పండ్లు అమ్ముడుపోలేదని తెలిపింది. ఇప్పటి వరకు కేవలం రూ.100 పండ్లు మాత్రమే అమ్ముడుపోయినట్ల చెప్పింది. అందుకే మొత్తం బండిపై ఉన్న పండ్లు కొనుగోలు చేశాను’ అని ఖవాల్జీత్ తెలిపారు. దీనికి సంబధించిన వీడియోను ఆయన తన ఇన్స్టాగ్రామ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏడుపు ఆగలేదు’, ‘చాలా మంచి పని చేశారు సర్దార్జీ’ అని కామెట్లు చేస్తున్నారు. -
ఆటో డ్రైవర్ దుర్మార్గం! వృద్ధురాలిపై..
యలమంచిలి: ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన ఆటో డ్రైవర్ దుర్మార్గంగా ప్రవర్తించాడు. వృద్ధురాలిపై దాడి చేసి ఆమె మెడలో పుస్తెలతాడును లాక్కుని పరారయ్యాడు. పరవాడ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాలివి. ఈ నెల 2వ తేదీన అనకాపల్లి మండలం నర్సింగరావుపేట, చవితిని వీధికి చెందిన చవితిని చిలకమ్మ (70) రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో ఉన్న తన కుమార్తె మరపురెడ్డి భవానీ ఇంటికి వెళ్లడానికి అనకాపల్లిలో ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్ ప్రయాణికులతో పాటుగా ఆమెను యలమంచిలి పట్టణానికి తీసుకొచ్చాడు. అప్పుడు చిలకమ్మ పంచదార్ల వెళ్లడానికి ఆటోని యలమంచిలిలో నిలపమని డ్రైవర్కు చెప్పగా నేను కూడా పంచదార్ల మీదుగా వెళతానని ఆమెను మభ్యపెట్టి ఆటోను పురుషోత్తపురం సమీపంలో ములకలాపల్లి మీదుగా పోలవరం కాలువ వైపు పోనిచ్చాడు. నిర్మానుష్య ప్రాంతానికి చేరాక ఆమెను బెదిరించి ఆమె మెడలో గల మూడు తులాల బంగారు గొలుసు, రెండు తులాల తాడును లాక్కొని ఆమె తలపై రాయితో కొట్టి ఉడాయించాడు. దీంతో ఆమె సంఘటన స్థలంలో స్పృహ తప్పి పడిపోయింది. కొంత సమయానికి కొత్తలి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమెను గమనించి ఆటోలో యలమంచిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ కె.సన్నిబాబు బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డ ఆటోడ్రైవర్ యలమంచిలిలో ఒక మందుల దుకాణం వద్ద ఆటోను నిలిపి మందులు కొనడానికి షాపు దగ్గరకు వెళ్లగా అక్కడ ఉన్న సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించి విచారణ చేశారు. కొక్కిరాపల్లి సమీపంలో గురువారం ఆటోలను తనిఖీ చేస్తుండగా అనకాపల్లి బీఆర్టీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఎర్రబోయిన రెడ్డప్ప ఆలియాస్ శేఖర్గా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చేసిన నేరాన్ని అంగీకరించడంతో అతనితో పాటు మరో ఆటో డ్రైవర్ భర్నికాల గంగరాజు పాత్ర ఉండడంతో వారి వద్ద నుంచి బంగారం అమ్మిన నగదు, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ శుక్రవారం విలేకరులకు తెలిపారు. పథకం ప్రకారమే చోరీ.. కాగా అనకాపల్లిలో ఆటో ఎక్కడానికి వచ్చిన వృద్ధురాలు చవితిన చిలుకమ్మ మెడలో బంగారంపై కన్నేసిన నిందితులు పథకం ప్రకారమే ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. రెడ్డప్ప వృద్ధురాలి నుంచి దొంగిలించిన బంగారాన్ని స్నేహితుడు గంగరాజుకు ఇవ్వగా, గంగరాజు దానిని విక్రయించి వచ్చిన నగదు పంచుకుందామనుకున్నారు. క్రికెట్ బెట్టింగ్లు ఇతర అలవాట్లకు బానిసైన గంగరాజు అప్పుల పాలై రెడ్డప్పను డబ్బు అడిగాడు. స్నేహితుడు అడిగిన డబ్బు ఇవ్వడానికే ఈ దొంగతనం చేయాల్సి వచ్చిందని రెడ్డప్ప విచారణలో ఒప్పుకున్నట్టు ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. అన్నమయ్య జిల్లాకు చెందిన ఎర్రబోయిన రెడ్డప్ప ఆలియాస్ శేఖర్ అనకాపల్లి వలస వచ్చి కొంతకాలంగా భార్యతో కలిసి బీఆర్టీ కాలనీలో నివాసం ఉంటున్నాడని తెలిపారు. ఇటువంటి ఘటనల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఆటోల్లో ప్రయాణించేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ సూచించారు. ఇవి చదవండి: సీఏ విద్యార్థిని తీవ్ర నిర్ణయం! అసలేం జరిగింది? -
70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్దురాలు
సాధారణంగా 35-40 ఏళ్లు దాటితేనే ప్రెగ్నెన్సీ కష్టమనుకుంటున్న రోజుల్లో 70 ఏళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చి ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన ఘటన తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో చోటు చేసుకుంది.ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ వయసు 70 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చింది. నముక్వాయా 1992లో భర్తను కోల్పోయింది. దీంతో నాలుగేళ్లకు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సుమారు 20 ఏళ్లకు సఫీనా ఐవీఎఫ్ ద్వారా ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే పాప పుట్టిన వెంటనే చనిపోవడంతో సఫీనా చాలా కుంగిపోయింది. దీంతో తల్లి కావలన్నా తన కోరికను 70 ఏళ్ల వయసులో తీర్చుకుంది. రెండోసారి కూడా ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా ఆమె కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు పాప కాగా, మరొకరు బాబు ఉన్నారు. ప్రస్తుతం తల్లితో సహా పిల్లలు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వయసులో కవలలకు జన్మనిచ్చిన సఫీనా.. ఆఫ్రికాలోనే అత్యంత పెద్ద వయసులో తల్లైన మహిళగా రికార్డు సృష్టించింది. A 70-year-old woman has given birth to twins following IVF treatment, a hospital in Uganda has said. Safina Namukwaya delivered a boy and a girl via caesarean at a fertility centre in the capital, Kampala. pic.twitter.com/XjGBgbkGPV — The Instigator (@Am_Blujay) December 1, 2023 -
97 నుంచి 77 కట్ చేస్తే... ఆ కరేజ్ ఇలా ఉంటుంది!
97 సంవత్సరాల వయసులో రెండు అడుగులు వేగంగా వేయాలంటేనే కష్టం. అలాంటిది ‘పారా మోటరింగ్ అడ్వెంచర్’ చేస్తే... మహారాష్ట్రలోని నాగ్పుర్కు చెందిన ఉషా తూసే 97 సంవత్సరాల వయసులో పారామోటరింగ్ సాహసం చేసి నెటిజనులు ‘వావ్’ అనేలా చేసింది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో 1.2 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. ఆర్మీ పారా–కమాండో పైలట్స్, ఎయిర్ ఫోర్సు వెటరన్స్ ఆపరేట్ చేసే ఫ్లైయింగ్ రైనో పారామోటరింగ్ విభాగం బామ్మ చేత ఈ సాహసాన్ని చేయించింది. ‘97 ఇయర్ వోల్డ్ కరేజ్ అండ్ 20 ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్’ అనే కాప్షన్తో ‘ఎక్స్’లో ఈ వీడియో క్లిప్ను పోస్ట్ చేసింది. ‘సాహసంలో జీవనోత్సాహం కూడా ఉంటుంది అనే వాస్తవాన్ని ఆవిష్కరించే వీడియో ఇది’. ‘ఎంతోమందిని ఇన్స్పైర్ చేసే వీడియో’.... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి నిజానికి ఉషాకు సాహసం కొత్త కాదు. భర్త ఆకస్మిక మరణం, పిల్లల బరువు బాధ్యతల సమయంలో కూడా ఆమె డీలా పడిపోలేదు. ఒంటి చేత్తో కుటుంబాన్ని ధైర్యంగా పోషించింది. -
‘ఈసారి కూడా నా మనవడే సీఎం’
ద్వారకా తిరుమల: ‘ఈ మనవడు నాకెందుకు తెలీదు. నా పెద్ద మనవడే. వయసులో చిన్నోడైనా నాలాంటి ముసలోళ్లతోపాటు ఎంతోమంది పేదల జీవితాల్లో భరోసా నింపుతున్నాడు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా నేనే కాదు. రాష్ట్రంలోని అందరూ ఆయనకే ఓటేస్తారు. ఈసారి కూడా నా మనవడు జగనే సీఎం అవుతాడు’ అంటోంది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడుకు చెందిన ముద్దన ముస్సెమ్మ. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం దొరసానిపాడులో ఇంటింటికీ వెళ్లి సీఎం జగన్ సంక్షేమ పాలనను వివరించారు. ఈ సందర్భంలో ముద్దన ముస్సెమ్మ అనే వృద్ధురాలు తారసపడగా.. ఎమ్మెల్యే ఆమెతో ముచ్చటించారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ కరపత్రంపై ఉన్న సీఎం జగన్ ఫొటోను బామ్మకు చూపి ‘ఈయన ఎవరో గుర్తు పట్టావా’ అని అడిగారు. అది చూసిన ముస్సెమ్మ విప్పారిన కళ్లతో ‘నా మనవడు నాకెందుకు తెలీదు. జగన్ మనవడి వల్లే సంతోషంగా బతుకుతున్నా. జగన్బాబే లేకపోతే మాలాంటి వాళ్ల బతుకులు ఏమైపోయేవో. ఆయన దయవల్ల ఎందరో పేదల బతుకులు బాగుపడ్డాయ్. మా అందరి ఆశీస్సులతో మళ్లీ నా మనవడే సీఎం అవుతాడు’ అంటూ అమితానందంతో జవాబిచ్చింది. చదవండి: ఇళ్లపైకి ‘పచ్చ’దొంగలు.. జాగ్రత్త! -
ఆమెకు 63, ఆయనకు 72 ఏళ్లు.. ప్రియుడు మోసం చేశాడని వృద్ధురాలి ఫిర్యాదు
కర్ణాటక: యుక్త వయసులో స్నేహం, ప్రేమ, వంచన లాంటి ఘటనలు సాధారణం. కానీ కాటికి కాళ్లు చాపుకున్న 63 ఏళ్ల మహిళ, 72 ఏళ్ల వృద్ధుడు పెళ్లి పేరుతో మోసగించాడని బెంగళూరు తూర్పు విభాగం మహిళా పోలీస్స్టేషన్ను ఆశ్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. హలసూరు కు చెందిన వృద్ధురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త గతంలో మరణించాడు. ఆమె పిల్లలతో ఉంటూ ఒక బ్యాంక్ మేనేజర్ ఇంట్లో వంటపని చేస్తుంది. ఈ సమయంలో లోకనాథ్ అనే వృద్ధునితో ఆమెకు పరిచయమైంది. ఆయన భార్య గతంలో కన్నుమూసింది. తన కొడుక్కి పిల్లను చూడడానికి వెళ్తున్నానని, తనతో రావాలని వృద్ధురాలిని పిల్చుకెళ్లాడు. అలా ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. తరచూ పలు పర్యాటక ప్రాంతాల్లో షికార్లు చేశారు. పెళ్లి చేసుకోనంటున్నాడు నిన్ను బాగా చూసుకుంటాను, పిల్లలను వదిలి తనతో వచ్చేయాలని వృద్ధుడు ప్రాధేయపడ్డాడు. దీంతో కుమారుడు వద్దన్నా లెక్కచేయకుండా లోక్నాథ్ వద్దకు వచ్చింది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన లోకనాథ్ ఇప్పుడు మాట మారుస్తున్నాడని, వయసు తేడా ఉందంటూ అసభ్యపదజాలంతో దూషిస్తున్నాడని, తనను దూరం పెట్టేందుకు యత్నిస్తున్నాడని ఆమె పలు ఆరోపణలు చేసింది. అతన్ని నమ్ముకుని అటు పిల్లలను వదిలేసి, ఇటు పని మానేసి వీధిన పడ్డానని, నమ్మించి మోసం చేసిన లోకనాథ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఆమె ఆరోపణలను లోకనాథ్ ఖండించాడు, ఆమెకు డబ్బు చెల్లించానని తెలిపాడు. వృద్ధుల తగవును ఎలా తీర్చాలా? అని పోలీసులు తలపట్టుకున్నారు. -
కోతుల వీరంగం.. బావిలోపడ్డ వృద్ధురాలు
సాక్షి, సిరిసిల్ల: ఇటీవల కాలంలో కోతుల దాడులు పెరిగిపోయాయి. జనావాసాల్లోకి చొరబడి గుంపులు, గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కోతులు మూకుమ్మడిగా దాడి చేయడంతో ఓ వృద్ధురాలు బావిలో పడింది. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్లో శనివారం చోటుచేసుకుంది. రాచర్లబొప్పాపూర్కు చెందిన గంభీర్పూర్ రాజవ్వ (68) ఇంటి బయట కూర్చుని ఉండగా.. హఠాత్తుగా కోతుల గుంపు దాడి చేశాయి. కోతుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న బావిలో పడి మధ్యలో ఇరుక్కుపోయింది. కేకలు వేయడంతో సమీప ఇళ్లలోని యువకులు వచ్చి బావిలో వేలాడుతున్న రాజవ్వను తాళ్ల సహాయంతో బయటకు లాగారు. అపస్మారకస్థితిలో ఉన్న రాజవ్వను ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. చదవండి: ప్రగతి కాదు.. సర్పంచ్లకు దుర్గతి.. ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి ధ్వజం -
ఆమె వయసు 60.. భర్తకు అనుమానం, నిత్యం వేధింపులు, పక్కా ప్లాన్తో..
సిరిసిల్లక్రైం: వృద్ధాప్యంలోనూ కట్టుకున్న భార్యను అనుమానించాడు. భర్త పదేపదే కొట్టడంతో విసిగిపోయింది. ఎలాగైనా తన భర్తను హతమార్చాలని రూ.రెండు లక్షలకు సుపారీ ఇచి్చంది. గత నెల 13వ తేదీన హత్య జరగ్గా, బుధవారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి చెందిన కనకవ్వ (60), కాశయ్య (65) బతుకుదెరువుకు సిరిసిల్లకు 25 ఏళ్ల క్రితం వచ్చారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కూతుళ్లకు పెళ్లిళ్లు జరగగా, కొడుకు మానసికస్థితి సరిగ్గా లేదు. వృద్ధ దంపతులిద్దరూ సిరిసిల్ల మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తారు. ఈ క్రమంలోనే భార్యపై భర్తకు అనుమానం కలిగింది. పలుమార్లు కనకవ్వను కొట్టాడు. ఆమె భర్త వేధింపులు తట్టుకోలేకపోయింది. వరుసకు తమ్మునిగా పిలిచే ఒకరికి విషయాన్ని చెప్పింది. భర్తను చంపితే రూ.2లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. గత నెల 13న మద్యం మత్తులో కాశయ్య నిద్రిస్తుండగా, అనుకున్న పథకం ప్రకారం తను సంప్రదించిన వారికి సమాచారం ఇచి్చంది. వారు ఇంటికి చేరుకొని నిద్రలో ఉన్న కాశయ్య గొంతుకు దుప్పటి చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. మృతదేహాన్ని కారులో వేసుకొని సిరిసిల్లలోని మానేరువాగు చెక్డ్యామ్ వద్ద బొందలగడ్డలో పూడ్చిపెట్టారు. ఆ తర్వాత రూ.2 లక్షలు తీసుకుని వెళ్లిపోయారు. డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చంపడానికి చేసుకున్న ఒప్పందంతోపాటు హత్య చేసిన విధానాన్ని నిందితుల్లో ఒకరు వీడియో తీసినట్టు తెలిసింది. హత్య చేసిన తర్వాత వచి్చన రూ.2లక్షలతో జల్సాలు చేసే సమయంలో మరో రూ.లక్ష కావాలంటూ కనకవ్వను డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే హత్యకు సంబంధించిన వీడియో బయటపెడతామని బెదిరించసాగారు. ఈ తతంగమంతా బయటకు పొక్కింది. దీనిపై సిరిసిల్లటౌన్ సీఐ ఉపేందర్ విచారణ చేపట్టారు. కూరగాయల మార్కెట్ ఏరియాలో నిఘా పెట్టి అనుమానితుల నుంచి సమాచారం సేకరించారు. చివరికి వృద్ధుడి హత్య చేయడానికి సుపారీ తీసుకున్న ఇద్దరు నిందితులతోపాటు మృతుని భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. బొందలగడ్డలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తహసీల్దార్ సమక్షంలో బయటకు తీయించారు. ఈ విషయంపై సిరిసిల్లటౌన్ సీఐ ఉపేందర్ను వివరణ కోరగా కేసు దర్యాప్తులో ఉందని, వివరాలు ఉన్నతాధికారుల సమక్షంలో వెల్లడిస్తామని తెలిపారు. -
10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 51 ఏళ్ల మహిళ
అన్నానగర్(చెన్నై): కరూర్లో 41 ఏళ్ల మహిళ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. వివరాలు.. కరూర్ జిల్లా కృష్ణరాయపురం ప్రాంతానికి చెందిన రహీలా భాను (51). ఈమె పూవంబాడి పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్లో వంటపని చేస్తోంది. 1989లో 9వ తరగతి పూర్తి చేసిన ఈమె కుటుంబ పరిస్థితుల కారణంగా పాఠశాలకు వెళ్లలేదు. ఈ క్రమంలో 10వ తరగతి ఉత్తీర్ణులైతేనే న్యూట్రిషన్ ఆర్గనైజర్ పోస్టుకు అర్హత సాధించే అవకాశం ఉన్నందున 10వ తరగతి పరీక్షలు హాజరు కావాలని నిర్ణయించుకుని గత ఏప్రిల్లో జరిగిన 10వ తరగతి సాధారణ పరీక్షలకు ప్రత్యేక అభ్యర్థిగా దరఖాస్తు చేసుకుంది. ఈమె ఇంగ్లీషు, సోషల్సైన్స్లో ఉత్తీర్ణత సాధించింది. ఆపై తాను ఉత్తీర్ణత సాధించని తమిళం, గణితం, సైన్స్ సబ్జెక్టులకు జూన్లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తు చేసిపరీక్ష రాసింది. ఈ క్రమంలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇందులో రహీలా భాను తమిళం, గణితం, సైన్స్ సబ్టెక్టుల్లో ఉత్తీర్ణులయ్యారు. చదవండి Cockroach Found In IRCTC Meals: వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఆహారంలో స్పెషల్ ఐటెం.. -
వోగ్ కవర్ పేజీపై అత్యంత వృద్ధ స్టార్.. అలాంటి టాటూలు ఈమె మాత్రమే వేయగలదు
మౌలిక సదుపాయాలు, సెల్ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా లేని గ్రామంలో ఉన్న వాంగ్ దగ్గర టాటూలు వేయించుకోవడానికి అంతర్జాతీయ ఔత్సాహికులు అమితాసక్తి కనబరుస్తున్నారు. అత్యంత వృద్ధ టాటూ ఆర్టిస్ట్ దగ్గర టాటూ వేసుకోవాలన్న ఆసక్తికి తోడు, వాంగ్ వేసే జామెట్రిక్ డిజైన్స్ కోసం ఎగబడుతున్నారు. ఎన్నో ఏళ్లనాటి కళను సెంచరీ దాటాక కూడా కాపాడుతూ తరువాతి తరాలకు అందిస్తోన్న వాంగ్ను ‘వోగ్’ సత్కరించింది. ఈ ఏడాది ఏప్రిల్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె రూపాన్ని చిత్రించింది. ఇప్పటిదాక వోగ్ కవర్పేజీపై వచ్చిన అత్యంత వృద్ధ స్టార్గా వాంగ్ నిలవడం విశేషం. ఎంతో ఇష్టమైన పేర్లు, నచ్చిన డిజైన్లను శరీరం మీద పచ్చబొట్టు (టాటూ) వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. ఈ అభిరుచి కొత్తగా వచ్చిందేం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాల్లో వందల ఏళ్లుగా భాగంగా ఉన్నదే. ఇప్పుడు టాటూలు వేయడానికి వాడుతోన్న సూదులు, టాటూ గన్లకు బదులు.. అప్పట్లో పదునైన గులాబీ ముళ్లు, సొరచేప పళ్లతో టాటూలు వేసేవాళ్లు. అప్పటి టాటూ పద్ధతులు చాలా వరకు కనుమరుగయ్యాయి. కానీ వందల ఏళ్లనాటి టాటూ టెక్నిక్ను సజీవంగా ఉంచేందుకు కృషిచేస్తోంది అపోవాంగ్ ఓడ్. 106 ఏళ్ల వయసులో పురాతన టాటూలను వేస్తూ కళను సజీవంగా ఉంచుతోంది వాంగ్. అంతేగాక ప్రపంచంలో అత్యంత వృద్ధ టాటూ ఆర్టిస్ట్గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఫిలిప్పీన్స్కు చెందిన అపో వాంగ్ ఓడ్ను మరియా ఒగ్గే అని కూడా పిలుస్తారు. మనీలాకు దగ్గరల్లో ఉన్న కలింగా ప్రావిన్స్లోని మారుమూల బుస్కలాన్ గ్రామంలో పుట్టి, అక్కడే స్థిరపడింది. టీనేజ్లో ఉండగా ‘మాంబా బాటక్’ అనే టాటూ కళను నేర్చుకుంది. పదహారేళ్ల వయసులో తండ్రితో కలిసి మాంబా బాటక్ వేస్తూ టాటూ ఆర్టిస్ట్గా మారింది. అప్పట్లో మాంబా బాటక్ వేయగల ఒకే ఒక మహిళా ఆర్టిస్ట్ అపోవాంగ్. చుట్టుపక్కల గ్రామాలకు సైతం వెళ్లి అక్కడ టాటూలు వేసేది. పురుషుల్లో ధైర్యసాహసాలకు గుర్తుగానూ, యోధులుగా గుర్తింపు పొందిన వారికి, అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మహిళలు ఈ టాటూలు వేయించుకునేవారు. అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏళ్ల తరబడి టాటూలు వేస్తూనే ఉంది వాంగ్. బొగ్గులో నీళ్లు కలిపి సిరా తయారు చేసి వెదురు పుల్లలు (బ్యాంబూ స్టిక్స్), పంపర పనస ముళ్లతో ఈ టాటూలను వేయడం వాంగ్ ప్రత్యేకత. చుక్కలతో రకరకాల ఆకర్షణీయమైన డిజైన్లు వేస్తుంది. ప్రస్తుతం ఈ టాటూలు వేయడం వచ్చిన వారు ఎవరూ లేరు. వాంగ్ తన తండ్రి దగ్గర నేర్చుకున్న ఈ ఆర్ట్ను రక్తసంబంధీకులకు మాత్రమే నేర్పిస్తోంది. వాంగ్కు పిల్లలు ఎవరూ లేకపోవడంతో తన మేనకోడలికి మాంబా బాటక్లో శిక్షణ ఇస్తోంది. ‘‘ఈ టాటూలు వేసేవాళ్లంతా చనిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయినా నాకు దిగులు లేదు. తరువాతి తరానికి శిక్షణ ఇస్తున్నాను. వాళ్లు టాటూ మాస్టర్స్ అవుతారు’’ అని వాంగ్ చెబుతోంది. -
106 ఏళ్ల వయసులో బంగారు పతకాలు సాధించిన బామ్మ
డెహ్రాడున్: హర్యానాలోని కద్మ అనే కుగ్రామానికి చెందిన రమాబాయి 18వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొని 106 ఏళ్ల వయసులో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెం తోపాటు షాట్ పుట్ లో కూడా బంగారు పతకాలను గెలుచుకున్నారు. నడుము వాల్చి సేదదీరాల్సిన వయస్సులో రమాబాయి సాధించిన ఈ ఫీట్ నడుమొంచని నేటి యువతకు చెంపపెట్టు లాంటిది. ప్రపంచ రికార్డుతో మొదలు.. రెండేళ్ల క్రితం అంటే బామ్మ వయసు 104 ఏళ్ళున్నప్పుడు మనవరాలు షర్మిలా సంగ్వాన్ నింపిన స్ఫూర్తితో అథ్లెటిక్స్ వైపు అడుగులేసింది. సరిగ్గా ఏడాది దాటేసరికి 85 ఏళ్ళు పైబడిన కేటగిరీలో 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు కూడా సొంతం చేసుకుంది. వడోదరలో జరిగిన ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 100 మీటర్ల పరుగును 45.50 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డును సృష్టించింది. ఇక అక్కడి నుండి బామ్మ వెనుదిరిగి చూడలేదు. ఈ వ్యవధిలో రమాబాయి మొత్తం 14 ఈవెంట్లలో సుమారు 200 మెడల్స్ సాధించింది. తాజాగా జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ లో ఏకంగా మూడు బంగారు పతకాలను చేజిక్కించుకుని యువతకు ఆదర్శప్రాయంగా నిలిచింది. పతకాలను అందుకోవడానికి పోడియం వద్దకు వెళ్లిన బామ్మ తన కాళ్లకు శక్తినిచ్చిన మనవరాలికి కృతఙ్ఞతలు చెప్పారు. అలా మొదలైంది.. 2016లో వాంకోవర్లో జరిగిన అమెరికన్ మాస్టర్స్ గేమ్ ఈవెంట్లో పంజాబ్ కు చెందిన కౌర్ అనే బామ్మ 100 ఏళ్ల వయసులో 100 మీటర్ల పరుగుని 1 నిముషం 26 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. కౌర్ ఆ తర్వాత ఏడాదే ఆక్లాండ్లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ ఈవెంట్లో మరో ఏడు సెకన్లను తగ్గిస్తూ తన రికార్డును తానే మెరుగుపరుచుకుంది. రమాబాయి మనవరాలు కౌర్ గురించి చెప్పినప్పుడు మొట్టమొదటిసారి రమాబాయికి కూడా అథ్లెటిక్స్ లో పాల్గొనాలన్న తృష్ణ కలిగింది. ఫిట్నెస్ కోసం.. అప్పటివరకు గృహిణి గాను, ఎప్పుడైనా వ్యవసాయం చేసుకుంటూ కాలం వెళ్లదీసిన బామ్మ రూటు మార్చింది. మైదానంలో అడుగుపెట్టి వయసు అడ్డంకులన్నిటినీ చెరిపేసి సాధన చేసింది. ఫిట్నెస్ కోసం పాలు, పాల ఉత్పత్తులు, తాజా ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుంది. భారీ వాహనాన్ని నడిపే రమాబాయి మనవరాలు షర్మిల మొదట తన బామ్మకు క్రీడలవైపు వెళ్లాల్సిందిగా సలహా ఇచ్చినప్పుడు మొత్తం కుటుంబం భయపడింది... ఈ వయసులో బామ్మను సరిగ్గా చూసుకోకపోతే గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తారని భయపడినట్లు వెల్లడించారు. కానీ తన బామ్మ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లేటు వయసులో చాంపియన్ గా అవతరించి మొత్తం గ్రామానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇది కూడా చదవండి: వేలాది పక్షుల మృతి.. పురుగు మందులే కారణం? -
యువకుని శవానికి రోజుల తరబడి స్నానాలు, దుస్తుల మార్పిడి.. దుర్వాసన రావడంతో..
ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో రోమాలు నిక్కబొడుచుకునే ఉదంతం వెలుగు చూసింది. ఒక బామ్మ 10 రోజులుగా తన 18 ఏళ్ల మనుమడి మృతదేహాన్ని తనతోపాటు ఉంచుకుని దానికి స్నానం చేయిస్తూ, దుస్తులు మారుస్తూ వస్తోంది. అయితే ఆ మృతదేహం నుంచి వెలువడుతున్న దుర్వాసన చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో, అక్కడివారు పోలీసులకు ఈ సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ఇంటి తలుపులు తెరిచి చూసి అవాక్కయ్యారు. ఆ బామ్మ తన మనుమడి మృతదేహాన్ని తన దగ్గరే ఉంచుకుంది. ఆ మృతదేహం పురుగులు పట్టి, కుళ్లిపోయిన స్థితిలో ఉండటాన్ని పోలీసులు గమనించారు. గదిలో నుంచి విపరీతమైన దుర్ఘందం వెలువడసాగింది. ఆ దుర్వాసనకు పోలీసులకు ఒక్కసారిగా వాంతులు వచ్చాయి. అయితే వారు తమను తాము నియంత్రించుకుని, ముందుగా ఆ బామ్మను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఆ వృద్ధురాలు మతిస్థిమితం లేనిదని తెలిపారు. కాగా పోలీసులు ఆ యువకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆ కుర్రాడు ఎలా మృతి చెందాడనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోహరిపుర్వా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్దురాలి ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నదని అక్కడివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితి చూసి పోలీసులు సైతం హడలెత్తిపోయారు. గదిలో ఒక వృద్ధురాలు 18 ఏళ్ల యువకుని మృతదేహానికి సపర్యలు చేస్తూ కనిపించింది. ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఆ వృద్ధురాలిని పోలీసులు ప్రశ్నించగా, తన మునుమడు 10 రోజుల క్రితం చనిపోయాడని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్.. నిశ్చేష్టుడైన వరుడు! -
109వ బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్న బామ్మ.. ఆరోగ్య రహస్యమిదేనట
ఫొటోలో కనిపిస్తున్న ఈమె పేరు మెరైన్ హ్యూస్. చూడ్డానికి డెభై, ఎనభై ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తుంది కానీ, వయసు వందేళ్ల పైనే! ఇప్పటికీ చేతికర్ర లేకుండా నడుస్తుంది. స్వయంగా వంట వండుతుంది. ఇంటి పనుల్లో ఇతరులకు సహాయం కూడా చేస్తుంది. ఇక అప్పుడప్పుడు చాలా సంతోషం వస్తే పాట పాడుతూ డాన్స్ ఆడుతుంది.} రచయిత్రి అయిన ఈమె ఇప్పటికీ తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తోంది. ఈ మధ్యనే అమెరికాలోని తన స్వగృహంలో కుంటుంబ సభ్యులందరితో కలసి తన 109వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకలో అందరినీ నవ్వుతూ పలకరించి, కేక్ కట్ చేసి, అందరికీ తానే తినిపించడంతో వారంతా ఆశ్చర్యపోయారు. ఈ వయసులోనూ ఇంత ఆరోగ్యం ఉండటం వెనుక అసలు రహస్యం ఏమిటని ఆమె మనవళ్లు, మనవరాళ్లు అడిగితే ‘నాకు ఏం చేయాలని అనిపిస్తే అది చేస్తా. ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించను. మంచి సంగీతం వింటా. ఆహారం విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోను. కానీ, తినే ఆహారంలో నాకిష్టమైన పదార్థాలే ఎక్కువగా ఉండేలా చూసుకుంటా. ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామని నేను నమ్ముతా’ అని చెప్పింది. -
5 టు 95
మానవ పరిణామక్రమం లాగే మనిషి వయసుకు సంబంధించిన రూప పరిణామక్రమం కూడా ఆసక్తికరమే. అయిదు సంవత్సరాల వయసు ఉన్న బాలిక 95 ఏళ్ల వృద్ధురాలు అయ్యేక్రమంలో ఎన్ని రూపాల్లో కనిపిస్తుందో చూపే ఈ వీడియో వైరల్ అవుతోంది. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈ హైపర్ రియలిస్టిక్ ఏఐ జనరేటెడ్ వీడియో క్లిప్ను ట్విట్టర్లో పోస్ట్ చేస్తే 1.8 లక్షల వ్యూస్ వచ్చాయి. బోలెడు లైక్లు వచ్చాయి. ‘మా అమ్మ వయసు 72 సంవత్సరాలు. ఆమె పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు దిగిన ఫొటో మా ఇంట్లో ఉంది. ఆ ఫొటోను, అమ్మను చూసినప్పుడల్లా ఈ ఇద్దరూ నిజంగా ఒకరేనా? లేకపోతే వయసు ఆధారంగా కొత్త వ్యక్తులు ఆ వ్యక్తిలోకి వస్తుంటారా!’ అనే ధర్మసందేహాన్ని వెలిబుచ్చాడు ఒక నెటిజనుడు. ఈ సందేహం మాట ఎలా ఉన్నా ‘ఈ హైపర్ రియాలిటీ ఏఐ టెక్నాలజీతో 95 ఏళ్ల వయసులో నేను ఎలా ఉంటానో చూసుకోవాలని ఉంది’ అని సందడి చేస్తున్న నెటిజనుల సంఖ్యే ఎక్కువ. -
సైరా... సైకిల్ సవారీ.. ఆమెకు 74 సంవత్సరాలు అంటే నమ్మడం కష్టం
ఉత్తర కర్ణాటకలోని గోకర్ణకు చెందిన జ్యోత్స్న కాగల్ను చూస్తే ‘74 సంవత్సరాలు’ అని నమ్మడం చాలా కష్టం. దీనికి కారణం ఆమె చలాకీతనం. 74 ఏళ్ల వయసులో కొందరికి నడవడం కష్టం కావచ్చు. అయితే జ్యోత్స్న మాత్రం వేగంగా నడవడంతో పాటు వేగంగా సైకిల్ తొక్కుతూ వీధి వీధీ తిరుగుతుంది. 1968లో తన తొలి సైకిల్ను కొన్నది. ఆ రోజుల్లో ఆడవాళ్లు సైకిల్ తొక్కడం అనేది అతి అరుదైన దృశ్యం. అలాంటి రోజుల్లో సైకిల్పై మెరుపు వేగంతో దూసుకుపోయే జ్యోత్స్నను చూసి సర్వజనులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేవారు. ఆమె పేరు తెలియక ‘సైకిల్ అమ్మాయి’ అని పిలిచేవారు. ఆమె గోకర్ణలోని మహాబలేశ్వర్ కో–ఆపరేటివ్ సొసైటీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసింది. ధ్యానం, యోగాలతో జ్యోత్స్న దినచర్య మొదలవుతుంది. సైకిల్ సవారీ తన విజయ రహస్యం అని చెబుతున్న జ్యోత్స్న కాగల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
Viral Video: అరే వాహ్.. అద్భుత స్టెప్పులతో అదరగొట్టిన బామ్మ
మ్యూజిక్ వినిపిస్తే చాలు కొంతమంది ఆటోమెటిక్గా కాలు కదిపేస్తుంటారు. లోకాన్ని మర్చిపోయి ఎంతో ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటారు. ఈ మధ్య ఏ ఫంక్షన్, కార్యక్రమం జరిగినా డ్యాన్స్ లేకుండా ఉండటం లేదు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఉత్సాహంగా స్టెప్పులేసేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. తాజాగా ఇలాంటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ఓ బామ్మ సూపర్ ఎనర్జిటిక్ స్టెప్పులు వేసి అందరినీ షాక్కు గురి చేసింది. మహిళల కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్టేజ్పై ఉన్న సింగర్స్ పాటపాడుతుంటే అక్కడున్న వారంతా డ్యాన్స్ చేశారు. వారిలో అందరికంటే ముందు వరుసలో నిల్చున్న ఓ బామ్మ.. ఇతరులతో కలిసి ఎంతో హుషారుగా డ్యాన్స్ చేసింది. మరాఠీ పాటకు అద్భుత స్టెప్పులతో అదరహో అనిపించింది. 60 ఏళ్ల పైవయసున్న బామ్మ.. చుట్టుపక్కన వారిని పట్టించుకోకుండా, పూర్తిగా పాటను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ ఇరగదీసింది. బామ్మ డ్యాన్స్కు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె స్టామినా చూసి అవాక్కువుతున్నారు. ఆ వయస్సులో ఉరకలేస్తున్న ఆమె ఉత్సాహం చూసి ఫిదా అవుతున్నారు. మళ్లీ బాల్యం గుర్తొచ్చిందా బామ్మ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరు ఆ వీడియోను చూసేయండి. aaji at the front has cured my depression 😩 pic.twitter.com/QRkVSwVSov — gordon (@gordonramashray) March 25, 2023 -
బావిలో పడిపోయి.. మృత్యువుతో పోరాడి
మానకొండూర్: మతిస్థిమితం లేక నడుస్తూ అదుపుతప్పి బావిలో పడిపోయిన ఒక వృద్ధురాలిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ సంజీవ్నగర్ కాలనీలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. మండల కేంద్రానికి చెందిన ఉండింటి మధునమ్మ (80)కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులతో నివసిస్తున్న ఆమె.. మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో నిద్రలేచింది. అలాగే నడుస్తూ సమీపంలోని చేదబావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. బావిలోని బోర్మోటార్ పైపును పట్టుకొని అలాగే ఉండిపోయింది. ఉదయం 4.30 గంటల సమయంలో నిద్ర లేచిన ఓ మహిళకు బావిలోంచి వృద్ధురాలి అరుపులు వినిపించడంతో ఆమె సమీపంలోని వారికి చెప్పింది. వెంటనే స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. మధునమ్మ కుమారుడు రవి అందించిన సమాచారంతో మానకొండూర్ అగ్నిమాపక శాఖాధికారి భూదయ్య, లీడింగ్ ఫైర్మన్ ధర్మ్, ఫైర్మన్ పి.సంతోష్కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. లీడింగ్ ఫైర్మన్ ధర్మ్ చేదబావిలోకి దిగి వృద్ధురాలిని ఉదయం 6.30 గంటల సమయంలో క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు మూడు గంటలపాటు చేదబావిలో ఉన్న వృద్ధురాలు ప్రాణాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
అవ్వా.. ఎలా ఉన్నావ్?: సీఎం జగన్
-
అవ్వా.. ఎలా ఉన్నావ్?: సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్: జనంతో మమేకం అయ్యేవాడే నిజమైన లీడర్. అలాంటి లక్షణాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలో పుష్కలంగా ఉన్నాయి. అధికారంలో లేనప్పుడు పాదయాత్ర ద్వారా.. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు సంక్షేమం ద్వారా నిత్యం ప్రజల మధ్యే నిలుస్తుంటాడాయన. సాయం కోసం చూసే ఎదురు చూపులు.. ఎక్కడున్నా ఆయన కంట పడతాయి. ఎందుకంటే.. ప్రజల బాగోగులనే ఎజెండా ఆయన పాలనా ప్రాధాన్యాల్లో అగ్రభాగాన ఉంటుంది కాబట్టి. తాజాగా.. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం అధికారిక కార్యక్రమం ముగిశాక ఓ వివాహ రిసెస్షన్కు హాజరయ్యారు సీఎం జగన్. నల్లపురెడ్డి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్లో సందడి చేశారాయన. ఆ వేడుకలో పాల్గొని తిరుగు పయనమైన సందర్భంలో నియోజకవర్గ ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారాయన. ఆ సమయంలో ఆయనతో కరచలనం కోసం అక్కడున్నవాళ్లు ఎగబడ్డారు. ఈ క్రమంలో.. జనాల మధ్య ఉన్న ఓ వృద్ధురాలు.. సీఎం జగన్ను పిలిచారు. అది గమనించిన ఆయన.. తన సిబ్బందికి చెప్పి ఆమెను దగ్గరకు రప్పించుకున్నారు. ఎర్రబెల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మప్పగా తనను తాను పరిచయం చేసుకుంది ఆ వృద్ధురాలు. ఆపై ఆప్యాయంగా పలకరించి.. ఆమె బాగోగులు తెలుసుకున్నారు. బోసి నవ్వులతో మురిసిపోతున్న అవ్వను.. సీఎం జగన్ ఆప్యాయంగా కౌగిలించుకోవడం అక్కడున్నవాళ్లను ఆనందానికి గురి చేసింది. -
చీరకట్టులో మారథాన్.. 80 ఏళ్లయినా తగ్గేదే లే.. బామ్మ వీడియో వైరల్
ముంబై: పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏమైనా సాధించవచ్చని మరోమారు నిరూపించారు మహారాష్ట్ర ముంబైకి చెందిన ఓ బామ్మ. 80 ఏళ్ల వయసులో మారథాన్లో పాల్గొన్నారు. స్నీకర్స్ ధరించి చీరకట్టులో పరుగులు తీశారు. చేతిలో జాతీయ జెండా కూడా పట్టుకున్నారు. 51 నిమిషాల్లో 4.2కిలోమీటర్లు పరుగెత్తి శభాష్ అనిపించుకున్నారు. టాటా ముంబై మారథాన్ 18వ ఎడిషన్ ఆదివారం ఘనంగా జరిగింది. దాదాపు 55,000 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. 80 ఎళ్ల బామ్మ కూడా ఇందులో భాగమయ్యారు. ఆమె మనవరాలు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్గా మారింది. दुनिया में कोई काम असंभव नहीं, बस हौसला और मेहनत की जरूरत है।#thursdayvibes #ThursdayMotivation #marathon #mumbai #grandmother pic.twitter.com/dDzvGxmFG9 — Dr. Vivek Bindra (@DrVivekBindra) January 19, 2023 ఈ బామ్మ చాలా మందికి స్ఫూర్తి. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమేనని ఈమె నిరూపించారు. అని కొందరు నెటిజన్లు ప్రశంసించారు. కాగా.. ఈ మారథాన్లో పాల్గొనడం తనకు ఇది ఐదోసారి అని బామ్మ తెలిపారు. తాను భారతీయురాలినని సగర్వంగా చెప్పేందుకే చేతిలో జాతీయ జెండా పట్టుకున్నట్లు వివరించారు. చదవండి: పేదలకు ప్రతి నెలా రూ.2,000.. కర్ణాటక మంత్రి కీలక ప్రకటన -
బరితెగించిన మేల్ నర్స్.. సన్నిహితంగా ఉంటూ బ్లాక్మెయిలింగ్
సాక్షి, హైదరాబాద్: మలక్పేట ప్రాంతానికి చెందిన మేల్ నర్స్ మహ్మద్ గులామ్ నగరానికి చెందిన ఓ వృద్ధురాలిని టార్గెట్గా చేసుకున్నాడు. ఆమె వ్యక్తిగత వివరాలు సంగ్రహించిన అతగాడు వాటిని బయటపెడతానంటూ బ్లాక్మెయిలింగ్కు దిగాడు. బాధితురాలు నగర షీ–టీమ్స్ను ఆశ్రయించడంతో కటకటాల్లోకి చేరాడని అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ శుక్రవారం పేర్కొన్నారు. సదరు 55 ఏళ్ల మహిళ గతంలో కోవిడ్ బారినపడగా టెలీ మెడిసిన్ ద్వారా వైద్య సహాయం పొందారు. అప్పట్లో మేల్ నర్సుగా ఈమెకు తరచు ఫోన్లు చేసి యోగక్షేమాలు తెలుసుకున్న గులామ్ ఆమెకు సన్నిహితంగా మారాడు. తరచు ఫోన్లు చేస్తూ ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు. అతిగా స్పందిస్తున్నాడని, తన వ్యక్తిగత వివరాలు తెలుసుకుంటున్నాడని పసిగట్టిన ఆమె దూరంగా ఉంచడం మొదలెట్టారు. దీంతో తన వద్ద ఉన్న సమాచారాన్ని లీక్ చేస్తానని, ప్రశాంత జీవితాన్ని పాడుచేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఇతడిని వదిలించుకోవడానికి ఆమె కొంత మొత్తం చెల్లించినా పంథా మారలేదు. బాధితురాలు షీ–టీమ్స్ను ఆశ్రయించింది. విషయాన్ని పూర్తి గోప్యంగా ఉంచిన అధికారులు గులామ్ను పట్టుకుని, పూర్తి సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతడికి 8 రోజుల జైలు విధించడంతో చంచల్గూడకు తరలించారు. పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి వేధిస్తున్నాడంటూ.. ►పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి వేధిస్తున్నాడని మరో బాధితురాలు షీ–టీమ్స్ను ఆశ్రయించింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఈ మహిళకు (26) స్పాలో పని చేసే ఎం.అర్జున్ అకౌంటెంట్ ఉద్యోగం ఇప్పించాడు. కొన్నాళ్ల తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని అడగడం మొదలెట్టాడు. వివాహితుడైన అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో తిరస్కరించింది. బాధితురాలు ఆ ఉద్యోగాన్ని వదిలేసినా అర్జున్ నుంచి వేధింపులు తప్పలేదు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీ–టీమ్స్ అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాయి. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఐదు రోజుల జైలు శిక్ష విధించారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు ►గాంధీనగర్ ప్రాంతానికి చెందిన బాలికను ఇన్స్ట్రాగామ్ ద్వారా వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మొత్తమ్మీద గత నెల్లో షీ–టీమ్స్కు 103 ఫిర్యాదులు వచ్చాయి. వీరిలో 52 మంది నేరుగా, 34 మంది వాట్సాప్ ద్వారా, మిగిలిన వాళ్లు ఇతర విధానాల్లో ఆశ్రయించారు. వీటికి సంబంధించి ఆయా ఠాణాల్లో 12 కేసులు నమోదు కాగా.. 26 ఫిర్యాదులు పెట్టీ కేసులుగా మారాయి. ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో 98 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. వేధింపులు ఎదురైనప్పుడు మౌనంగా ఉండవద్దని, 9490616555కు వాట్సాప్ చేయడం ద్వారా లేదా నగర పోలీసు సోషల్మీడియా ఖాతాల ద్వారా ఫిర్యాదు చేయాలని ఏఆర్ శ్రీనివాస్ కోరారు. చదవండి: థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం.. హెచ్సీయూలో ఉద్రిక్తత -
కర్నూలు ప్రభుత్వాసుపత్రి.. రూ.150 కోసం పీడించారు
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అనధికార వ్యక్తుల సంచారం అధికమైంది. వైద్య సిబ్బందిలాగా యూనిఫాం ధరించి వార్డులో తిరుగుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. రోగులు, వారి సహాయకులను డబ్బుల కోసం వేధిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి ఫిమేల్ వార్డుకు వైద్యపరీక్షల కోసం ఓ మహిళ వచ్చింది. ఆమెకు సహాయంగా వచ్చిన వృద్ధురాలిని డబ్బులు ఇవ్వాలంటూ యూనిఫాంలో ఉన్న వ్యక్తులు వేధించారు. తన వద్ద డబ్బులు లేవంటూ వృద్ధురాలు బతిమిలాడినా వదిలిపెట్టలేదు. చివరికి వంద రూపాయలు ఇస్తానని వృద్ధురాలు చెప్పగా కనీసం రూ.150 ఇవ్వాలంటూ వేధించి మరీ తీసుకున్నారు. ఈ తతంగాన్ని కొందరు సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్గా మారింది. ఇది జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆసుపత్రి అధికారులను విచారణకు ఆదేశించారు. అయితే వైద్య సిబ్బంది ముసుగులో ఉన్న వ్యక్తులు ఆసుపత్రికి సంబంధించిన వారు కాదని, బయటి వ్యక్తులని అధికారులు తేల్చారు. వారిపై మూడవ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్రెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది నిత్యం పర్యవేక్షణలో నిమగ్నమై ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు, డ్రస్ కోడ్ ధరించి ఉండాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: (ఏపీ సంక్షేమ పథకాలకు లండన్ ఎంపీ కితాబు) -
మానవత్వం అంటే ఇది కదా! రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న ఆమెను..
ఇప్పటి వరకు ఎన్నో వైరల్ వీడియోలు చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో అందరీ హృదయాలను దోచేవిధంగానూ, కదిలించేలా ఉంటుంది. రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవించే ఒక వృద్ధురాలు కలలో కూడా ఊహించి ఉండి ఉండదు. తన జీవితంలో ఇలాంటి మంచి రోజు ఒకటి ఉంటుందని, చింత లేకుండా బతకుతాను అని అనుకుని ఉండకపోవచ్చు కదా. ఆ యువకుడు ఒక్కరోజులో ఆమె జీవితాన్ని మొత్తం మార్చేశాడు. వివరాల్లోకెళ్తే...75 ఏళ్ల వృద్ధురాలు రోడ్డుపై చెత్త కాగితాలు అమ్ముకుంటూ జీవిస్తుంటుంది. ఒక యువకుడు వచ్చి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతాడు. ఆమె చెత్తకాగితాలు అమ్ముకుంటూ బతుకుతుంటానని చెప్పింది. ఆ తర్వాత ఆ యువకుడు ఆమెను తీసుకెళ్లి షాపింగ్ చేయించి ..కూరగాయాలు, వేయింగ్ మిషన్, తోపుడు బండి వంటి అన్ని వస్తువులు కొని కూరగాయాలు అమ్ముకుంటూ బతకమని చెబుతాడు. అంతేగాదు ఆమెకు రోజు బతకడానికి కావల్సిన కనీస అవసరాలన్నింటిని సమకూరుస్తాడు. దీంతో సదరు వృద్ధురాలి సంబరపడిపోతూ ఆ యువకుడిని ఆనందంగా ఆశీర్వదిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో ఐఏఎస్ ఆఫీసర్ అవినాశ్ శర్మ పోస్ట్ చేశారు. ఆ వృద్ధురాలికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి తరుణ్ మిశ్రా అనే ఇన్స్ట్రాగ్రామర్ అని చెప్పారు. అతను తన అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియో నచ్చడంతో షేర్ చేసినట్లు తెలిపారు. అంతేగాదు నెటిజన్లు ఆ వృద్ధురాలికి చేసిన సాయానికి సదరు యువకుడిని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. Humanity.🙏🙏🙏 pic.twitter.com/NUZTGEB6Cp — Awanish Sharan (@AwanishSharan) October 18, 2022 View this post on Instagram A post shared by TARUN MISHRA (@tarun.mishra17) (చదవండి: చికెన్ బిర్యానీ కోసం ఏకంగా రెస్టారెంట్ని తగలెట్టేశాడు) -
అయ్యో.. అవ్వా, అన్నేళ్ల కష్టమంతా పోయిందే!
రాయగడ(భువనేశ్వర్): ఆరుగాలం కష్టపడి పైసా పైసా కూడబెట్టింది ఆ వృద్ధురాలు. నా అన్నవారు ఎవరూ లేకపోయినా దాచుకున్న సొమ్ముతో కులాసాగా బతకాలని అనుకుంది. తీరా అవసరం కోసం దాచుకున్న డబ్బును బయటకు తీయగా చెదలు పట్టడంతో దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరు అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కెరడ పంచాయతీ ఖిలిమిసి గుడ గ్రామానికి చెందిన సామంత సదే అనే వృద్ధురాలికి ఎవరూ లేరు. కూలి పనులు చేసుకుంటూ బతుకుతోంది. వచ్చే కూలి డబ్బులను కొంతమేర అవసరాలకు ఖర్చు పెట్టి, మిగతా డబ్బును ఒక ట్రంకు పెట్టెలో దాచి ఉంచింది. ఇలా సుమారు రూ.40 వేలకు పైగా దాచుకున్న డబ్బు అవసరం కోసం తెరవగా, డబ్బుకు చెదలు పట్టి పనికిరాకుండా పోయినట్లు గుర్తించింది. కొన్ని నోట్లు తడిచిపోవడంతో పాటు మరికొన్ని పూర్తిగా చిరిగిపోయి ఉన్నాయి. దీంతో కష్టమంతా వృథా అయ్యిందని కన్నీటిపర్యంతమైంది. కొన్ని నోట్లు తడిచి ఉండడంతో ఎండలో ఆరబెట్టింది. చదవండి: డాక్టర్ సతీమణి అత్యుత్సాహం.. భర్త లేకపోవడంతో తానే వైద్యం, రోగి మృతి.. ఇద్దరూ పరార్! -
బాప్రే!...ఆమె కంటిలో ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్లు...
ఇంతవరకు పలు రకాల వైరల్ వీడియోలు చూశాం. క్లినికల్ ఆపరేషన్కి సంబంధించిన వీడియోలు అరుదు. అందునా కంటికి సంబంధించిన సర్జరీ వీడియోలు చూసి ఉండం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే.. అమెరికాలో ఒక వృద్ధురాలికి కాంటాక్ట్ లెన్స్ ధరించే అలవాటు ఉంది. వాస్తవానికి ఇలాంటి కాంటాక్ట్లెన్స్ ధరిస్తే రాత్రి పడుకునే ముందు కచ్చితంగా తీసేసి పడుకోవాలి. ఐతే ఆమె అలా చేయడం మరిచిపోయి ప్రతి రోజు మరో కొత్త లెన్స్ని వాడటం మొదలు పెట్టింది. ఇలా సుమారు ఒక నెల వరకు ఇలానే చేసింది. ఆ తర్వాత కన్ను నుంచి నీరు రావడం, ఇబ్బందిగా ఉండటంతో ఆ వృద్ధురాలు డాక్టర్ వద్దకు వచ్చింది. దీంతో వైద్యులు ఆమె కంటికి ఒక చిన్న సర్జరీ చేసి సుమారు 23 కాంటాక్ట్ లెన్స్లను తొలగించారు. ఈ మేరకు డాక్టర్ కటెరినా కుర్తీవా మాట్లాడుతూ...ఇలా కాంటాక్ట్ లెన్స్లు తీయడం మరిచిపోయి మళ్లీ కొత్తది పెట్టడం అనేది చాలా అరుదైన ఘటన అని అన్నారు. కాంటాక్ట్ లెన్స్ని వేరుచేయడానికి చాలా సూక్ష్మమైన పరికరాన్ని వినియోగించాల్సి వచ్చిందన్నారు. ఆ కాంటక్ట్ లెన్స్లన్నీ కంటిలో ఒక నెల వరకు ఉండటంతో ఒకదానికొకటి అతుక్కుపోయి ఉన్నాయని చెప్పారు. ఇలా ఆమె వరుసగా 23 రోజులు చేసిందని అన్నారు. సర్జరీ తర్వా లెక్కిస్తే...కరెక్ట్గా 23 కాంటాక్ట్ లెన్స్లు ఉన్నాయని చెప్పారు. అంతేగాదు సదరు వైద్యురాలు ఆ సర్జరీకి సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Ophthalmologist | Dr. Katerina Kurteeva M.D. | Newport Beach (@california_eye_associates) (చదవండి: బీటెక్ చదివితే జాబే చేయాలా.. ‘బీటెక్ చాయ్వాలి’ వెరీ స్పెషల్ అంటున్న నెటిజన్లు!) -
AP: సచివాలయ ఉద్యోగుల ఔదార్యం
మండపేట(కోనసీమ జిల్లా): వయసు తక్కువగా ఉండటంతో పింఛన్ ఆగిపోయిన మహిళ దీనస్థితిని చూసి చలించిపోయి ఏడాదిన్నరగా ప్రతి నెల రూ.2,000 చొప్పున తమ జీతం నుంచి సాయం అందిస్తూ ఔదార్యాన్ని చాటుకున్నారు కోనసీమ జిల్లా మండపేటలోని 3వ వార్డు సచివాలయ ఉద్యోగులు. తాజాగా, ఆమెకు రూ.2,500 పింఛన్ మంజూరు కాగా, గురువారం అందించారు. గతంలో నిర్వహించిన వెరిఫికేషన్లో మండపేటకి చెందిన పి.రాజమ్మకు వయసు తక్కువగా ఉండటంతో పింఛన్ ఆగిపోయింది. చదవండి: స్ఫూర్తి సముదాయం.. ఒకేచోట అన్ని భవనాలు పునరుద్ధరించేందుకు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ జి.శ్రీసత్యహరిత పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కాకినాడ డీఆర్డీఏ అధికారుల వద్దకు పంపినా సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారాయి. నిరుపేద అయిన రాజమ్మ దీనస్థితిని చూసి చలించిపోయిన హరిత, మహిళా కానిస్టేబుల్ విజయలక్ష్మి, వెల్ఫేర్ సెక్రటరీ గణేష్ ప్రతి నెల తమ జీతం నుంచి రూ.2,000 మొత్తాన్ని ఏడాదిన్నరగా ఆమెకు అందజేస్తూ వచ్చారు. సాంకేతిక లోపాలు సరిజేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో ఆగస్ట్ నుంచి రాజమ్మకు కొత్త పింఛన్ మంజూరైంది. తనకు ఇంతకాలం సాయం అందించి ఆదుకోవడంతోపాటు పింఛను మంజూరు చేయించిన సచివాలయ ఉద్యోగులకు రాజమ్మ కృతజ్ఞతలు తెలిపింది. -
పింఛన్ కోసం వెళ్తే చనిపోయావన్నారు
సాక్షి, హైదరాబాద్: పింఛన్ కోసం అధికారులను ఆశ్రయించిన వృద్ధురాలికి వింత అనుభవం ఎదురైంది. పింఛన్ మంజూరైందో, లేదో తెలుసుకునేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్తే ఆన్లైన్లో ఆమె చనిపోయినట్లుగా ఉందన్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శుక్రవారం జరిగింది. చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామానికి చెందిన బుడిగె వెంకటనర్సమ్మ వృద్ధాప్య పింఛన్ కోసం ఏడాదిక్రితం దరఖాస్తు చేసింది. ప్రభుత్వం ఇటీవల కొత్త పింఛన్లు మంజూరు చేయడంతో ఆ జాబితాలో తన పేరు ఉందో లేదో తెలు సుకునేందుకు కుమారుడు నరేష్తో కలిసి వెంకటనర్సమ్మ శుక్రవారం ఉదయం పంచాయతీ కార్యాలయానికి వెళ్లింది. వెంకటనర్సమ్మ ఆధార్ కార్డు నంబర్ను కార్యదర్శి సౌమ్య ఆన్లైన్లో ఎంటర్ చేయగా ఆమె చనిపోయినట్లుగా చూపించింది. అనంతరం మీసేవ, మండల పరిషత్ కార్యాలయాల్లో విచారిస్తే.. అక్కడెక్కడా ఆ ధ్రువీకరించిన దాఖలాలు లేవు. కానీ ఆన్లైన్లో మాత్రం మరణించినట్లుగా నమోదై ఉండడంతో వెంకటనర్సమ్మ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాను బతికే ఉన్నానని, పింఛన్ మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటోంది. చదవండి: Munugodu Politics: మునుగోడు బరిలోకి వైఎస్సార్టీపీ! -
ఇదేం సరదా.. అడిగి మరీ అరెస్టయింది!
జీన్ బికెంటన్. ఆస్ట్రేలియాకు చెందిన వందేళ్ల బామ్మగారు. కొన్నేళ్లుగా వీల్చైర్కే పరిమితమైంది. అయినవాళ్ల నడుమ తన వందో పుట్టినరోజు వేడుకలు ఫుల్ జోష్గా జరుపుకుంటోంది. ఉన్నట్టుండి పోలీసులు రంగప్రవేశం చేశారు. అందరూ చూస్తుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సంకెళ్లు వేసి మరీ తీసుకెళ్లారు. కానీ, షాకవ్వాల్సింది పోయి బామ్మగారు చప్పట్లు కొడుతూ సంబరపడిపోయారు. పైగా ఆహూతులంతా ఆమెతో శ్రుతి కలిపారు. ఎందుకంటారా? ఎందుకంటే జరిగింది ఉత్తుత్తి అరెస్టే కాబట్టి. పోలీసులు వేసినవీ ఉత్తుత్తి సంకెళ్లే కాబట్టి. అసలు సంగతేమిటంటే జీవితంలో ఒక్కసారైనా ఒక్కసారన్నా అరెస్టు కావాలన్నది ఈ బామ్మగారి చిరకాల వాంఛ. ఈ విచిత్రమైన కోరికను విక్టోరియా పోలీసులు ఇలా తీర్చారన్నమాట. పైగా బామ్మ కోరిక మేరకు పుట్టినరోజు నాడే అరెస్టు చేసి మరింత సంతోషపెట్టారు. తర్వాత కలిసి ఇలా ఫొటోలు దిగి సందడి చేశారు. విక్టోరియా పోలీసు శాఖ వాటినిలా ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ‘‘అరెస్టయితే ఎలా ఉంటుందో చూడాలన్నది బామ్మగారి చిరకాల కోరిక అని తెలియడంతో దాన్నిలా తీర్చాం. దాంతో ఆమె చెప్పలేనంత ఆనందపడింది. ఇది మాకూ సరదాగానే అన్పించింది’’ అని చెప్పుకొచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్ నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంది. పోలీసుల స్పందన వారి మనసు దోచుకుంది. ఇది కమ్యూనిటీ పోలీసింగ్కు అద్దం పట్టిందంటూ కామెంట్లు పెట్టారు. పుట్టిన రోజునాడు పెద్దావిడకు గొప్ప కానుక ఇచ్చారంటూ కొందరు మెచ్చుకున్నారు. అన్నట్టూ ఈ బామ్మగారు ఆర్మీలో నర్సుగా సుదీర్ఘకాలం పని చేసి రిటైరయ్యారట. తన చిరకాల కోరికను జీవిత చరమాంకంలో మొత్తానికిలా తీర్చుకున్నారు. -
జై బాలయ్య అంటూ ఈలలు వేస్తూ పెద్దావిడ రచ్చ, వీడియో వైరల్
నందమూరి బాలకృష్ణ-గోపిచంద్ మలినేని కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుత్ను సంగతి తెలిసింది. ప్రస్తుతం షూటింగ్ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఎన్బీకే107(#NBK107) అనే వర్కింగ్ టైటిల్తో సెట్స్పైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కర్నూల్లో జరపుకుంటుంది. ఇటీవలే టర్కీలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కర్నూల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. బాలయ్యను చూసేందుకు స్థానికులు తండోనతండాలుగా తరలివచ్చారు. ఇక ఫ్యాన్స్లో బాలయ్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా అన్న, ఆయన కనిపించిన అభిమానులు చేసే రచ్చ అంత ఇంత కాదు. చదవండి: కదలలేని స్థితిలో కైకాల, బెడ్పైనే కేక్ కట్ చేయించిన చిరు.. ఫొటోలు వైరల్ ఈ క్రమంలో ఎన్బీకే 107 షూటింగ్ సెట్ను బాలయ్యను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇందులో ఓ ముసలావిడ కూడా ఉండటం విశేషం. బాలకృష్ణను చూడగానే ఆమె డాన్స్, ఈలలు వేస్తూ రచ్చరచ్చ చేసంది. అంతేకాదు జై బాలయ్య అంటూ పలుమార్లు ఈలలు వేస్తూ బాలకృష్ణపై అభిమానాన్ని చాటుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్గా టాలీవుడ్కు పరిచయం కాబోతున్నాడు. విలక్షణ నటి వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలో పోషిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. Celebrating the shoot of #NBK107 ❤️ pic.twitter.com/mQb0MteeyB — Mythri Movie Makers (@MythriOfficial) July 26, 2022 -
అక్షరమే ఆమె ఆరోగ్య బలం.. 82 ఏళ్ల వయస్సులో పుస్తకాలు రాయడం మొదలుపెట్టి
ఎనభై ఏళ్లు దాటిన తరువాత పుస్తకాలు చదవడానికే ఇబ్బంది పడతాం. కేరళకు చెందిన మారీస్ మాత్రం 82 ఏళ్ల వయసులో తొలి పుస్తకం రాసింది. ఇప్పుడు ఆమె వయసు 88. రాసిన పుస్తకాల సంఖ్య 12. అప్పుడెప్పుడో చిన్నప్పుడు కలం పట్టింది మారీస్. సందర్భం ఏమిటంటే, స్కూల్లో కవితల పోటీ నిర్వహించారు. అందులో తనకు బహుమతి వచ్చింది. ఇక ఆ ఉత్సాహంలో ఎన్నో కవితలు రాసింది. అయితే చదువుల ఒత్తిడి, ఆ తరువాత ఉద్యోగం కోసం సన్నాహం, తీరిక లేని ఉద్యోగ బాధ్యతలు, పెళ్లి, కుటుంబ బాధ్యతలు... తనను రచనలకు దూరం చేశాయి. కక్కనాడ్(కేరళ)లో ట్రెజరీ ఆఫీస్ సూపరిండెంట్గా పనిచేసింది మారీస్. వృత్తిరీత్యా ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే మారీస్ను రిటైరయ్యాక ఒక్కసారిగా శూన్యం ఆవరించింది. చురుకుదనం దూరం అయింది. ఆ సమయంలోనే తనను ఇంట్లో షెల్ఫ్లలోని పుస్తకాలు పలకరించాయి. అందులో చాలా పుస్తకాలు ‘టైమ్ దొరికితే చదవాలి’ అనుకున్నావే. ఆ టైమ్ తనకు ఇప్పుడు వచ్చింది. అలా అక్షరప్రయాణం మొదలైంది. షెల్ఫ్లోని పుస్తకాలన్ని ఖాళీ అయ్యాయి. కొత్త పుస్తకాలు వచ్చి చేరుతున్నాయి. ఫిక్షన్ నుంచి వ్వక్తిత్వ వికాసం వరకు ఎన్నో పుస్తకాలు చదివింది. ఆ పుస్తకాలు ఇచ్చిన స్ఫూర్తితో 82 ఏళ్ల వయసులో కలం పట్టింది మారీస్. ‘కడలింటే మక్కాల్’ పేరుతో తొలి పుస్తకం రాసింది. అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘ఈ వయసులోనూ ఎంత బాగా రాసిందో. మొదటి పుస్తకం అంటే ఎవరూ నమ్మరు’ అనేవాళ్లతో పాటు– ‘ఇక్కడితో మీ రచన ఆగిపోకూడదు. ఇంకా ఎన్నో పుస్తకాలు రావాలి’ అని ప్రోత్సహించిన వాళ్లు ఉన్నారు. వారి సలహాతో ఆమె తన కలానికి ఇక విశ్రాంతి ఇవ్వలేదు. ఇప్పుడు మారీస్ వయసు 88 సంవత్సరాలు. ఇప్పటి వరకు 12 పుస్తకాలు రాసింది. వాటిలో ఇంగ్లీష్లో రాసినవి కూడా ఉన్నాయి. కలం బలం ఉండాలేగానీ వస్తువుకు కొరతా? తన విస్తృతజీవిత అనుభవాలలో నుంచి రచనకు అవసరమైన ముడిసరుకును ఎంచుకుంది. వ్యక్తిగత జీవితం నుంచి ట్రెజరీ ఆఫీస్ వరకు ఎన్నెన్నో అనుభవాలు తన రచనల్లోకి వచ్చి పాఠకులను మెప్పించాయి. విశేషం ఏమిటంటే మారీస్ స్ఫూర్తితో మనవలు, మనవరాళ్లు కూడా కలం పట్టుకున్నారు. చిన్న చిన్న రచనలు చేస్తున్నారు. ఇంటినిండా ఓ సృజనాత్మక వాతావరణం ఏర్పడింది. ‘రచన అంటే అక్షరాలు కూర్చడం కాదు. అది ఒకలాంటి ధ్యానం’ అనే సత్యాన్ని నమ్మిన మారీస్ ఇప్పుడు పదమూడో పుస్తకం రాయడానికి సిద్ధం అయింది. ఆమె పుస్తకాలకు ఎందరో విద్యావేత్తలు, సృజనకారులు ముందుమాటలు రాశారు. వారిలో ప్రొఫెసర్ ఎంకే సను ఒకరు. ‘సృజనకు వయసు అడ్డుకాదని మరోసారి నిరూపించారు మారీస్. వేగంగా చదివించే శైలి ఆమె ప్రత్యేకం’ అంటున్నారు సను. చదవండి: Tanisa Dhingra: ఆమె మరణించీ... జీవిస్తోంది! కూతురి కోసం ఆ తల్లి.. -
తీరిన కోరిక: పాకిస్తాన్ వెళ్లాలి మా ఇల్లు చూడాలి
15 ఏళ్ల వయసులో దేశ విభజన సమయంలో రావిల్పిండిని వదిలి వచ్చేసింది రీనా వర్మ కుటుంబం. అప్పటి నుంచి పాకిస్తాన్ వెళ్లి తన ఇంటిని చూసుకోవాలని బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని ఆమె కోరిక. ఎన్ని దశాబ్దాలు ప్రయత్నించినా వీసా ఇవ్వలేదు. ఇప్పుడు 90 ఏళ్ల వయసు ఆమెకు. వీసా వచ్చింది. 75 ఏళ్ల తర్వాత వాఘా సరిహద్దును దాటి పాకిస్తాన్లోకి అడుగుపెట్టింది. ఆమె ఉద్వేగాలు ఎలా ఉంటాయో. ఎవరికైనా ఇది ఎంత గొప్ప అనుభవమో. గత సంవత్సరమే హిందీలో ఒక సినిమా వచ్చింది. నీనా గుప్తా లీడ్ రోల్. సినిమా పేరు ‘సర్దార్ కా గ్రాండ్సన్’. ఇందులో అమృత్సర్లోని 90 ఏళ్లు దాటిన ఓ వృద్ధురాలు లాహోర్లో ఉన్న తన ఇంటిని చూడాలనుకుంటుంది. దేశ విభజన సమయంలో అల్లర్లకు భర్త చనిపోగా నెలల బిడ్డను తీసుకొని సైకిల్ తొక్కుకుంటూ లాహోర్ విడిచిపెట్టి భారత్కు చేరుకుంటుందామె. మళ్లీ పాకిస్తాన్ వెళ్లడం కుదరదు. తన ఇంటితో ముడిపడ్డ జ్ఞాపకాలను తలచుకోని రోజు ఉండదు. పోయే ముందు ఆ ఇంటిని చూసి పోవాలని ఆమె కోరిక. కాని ప్రయాణం చేసే శక్తి ఉండదు. ఆమె బాధను మనవడు అర్థం చేసుకుంటాడు. ఆమె పాకిస్తాన్ వెళ్లకపోతే ఏమి ఆమె ఉన్న ఇంటినే ఇక్కడకు తెస్తాను అని పాకిస్తాన్ వెళ్లి ఆ ఇంటికి చక్రాలు కట్టి (బిల్డింగ్ మూవర్స్ సహాయంతో) తెచ్చి ఆమెకు చూపిస్తాడు. ఇది కొంచెం కష్టసాధ్యమైనా సినిమాలో ఎమోషన్ పండింది. అయితే రీనా వర్మ విషయంలో ఇంత ప్రయాస లేదు. అదృష్టవశాత్తు ఆమెకు పాకిస్తాన్ హైకమిషన్ వీసా ఇచ్చింది. కాకపోతే 1965 నుంచి ట్రై చేస్తుంటే 2022కు. మొన్న శనివారం (జూలై 16) వాఘా సరిహద్దు దాటి ఆమె పాకిస్తాన్లోకి అడుగుపెట్టింది. 15 ఏళ్ల వయసులో పాకిస్తాన్ను వదిలాక ఇన్నేళ్ల తర్వాత తన ఇంటిని చూసుకోవడానికి అక్కడకు వెళ్లింది రీనా వర్మ. రావల్పిండిలో బాల్యం పూణెలో నివసిస్తున్న 90 ఏళ్ల రీనా వర్మ పాకిస్తాన్లోని రావల్పిండిలో పుట్టి పెరిగింది. అక్కడి ‘ప్రేమ్నివాస్’ అనే ఏరియాలో ఆమె బాల్యం గడిచింది. ‘మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసేవాడు. నాకు నలుగురు తోబుట్టువులు. నేను అక్కడి మోడర్న్ స్కూల్లో చదువుకున్నాను. మా నాన్న ఆ రోజుల్లోనే చాలా ప్రోగ్రెసివ్. ఆడపిల్లలను చదివించాలనుకున్నాడు. మా పెద్దక్క 1930లలోనే కాలేజీలో చదివింది. రావల్పిండి శివార్లలో మూరీ అనే హిల్ స్టేషన్ ఉంది. కొన్నాళ్లు అక్కడ మా నాన్న పని చేశాడు. అక్కడంతా బ్రిటిష్ వాళ్లు ఉండేవాళ్లు. వాళ్లతో మేము కలిసి మెలిసి ఉన్నాం’ అని చెప్పింది రీనా వర్మ. ఆమె అసలు పేరు రీనా చిబ్బర్. పెళ్లయ్యాక రీనా వర్మ అయ్యింది. దేశ విభజన 1932లో పుట్టిన రీనా వర్మకు దేశ విభజన నాటికి 15 ఏళ్లు. ‘దేశ విభజన వరకూ మాకు మత కలహాలు అంటే తెలియదు. మా ఇంటికి ముస్లింలు, శిక్కులు వచ్చి పోతుండేవారు. అందరూ స్నేహంగా ఉండేవాళ్లు. కాని దేశ విభజన సమయానికి అల్లర్లు పెరిగిపోయాయి. మా అమ్మ అసలు దేశం విడిపోతుందంటే నమ్మలేదు. కాని మేము ఢిల్లీ వచ్చేశాం’ అంది రీనా వర్మ. ‘ఢిల్లీ వచ్చాక ఆమె తొలి రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనడం నాకొక గొప్ప అనుభూతి. అప్పుడు నెహ్రూగారిని చూశాను. మళ్లీ 1962 ఇండో చైనా యుద్ధం తర్వాత జరిగిన రిపబ్లిక్ డేలో లతా మంగేష్కర్ ‘ఏ మేరే వతన్ కే లోగో’ పాడుతున్నప్పుడు నేను నెహ్రూ గారి వెనుకనే కూచుని ఉన్నాను. ఆయన కన్నీరు కార్చడం నేను చూశాను’ అంటుంది రీనా. పెళ్లి తర్వాత ఆమె బెంగళూరు వచ్చి కావేరీ ఎంపోరియమ్లో పని చేయడం మొదలెట్టింది. భర్త హెచ్.ఏ.ఎల్ (హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్)లో చేసేవాడు. కాని ఎక్కడ ఉన్నా ఆమెకు ఒక్కసారి తిరిగి రావల్పిండి చూసి రావాలనే కోరిక వేధించేది. 1965 నుంచి ప్రయత్నిస్తే... 1965లో పాకిస్తాన్ వీసా కోసం ప్రయత్నిస్తే రాలేదు. కాని మధ్యలో క్రికెట్ మేచ్ల కోసం వీసాలు ఇస్తున్నారంటే 1990లో లాహోర్కు వెళ్లింది కాని రావల్పిండికి వెళ్లలేకపోయింది. 2021లో ఆమె తన ఫేస్బుక్లో రావల్పిండి గురించి రాస్తే పాకిస్తాన్కు చెందిన సజ్జద్ హైదర్ అనే వ్యక్తి రావల్పిండిలోని ఆమె ఇంటి ఫొటో తీసి పంపాడు. అది చూసినప్పటి నుంచి ఆమెకు ఇంకా ఆ ఇల్లు చూడాలనే కోరిక పుట్టింది. మళ్లీ వీసా కోసం అప్లై చేస్తే రాలేదు. ఇంకోసారి వీసాకు అప్లై చేసి ఆ విషయాన్ని ఫేస్బుక్లో పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి హీనా రబ్బానీకి ట్యాగ్ చేయడంతో 90 ఏళ్ల రీనా వర్మ కోరికను మన్నించాల్సిందిగా ఆమె ఆదేశాలు ఇచ్చింది. పాకిస్తాన్ హై కమిషన్ ఆమెకు వెంటనే మూడు నెలల వీసా మంజూరు చేసింది. వాఘా సరిహద్దు గుండా ఆమె రోడ్డు మార్గంలో పాకిస్తాన్లో అడుగుపెట్టింది. మాలాంటి వాళ్ల కోసం నిజానికి భారత్, పాకిస్తాన్ల మధ్య 60 ఏళ్లు దాటిన వారి కోసం సరిహద్దుల్లో తక్షణ వీసాలు ఇచ్చే ఒప్పందం ఉంది. కాని దానిని పాటించడం లేదు. ‘విడిపోకుండా ఉంటే బాగుండేది. సరే విడిపోయాం. కాని మాలాంటి వాళ్ల కోసం ఇరుదేశాలు వీసాలు ఇస్తే కొన్ని పాత జ్ఞాపకాలను సజీవం చేసుకుంటాం’ అంటుంది రీనా వర్మ. ఈ కథనం అంతా వాఘా దాటిన వెంటనే రాస్తున్నది. ఆమె అక్కడ ఏం చూసిందో ఏం చేసిందో మరో కథనంలో చెప్పుకుందాం. ఒక మంచి తలంపును గట్టిగా తలిస్తే నెరవేరుతుంది అనడానికి రీనా వర్మ ఒక ఉదాహరణ. -
ఇంజినీర్ చిన్నాలమ్మ!.. చదువు లేకపోయినా సంకల్ప బలంతో..
ఆ వృద్ధురాలికి చదువు లేదు.. సంకల్ప బలం ఉంది ఇంజినీర్లు సైతం సాధ్యం కాదన్నారు.. చిన్నాలమ్మ మాత్రం సాధ్యం కానిదేదీ లేదని నిరూపించింది. అధికారులు సాంకేతిక కారణాలతో చెక్ డ్యాం నిర్మించలేమన్నారు.. ఆ కారణాలకు ‘చెక్’పెడుతూ ‘డ్యాం’ నిర్మించారు.. చేయాలన్న తపన ఉంటే సాధ్యం కానిది లేదని నిరూపించారు. తన ఇద్దరు కుమారులతో కలిసి పంట పొలాలకు నీరందించే భగీరథులయ్యారు. చదవండి: లోకేష్తో ప్రేమ పెళ్లి.. అత్తారింటికి వెళ్లి.. భార్యను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి.. సాక్షి, పాడేరు: పెదబయలు మండలంలోని మారుమూల కిముడుపల్లి పంచాయతీకి చెందిన కోడా చిన్నాలమ్మ అనే మహిళా రైతు తోటి గిరిజన రైతులకు ఉపకారిగా నిలిచారు. తనతో పాటు మరికొంత మంది గిరిజన రైతుల సాగు భూములకు నిత్యం అన్ని కాలాల పాటు సాగు నీరు అందే లక్ష్యంగా కంబాలబయలు సమీపంలోని గేదెగెడ్డ వాటర్ఫాల్ ప్రాంతంలో మినీ చెక్డ్యాంను నిర్మించారు. పూర్వం నుంచి ఈ గెడ్డ వద్ద వృథాగా పోతున్న నీటిని పంట కాలువల ద్వారా దిగువ భూములకు సాగు నీటిని అందించాలని గిరిజనులు కోరుతున్నారు. అయితే వాటర్ఫాల్ ప్రాంతం ఎత్తుగా ఉండడంతో పాటు అక్కడ చెక్డ్యాం నిర్మించడం కష్టమని గతంలోనే ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు. పలుమార్లు ఇక్కడ చెక్డ్యాం మంజూరైనప్పటికి సాంకేతిక కారణాలతో పనులు జరగలేదు. గేదెగెడ్డ వాటర్పాల్కు ఆనుకుని నిర్మించిన మిని చెక్డ్యాం అయితే కోడా చిన్నాలమ్మ, ఆమె ఇద్దరు కుమారులు కోడా సింహాద్రి, కోడా వరహనందంలు ఇక్కడ మినీ చెక్డ్యాం నిర్మాణానికి గత ఏడాది శ్రీకారం చుట్టారు. సుమారు రూ.3లక్షలకు పైగానే సొంత నిధులు ఖర్చుపెట్టి వాటర్ఫాల్కు ఆనుకుని మినీ చెక్డ్యాంను నిర్మించారు. వాటర్ఫాల్ నుంచి దిగువుకు పోయే నీటిలో కొంత ఈ చెక్డ్యాం చానల్లోకి వస్తుంది. అక్కడ నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న పంట భూములకు కాలువ ద్వారా నీటిని మళ్లించారు. మట్టి కాలువ తవ్వడంతో పాటు కొంత భాగంలో సిమెంట్ కాంక్రీట్తో ప్రధాన కాలువను కూడా నిర్మించారు. ఆ సిమెంట్ కాలువ దిగువున చిన్నపాటి వంతెన కూడా నిర్మించడంతో ఈ మొత్తం నిర్మాణమంతా అద్భుతంగానే ఉందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణదారులైన కోడా చిన్నాలమ్మకు చెందిన భూములకు కూడా సాగు నీరు అందుతోంది. అలాగే సమీపంలోని మిగిలిన గిరిజనుల భూములకు కూడా సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఈ పంట కాలువను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే చేదుపుట్టు సమీపంలోని పంట భూములకు వేసవిలో కూడా సాగునీరు అందించవచ్చని గిరిజనులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిర్మించిన చెక్డ్యాం, కాలువ ద్వారా 60 ఎకరాల భూములకు సాగునీరు పుష్కలంగా అందుతుందని, వర్షాలు కురవకపోయిన పంటలు పండించవచ్చని స్థానిక గిరిజనులు పేర్కొంటున్నారు. దశాబ్దాల కల నెరవేరింది : కంబాల బయలు శివారున తమతో పాటు అనేక మంది గిరిజనులకు వ్యవసాయ భూములున్నాయి. పూర్వం నుంచి అక్కడ భూములకు గేదెగెడ్డ నుంచి సాగు నీరును అందించేందుకు చెక్డ్యాం నిర్మించాలని అధికారులను అనేకసార్లు కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. తన కుమారుల సహాయంతో సొంతంగానే మిరీ చెక్డ్యాం, పంట కాలువలు నిర్మించడం సంతోషంగా ఉంది. చెక్డ్యాం నిర్మించాలనే తమ కల ఇన్నాళ్లకు నెరవేరింది. ప్రధాన పంట కాలువ ద్వారా అందరి అవసరాలకు సాగునీరును మళ్లిస్తాం. –కోడా చిన్నాలమ్మ, నిర్మాణ దాత, కిముడుపల్లి -
అంధురాలు ఆవేదన.. గూడు లేకుండా చేశారయ్యా!
రహమత్నగర్: తన నివాసం తొలగించడం పట్ల ఓ అంధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం అందించిన పట్టా ప్రకారం కేటాయించిన స్థలంలోనే నివాసం నిర్మించుకున్నా.. కొంత మంది బస్తీ నాయకులు రెవెన్యూ సిబ్బందికి తప్పుడు సమాచారం అందించి తన నివాసాన్ని కూల్చివేయించారని అంధురాలైన చంద్రమ్మ వాపోయింది. ఎస్పీఆర్ హిల్స్ రాజీవ్గాంధీనగర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రమ్మ మాట్లాడుతూ... అంధురాలైన తన విజ్ఞప్తి మేరకు 1993వ సంవత్సరంలో తహసీల్దార్ తనకు ఫాం డీ పట్టాను (ఎఫ్.4477.93) అందజేశారన్నారు. ఈ క్రమంలోనే రాజీవ్ గాంధీనగర్లోని తనకు కేటాయించిన 89 ప్లాట్లోనే చిన్న షెడ్డు వేసుకుని తన కుమార్తెతో కలిసి జీవిస్తున్నానని తెలిపింది. అయితే కొంత మంది బస్తీ నాయకులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో రెవెన్యూ సిబ్బంది తాను నివాసం ఉంటున్న షెడ్డును తొలగించారని ఆమె వాపోయింది. తన పేరున ఇచ్చిన పట్టా ఉండగా తన నివాసం ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది. అంధురాలైన తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డిలకు చంద్రమ్మ విజ్ఞప్తి చేసింది. -
మామూలు డేరింగ్ కాదుగా.. వంతెన పైనుంచి గంగా నదిలో దూకి..
సోషల్ మీడియా అనగానే ఎన్నో వింతలు, విశేషాలు కనిపిస్తుంటాయి. కొన్ని వినూత్న వీడియోలు, ఫన్నీలు నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. మరికొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా ఓ బామ్మ(73) చేసిన ఫీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. వివరాల ప్రకారం.. హర్యానాలోని సోంపేట్కు చెందిన ఓంవతి(73) హరిద్వార్లోని హర్ కీ పౌరి వద్ద 40 అడుగుల ఎత్తైన వంతెన పై నుంచి గంగా నదిలో దూకింది. ఆ తర్వాత నది అవతల ఒడ్డునకు ఈదుకుంటూ వెళ్లింది. ఆమె గంగా నదిలో దూకే సమయంలో కొందరు యువకులు ఆమెకు సహాయం అందించారు. అంత ఎత్తు నుంచి ఆమె నదిలో దూకడం అక్కడున్న వారందరినీ షాక్కు గురిచేసింది. हर हर गंगे...🙏 70 years old dadi jumping into the Ganges river from the bridge of Har Ki Pauri, Haridwar and she swimming comfortably. Really this is unexpected.@ActorMadhavan @ShefVaidya @amritabhinder @bhumipednekar @VidyutJammwal @divyadutta25 @ImRaina @harbhajan_singh pic.twitter.com/kaCpXH8hy1 — Rajan Rai (@RajanRa05092776) June 28, 2022 కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. అనంతరం, ఓంవతి మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి నదుల్లో ఈత కొడుతున్నానని తెలిపింది. ఎత్తైనా వంతెనల నుంచి దూకి ఈత కొట్టడం అలవాటేనని పేర్కొంది. ఓంవతికి డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టమని చెప్పింది. ఆమె డ్యాన్స్కు సంబంధించిన వీడియోలు కూడా వైరల్గా మారాయి. Joie de vivre! The 73-year-old who went viral for her dive into Ganga is also fond of dancing... pic.twitter.com/dtlOokNndp — Boris A.K.A Bread & Circuses (@BorisPradhan) June 30, 2022 ఇది కూడా చదవండి: కప్పు ఛాయ్ రూ. 70 వసూలు! రైల్వే ప్యాసింజర్ షాక్.. రైల్వేస్ వివరణ -
100 మీటర్ల రేసులో 105 ఏళ్ల బామ్మ కొత్త చరిత్ర
100 మీటర్ల పరుగు పందెంలో 105 ఏళ్ల రామ్బాయి కొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం వడోదర వేదికగా జరిగిన నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో ఈ బామ్మ వంద మీటర్ల రేసులో భాగంగా 45.40 సెకన్లలోనే గమ్యాన్ని చేరింది. అయితే సమాచారం ప్రకారం ఈ రేసులో రామ్బాయి తప్ప మరెవరు పాల్గొనలేదంట. కేవలం 100 ఏళ్లు పైబడిన వారికే నిర్వహించిన రేసులో రామ్బాయి ఒక్కరే పాల్గొన్నారు. ఎవరు పోటీ లేకపోవడం.. తన రికార్డును తానే బద్దలు కొట్టి గమ్యాన్ని చేరిన రామ్బాయికి స్వర్ణ పతకం అందజేశారు. కాగా అదే రోజున నిర్వహించిన 200 మీటర్ల స్ప్రింట్ను ఒక నిమిషం 52.17 సెకన్లలో గమ్యాన్ని అందుకొని స్వర్ణం సాధించడం విశేషం. కాగా 100, 200 మీటర్ల రేసులో విజయం సాధించిన తర్వాత రామ్బాయిని స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు చప్పట్లు, కేరింతలతో అభినందించారు. అనంతరం ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఇక ఇదే గుంపులో రామ్బాయి మనవరాలు.. అథ్లెట్ అయిన షర్మిలా సంగ్వాన్ కూడా ఉంది. తన నానమ్మ విజేతగా నిలవడంతో ఆమె ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఆమె మాట్లాడుతూ.. ''మా నానమ్మ విజయం మాకు గర్వకారణం. ఈ విజయానికి ఆమె అర్హురాలు. ఎందుకంటే సాధారణ రోజుల్లో ఉదయాన్నే లేచి 3-4 కిలో మీటర్లు ఆగకుండా పరిగెత్తడం ఆమెకు అలవాటు. ఇది ఆమెను మరింత బలంగా తయారయ్యేలా చేసింది.'' అంటూ పేర్కొంది. At 105 years, super grandma sprints new 100m record. #Rambai ran alone in #Vadodara as there was no competitor above 85 competing at the National Open Masters Athletics Championship pic.twitter.com/iCIPTOkuFt — TOI Bengaluru (@TOIBengaluru) June 21, 2022 చదవండి: Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే Manoj Tiwary On Work And Cricket: పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గం పని -
82 ఏళ్లు.. 24 గంటలు.. 125 కిలోమీటర్లు
ఇవేం లెక్కలబ్బా... అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా? బార్బరా హంబర్ట్ అనే ఫ్రాన్స్ మహిళ రికార్డులివి. గత నెలాఖరులో జరిగిన ఫ్రెంచ్ చాంపియన్షిప్లో 24 గంటల్లో 125 కిలోమీటర్లు పరుగెత్తి ప్రపంచరికార్డు సృష్టించింది 82 ఏళ్ల బార్బరా. 24 గంటల్లో 105 కిలోమీటర్లు పరుగెత్తి ఓ జర్మన్ మహిళ నెలకొల్పిన రికార్డును బార్బరా బ్రేక్ చేసింది. ఆ వయసులో అలా పరుగెత్తిందంటే ఆమె జీవితమంతా రన్నింగేనేమో అనుకోకండి. తనకు 43 ఏళ్ల వయసులో అంటే తన కూతురు హైస్కూల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ టైమ్లో రన్నింగ్ మొదలుపెట్టారామె. మొదట బౌఫ్మాట్వీధులకే పరిమితమైన బార్బరా పరుగు... తరువాత మారథాన్స్ దాకా వెళ్లింది. ఈ 39 ఏళ్ల కాలంలో పారిస్, న్యూయార్కుల్లో జరిగిన 137 రేసులు, 54 మారథాన్స్లో పాల్గొన్నది. ‘మొదట మెడిటేషన్లాగా మొదలుపెట్టాను. కానీ వీధుల్లో పరుగెడుతున్నప్పుడు కలిగిన స్వేచ్ఛా భావన నాకో స్పష్టతనిచ్చింది. అప్పటినుంచి పరుగును ఆపలేదు’ అంటుంది బార్బరా. అంతేకాదు.. పరుగు పూర్తయ్యేవరకు దాహం, ఆకలి, నిద్ర అన్నింటినీ మరిచిపోతుంది. ముగింపు లైన్ దాటాకే ఆమెకు అలసట గుర్తొస్తుంది. 14 గంటల రేసులో ఆమెతోపాటు ఉండి... అవసరమైనవల్లా అందించిన ‘మై హస్బెండ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’ అంటారు బార్బరా. ఆ వయసులో పరుగు మొదలుపెడితే అడ్డంకులేం ఎదురు కాలేదా? అంటే... చాలా గాయాలయ్యాయి. నొప్పులొచ్చాయి. అయినా ఇవేవీ ఆమె పరుగును ఆపలేకపోయాయి. ఎలాంటి మందులు వేసుకోను, కేవలం ట్రైనింగ్నే నమ్ముతానని చెప్పే బార్బరా.. రన్నింగ్ను వదిలేస్తే మాత్రం నిరుత్సాహం ఆవహిస్తుందంటారు. -
బతికుండగానే చంపేశారు
సాక్షి,సత్తుపల్లి(ఖమ్మం): బతికున్న వృద్ధురాలు చనిపోయినట్టుగా రికార్డుల్లో నమోదు చేయడంతో పింఛన్ నిలిచిపోయిన ఘటన సత్తుపల్లి మండలం కిష్టారం పంచాయతీలో వెలుగుచూసింది. పింఛన్ పొందుతూ మృతి చెందిన వారి జాబితాను రూపొందించే క్రమంలో కొమ్మేపల్లికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు రఫీమోనిషా కూడా మృతి చెందిందని నమోదు చేసినట్లు తెలుస్తోంది. చనిపోయినా పింఛన్ పొందుతున్న వారి వివరాల పరిశీలనకు చేపట్టిన క్షేత్రస్థాయి విచారణలో పొరబాటు జరిగినట్లు సమాచారం. గంగారంలో కూడా ఇదే తరహాలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు నమోదు కాగా, మళ్లీ పొరబాటును సరిచేశారని తెలిసింది. అయితే కిష్టారం పంచాయతీలో సుమారు 20 మందికి పైగా చనిపోయినా పింఛన్ పొందినట్టు విచారణలో తేలడంతో కుటుంబీకుల నుంచి రికవరీ కోసం నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై సత్తుపల్లి ఎంపీడీఓ సుభాషిణిని సోమవారం వివరణ కోరగా రఫీమోనిషాకు ఒక నెల మాత్రమే పింఛన్ ఆగిందని.. సమగ్రంగా విచారించి పునరుద్ధరిస్తామని తెలిపారు. -
Sakshi Cartoon: ...కూరగాయలు తింటే, అమ్మితే ఇన్నేళ్లు బతకడం కాదు! పనిచేయడం
...కూరగాయలు తింటే, అమ్మితే ఇన్నేళ్లు బతకడం కాదు! పనిచేయడం వలన బతుకుతున్నాను! -
కూల్ డ్రింక్లో నిద్ర మాత్రలు కలిపి.. ఆమె పడుకోగానే..
సాక్షి,మాచారెడ్డి(నిజామాబాద్): ఓ వృద్ధురాలికి కూల్ డ్రింక్లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి చుక్కాపూర్లో చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిలుక లక్ష్మి కుటుంబ సభ్యులు ఊరు వెళ్లడంతో ఆమె ఒంటరిగా ఉంది. ఇది గమనించిన ఆమె ఇంటి పక్కన ఉండే రాములు ఆమెకు నిద్రమాత్రలు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి తాగించాడు. ఆమె నిద్రపోగానే మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించాడు. ఉదయం లేచిన లక్ష్మి మెడలో గొలుసు లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చదవండి: కుక్క కరిచిందా.. అయితే రూ.10వేలు తీసుకోవడం మరచిపోకండి! -
కొడుకులు కూడు పెట్టట్లే సార్.. ఓ వృద్ధురాలి దీనగాథ
తిరువళ్లూరు(చెన్నై): ఐదుగురు సంతానం ఉన్నా ఎవరూ తనను పట్టించుకోవడం లేదని.. ఈ నేపథ్యంలో తన భర్తపై పేరుపై వున్న ఇంటిని తన పేరుపై మార్చాలని కోరుతూ ఓ వృద్ధురాలు సోమవారం కలెక్టర్ ఆల్బీజాన్వర్గీష్కు వినతి పత్రం సమర్పించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కాకలూరుకు చెందిన శివజ్ఞాన సంబంధం, విజయలక్ష్మి(74) దంపతులకు ఐదుగురు సంతానం. వీరికి అదే ప్రాంతంలో కోటి రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. శివజ్ఞాన సంబంధం 2012లో మృతి చెందాడు. అయితే అప్పటి నుంచి కొడుకులు పట్టించుకోవడం లేదని, తిండి కూడా పెట్టడంలేదని తల్లి విజయలక్ష్మి వాపోయారు. తన భర్త పేరుపై ఉన్న ఆస్తిని కొడుకులకు ఇవ్వకుండా తన పేరుపై మార్చాలని కలెక్టర్ను కోరింది. స్పందించిన కలెక్టర్ బాధితురాలికి న్యాయం చేయాలని తిరువళ్లూరు తహసీల్దార్ను ఆదేశించారు. చదవండి: నిర్మలా సీతారామన్కు కర్ణాటక మొండిచేయి? -
బతికున్న మనిషి చనిపోయినట్లు నమ్మించి..
తిరువళ్లూరు(చెన్నై): బతికి ఉన్న వృద్ధురాలు మృతి చెందినట్లు నమ్మించి 30 ఎకరాల ఆస్తిని కాజేసిన వారిపై చర్యలు తీసుకుని, తమ భూములను అప్పగించాలని ఒకే కుటుంబానికి చెందిన బాధితులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గురువారం వెలుగుచూసింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పుదువల్లూరు నయపాక్కం గ్రామానికి చెందిన పచ్చయప్పన్కు అదే గ్రామంలో 30 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. గత 40 ఏళ్ల క్రితం కుటుంబ తగాదాల కారణంగా పుదువల్లూరు నయపాక్కం నుంచి పాక్కంకు వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్ల క్రితం పచ్చయప్పన్ మృతి చెందాడు. అతని కుమారులు కృష్ణన్, రాజన్ కలిసి తహసీల్దార్ను సంప్రదించారు. అయితే అప్పటికే పట్టాభూమితో సంబంధం లేని ముగ్గురు వ్యక్తుల పేరిట మారినట్లు తెలిసి షాక్కు గురయ్యారు. పచ్చయప్పన్ భార్య మృతి చెందినట్లు తప్పుడు సమాచారం ఇచ్చి డెత్ సర్టిఫికెట్తో పాటు మొత్తం రికార్డులను మార్చేసి కబ్జా చేసినట్లు నిర్ధారించారు. దీంతో పచ్చయప్పన్ భార్య సుశీల, ఇద్దరు కొడుకులు, ఏడుగురు కుమార్తెలు కలిసి తిరువళ్లూరు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్తో సహా పలువురు ఉన్నతాధికారులకు గత ఏడేళ్లుగా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. న్యాయం జరగకపోవడంతో ఆవేదన చెందిన వారు గురువారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. చదవండి: భార్యను కాటు వేసిన కొండచిలువ.. భర్త ఏం చేసాడంటే? -
భూమి కబ్జా చేశారంటూ..
ఆదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధురాలు పెట్రోల్ బాటిల్ వెంట తెచ్చుకోవడం కలకలం రేపింది. తన భూమిలో కొందరు అక్రమంగా ఉంటూ కొట్టం నిర్మిస్తున్నారని, తన చేను తనకు దక్కేలా చూడాలని కోరుతూ దరఖాస్తు రాసుకుని ఆదిలాబాద్ పట్టణం బొక్కలగూడకు చెందిన కొమ్ము నాగమ్మ ప్రజావాణికి వచ్చింది. ముందుగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ను కలసి అర్జీ అందజేసింది. అది చదివిన కలెక్టర్ ‘మీ భూమిని మీరే కాపాడుకోవాలి..’అని చెప్పి పంపించారు. దీంతో నిరాశకు లోనైన నాగమ్మ బయటకు వచ్చి అక్కడున్న వారందరికీ తన సమస్య తెలిపింది. ఆమెతో వచ్చిన మరో ఇద్దరు కూడా నాగమ్మ సమస్య పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఇక్కడే చనిపోయేందుకు పెట్రోల్ బాటిల్ తెచ్చుకుందని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. నాగమ్మకు నచ్చజెప్పారు. దాంతో ఆమె మళ్లీ కలెక్టర్ను కలిసేందుకు లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా నాగమ్మ తన సమస్యను పూర్తిగా వివరించింది. ‘నాకు ఖానాపూర్ శివారులో సర్వే నంబర్ 68/93లో 1.05 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి శిరీష అనే మహిళ అధీనంలో ఉండేది. 2021 జూన్లో శిరీష చనిపోయింది. ఆమె బతికి ఉన్నప్పుడే ఈ భూమిని నాకు ఇచ్చేసింది. నేను భూమి పట్టా బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చుకుని ఎవుసం చేసుకుంటున్నా. అయితే శిరీష బంధువులు పోయిన డిసెంబర్లో నా భూమిని కబ్జా చేసుకున్నరు. అక్రమంగా కొట్టం కడుతున్నరు. నేను చేనుకాడికి పోతే చంపుతామని బెదిరిస్తున్నరు. నా భూమి నాకు ఇప్పించుండ్రి’ అని నాగమ్మ వివరించింది. సమస్యను గుర్తించిన కలెక్టర్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
తనిఖీ పేరుతో దుస్తులు విప్పమని బలవంతం చేశారు.. అవమానించారు1
న్యూఢిల్లీ: ఎయిర్పోర్ట్లో చాలా మది ప్రముఖులు సిబ్బంది తనిఖీల దృష్ట్యా ఈ మధ్య కాలంలో పలు చేదు అనుభవాలను చూసిన సందర్భాలు కోకొల్లలు. ఇటీవల కాలంలో ప్రముఖ నర్తకి, నటి సుధా చంద్రన్ తన కృత్రిమ అవయవాన్ని తొలగించమని ముంబై విమానాశ్రయంలో సిబ్బంది కోరినప్పుడు తాను చాలా అవమానానికి గురైయ్యానని సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. పైగా మాలాంటి వాళ్ల పట్ల ఇలా ప్రవర్తించవద్దని ఎయిర్ పోర్ట్ సిబ్బందిని కోరారు కూడా. దీంతో ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది సుధా చంద్రన్ క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఇప్పడు అచ్చం అలాంటి చేదు అనుభవమే 80 ఏళ్ల దివ్యాంగురాలికి ఎదురైంది. ఈ ఘటన గౌహతి ఎయిర్పోర్ట్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే....గౌహతిలోని గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 80 ఏళ్ల దివ్యాంగురాలు తన మనవరాలలితో కలిసి వచ్చింది. అయితే ఎయిర్పోర్ట్లో ప్రయాణిలను తనిఖీ చేయడం సహజం అదే విధంగా వారిని ఆ విమానాశ్రయంలోని సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేశారు. అయితే సదరు మహిళ తుంటి ఎముక(హిప్ ఇపంప్లాంట్)కు సర్జరీ చేయించుకుంది. అయితే సిబ్బంది తనిఖీల సమయంలో ఆమె శరీరంలోని మెటల్ పీస్ ఇండికేటర్ ఆన్లో ఉండటంతో బీప్ సౌండ్ వచ్చింది. దీంతో ఆమెను ఫిజికల్ టెస్ట్ల తనిఖీ నిమిత్తం ఫ్రిస్కింగ్ బూత్కి తీసుకువెళ్లారు. అంతేకాదు తుంటి ఎముక సర్జరీ జరిగిన ప్రాంతం చూపించమంటూ సిబ్బంది బలవంతం చేశారు. పైగా ఆమె లోదుస్తులను తొలగించి నగ్నంగా చెక్ చేశారు. దీంతో ఆ మహిళ కూతురు కికాన్ ట్విట్టర్లో.. "నా 80 ఏళ్ల తల్లి టైటానియం ఇంప్లాంట్కు ప్రూఫ్ కావాలని ఆమెను దుస్తులు విప్పమని బలవంతం చేసారు. ఈ విధంగానా సీనియర్ సిటిజన్ల పట్ల వ్యవహరించేది అని మండిపడ్డారు". అంతేకాదు ఆమె ట్విట్టర్ వేదికగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, సీఐఎస్ఎఫ్ భద్రతా దళాలకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐఎస్ఎఫ్ గౌహతిలో జరిగిన దురదృష్టకర సంఘటనకు సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఆ ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన సదరు సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ని సస్పెండ్ చేశామని పేర్కొంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ట్విట్టర్లో ఫిర్యాదుదారుపై స్పందిస్తూ..తాను కూడా ఈ విషయమై విచారణ చేస్తున్నాని తెలియజేయడమే కాకుండా సదరు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. (చదవండి: వీడియో: హుషారుగా గంతులేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య.. అందులో ఎక్స్పర్ట్ కూడా!) -
ఇంప్లాంట్ ఉందన్నా బట్టలిప్పించి తనిఖీ
గౌహతి: నడుము భాగంలో ఇంప్లాంట్ (మెటల్ ప్లేట్) వేయించుకున్న 80 ఏళ్ల వృద్ధురాలిని బట్టలిప్పించి తనిఖీ చేసిన ఘటన అస్సాంలోని గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో గురువారం చోటుచేసుకుంది. వృద్ధురాలి నడుముకు గత ఏడాది శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు మెటల్ ప్లేట్ వేశారు. ఢిల్లీకి వెళ్లడానికి నాగాలాండ్ నుంచి గౌహతికి చేరుకుంది. మనవరాలితో కలిసి చక్రాల కుర్చీలో ఎయిర్పోర్టు లోపలికి వెళ్తుండగా, మెటల్ డిటెక్టర్ అలారం మోగింది. దీంతో సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది ఆమెను ఆపారు. బట్టలు ఇప్పించి తనిఖీ చేశారు. శరీరంలో ఇంప్లాంట్ ఉందంటూ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. వృద్ధురాలిని అవమానించినట్లు ఫిర్యాదు అందడంతో అందుకు కారణమైన మహిళా కానిస్టేబుల్ను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. గౌహతి ఎయిర్పోర్టులో వృద్ధురాలికి అవమానం -
ఉక్రెయిన్ గడ్డపై పౌరుషం ఎంతలా అంటే..
world war two veteran was ready to defend: ఉక్రెయిన్ గడ్డ పోరు ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ముఖ్యకారణం.. ప్రాణాలకు తెగించి దేశం కోసం సామాన్యుడు తుపాకీ పట్టడం.. యుద్ధ భూమిలో ప్రాణాలను ఎదురొడ్డి పోరాడడం. రష్యా బలగాలు.. విరుచుకుపడుతున్నా, పిట్టల్లా ప్రజలు రాలుతున్నా దేశభక్తితో ముందుకు వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో.. ఉక్రెయిన్లోని మాజీ సైనికురాలు ఓల్హా ట్వెర్డోఖ్లిబో తాను సైన్యంలోకి చేరతానుంటూ ఉత్సాహంగా ముందుకు వచ్చింది. ఓల్హా.. రెండో ప్రపచంలో యుధంలో పాల్గొన్న అనుభవజ్ఞురాలు కూడా. పైగా ఇప్పుడామె రెండోసారి యుద్ధాన్ని ఎదుర్కొడానికి సిద్ధంగా ఉంది. యుద్ధంలో దెబ్బతిన్న తన మాతృభూమిని రక్షించుకోవాడానికి తాను పోరాడుతానని చెబుతోంది. ఈ మేరకు ఆమె ఉక్రెయిన్ మిలటరీకి దరఖాస్తు చేసుకుంది. కానీ ఉక్రెయిన్ అధికారులు ఆమె వయసు రీత్యా ఆమె దరఖాస్తును తిరస్కరించారు. కానీ, ఆమె మాత్రం దేశం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమని అంటోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ట్విట్టర్లో పేర్కొంది. ఆమెకు అన్ని అర్హతలు, అనుభవం ఉన్నప్పటికీ వయసు రీత్యా తీసుకోలేదని వివరించింది. అయితే "ఆమె కచ్చితంగా త్వరలో కైవ్లో మరో యుద్ధ విజయాన్ని జరుపుకుంటుందని అనుకుంటున్నాం" అనే క్యాప్షన్ జోడించి మరీ ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఉక్రెయిన్ మహిళలు అత్యంత ధైర్యవంతులు అని ఒకరు, ఒక సైనికుడు ఎప్పటికీ సైనికుడే అని మరోకరు ట్వీట్ చేశారు. 98 y.o. Olha Tverdokhlibova, WWII veteran faced a war for the 2nd time in her life. She was ready to defend her Motherland again, but despite all the merits and experience was denied, though, because of age. We are sure, she will celebrate another victory soon in Kyiv!#Ukraine pic.twitter.com/jI39RyCCJK — MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) March 18, 2022 (చదవండి: పీల్చే గాలిని సైతం విషంగా మార్చిన ఉక్రెయిన్ యుద్ధం!) -
బువ్వ పెడ్తలేరు.. బాంచెన్
జగిత్యాలక్రైం: ‘అయ్యా.. కంటిసూపు సరిగ్గలేదు.. కూసుంటే లేవలేను.. లేస్తే కూసోలేను.. అడుగేసి నడ్వలేను.. నా పెన్మిటి నలబై ఏండ్ల కిందనే సచ్చిపోయిండు.. గిసొంటి స్థితిలో ఉన్న నాకు కొడుకులు, కోడండ్లు బువ్వ వెడ్తలేరు.. బాంచెన్ మీజే జర నాయం జేయండ్రి’ అని జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కోడెటి రాజవ్వ(85) బుధవారం పోలీసులను ఆశ్రయించింది. కోడెటి రాజవ్వ– మల్లయ్య దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. కూతుళ్ల వివాహలై అత్తవారింటికి వెళ్లిపోయారు. భర్త మల్లయ్య సుమారు 40ఏళ్ల క్రితమే మృతిచెందాడు. ఒక కొడుకు కూడా గతంలోనే చనిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఇద్దరు కోడళ్లతో కలిసి రాజవ్వ ఉంటోంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోంది. కంటిచూపు సరిగాలేదు. నడవనూలేదు. దీంతో కోడళ్లు సూటిపోటిమాటలతో వృద్ధురాలిని వేధిస్తున్నారు. కనీసం భోజనం పెట్టేందుకూ ముందుకు రావడంలేదు. విసిగి వేసారిన రాజవ్వ.. బుధవారం రూరల్ ఎస్సై అనిల్ను కలిసింది. తనకు న్యాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంది. స్పందించిన ఎస్సై.. వెంటనే కోడళ్లను పోలీస్స్టేషన్కు పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చెరో నెలరోజులు వృద్ధురాలిని పోషించాలని సూచించారు. ఆస్పత్రి ఖర్చులు, ఇతర అవసరాలు తీర్చాలని పేర్కొన్నారు. వృద్ధురాలి బాగోలు ఇద్దరూ కలిసే చూడాలని ఆదేశించారు. ఇందుకు వారిద్దరూ అంగీకరించి తమ అత్తను ఇంటికి తీసుకెళ్లారు. -
కనికరం చూపమని నా కోడలికి మీరైనా చెప్పండమ్మా!
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: ‘‘భర్త దూరమైనా...ఒక్కగానొక్క కొడుకును చూసుకుని బతికేదాన్ని...దేవుడు నా బిడ్డనూ 33 ఏళ్లకే తీసుకువెళ్లాడు. ప్రభుత్వ ఉద్యోగం చేసే కోడలు అండగా ఉంటుందనుకుంటే... ఇద్దరి పిల్లలనూ నా దగ్గర వదిలేసి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఈ పిల్లల ఆలనా పాలనా నా తరమా...వయస్సు ఉడిగిపోయిన నాపై పిల్లల బాధ్యత భావ్యమా..? వారి భవిష్యత్ తలచుకుంటుంటే భయమేస్తోంది. బిడ్డలపై కనికరం చూపమని నా కోడలికి మీరైనా చెప్పండమ్మా...ఈ ఇద్దరు చిన్నారుల భవిష్యత్ కోసం ఓ దారి చూపించండమ్మా’’ అని ఓ వృద్ధురాలు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’లో కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ను వేడుకుంది. కలెక్టర్కు వృద్ధురాలు ఇచ్చిన అర్జీ ప్రకారం....అనంతపురం విద్యుత్ నగర్కు చెందిన లక్ష్మికి ఒక్కగానొక్క కుమారుడు సంతానం. జేఎన్టీయూలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసేవాడు. మేనకోడలితో పెళ్లికాగా గిరీష్కుమార్, జ్ఞానేశ్వరి సంతానం కలిగారు. అయితే అతను అనారోగ్యానికి గురై 2020లో మృతి చెందాడు. దీంతో రెవెన్యూ శాఖలో ఆర్ఐగా పనిచేసే అతని భార్య పిల్లలను వారి నానమ్మ లక్ష్మి వద్ద వదిలి మరో పెళ్లి చేసుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నారుల ఆలనా పాలనా నానమ్మే చూసుకుంటోంది. ఈక్రమంలోనే తన కోడలికి బుద్ధి చెప్పి చిన్నారుల భవితకు దారి చూపాలని కలెక్టర్ను వేడుకుంది. పిల్లల చదువులు, బాగోగులు చూసుకోవడం తనకు కష్టతరమవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన కలెక్టర్... వృద్ధురాలు లక్ష్మి వినతిని ప్రత్యేకంగా స్వీకరించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. -
అంగన్వాడీ ఆయా ప్రభుత్వ నౌకరా!.. ఎమ్మెల్యేను ప్రశ్నించిన వృద్ధురాలు
సాక్షి, కామారెడ్డి: తాను రూ. 3వేల జీతంతో అంగన్వాడీ ఆయాగా పనిచేసి ఐదేళ్ల క్రితం రిటైర్ అయితే రూ. 30వేలు ఇచ్చారని, ఇప్పుడు ఆయా పని లేక, వృద్ధాప్య పింఛన్ రాక ఎలా బతకాలని రామారెడ్డికి చెందిన 75ఏళ్ల వృద్ధురాలు దుడుక సత్తవ్వ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ను ప్రశ్నిచింది. ఆదివారం రామారెడ్డి పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే దగ్గరకు వచ్చిన సత్తవ్వ తనకు పింఛన్ ఇవ్వాలని కోరింది. తనతో పాటు మరో 8 మంది వృద్ధులు ఆయాలుగా పనిచేసి రిటైర్ అయినా పింఛన్ల రావడం లేదని చెప్పింది. తమకు అంగన్వాడీ నుంచి ఎలాంటి పింఛన్లు ఇవ్వనప్పుడు ప్రభుత్వం ఆసరా పింఛన్లు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించింది. దీంతో స్పందించిన ఎమ్మెల్యే పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
మాయలేడి.. కోవిడ్ వ్యాక్సిన్ పేరుతో వృద్ధురాలిని నమ్మించి..
కర్నూలు: నగర శివారులోని న్యూ పోస్టల్ కాలనీలో నివాసముంటున్న వృద్ధురాలు మద్దమ్మను(70) గుర్తు తెలియని మహిళ కోవిడ్ వ్యాక్సిన్ పేరుతో మాయమాటలు చెప్పి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును తస్కరించి మాయమైంది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో 50 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ ముఖానికి స్కార్ఫ్ ధరించి మద్దమ్మ ఇంటి వద్దకు వచ్చి తాను సచివాలయం వలంటీర్ అంటూ పరిచయం చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నావా అని ఆరా తీసి బూస్టర్ డోస్ వేయడం కోసం వచ్చానని నమ్మబలికింది. మంచంపై పడుకోబెట్టి తన బ్యాగులో ఉన్న బీపీ మిషన్, స్టెతస్కోప్తో పరీక్షించినట్లు నటించింది. చదవండి: ఆనందంగా గడిపి.. కుటుంబ సభ్యులందరూ నిద్రపోయాక.. తలను అటువైపు తిప్పుకోమని చెప్పి మెడలో ఉన్న మూడు తులాల చైన్ను కట్టర్తో కత్తిరించింది. వృద్ధురాలు గుర్తించి ఇదేమిటని ప్రశ్నించగా మళ్లీ చైన్ ఇస్తానంటూ ఆమె బ్యాగులో ఉన్న నకిలీ చైన్ను గొంతులో వేసి కదులకుండా పడుకో ఆఫీసర్ను పిలుచుకుని వస్తానంటూ అక్కడి నుంచి కనిపించకుండా మాయమైంది. వృద్ధురాలు కొద్దిసేపటికి తేరుకుని నకిలీ గొలుసు మెడలో వేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని సేకరించారు. రెండు నెలల క్రితం స్టాంటన్పురం, నరసింహారెడ్డి నగర్లో కూడా ఇదే తరహాలోనే మహిళ చోరీకి పాల్పడింది. సీసీ పుటేజీ ఆధారంగా పాత నేరస్తురాలిగా పోలీసులు నిర్దారణకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. -
మానవత్వం చాటుకున్న ఉప్పల్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఉప్పల్ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. బాలాజీనగర్లో చలికి వణుకుతున్న ఓ వృద్ధురాలిని చేరదీసి.. చెంగిచర్లలోని భారతమాత అండ ఆశ్రమంలో చేర్చారు. రాయచోటికి చెందిన లింగమ్మ అనే వృద్ధురాలు కొడుకుతోపాటు బాలాజీ నగర్లో నివాసం ఉంటుంది. సోమవారం రాత్రి సొంత కొడుకే.. తల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. దీంతో గడ్డకట్టించే చలిలో వృద్ధురాలు రోడ్డుపై అనాథగా.. చలికి వణుకుతూ ఉండిపోయింది. పెద్దావిడ ధీన స్థితిని గమనించిన కాలనీవాసులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉప్పల్ పెట్రోలింగ్ పోలీసులు ఎ.నర్సింగ్రావు, మహిళా పోలీసు కానిస్టేబుల్ సుష్మ, డ్రైవర్ రాములు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వృద్ధురాలిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం వృద్ధురాలిని చెంగిచర్లలోని ఆశ్రమానికి తరలించారు. సకాలంలో స్పందించి వృద్ధురాలిని రక్షించిన పోలీసులకను ప్రజలు అభినందిస్తున్నారు. -
బామ్మగారి బాపూజీ విగ్రహం
దుగ్గొండి: ఆమె వయసు అరవై దాటింది. పూలమ్ముకుంటేనే పట్టెడన్నం దొరుకుతుంది. ఆ బీదరాలికి జాతిపిత మహాత్మాగాంధీ అంటే అంతులేని గౌరవం.. అదే ఆమెను మహాత్ముని విగ్రహావిష్కరణకు పురిగొలిపింది. పూలమ్ముకుని సంపాదించిన సొమ్ముతో శిథిలావస్థలో ఉన్న మహాత్ముడి విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేబల్లే గ్రామంలో పూలమ్ముకుని బతికే నౌగరి బుచ్చమ్మ తాత 1965లో గ్రామంలో మహా త్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అది ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. తాత ఏర్పాటు చేసిన విగ్రహం స్థానంలో బుచ్చమ్మ పూలవ్యాపా రం చేసి వెనకేసుకున్న డబ్బు రూ.25 వేలతో మహా త్ముడి నూతన విగ్రహాన్ని తెప్పించి బుధవా రం స్వయంగా ఆవిష్కరించింది.. దీంతో గ్రామస్తులు, మండల ప్రజలు నౌగరి బుచ్చమ్మను అభినందిం చారు. కార్యక్రమంలో సర్పంచ్ గటిక మమత, ఉప సర్పంచ్ పకిడె మైనర్బాబు, పాల్గొన్నారు. -
రూపాయికే దోసె.. ఎర్రకారం, బొంబాయి చట్నీ.. ఎక్కడో తెలుసా..?
హోటల్లో దోసె తినాలంటే రూ.20 నుంచి రూ.50లోపు వెచ్చించాలి. అయితే ఓ వృద్ధురాలు రూపాయికే దోసె విక్రయిస్తూ సామాన్యుల కడుపు నింపుతోంది. ఎర్రకారం, బొంబాయి చట్నీతో దోసె తింటుంటే ఎంతో రుచికరంగా ఉంటోందని స్థానికులు అంటున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నా రూపాయికే దోసె విక్రయిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది తాడిపత్రికి చెందిన సావిత్రమ్మ అనే వృద్ధురాలు. తనకు కూలి గిట్టుబాటు అయితే చాలు పెద్దగా లాభాపేక్ష ఏమీ లేదని చెబుతోంది. తాడిపత్రి టౌన్(అనంతపురం జిల్లా): తాడిపత్రి పట్టణం కాల్వగడ్డ వీధికి చెందిన వెంకట్రామిరెడ్డి, సావిత్రమ్మ దంపతులు. వీరికి చంద్రశేఖర్రెడ్డి, లక్ష్మీదేవి, సరళ సంతానం. 40 ఏళ్ల కిందట వెంకట్రామిరెడ్డి టీ బంకు పెట్టుకుని జీవనం సాగించేవాడు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుందని వెంకట్రామిరెడ్డి భార్య సావిత్రమ్మ ఇంటి వద్ద బంకు ఏర్పాటు చేసుకుని దోసెలు వేయడం మొదలు పెట్టింది. ప్రారంభంలో దోసె ధర పావలా. అలా దోసెలు వేసి అమ్మగా వచ్చిన సంపాదనను కుటుంబానికి, పిల్లల చదువులకు ఖర్చు చేసింది. వీధిలోని వారు, చుట్టుపక్కల పేదలు, విద్యార్థులు, పిల్లలు అధిక సంఖ్యలో ఈ దోసెలు తినేవారు. చదవండి: నెట్ సెంటర్లో వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయని మహిళ.. చివరికి.. 15 ఏళ్ల తరువాత బియ్యం, వంట నూనె ధరలు పెరగడంతో దోసె ధరను 50 పైసలకు పెంచి వ్యాపారం కొనసాగించింది. తరువాత కొన్నాళ్లకు భర్త అనారోగ్యం బారిన పడి మృతి చెందాడు. కుటుంబ పోషణ భారం మొత్తం సావిత్రమ్మపైనే పడింది. తన సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఇటీవల కాలంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో దోసె ధరను రూపాయికి పెంచింది. ఎర్రకారం, బొంబాయి చట్నీ కాంబినేషన్లో దోసె ఎంతో రుచికరంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సావిత్రమ్మ వయసు 70 సంవత్సరాలు. కొడుకు, కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి సంతోషంగా జీవనం గడుపుతోంది. పేదలు, సామాన్యులకు అతి తక్కువ ధరలో దోసె విక్రయిస్తూ కడుపు నింపుతున్నానన్న ఆనందం చాలని అంటోంది. చాలా రుచిగా ఉంటాయి నేను ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచి సావిత్రమ్మ అవ్వ దగ్గర దోసెలు తింటున్నాను. నూనె, బియ్యం ధరలు పెరిగినప్పటికీ పేదలకు అందుబాటులో రుచిరకంగా ఆతీ్మయంగా దోసెలు అమ్ముతోంది. కాలనీలో దోసెల అవ్వ అంటే తెలియని వాళ్లు ఉండరు. – జబ్బార్ బాషా, కాల్వగడ్డ, తాడిపత్రి -
వృద్ధురాలి కాళ్లుపట్టుకుని మంత్రి క్షమాపణ! ఏం జరిగిందంటే..
కూరగాయలు అమ్ముకొని జీవించే బామ్మకు ఓ మంత్రి క్షమాపణలు చేప్పారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు విషయం ఏమిటంటే.. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో రోడ్డుపై రద్దీ పెరుగుతున్న కారణంగా స్థానికంగా ఉండే ఓ కూరగాయల మార్కెట్ను అధికారులు మరోచోటుకి తరలించబోయారు. ప్రస్తుత మార్కెట్ను పరిశీలించడానకి అక్కడికి రాష్ట్ర ఇంధన వనరులశాఖ మంత్రి ప్రద్యుమ్న సింగ్ వచ్చారు. మంత్రిని చూసిన బాబినా బాయ్ అనే కూరగాయలు అమ్ముకునే వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు ఉపాధి కలిగించే మార్కెట్ను మరో చోటుకు తరలించడంపై ఆమె కన్నీరు పెట్టుకుంది. అయితే ఆమెను శాంతింపజేయడానకి మంత్రి.. రోడ్డు, మార్కెట్ పరిస్థితిని వివరించాడు. అంతటితో ఆగకుండా కూరగాయలు అమ్ముకునే వారికి కలిగిస్తున్న అసౌకర్యానికిగాను ఆమె కాళ్లు పట్టుకొని క్షమించమని అడిగారు. మార్కెట్ తరలింపు వల్ల ఇబ్బంది పెడుతున్నామని.. ఆమె చేతులు పట్టుకొని చెంపలపై కొట్టించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వృద్ధురాలికి మంత్రి క్షమాపణ చేప్పి.. తన గొప్ప మనసు చాటుకున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
విస్తుపోయిన వృద్ధురాలు.. ఖాతాలోకి రూ.10 కోట్లు
రాయచూరు: పింఛన్తో జీవితం సాగించే వృద్ధురాలి ఖాతాలోకి ఏకంగా రూ.10 కోట్ల నగదు జమ అయిన ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయచూరు తాలూకా గుంజళ్లిలో నివాసం ఉంటున్న తాయమ్మ(65)కు నెలకు రూ.3వేలు పింఛన్ వస్తుంది. గత ఏడాది డిసెంబర్ 20న ఈ అవ్వ ఖాతాలోకి రూ.10 కోట్ల 38 లక్షల 62 వేల నగదు జమైంది. చదవండి: కారులో 6 ఎయిర్బ్యాగ్స్ ఉండాల్సిందే : గడ్కరీ అదే నెల 31న తాయమ్మ గుంజళ్లిలోని బ్యాంక్కు వెళ్లి పింఛన్ డ్రా చేసుకుని ఇంటికి వచ్చింది. ఆమె వెంట వెళ్లిన వ్యక్తి తాయమ్మ ఖాతాలో రూ.కోట్లలో నగదు ఉండటాన్ని గుర్తించాడు. రూ.8 లక్షలు డ్రా చేయాలని చెప్పి జనవరి 1న బ్యాంకుకు తీసుకొని వెళ్లాడు. బ్యాంకు అధికారులు అనుమానం వచ్చి ఖాతాను పరిశీలించగా కోట్లలో నగదు ఉండటంతో విస్తుపోయారు. దీనిపై విచారణ చేస్తామని, అప్పటివరకు డబ్బు డ్రా చేయవద్దని చెప్పి వారిని వెనక్కి పంపారు. బ్యాంకు అధికారులనుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో వృద్ధురాలి భర్త రామన్న గురువారం రాయచూరు జిల్లా ఎస్పీ నిఖిల్కు ఫిర్యాదు చేశారు. -
బరితెగించిన కామాంధుడు.. వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నం
అమడగూరు(అనంతపురం జిల్లా): ఓ కామాంధుడు బరి తెగించాడు. 95 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించాడు. మండలంలోని ఓ తండాలో మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం తండాకు చెందిన వృద్ధురాలి కుటుంబసభ్యులు కూలి పనులకు వెళ్లగా, అదే గ్రామానికి చెందిన 65 ఏళ్ల రామాంజులు నాయక్ మద్యం మత్తులో అత్యాచారయత్నం చేశాడు. చదవండి: ఆమె ఇంట అతడు.. భర్తకు విషయం తెలిసి.. వృద్ధురాలి అరుపులతో వెంటనే చుట్టుపక్కల వారు చేరుకుని నిందితుడిని చితకబాదారు.దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ విచారణ చేయలేదని బాధితురాలి మనువడు ఆవేదన వ్యక్తం చేశాడు. పలువురు టీడీపీ నాయకులు కేసు వద్దు, రాజీ చేసుకోవాలంటూ బెదిరిస్తున్నారని వాపోయాడు. ఎవరికీ ఇలాంటి అన్యాయం జరగరాదనే ఫిర్యాదు చేశానని, ఉన్నతాధికారులైనా స్పందించి న్యాయం చేయాలని కోరాడు. -
విషాదం: పెళ్లి బారాత్లో ఆగిన గుండె
సాక్షి, వేములవాడ: పెళ్లి బారాత్లో ఏర్పాటు చేసిన డీజే పాటలతో యువకులు డ్యాన్స్లు, కేరింతలు, ఈలలతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో డీజే సౌండ్ కారణంగా పెళ్లి వాహనంలో ఉన్న వృద్దురాలికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. సంతోష క్షణాల మధ్య గడుపుతున్న బంధువులు, కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహానికి కోనరావుపేట గ్రామానికి చెందిన నక్క విజయ (58) అనే మహిళ హాజరైంది. అప్పగింతలు పూర్తి కాగానే పెళ్లి కుమారుని వాహనంలో అనంతపల్లి గ్రామానికి శుక్రవారం రాత్రి చేరుకుంది. చదవండి: ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య.. ‘నా భర్త సైకో..’ పెళ్లి బారత్లో భాగంగా డీజే ఏర్పాటు చేశారు. ఈ డీజే సౌండ్ శబ్ధానికి మహిళ చాతిలో నొప్పితో కుప్పకూలింది. అప్పటి వరకు డీజే పాటలకు స్టెప్పులు వేసిన యువకుల డ్యాన్సులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఏమైందని అక్కడున్న వారందూ తెరుకునేలోపే మహిళ మృతిచెందింది. దీంతో శుభకార్యం జరిగే ఇంట్లో విషాదం అలుముకుంది. సంబరాలు జరుపుకోవాల్సిన బంధువులు మహిళ మృతదేహంతో కోనరావుపేటకు చేరుకున్నారు. చదవండి: వివాహేతర సంబంధం: ఆమె లేకపోతే బతకలేనంటూ భార్యతో చెప్పి.. -
భార్యతో గొడవ.. ‘కొడుకా’ అని నచ్చచెప్పేందుకు వెళ్తే..
సాక్షి, దేవరకొండ (నల్లగొండ): భార్యతో గొడవెందుకు కొడుకా అని నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన వృద్ధురాలిపై దాడికి తెగబడ్డాడు. పండుటాకు అనే కనికరం కూడా లేకుండా ఉన్మాదిలా వ్యవహరిస్తూ ఛాతి ఎడమ భాగంలో పొడవడంతో అక్కడికక్కడే కూప్పకూలి ప్రాణాలొదిలింది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండల పరిధి లోని చింతచెట్టుతండా గ్రామపంచాయతీ జేత్యతండాకు చెందిన మూఢావత్ రవి వ్యవసాయం చేసుకుంటూ భార్య విజయ, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. మద్యానికి బానిసై.. రవి కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం కూడా మద్యం విషయంలోనే దంపతులు గొడవ పడ్డారు. తనను మద్యం తాగనీయకుంటే చస్తానని, కత్తి తీసుకుని ప్రాణం తీసుకుంటానని భార్యను బెదిరించాడు. పెద్దపెట్టున అరుస్తుండడంతో భర్త తీరుకు విసుగుచెందిన విజయ పిల్లలను తీసుకుని తండాలోనే బంధువు ఇంటికి వెళ్లింది. గొడవ పెట్టుకోవద్దని అన్నందుకు.. కాగా, మూఢావత్ రవి ఇంటి ఎదురుగానే ఇస్లావత్ బంగారి(60), భర్త చందుతో కలిసి జీవనం సాగి స్తోంది. వీరికి కుమారుడు, కుమార్తెకు వివాహాలు కావడంతో హైదరాబాద్లోనే కూలిపనులు చేసుకుని జీవిస్తున్నారు. అయితే, రవి తన భార్యతో గొ డవ పెట్టుకుండుడం విన్న బంగారి నచ్చచెప్పేందుకు అతడి ఇంటికి వెళ్లింది. భార్యతో గొడవపెట్టుకోవద్దని, బాగా జీవించాలని చెప్పి ంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రవి కత్తితో ఆమెపై పాశవికంగా దాడి చేశాడు. బంగారి ఛాతి ఎడమ భాగంలో బలంగా కత్తితో పొడవడంతో నిల్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. తాళ్లతో బంధించి.. రవి ఘాతుకానికి ఎదురుగా అరుగుపై కూర్చున్న బంగారి భర్తతో పాటు మరికొందరు హతాశులయ్యారు. వెంటనే వారు అక్కడికి వెళ్లే సరికి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడి బంగారి ప్రాణాలు వది లింది. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన మరికొందరు తండావాసులు నిందితుడు రవిని తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చా రు. బంగారి మృతదేహాన్ని రవి ఇంటి ఎదుట ఉంచి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు ఆందోళన చేపట్టారు. బంగారి మృతి వార్త తెలుసుకున్న బంధువులు తండాకు చేరుకొని బోరున విలపించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ భాస్కర్రెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. .తండాలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కొండమల్లేపల్లి, గుడిపల్లి, గుర్రపోండు ఎస్ఐలు భాస్కర్రెడ్డి, వీరబాబు, శ్రీనయ్య బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
టీకా వద్దని అవ్వ డ్రామా.. నా బిడ్డా రా నిన్ను నా ఒడిలో చేర్చుకుంటా అంటూ..
సాక్షి, బెంగళూరు: ఒక అవ్వను కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోమంటే పెద్ద డ్రామానే చేసింది. ఇంటింటికీ టీకాలో భాగంగా ఒక తహసీల్దార్ దావణగెరె జిల్లా కైదాళ గ్రామానికి వెళ్లారు. ఒక వృద్ధురాలికి టీకా వేయించుకోవడం ఇష్టం లేక అమ్మవారు పూనినట్లు నటించింది. ‘నా బిడ్డా.. రా... నిన్ను నా ఒడిలో చేర్చుకుంటా’ అంటూ కేకలు వేయసాగింది. తహశీల్దార్ కూడా నాటకీయంగా స్పందించారు. ‘దేవీ నీవే నా కలలోకి వచ్చావు. వచ్చి నీకు టీకా వేయించమన్నావు. ఇది నీ ఆజ్ఞనే’ అని తహశీల్దార్ అరిచేటప్పటికీ అవ్వ కరోనా టీకాకు ఒప్పుకుంది. చదవండి: (ప్రేమించి, శారీరకంగా ఒక్కటై.. గర్భం దాల్చగానే..) -
ఆస్తి కోసం బిడ్డలు ఇబ్బంది పెడుతున్నారయ్యా..
కోనేరు సెంటర్: జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం జరిగిన ప్రతి రోజు స్పందనలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. సమస్య ఎలాటిదైనా చట్టపరిధిలో పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రతి రోజు స్పందనలో ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చదవండి: దేవుడిలా ఆదుకున్న పోలీస్.. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ప్రశంసలు ఆస్తి కోసం బిడ్డలు ఇబ్బంది పెడుతున్నారంటూ వృద్ధులు, అధికకట్నం కోసం అత్తింటి వేధింపులు అధికం అయ్యాయంటూ వివాహితులు, ఉద్యోగం పేరిట మోసం చేశారంటూ నిరుద్యోగులు, ప్రేమ పేరుతో వంచన చేశారంటూ అమాయపు ఆడపిల్లలు ఇలా అనేక మంది ఫిర్యాదులు చేసేందుకు ఎస్పీ కార్యాలయంలో బారులు తీరుతున్నారు. ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ అదే స్థాయిలో స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తుండటంతో బాధితులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శనివారం జరిగిన ప్రతి రోజు స్పందనలో దాదాపు 25 మందికిపై బాధితులు ఎస్పీని కలిసి తమ తమ సమస్యలు చెప్పుకుని న్యాయం కోరారు. స్పందించిన ఎస్పీ బాధతులకు తప్పకుండా న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. గూడూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఎస్పీని కలిసి తన ఇద్దరు కుమారులు ఆస్తి కోసం తనను అనేక అవస్థలు పెడుతున్నారని వారిపై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది. అలాగే కోడూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాను వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటానని సరిహద్దుదారుడు తన పొలంలో పురుగుమందు పిచికారీ చేసే క్రమంలో తన పంట మొత్తం నాశనం అయిందని అదేమని అడిగితే తనపై దాడి చేసి కొట్టాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఎస్పీ ఫిర్యాదులన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి పరిష్కరిస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. -
వృద్ధురాలిపై పైశాచికం: మద్యం తాగించి.. లైంగిక దాడికి పాల్పడి..
సాక్షి, అబ్దుల్లాపూర్మెట్: ఓ వృద్ధురాలు హత్యకు గురికాగా, ఆమెకు మద్యం తాగించి లైంగికదాడి చేసి.. ఆపై హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో భర్త తోపాటు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని తారామతిపేటకు చెందిన ఇరగదిండ్ల ఆండాలు (58), ఆమె భర్త ఈదయ్య కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి కుమారుడు మల్లేశ్ హయత్నగర్లో ఉంటూ అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుండేవాడు. కాగా మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన కృష్ణ.. మల్లేశ్కు ఫోన్ చేసి మీ అమ్మ ఇంట్లో చనిపోయి ఉందని, ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని సమాచారమిచ్చాడు. మల్లేశ్ ఇంటికి వచ్చి చూడగా ఆండాలు విగతజీవిగా పడి ఉంది. ఆమె చేతిపై, భుజాలు, మెడపై కమిలిపోయి బలమైన గాయాలు ఉన్నాయి. చదవండి: కుక్క చేసిన పని.. రెండు కుటుంబాల మధ్య గలాటా తన తల్లి హత్యపై తండ్రి ఈదయ్య, అదే గ్రామానికి చెందిన బొడిగ శ్రీకాంత్, దేవర సురేశ్లపై అనుమానం ఉందని మల్లేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ సీఐ స్వామి ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కాగా, మృతురాలు ఆండాలుకు ఈదయ్య మూడో భర్త అని స్థానికులు తెలిపారు. అత్యాచారం చేసి ఆపై హత్య చేశారా? ఆండాలుతో పాటు ఆమె భర్త ఈదయ్య, బొడిగ శ్రీకాంత్, దేవర సురేశ్ సోమవారం రాత్రి మద్యం సేవించారని స్థానికుల ద్వారా తెలిసింది. మద్యం మత్తులో ఉన్న శ్రీకాంత్, సురేశ్ ఆండాలుపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్ర«థమికంగా నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంది. ఈ కేసులో నిందితులకు ఈదయ్య సహకరించాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆండాలు హత్య కేసులో అనుమానితులు ఈదయ్య, శ్రీకాంత్, సురేశ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అండాలును తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
అదృష్టం.. భూమ్మిద ఇంకా నూకలున్నాయ్!
చైనా: ఓ వృద్ధ మహిళ తను నివసించే అపార్టుమెంట్లోని బాల్కని నుంచి అదుపు తప్పి కిందకు జారీపడింది. అయితే బట్టలు ఆరేసే ర్యాక్కు ఆమె చిక్కుకొని ప్రమాదకరంగా తలకిందులుగా వేలాడింది. ఈ ఘటన తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ చోటు చేసుకుంది. అపార్టుమెంట్లోని 19వ అంతస్తు బాల్కని నుంచి ఆమె కిందికి వేలాడటం గమనించిన స్థానికులు ఫైర్ ఫైటర్లకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ ఫైటర్లు ఆ వృద్ధురాలని సురక్షితంగా కాపాడారు. ఆ మహిళ గాయాలపాలు కాకుండా.. ప్రాణాపాయం తప్పిందని ఫైర్ ఫైటరర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. An 82-year-old woman was seen dangling upside down from a clothes rack after falling from the 19th floor of a building in eastern China’s Jiangsu province. pic.twitter.com/Y4yvFRNBo8 — South China Morning Post (@SCMPNews) November 23, 2021 -
అ ఆ లు ప్రతి ఇంటికీ రావాలి
104 ఏళ్ల కేరళ కుట్టియమ్మ పరీక్షలు రాసి పాసవడం చూశాం. ఆమెకేనా ఆ అదృష్టం? ఐదారు దశాబ్దాల క్రితం పుట్టిన చాలా మంది స్త్రీలు చదువుకు నోచకనే జీవితంలో పడ్డారు. ఇప్పుడు అమ్మమ్మలు నానమ్మలుగా ఉన్న వారంతా కుట్టియమ్మకు మల్లే చదువుకోవాలని అనుకోవచ్చు. కేరళలో ఇలాంటి స్త్రీల కోసం ఇంటికి వచ్చి చదువు చెప్పే ప్రభుత్వ వాలంటీర్లు ఉన్నారు. కుట్టియమ్మ అలా ఇంట్లోనే చదివింది. దేశమంతా ఇలా అఆలు ఇళ్ల తలుపు తట్టాల్సి ఉంది. వెలుతురు నవ్వు చూడాల్సి ఉంది. ‘అ’ అంటే అమ్మ అని పుస్తకాల్లో చదువుకుంటాం. ఇక మీదట ‘అ’ అంటే ‘అవ్వ’ అని చదవాలమో. కుట్టియమ్మ అనే అవ్వ ఇప్పుడు ఆ మేరకు వార్తలు సృష్టిస్తోంది. దానికి కారణం ఆమె వయసు 104. ఆమె పరీక్షల్లో సాధించిన మార్కులు 100కు 89. మొన్నటి నవంబర్ 10న ఆమె ఈ పరీక్షలో కూచుంది. ఇంకేంటి. ఆమె పేరు మారుమోగదా? కేరళలోని కొట్టాయం జిల్లాలోని ‘అయర్ కున్నమ్’ అనే పంచాయతీకి చెందిన కుట్టియమ్మను చూడటానికి ఇప్పుడు ఆ ఊరికి కార్లు వస్తున్నాయి. అందులో నాయకులు వస్తున్నారు. కేరళ విద్యా శాఖ మంత్రి వి.శివన్ కుట్టి ఆమెను సత్కరించి ‘అక్షర ప్రపంచంలోకి స్వాగతం’ అన్నాడు. ఆమె ఇలా చదువుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి అన్నాడు. ఇంతకు మించిన స్ఫూర్తి ఏముంటుంది ఏ వయసులో అయినా చదువుకోవడానికి. రెండు నెలల్లో చదివి కుట్టియమ్మ కథ దేశంలోని లక్షల మంది స్త్రీల కథే. ఆమెకు చదువుకునే వీలు కలగలేదు. 15 ఏళ్లకే పెళ్లి అయ్యింది. ఇప్పటికి ఆమె తన వంశంలో ఏడు తరాలను చూసింది. కాని ఆమెకు చదువుకోవాలని ఉండేది. అక్షరాలను గుణించుకుని న్యూస్పేపర్ చదివే ప్రయత్నం చేసేది. కాని ఆమె పెన్ను పట్టుకుని రాయలేదు. కేరళ ప్రభుత్వం ‘సాక్షరతా మిషన్’లో భాగంగా ‘సాక్షరతా ప్రేరకులు’ పేరుతో వాలంటీర్లను నియమించి ఇలాంటి మహిళల కోసం ఇంటింటికి వెళ్లి చదువు చెప్పే ఏర్పాటు చేసింది. అలా ఫెహరా జాన్ అనే వాలంటీర్ ఆమె ఇంటికి వచ్చి చదువు చెప్పింది. ‘టీచర్ను చూసి ఆమె చిన్నపిల్లలా ఉత్సాహపడింది’ అని కుట్టియమ్మ కుటుంబ సభ్యులు చెప్పారు. పరీక్ష రాస్తున్న కుట్టియమ్మ ‘ఆమె షరతు ఒక్కటే. పెద్దగా పాఠం చెప్పమని. ఎందుకంటే ఆమెకు సరిగా వినపడదు. నేను అరిచి చెప్పేదాన్ని. సాక్షరతా మిషన్లో భాగంగా కేరళలోని ప్రతి పంచాయితీలో ప్రాథమిక పరీక్షను నిర్వహిస్తారు. ఆ పరీక్షలో పాసైతే 4వ తరగతి స్థాయి పరీక్ష రాయవచ్చు. ప్రాథమిక పరీక్షలో మలయాళం, లెక్కలు, జనరల్ నాలెడ్జ్ ఉంటాయి. పరీక్షకు కేవలం రెండు నెలల ముందే ఆమెకు చదువు మొదలయ్యింది. రెండు నెలల్లోనే ఆమె బాగా పాఠాలు నేర్చుకుంది. అంతే కాదు పెన్ను పట్టి అక్షరాలు రాయడం మొదలెట్టి మార్కులు కూడా తెచ్చుకుంది’ అంది ఫెహరా జాన్. ‘ఆమె గుచ్చి గుచ్చి అడిగి మరీ తెలుసుకునేది. నస పెట్టడం అంటారు చూడండి. అలా’ అని నవ్వుతుంది ఆ పెద్ద వయసు స్టూడెంట్ కలిగిన చిన్న వయసు టీచర్. కర్ర పెండలం, చేపలు కుట్టియమ్మకు 104 సంవత్సరాలు ఉన్నా ఇంకా చురుగ్గా ఉంది. బి.పి, షుగర్ లేవు. కళ్లద్దాలు కూడా లేవు. రాత్రి పూట చూపు ఆనదు. వినపడదు. అంతే. ‘ఆమె ఉదయం పూట టిఫిన్ రాత్రి భోజనం తప్ప మధ్యలో ఏమీ తినదు. అవి కూడా కొంచెం కొంచెమే తింటుంది. మధ్యాహ్నం ఆమెకు పడుకునే అలవాటు లేదు. ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు చేపలు, కర్రపెండలం ఇష్టం.’ అని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ వయసులో చదువుకోవడం వల్ల ఇప్పుడు ఆమెకు మాత్రమే కాక ఆమె ఇంటికి కూడా గుర్తింపు వచ్చింది. ఇతరుల సంగతి ఏమిటి? ఏ మనిషికైనా తన పేరు తాను రాసుకోగలగడం, తన పేరును తాను చదువుకోగలడం ప్రాథమిక అవసరం. దేశంలో సంపూర్ణ అక్షరాసత్య కార్యక్రమాలు మొదలయ్యి ఇన్నాళ్లవుతున్నా అందరినీ అక్షరాస్యులు చేసే పని అంత సజావుగా సాగడం లేదు. కేరళలో మాత్రం 1989లోనే ‘కొట్టాయం’ జిల్లా సంపూర్ణ సాక్షరతను సాధించిన జిల్లాగా పేరు పొందింది. సాక్షరతా సూచిలో తమ రాష్ట్రం ముందుండేలా ఆ రాష్ట్రం నిరంతరం శ్రద్ధ పెడుతూనే ఉంది. ఇలా ప్రతి రాష్ట్రంలో చదువు, జ్ఞానం పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఏ వయసులోనైనా ఉంది. స్త్రీలు ఎన్నో దశాబ్దాలుగా అక్షరానికి దూరమై ఉన్నారు. వారి కోసం కొంత కాలం ప్రభుత్వాలు రాత్రి బడులు నిర్వహించాయి. ఇప్పుడు అలాంటి పని జరగడం లేదు. కేరళ వంటి చోట చదువే అలాంటి వారి ముంగిట్లోకి వస్తోంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. ఆ వెలుగు ఇంటింటికి చేరాల్సి ఉంది. కుట్టియమ్మ చూపిన పట్టుదల చదువుకు నోచుకోని ప్రతి మహిళా చూపితే, అందుకు వ్యవస్థలు మద్దతుగా నిలిస్తే దేశం నిజమైన వికాసంలోకి అడుగు పెడుతుంది. ఇంట్లో తన టీచర్ దగ్గర చదువుతూ... జ్ఞానం పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఏ వయసులోనైనా ఉంది. స్త్రీలు ఎన్నో దశాబ్దాలుగా అక్షరానికి దూరమై ఉన్నారు. కేరళ వంటి చోట చదువే అలాంటి వారి ముంగిట్లోకి వస్తోంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. ఆ వెలుగు ఇంటింటికి చేరాల్సి ఉంది. -
ఆహరం మానేసి.. 102 ఏళ్ల వృద్ధురాలి సల్లేఖన వ్రతం
సాక్షి,తిరువొత్తియూరు(తమిళనాడు): తిరువన్నామలై జిల్లా వందవాసి సమీపంలో జైన మతానికి సంబంధించిన వృద్ధురాలు (102). గత కొన్ని రోజులుగా ఆహార, పానీయాలు తీసుకోకుండా (సల్లేఖన వ్రతం)ముక్తి మార్గంలో జీవ సమాధి పొందారు. ఈమెకు దేవదత్త, సుశీల, నాగరత్నం, కస్తూరిబాయి, సాందన, గౌరి అనే ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. ఈమె ఎరుపూర్ గ్రామంలో తన ఇంటిలో నివాసం ఉంటున్నారు. శతాధిక వృద్ధురాలు అయినప్పటికీ ఆమె ఇప్పటి వరకు కంటికి అద్దాలు లేకుండా పుస్తకాలు చదవగలిగే సామర్థ్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో విజయలక్ష్మి తాను జీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నారు. దీంతో గత 11వ తేదీ వంద వాసి, పొన్నూరు కొండ దిగువ భాగంలో ఉన్న కుంద, కుందర విశాఖచారిని జైన ఆశ్రమానికి వెళ్లి.. అక్కడ అన్నపానీయాలు మాని ముక్తి కోసం ఆమె జైనమతంలోనే అత్యంత ఉత్కృష్టమైన సల్లేఖన వ్రతం చేశారు. ఈ క్రమంలో ఆదివారం తుదిశ్వాస విడిచి జీవ సమాధి పొందారు. -
యాహూ! వందకు 89 మార్కులు.. 104 ఏళ్ల బామ్మ సంతోషం!!
This 104 Year Old Woman Has Scored 89/100 in Literacy Exam: ఆలస్యం అమృతం విషం అని అంటారు. కానీ డ్రీమ్ నెరవేరడం జీవితకాలం ఆలస్యమైతే.. మరేం పర్వాలేదు అంటుంది ఈ బామ్మ! లేటు వయసులో లేటెస్ట్ రికార్డు సొంతం చేసుకుంది. పది పదుల వయసులో రాయడం, చదవడం నేర్చుకుని పరీక్షలు రాసి అందరితో శభాష్!! అనిపించుకుంది. అవిశేషాలు మీ కోసం.. ఒన్మనోరమ మీడియా తెల్పిన సమాచారం ప్రకారం.. కేరళలోని కొట్టాయాంకు చెందిన కుట్టియమ్మ తన జీవితంలో ఒక్కసారి కూడా పాఠశాలకు వెళ్లలేదు. ఐతే 104 ఏళ్ల కుట్టియమ్మ ‘సాక్షరత ప్రేరక్ రెహ్నా ప్రోగ్రాం ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించే క్లాసులకు హాజరయ్యి రాయడం, చదవడం నేర్చుకుంది. తద్వారా 4వ తరగతి పరీక్షలు రాయడానికి కుట్టియమ్మ అర్హత సాధించింది. పది పదుల వయసుదాటిన కుట్టియమ్మకు వినికిడి సమస్య ఉన్న కారణంగా పరీక్షలు నిర్వహించే ఇన్విజిలేటర్లను బిగ్గరగా మాట్లాడాలని కోరిందట కూడా. పరీక్ష కూడా భేషుగ్గా రాసింది. ఈ పరీక్షలో వందకు 89 మార్కులు సాధించింది. మార్కులను చూసుకుని ఆనందపడిపోతున్న కుట్టియమ్మ ఫొటోను కేరళ ఎడ్యుకేషన్ మినిష్టర్ వాసుదేవన్ శివన్కుట్టి ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో స్థానికంగా స్టార్ అయ్యింది. ‘కుట్టియమ్మ అంకితభావానికి సెల్యూట్. ఇది ఖచ్చితంగా చాలామందికి స్ఫూర్తినిస్తుందని’ సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో నెటిజన్లు ప్రశంశిస్తున్నారు. చదువుకు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది. మీరేమంటారు.. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. 104-year-old Kuttiyamma from Kottayam has scored 89/100 in the Kerala State Literacy Mission’s test. Age is no barrier to enter the world of knowledge. With utmost respect and love, I wish Kuttiyamma and all other new learners the best. #Literacy pic.twitter.com/pB5Fj9LYd9 — V. Sivankutty (@VSivankuttyCPIM) November 12, 2021 -
వయసు 105.. 102 సెకన్లలో 100 మీటర్లు
వాషింగ్టన్: 105 ఏళ్లు... జీవితమే ఊహకందదు. కానీ ఆ వయసులో ప్రపంచ రికార్డు సృష్టించింది లూసియానాకు జూలియా హరికేన్స్ హాకిన్స్. 102 సెకన్లలో 100 మీటర్ల దూరం పరుగెత్తింది. ఆమె పేరులోకి ‘హరికేన్’అట్లా రికార్డుతో వచ్చిందే. మీ వయసుకంటే తక్కువ సెకన్లలోపే పూర్తిచేశారు కదా ... ‘‘నో’నిమిషంలో పూర్తి చేయాలనుకున్నా. కుదరలేదు. ఇంకా ఎక్కువ పరుగెత్తాలి’ అని చెబుతోంది. రన్నింగ్ను 101వ ఏట మొదలుపెట్టిన హాకిన్స్కు అథ్లెటిక్స్ కొత్తేం కాదు. 80 ఏళ్ల వయసులో ‘నేషనల్ సీనియర్ గేమ్స్’సైక్లింగ్లో పోటీ పడింది. 2017లో సైక్లింగ్ వదిలేశాక... రన్నింగ్ ట్రాక్ను ఎంచుకుంది. సో... సంకల్పం ఉండాలేగానీ.. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్! -
ప్రాణం తీసిన చుట్ట.. సజీవ దహనం
సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): మంచానికి మంటలు వ్యాపించి వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డి దుర్గారావు కూలి పనులు చేసుకుంటూ తల్లి రెడ్డి సీతమ్మ(71)తో కలసి జామి అప్పన్నవీధి, సత్యనారాయణపురం సీతన్నపేటగేటు సమీపంలో నివాసముంటున్నాడు. తల్లి అనారోగ్యంతో కొంతకాలంగా మంచానికే పరిమితమైంది. రోజు తల్లికి టిఫిన్ తినిపించి సపర్యలు చేసి, ఆమెకు చుట్ట తాగే అలవాటు ఉండటంతో కొన్ని చుట్టలు మంచం పక్కనే పెట్టి పనికి వెళ్తుంటాడు. సోమవారం ఉదయం తల్లికి టిఫిన్ తినిపించి పనికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి పొగ వస్తుండటంతో చుట్టుపక్కల వారు దుర్గారావుకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అతను ఇంటికి వచ్చి చూడగా తల్లి పడుకున్న మంచానికి మంటలు వ్యాపించాయి. నీళ్లు చల్లి మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే మంటల్లో పూర్తిగా కాలిపోయి సీతమ్మ చనిపోయింది. చుట్ట తాగి కింద పడేయడంతో మంచం కింద ఉన్న బట్టలకు మంటలు వ్యాపించి నవ్వారు మంచం కాలిపోయిందని, కదలలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు మంటల్లో కాలిపోయి మృతి చెంది ఉండొచ్చని భావిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వ్యాక్సిన్ వేస్తే.. ఉరేసుకుంటా.. చుక్కలు చూపించిన బామ్మ..
సాక్షి, జనగామ: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోమంటే.. ఓ వృద్ధురాలు వైద్య సిబ్బందికి చుక్కలు చూపించింది. వ్యాక్సిన్ వేస్తే.. ఉరి వేసుకుంటానంటూ హడావుడి సృష్టించింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలో 80 ఏళ్ల వృద్ధురాలిని వ్యాక్సిన్ వేసుకోమని అడగగా వ్యాక్సిన్ వేస్తే ఉరి వేసుకుంటానంటూ మొండిగా వ్యవహరించింది. చదవండి: జొన్నలకు పులి కాపలా! వైద్య సిబ్బందిని మీరు వెళ్లిపోండి.. మీ కాళ్లు మొక్కుతా అంటూ ఆ వృద్ధురాలు తల బాదుకుంది. ఎంతగా నచ్చజెప్పినా ఏమాత్రం వినలేదు. సూది మందంటే చిన్న పిల్లల్లా మారాం చేయడంతో కాస్త ఫన్నీగా అనిపించింది. కొందరు కరోనా టీకా వేయించుకోవటానికి భయపడుతున్నారు. దాన్నో భూతంలా చూస్తున్నారు. మరికొందరు లేనిపోని అపోహలతో వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఆసక్తి చూపడంలేదు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఏమాత్రం వారి తీరులో మార్పు రావడం లేదు. చదవండి: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు! -
సీఐడీ షో స్ఫూర్తి: దారుణానికి పాల్పడ్డ మైనర్లు
ముంబై: హిందీలో ప్రసారం అయ్యే సీఐడీ షోకు దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులున్నారు. ఈ షో తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఇక్కడ కూడా దీనికి చాలా మంది ఫ్యాన్స్. అయితే ఈ షోను స్ఫూర్తిగా తీసుకుని పుణెకు చెందిన ఇద్దరు మైనర్లు దారుణానికి పాల్పడ్డారు. 70 ఏళ్ల వృద్ధురాలిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఆ వివరాలు.. ఈ సంఘటన పుణెలో చోటు చేసుకుంది. షాలిని బద్నారావు సోనావానే(70) అనే వృద్ధురాలు పుణెలోని సయాలి అపార్ట్మెంట్లో నివసిస్తుండేది. నిందితులిద్దరు షాలిని ఇంటికి సమీపంలోనే ఉండేవారు. వృద్ధురాలు ఒక్కతే ఒంటరిగా అపార్ట్మెంట్లో నివసిస్తుందని గ్రహించారు. ఆమె ఇంటిలో దొంగతనం చేయాలని భావించారు. (చదవండి: హ్యాండ్సప్ అని గన్ గురిపెట్టాడో లేదో.. వాటే రియాక్షన్!) ఈ క్రమంలో 2021, అక్టోబర్ 30 మధ్యాహ్నం 01:30 గంటల ప్రాంతంలో నిందితులైన ఇద్దరు మైనర్లు షాలిని ఇంట్లో ప్రవేశించారు. ఆ సమయంలో వృద్ధురాలు ఇంట్లో టీవీ చూస్తూ ఉంది. ఇంట్లో ప్రవేశించిన నిందితులు.. వృద్ధురాలిపై దాడి చేసి.. 93 వేల రూపాయల నగదు, కొంత బంగారం దొంగతనం చేశారు. నిందుతల దాడిలో వృద్ధురాలు మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. (చదవండి: చోరీ మామూలే..కానీ ఈ దొంగకు ఓ ప్రత్యేకత ఉంది) ఇక ఈ దారుణం జరిగిన తీరు పోలీసులను ఆశ్చర్యపరిచింది. నేరం జరిగిన తీరు ఒకనాటి సీఐడీ షో ఎపిసోడ్ను స్ఫురింపజేసింది. నిందితులిద్దరు పరారీలోనే ఉన్నారు. పోలీసులు వారికోసం గాలిస్తున్నారు. చదవండి: పోలీసులే దొంగలు.. పట్టేసిన సీసీ కెమెరాలు -
వృద్ధురాళ్లపై లైంగిక దాడి.. నిందితుల్లో 22 ఏళ్ల వ్యక్తి
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తాగిన మైకంలో 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాగే బల్లియా జిల్లాలో 98 ఏళ్ల వృద్ధురాలిపై మరో వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ 70 ఏళ్ల యాచకురాలు తరిణవ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాల భవనంలో నిద్రించేది.ఈ క్రమంలో ఆదివారం రాత్రి లక్ష్మీ లోధి(32) మద్యం మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చదవండి: మహిళా పూజారి దారుణ హత్య. 38 రోజుల్లో నాలుగు హత్యలు అంతే కాకుండా బల్లియా జిల్లాలో 22 ఏళ్ల వ్యక్తి 98 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఆగస్టు 20న సోను అనే నిందితుడు తనపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఈ ఘటనపై మొదట కేసు నమోదు చేయడానికి నిరాకరించారని, కానీ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్షలు రావడంతో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులు అన్నారు. చదవండి: ఎంత వేధించిందో: పెళ్లాం వేధింపులు తట్టుకోలేక పోలీస్స్టేషన్కే నిప్పు -
ఉద్యోగ విరమణ చేసిన 11 ఏళ్ల తరువాత జీతం
చల్లపల్లి (అవనిగడ్డ): ఆ వృద్ధురాలు ఉద్యోగ విరమణ చేసి పదకొండేళ్లయ్యింది. అప్పటి నుంచి ఆమె పెండింగ్ జీతాన్ని గ్రామ పంచాయతీ అధికారులు ఇవ్వలేదు. ఆ డబ్బుల కోసం తిరిగి అలిసిపోయింది. ప్రస్తుతం ఆమె అనారోగ్యానికి గురై జీవిత చరమాంకానికి చేరింది. ఆమె దీనస్థితిని బంధువులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ప్రస్తుత అధికారులు ఆమె జీతాన్ని వెంటనే అందించారు. కృష్ణా జిల్లా పురిటిగడ్డ గ్రామ పంచాయతీలో బుర్రే రాఘవమ్మ స్వీపర్ కం నైట్ వాచ్మన్గా పనిచేసి పదకొండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. అప్పట్లో ఆమెకు రూ.53 వేల జీతం పెండింగ్ బకాయి ఉంది. దీంతో పాటు రూ.78,171 పెన్షన్ కంట్రిబ్యూషన్ చెల్లించాల్సి ఉంది. అప్పట్లో పంచాయతీలో అధికారులు మారిన నేపథ్యం, పంచాయతీలో నిధుల కొరత కారణంగా ఆ మొత్తం ఆమెకు ఇప్పటికీ అందలేదు. ఈ సమస్యను ఆమె బంధువులు కలెక్టర్, డీపీవో, డీఎల్పీవో, జెడ్పీ సీఈవోల దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల ఆదేశాల మేరకు పురిటిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ రమ్య ఆధ్వర్యంలో పంచాయతీ ఈవో పిట్టి రాంబాబు వృద్ధురాలికి పెండింగ్ జీతం రూ.53 వేలు అందచేశారు. పెన్షన్ కంట్రిబ్యూషన్ కూడా వెంటనే చెల్లిస్తామని తెలిపారు. ఇవీ చదవండి: విషాదం: వరదలో కొట్టుకుపోయిన కారు.. నవవధువు గల్లంతు ఏపీ: ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన -
నది మధ్యలో మూడు రోజులు.. మృత్యువును జయించి..
వల్లూరు: వంతెనపై నడిచివెళ్తున్న వృద్ధురాలు అనుకోకుండా పెన్నా నదిలో పడిపోయి ప్రవాహంలో సుమారు 5 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయింది. ధైర్యాన్ని కూడగట్టుకుని నది మధ్యలో గల ఇసుక గుట్టలపైకి చేరింది. మూడు రోజులపాటు ఆ గుట్టలపైనే ఉండిపోయిన ఆమె స్థానికులు, పోలీసుల చొరవతో ఎట్టకేలకు ఇంటికి చేరుకుంది. వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. కమలాపురం మండలం గంగవరానికి చెందిన పుత్తా రుక్మిణమ్మ (65) భర్త చాలా ఏళ్ల క్రితమే మరణించాడు. సంతానం లేని ఆమె అప్పటినుంచి గంగవరంలోని తన సోదరుని ఇంట్లో ఉంటోంది. సోమవారం రాత్రి భోజనానంతరం ఇంటినుంచి బయటకు వెళ్లిన రుక్మిణమ్మ గ్రామ సమీపంలో కమలాపురం–ఖాజీపేట మండలాల సరిహద్దున గల వంతెన పైనుంచి పెన్నా నదిలో పడిపోయింది. అక్కడి నుంచి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు లోతట్టున చెరువుకిందిపల్లె సమీపంలో నది మధ్యన గల ఇసుక గుట్టలపైకి చేరింది. గురువారం నీటి ప్రవాహం మధ్య ఇసుక గుట్టలపై ఎవరో ఉన్నట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వల్లూరు ఎస్ఐ కల్పన అక్కడకు చేరుకుని పుష్పగిరి నుంచి ఈతగాళ్లను రప్పించి ట్యూబుల సహాయంతో ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం ఆమెకు పీహెచ్సీలో వైద్యం చేయించి బంధువులకు అప్పగించారు. -
గ్రేట్ జర్నీ.. సోలోగా.. ధైర్యంగా
‘ఆకాశమే మన హద్దు... అవకాశాలను వదలద్దు’ ఇదేదో పర్సనాలిటీ డెవలప్మెంట్ నినాదంలా అనిపిస్తోంది. కానీ ఈ అడ్వంచరస్ ఉమన్ గురుదీపక్ కౌర్ను చూస్తే ఇలాంటి మరెన్నో స్ఫూర్తివచనాలు చెప్పాలనిపిస్తుంది. 73 ఏళ్ల వయసులో ఆమె సొంతంగా కారు నడుపుకుంటూ ఒంటరిగా కొత్త ప్రదేశాలను చూడడానికి వెళ్తుంటారు. సోలో ట్రావెలర్, సోలో ఉమెన్ ట్రావెలర్... ఇవేవీ గురుదీపక్కు సరిపోకపోవచ్చు. సీనియర్ సోలో అడ్వెంచరస్ ట్రావెలర్ అనాల్సిందే. ఆమె మాత్రం ‘వయసు ఒక సంఖ్య మాత్రమే. మన ఉత్సాహానికి వయసు అడ్డుకట్ట వేయలేదు. బాధ్యతలు కొంత వరకు వేగాన్ని అదుపు చేస్తుంటాయి. కానీ నాకు బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ఫ్రీ బర్డ్ని. కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు నా చేత ప్రయాణం చేయిస్తున్నది... ప్రపంచాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఒక్కటే’’ అంటారు. మూడు రోజుల రైలు ప్రయాణం జీవితంలో పరిస్థితులే తన చేత ఒంటరి ప్రయాణాలు చేయించాయంటారు గురుదీపక్ కౌర్. ‘‘నాన్న మిలటరీ పర్సన్, బదిలీలుంటాయి. పన్నెండేళ్ల వయసు నుంచి ప్రయాణం అంటే మా వస్తువులు మేమే ప్యాక్ చేసుకుని సిద్ధం అయ్యేవాళ్లం. ‘ప్యాకింగ్, మూవింగ్, మీటింగ్ న్యూ పీపుల్’ ఇదే మా లైఫ్. ఇక ఒంటరి ప్రయాణాలు పెళ్లి తర్వాత మొదలయ్యాయి. నా భర్త కూడా మిలటరీ పర్సనే. పెళ్లయిన తర్వాత రెండో ఏడాదిలో ఆయనకు కర్నాటక, బెల్గామ్లో పోస్టింగ్ వచ్చింది. చండీగర్ నుంచి రెండు నెలల బాబుతో, ఎనిమిది పెద్ద పెద్ద చెక్క పెట్టెలతో బెల్గామ్కు ప్రయాణమయ్యాను. అప్పట్లో విమానాలు ఇంత ఎక్కువగా ఉండేవి కావు. రైల్లో మూడు రోజుల ప్రయాణం. అది నా తొలి ఒంటరి ప్రయాణం మాత్రమే కాదు, సాహసోపేతమైన ప్రయాణం కూడా. కారులో షికారు గురుదీపక్ కౌర్ తొలి సోలో ఇంటర్నేషనల్ టూర్ 1994లో చేశారు. యూఎస్కు ఒంటరిగా వెళ్లడం మాత్రమే కాదు, స్థానికంగా ప్రదేశాలను చూడడానికి రైల్లో ఒంటరిగానే ప్రయాణించారు. ఇదంతా బాగానే ఉంది. కానీ సొంతంగా కారు నడుపుకుంటూ ప్రయాణించడం 2013లో మొదలైంది. సాంత్రో కారులో చండీగర్ నుంచి బెంగళూరుకు బయలుదేరారు గురుదీపక్ కౌర్. ఢిల్లీ, అజ్మీర్, ఉదయ్పూర్, అహ్మదాబాద్, ముంబయి మీదుగా బెంగళూరు చేరారు. ఆ తర్వాత ఏడాది ఉత్తరాఖండ్కు కారు తీశారు. కొండలు, లోయల మధ్య మెలికలు తిరిగిన రోడ్డు మీద కారు నడుపుతూ తాను చూడదలుచుకున్న ప్రదేశాలను చుట్టి వచ్చారు. ప్రమాదం తప్పింది దేహం అలసటగా ఉన్నప్పుడు ట్రిప్ మొదలు పెట్టవద్దని చెబుతారు కౌర్. దేహం ఫిట్గా ఉందా నీరసంగా ఉందా అనేది ఎవరికి వాళ్లకు తెలుస్తుంది. దేహం అలసటకు మానసిక అలసట కూడా తోడైతే... ఇక వాహనం నడప కూడదని చెబుతూ మూడేళ్ల కిందట తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పారామె. ‘‘ముంబయికి వెళ్లినప్పుడు కారు నడుపుతూ తీవ్రమైన అలసటతో రోడ్డు పక్కన కారాపి కొన్ని క్షణాలపాటు స్టీరింగ్ మీద తల వాల్చాను. మెలకువ వచ్చేసరికి కారు కదులుతోంది. అప్పటికే చెట్ల పొదల్లోకి వచ్చేసింది. వెంటనే అప్రమత్తమై బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది’’. ఇల్లు అపురూపమే... ‘‘ప్రతి మహిళకూ నేను చెప్పేది ఒక్కటే. ఇల్లు, కుటుంబం బాధ్యతలు ఎలాగూ ఉంటాయి. బాధ్యతల పట్ల బాధ్యతరహితంగా ఉండవద్దు. బాధ్యతలతోపాటు మీకూ కొంత సమయం కేటాయించుకోండి. మీకంటూ సొంతంగా కొంత డబ్బు ఉంచుకోండి. ఏడాదిలో కొన్ని రోజులు మీరు మీరుగా జీవించండి. ఆ తర్వాత తిరిగి మీ బాధ్యతల వలయంలోకి వచ్చి పడినప్పటికీ అప్పుడు ఆ బాధ్యత బరువుగా అనిపించదు. మానసికంగా ఒత్తిడిని కలిగించదు. మనకు ఇల్లు అపురూపమైనదే, అలాగే ప్రపంచం అందమైనది. ఆ అందానికి కూడా మన జీవితంలో స్థానం కల్పించాలనే విషయాన్ని మర్చిపోవద్దు’’ అంటారు గురుదీపక్ కౌర్. -
బామ్మ బైక్ రైడ్ వండర్.. 7 కోట్లపైగా వ్యూస్.!
వెబ్ డెస్క్: మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో సదరా ఉంటుంది. కొన్ని వెంటనే తీరవచ్చు.. మరికొన్నింటికి కొంత సమయం పట్టొచ్చు. ఓ వందేళ్లు దగ్గర పడిన బామ్మ బైక్ రైడ్ చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా యమహా R15 అయితే.. ఆ స్టైల్ అదిరిపోతుంది కదా.. తాగాజా ఓ వృద్ధురాలు స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. బామ్మను చూస్తే ఓ వందేళ్లకు దగ్గర వయసు అనిపిస్తుంది. కానీ స్టైల్గా యమహా R15 బైక్పై కూర్చుని రైడ్ చేసి ఆశ్చర్యపరిచింది. అంతేకాదండోయ్.. బామ్మ బోసి నవ్వుతో.. రైడ్కు మరింత అందం చేకూరింది. ఈ వీడియోను శుభం_5 ఎక్స్ అనే ఇన్స్టా యూజర్ పోస్ట్ చేయగా.. 7.8 కోట్ల మంది నెటిజనులు వీక్షించగా.. లక్షల మంది లైక్ కొట్టి కామెంట్ చేస్తున్నారు. ‘‘వావ్ దాది అమ్మ. వందేళ్ల బామ్మ.. వండర్ఫుల్ బైక్ రైడ్ అదిరింది.’’ ‘‘బామ్మ బైక్ నడపడం లేదు. కింద నుంచి ఎవరో తోస్తున్నారు.’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ చిత్రీకరించారో.. తెలియదు కానీ.. బామ్మ బైక్ రైడ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by @__shubham__5x -
డ్యాన్సింగ్ సెన్సేషన్ ఈ బామ్మ.. 2 కోట్ల వ్యూస్
-
డ్యాన్సింగ్ సెన్సేషన్ ఈ బామ్మ.. 2 కోట్ల వ్యూస్
ఖాట్మండు: లేడిపిల్లలా చెంగుచెంగున నడుస్తూ.. నెమలిలా నాట్యం చేస్తోంది కృష్ణకుమారి తివారి. నాట్యం చేస్తుంటే అందరి కళ్లు ఆమె పైనే. కాళ్లకు ఘల్లుఘల్లుమనే గజ్జలు కట్టుకుని, నాట్యంతో హావభావాలు పలికిస్తోన్న అమ్మాయి కదా! అందరూ ఆసక్తిగా చూస్తారులే! అనుకుంటే మీరు పొరబడినట్లే. డెబ్భైఎనిమిదేళ్ల వయసులో మైమరిపించే స్టెప్పులతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది కృష్ణకుమారి బామ్మ. నేపాల్లోని గోర్కా జిల్లాకు చెందిన కృష్ణకుమారి తివారికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో ఇంట్లో వాళ్లు డ్యాన్స్ను ప్రోత్సహించేవారు కాదు. సంప్రదాయ కుటుంబాలలోని ఆడపిల్లలు డాన్సులంటూ తిరిగితే సమాజం నుంచి వెలేస్తారేమోనని భయపడే రోజుల్లో ఆమె బాల్యం గడిచింది. దీంతో తనకి ఎంతో ఇష్టమైన నాట్యం తీరని కలగానే మిగిలిపోయింది. పెళ్లీ, పిల్లలు, వారి బాధ్యతలు అన్నీ తీరడం, ఇప్పుడు తీరిక దొరకడం చిన్నప్పటి కట్టుబాట్లు ప్రస్తుతం లేకపోవడంతో ఒంట్లోని ఓపికను కూడగట్టుకుని పదహారేళ్ల పడచు పిల్లలా డ్యాన్స్ చేస్తూ తన చిరకాల కోరికను తీర్చుకుంటోంది. కృష్ణకుమారి డ్యాన్స్ చేస్తోన్న వీడియోలు ఆమె కుటుంబ సభ్యులు టిక్టాక్లో అప్లోడ్ చేయడంతో ఇప్పుడవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె డ్యాన్సింగ్ వీడియోలలో ఒకదానికి దాదాపు రెండుకోట్ల వ్యూస్, 65 వేల కామెంట్లు వచ్చాయి. కృష్ణకుమారి డ్యాన్స్ గురించి తెలిసిన వారంతా ఆ చుట్టుపక్కల జరిగే పెళ్లిళ్లు, పార్టీలకు ఆహ్వానిస్తూ ఆమె డ్యాన్స్ను మరింత ప్రోత్సహిస్తున్నారు. ‘‘అప్పటి సమాజంలో ఉన్న నిబంధనలను అనుసరించి డ్యాన్స్ చేయాలన్న ఆకాంక్షను నాలోనే అణచి వేసుకున్నాను. అయితే ఇప్పుడు నాకేం జరుగుతుందే తెలియడం లేదు. ఎప్పుడూ డ్యాన్స్ చేస్తూనే ఉంటున్నాను. ఎవరూ నన్ను ఆపడంలేదు, నా పిల్లలు కూడా చాలా సంతోషిస్తున్నారు. నా డ్యాన్స్ వీడియోలకు చాలా మంది అభిమానం చూపిస్తుంటే మరింత డ్యాన్స్ చేయాలనిపిస్తోంది. డ్యాన్స్ చేస్తూ చనిపోవాలని ఉంది’’ అని చెప్పారు కృష్ణకుమారి సంతోషంతో నీళ్లు నిండిన కన్నులతో. -
ఒకే సారి రెండు కరోనా వేరియంట్లు.. వృద్ధురాలు బలి!
బ్రుసెల్స్ : ఒకేసారి రెండు కరోనా వైరస్ వేరియంట్ల బారిన పడిన ఓ వృద్దురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బెల్జియంలో వెలుగుచూసింది. సదరు వృద్దురాలి శరీరంలో యూకే, సౌత్ ఆఫ్రికన్ వేరియంట్లను గుర్తించినట్లు బెల్జియం సైంటిస్టులు ప్రకటించారు. బ్రుసెల్స్కు చెందిన 90 ఏళ్ల వృద్దురాలు గత మార్చినెలలో కరోనా వైరస్ బారినపడింది. దీంతో ఆమెను అలాస్ట్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ సరిగానే ఉన్నా.. ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఐదు రోజుల తర్వాత మృత్యువాత పడింది. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించగా.. ఆమె శరీరంలో బ్రిటన్ ఆల్ఫా వేరియంట్, సౌత్ ఆఫ్రికా బెటా వేరియంట్లు రెండూ ఉన్నట్లు గుర్తించారు. కరోనా రోగి శరీరంలో రెండు వేరియంట్లను గుర్తించటం ఇదే మొదటిసారని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తుంటాయని తెలిపారు. దీనిపై మాలుక్యులర్ బయాలజిస్ట్ ఆనీ వాన్కీన్బెర్హన్ మాట్లాడుతూ.. ‘‘ మార్చి నెలలో ఈ రెండు వేరియంట్లకు సంబంధించిన కేసులు బెల్జియంలో బాగా నమోదయ్యాయి. ఆమె ఇద్దరు వేరు వేరు వ్యక్తుల నుంచి ఈ రెండు వేరియంట్లను అంటించుకుని ఉంటుంది. అయితే, ఆమెకు ఎలా ఈ వైరస్లు సోకాయన్న సంగతి తెలియలేదు. ఆమె ఆరోగ్యం త్వరగా క్షీణించటానికి ఈ రెండు వేరియంట్లే కారణమని చెప్పటం చాలా కష్టం’’ అని తెలిపింది. కాగా, బెల్జియంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా 1,027 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 1,093,700 కేసులు రికార్డయ్యాయి.. 25,198మంది మరణించారు. -
వృద్ధురాల్ని చంపిన ఏనుగు
కేజీఎఫ్(కర్ణాటక): బంగారుపేట తాలూకా బూదికోట ఫిర్కా గుల్లహళ్లి గ్రామంలో ఏనుగు దాడిలో మహిళ మృతి చెందింది. గుల్లహళ్లి గ్రామానికి చెందిన సిద్దమ్మ (59) శనివారం తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో గుల్లహళ్లి గ్రామం నుంచి పక్కలోనే ఉన్న గొడగుమందె గ్రామానికి తన మనవడిని చూడడానికి కాలినడకన బయల్దేరింది. మార్గమధ్యంలో అడవి ఏనుగు.. సిద్దమ్మపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఎమ్మెల్యే ఎస్ఎన్ నారాయణస్వామి సిద్దమ్మ కుటుంబాన్ని పరామర్శించి అంత్య సంస్కారం కోసం కొంత సహాయ ధనం అందించారు. కాగా, గత కొద్ది నెలల కాలంగా బూదికోట ఫిర్కాలో మనుషులపై, పంటలపై ఏనుగుల దాడులు పెరిగాయి. ప్రజలు భయం నీడన జీవించాల్సి వస్తోంది. ఇంతవరకు తాలూకాలో ఏనుగుల దాడిలో 9 మంది మరణించారు. -
అతడికి నా మీద క్రష్ ఉందంట. సో క్యూట్!
న్యూయార్క్ : 85 ఏళ్ల పండు వయసులో ప్రేమ కోసం పరితపిస్తోంది ఓ బామ్మ. లేటు వయసులో ఘాటు ప్రేమ కోసం పురుషులు కావాలంటూ పత్రికా ప్రకటన ఇచ్చింది. వివరాలు.. అమెరికాలోని న్యూయార్క్కు చెందిన హ్యాటీ రోట్రేజ్ 1984లో 48 ఏళ్ల వయసులో భర్తతో విడిపోయింది. ఆ తర్వాత జాన్ అనే యువకుడితో ప్రేమలోపడింది. ఇద్దరూ కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు. 2018లో ఓ టీవీ షోలో కూడా కనిపించారు. అయితే, తాజాగా ఈ ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో ఒంటిరి జీవితాన్ని భరించలేకపోతున్న హ్యాటీ ప్రేమికుడికోసం అన్వేషిస్తోంది. మొన్నటి వరకు టిండర్ అనే డేటింగ్ యాప్లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. సదరు డేటింగ్ యాప్లో హ్యాటీని బ్లాక్ చేయటంతో ప్లాన్ బీకి వచ్చేసింది. పేపర్లో ఓ ప్రకటన ఇచ్చింది. తనతో డేట్కు రావటానికి 35 సంవత్సరాల లోపు యువకులు కావాలని పేర్కొంది. ఈ ప్రకటన తర్వాత హ్యాటీకి విపరీతమైన ప్రపోజల్స్ వచ్చాయి. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం నేను ఎవరితోనూ డేటింగ్లో లేను. బంబుల్(డేటింగ్ యాప్)లో పోస్టులు పెడుతున్నాను. మళ్లీ డేట్కు వెళ్లటం ద్వారా నేను ప్రేమను పొందగలుగుతాను. నిన్న ఉదయం ఇజ్రాయెల్నుంచి నాకో యువకుడు ఫోన్ చేశాడు. అతడికి నా మీద క్రష్ ఉందంట. సో క్యూట్!’’ అని పేర్కొంది. -
ఒక బల్బు, టేబుల్ ఫ్యాన్; ఇంత బిల్లు ఎలా కట్టేది?
భోపాల్: మీటర్లో సాంకేతిక కారణాల వల్ల ఒక్కోసారి కరెంట్బిల్లులు షాక్ ఇస్తుంటాయి. ఇలాంటి చిత్రమైన అనుభవాలను ఇప్పటికే చాలాసార్లు చూశాం. వాటికి సంబంధించిన బిల్లులు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన ఒక నిరుపేద వృద్ధురాలికి ఇలాంటి ఘటనే ఎదురైంది. ఇళ్లల్లో పనిచేసే ఆ వృద్ధురాలు ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటుంది. కేవలం ఒక లైటు, టేబుల్ ఫ్యాన్ మాత్రమే ఉన్న ఆ ఇంటికి ఏకంగా రూ .2.5 లక్షల బిల్లు రావడాన్ని చూసి ఆశ్చర్యపోయింది. వివరాలు.. మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాకు చెందిన 65 ఏళ్ల రాంబాయి ప్రజాపతి స్థానికంగా ఉన్న ఇళ్లలో పనిచేసుకుంటూ ఒక పూరి గుడిసెలో నివసిస్తుంది.ఆమెకు ఇంట్లో ఒక లైట్, టేబుల్ ఫ్యాన్ తప్ప మరే వస్తువు లేదు. ప్రతీనెల ఆమెకు రూ. 300 నుంచి రూ. 500కు మించి కరెంట్ బిల్లు వచ్చేది. కానీ గత నెలలో ఏకంగా రూ .2.5 లక్షల కరెంట్ బిల్లు రావడం చూసి షాకైంది. విద్యుత్ అధికారుల ముందు తన గోడు వెల్లబోసుకునేందుకు స్థానిక విద్యుత్ కార్యాలయానికి వెళ్లింది. కానీ అక్కడ ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ఎవరైనా అధికారి కలిస్తే తన గోడు వెల్లబోసుకోవచ్చని అప్పటినుంచి ప్రతిరోజు విద్యుత్ కార్యాలయం చుట్టు ప్రదర్శనలు చేస్తుంది. ఈ సందర్భంగా రాంబాయి ప్రజాపతి మాట్లాడుతూ.. '' నేను చాలా సంవత్సరాల నుంచి షాన్టీ ప్రాంతాలోని ఒక గుడిసెలో నివసిస్తున్నాను.ఇంత చిన్న పూరి గుడిసెలో నివసించే నాకు లక్షల్లో బిల్లు ఎలా వచ్చిందో తెలియడం లేదు. దీనిపై అధికారును సంప్రదిస్తే వారు అస్సలు పట్టించుకోవడం లేదు. నా సమస్య పరిష్కారం కోసం కేవలం విద్యుత్ అధికారులనే కాదు స్థానిక ప్రజా ప్రతినిధులను, గుణ కలెక్టర్ కూడా కలిశాను. కానీ ఎవరూ నా సమస్యను పరిష్కరించలేదు” అని వాపోయింది. -
జిమ్ బామ్మ ఫ్రమ్ చెన్నై
వయసు 83. చేస్తుంది కసరత్తు. చెన్నైకి చెందిన కిరణ్బాయి తన మనవడి ప్రోత్సాహంతో హుషారుగా జిమ్ చేస్తూ ఆరోగ్యంలో.. బలంలో నాతో పోటీ పడగలరా అని సవాలు చేస్తోంది. వ్యాయామం ఏ వయసులో అయినా అవసరమే అని చెబుతోంది. ‘ఇదా... ఇదేముంది... వయసులో ఉన్నప్పుడు ఇనుప గుగ్గిళ్లు తిని అరాయించుకునేదాన్ని’ అంటుంది 83 ఏళ్ల కిరణ్బాయి చేతుల్లోని చెరి ఐదు కిలోల బరువున్న వెయిట్బార్స్ని పక్కన పెడుతూ. చైన్నై ఆర్.ఏ పురం లో నివాసం ఉండే కిరణ్ బాయి సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఆమె జిమ్ వర్కవుట్స్ వీడియోలకు అభిమానులు ఉన్నారు. వృద్ధాప్యంలో ఉండే సహజమైన నిరాసక్తతగాని, నిర్లిప్తతగాని లేకుండా ఈ వయసులో శిథిలమవడమే శరీర ధర్మం అని వదిలిపెట్టేయకుండా ఆమె శరీరాన్ని బలసంపన్నం చేసుకుంటూ తద్వారా ఆరోగ్య స్ఫూర్తినిస్తోంది. హుషారైన అమ్మాయి చెన్నైలో పుట్టి పెరిగిన కిరణ్బాయి చిన్నప్పటి నుంచి ఆటల్లో చాలా చురుగ్గా ఉండేది. ఈత కొట్టేది. పెళ్లయ్యాక ఇంటి పనులన్నీ ఒంటి చేత్తో చేసేది. ‘మా రోజుల్లో మసాలాలు నూరేవాళ్లం. నీళ్లు పైకి కిందకి మోసేవాళ్లం. పశువుల పాలు పితికే వాళ్లం. ఇవన్నీ నేను ఉత్సాహంగా చేసేదాన్ని. అందుకే ఆరోగ్యంగా ఉండేదాన్ని’ అంటుంది కిరణ్ బాయి. ఆమె తల్లిగా మారినా, బామ్మ వయసుకు చేరినా అంతే ఉత్సాహంగా ఉండేది. ‘మా కాలనీలో నేను అందరి కంటే హుషారైన బామ్మని’ అంటుంది కిరణ్ బాయి. 2020లో మారిన కథ అయితే ఇలా హుషారుగా ఉంటున్న కిరణ్ బాయి ఒకరోజు మంచం మీద నుంచి లేస్తూ కింద పడింది. ఆమె కాలు బాగా బెణికింది. ఆ సమయంలో ఆమెకు తన స్వభావానికి తగని నిర్లిప్తత వచ్చింది. నా జీవితం ముగింపుకు వచ్చేసింది... ఇక నేను ఎప్పటికీ మామూలు మనిషిని కాలేను అనే భావనకు వచ్చేసింది. ఆమె అలా డల్ కావడం గమనించిన కుటుంబ సభ్యులు చైన్నైలోనే ఆల్వార్పేటలో ఉంటున్న ఆమె మనవడు చిరాగ్కు పరిస్థితిని చెప్పారు. చిరాగ్కు సొంత జిమ్ ఉంది. సర్టిఫైడ్ జిమ్ ట్రైనర్ అతడు. ‘నువ్వు కొంచెం నానమ్మను దారిలో పెట్టరాదూ’ అని అడిగారు వాళ్లు. బామ్మ కోసం మనవడు చిరాగ్ ఆమె కోసం ఆమె ఇంట్లోనే తాత్కాలికమైన జిమ్ను ఏర్పాటు చేశాడు. కొద్దిపాటి పరికరాలతో ఇంట్లో ఉన్న వస్తువులతో అతడు తయారు చేసిన జిమ్లో వారానికి మూడు రోజులు ఆమె ఎలా వర్కవుట్స్ చేయాలో ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు. కిరణ్బాయి ముందు అనాసక్తిగా ఉన్నా తర్వాత వాటిని మొదలెట్టింది. సరిగ్గా మూడు నెలలు గడిచాయి. కిరణ్ బాయి మునుపటి కిరణ్బాయిగా మారిపోయింది. ఆమెకు శరీరం దారిలో పడింది. మనసుకు ఉత్సాహం వచ్చింది. మనవడితో కలిసి హుషారుగా వీడియోలు చేసింది. ఆ వీడియోలతో ఆమెకు పేరు వచ్చింది. ప్రశంసలు... విమర్శలు ఆ వీడియోలు చూసిన నెటిజన్లు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా చేశారు. ‘జిమ్ చేయడం వల్ల వృద్ధులలో కూడా కండరం శక్తిమంతం అవుతుంది. వాళ్ల ఎముకలు దృఢం అవుతాయి. శరీరం మీద బేలెన్స్ వస్తుంది. అంతే కాదు మెదడు కూడా చురుగ్గా తయారవుతుంది. మా బామ్మ ఇప్పుడు తను టాయిలెట్కు వెళ్లినా కింద కూచున్నా తనే లేవగలదు’ అంటాడు చిరాగ్. చీరలోనే జిమ్ కిరణ్ బాయి తన మనవడు చెప్పినట్టుగా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా జిమ్ చేస్తుంది. తాను రోజూ కట్టుకునే చీరలోనే ఆ వ్యాయామాలన్నీ చేస్తుంది. జిమ్ పరికరాలతో కాకుండా కాళ్లతో సోఫా జరపడం, కుర్చీని కదల్చడం వంటివి కూడా చేస్తుంది. ‘నా పనులు నేను చేసుకోలేనేమోననే భయం నాకు పోయింది’ అంటుంది కిరణ్ బాయి. ఆమె వీడియోలు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆ వయసులో ఉన్నవారిని ఉత్సాహ పరుస్తున్నాయి. ‘ఈ వయసులో ఇంత పేరా బామ్మా’ అని అడిగితే ‘అంతా నా మనవడి దయ’ అని మనవడికి ముద్దు పెడుతుంది. ఆమె ఆ మనవడికి సరిగానే పేరు పెట్టింది. ‘చిరాగ్’ అని. చిరాగ్ అంటే వెలుతురు అని అర్థం. ఉత్సాహ పరిచే పిల్లలు, మనవలు ఉంటే వృద్ధాప్యంలో ఉన్న ఎవరి జీవితాల్లో అయినా ఇలాంటి వెలుతురు సాధ్యమే. – సాక్షి ఫ్యామిలీ -
అయ్యో.. కుళ్లిన శవం, పీక్కుతిన్న పెంపుడు పిల్లులు
స్పెయిన్లో ఘోరం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉంటున్న ఓ పెద్దావిడ చనిపోగా, ఆ విషయం మూడు నెలల దాకా ఆ విషయం బయటి ప్రపంచానికి తెలియలేదు. ఇక ఆమె పెంచుకుంటున్న పిల్లులు ఆకలికి తాళలేక ఆమె మృతదేహాన్నే పీక్కుతిన్నాయి. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మాడ్రిడ్: క్లారా ఇనెస్ టోబోన్(79) అనే ఆవిడ నగరంలోని ఓ అపార్ట్మెంట్లో చాలా ఏళ్లుగా ఒంటరిగానే ఉంటోంది. ఆ ఒంటరితనం నుంచి బయటపడేందుకు ఆమె కొన్ని పిల్లుల్ని పెంచుకుంటోంది. పోయిన సొమవారం ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తలుపులు బద్ధలు కొట్టిన పోలీసులు అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యారు. ఆమె రెండు పెంపుడు పిల్లులు.. కుళ్లిన ఆమె శవాన్ని పీక్కుతింటూ కనిపించాయి. కరోనా అనే అనుమానంతో.. ఇక ఈ కేసులో దారుణమైన విషయం ఒకటి బయటపడింది. క్లారా, కొలంబియా నుంచి మాడ్రిడ్కు వలస వచ్చింది. 1996 నుంచి శాన్ కుగట్ సెల్ వాల్లెస్లో ఒంటరిగా ఉంటోంది. పోయినేడాది ఆమె జబ్బుపడింది. దీంతో ఆమెకు కరోనా సోకిందేమో అనే అనుమానంతో ఎవరూ సాయం అందించలేదు. కొన్ని నెలల క్రితం ఆమె దగ్గుతూ కనిపించిందని కొందరు చెప్పారు. వీధిలో పిల్లులకు ఆహారం పెట్టిందని, మార్కెట్ నుంచి సరుకులు తెచ్చుకుందని, ఆమెను చూడడం అదే చివరిసారని చుట్టుపక్కల వాళ్లు చెప్తున్నారు. కాగా, క్లారా మృతదేహాం నడుం పైభాగం వరకు పూర్తిగా కుళ్లిపోయి ఉంది. ఆమె పెంపుడు పిల్లులో అయిదు అక్కడే చచ్చిపడి ఉన్నాయి. చచ్చిన పిల్లుల కడుపులో ఆమె అవశేషాలున్నాయా? అనేది గుర్తించేందుకు వాటి శవాల్ని ల్యాబ్కు పంపించారు. ఆమె శవాన్ని పీక్కతుంటూ కనిపించిన రెండు పిల్లులూ.. దీనావస్థకి చేరుకున్నాయి. దీంతో వాటిని యానిమల్ షెల్టర్కు తరలించారు. క్లారా కరోనాతో చనిపోయిందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. కాగా, ఆమెకు బంధువులు ఎవరూ లేరని, డైజెనెస్ సిండ్రోమ్ డిజార్డర్(శుభ్రత పాటించకపోవడం, చెత్తను పోగు చేసుకోవడం)తో ఆమె బాధపడుతోందని, అందుకే ఆమెకు దగ్గరగా ఎవరూ వెళ్లేవాళ్లు కారని ఆ హౌజింగ్ అసోషియేషన్ హెడ్ చెబుతున్నాడు. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో అరుదైన ప్రయోగం -
వృద్ధురాలిపై అత్యాచారం.. కొట్టి చంపిన గ్రామస్తులు
పుంగనూరు(చిత్తూరు జిల్లా): ఓ దళిత వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని రాళ్లతో, కట్టెలతో కొట్టి చంపిన ఘటన శుక్రవారం పుంగనూరు మండలం అప్పిగానిపల్లెలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అప్పిగానిపల్లెకు చెందిన వృద్ధురాలు సమీపంలోని వనమలదిన్నె గ్రామానికి వెళ్లి మినీ బ్యాంకులో నగదు డ్రా చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరింది. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన గురుమూర్తి(47) ఆమెను అనుసరించి.. ఎవరూ లేని సమయంలో వనమలదిన్నె సమీపంలోని సబ్స్టేషన్ వెనుక పొదల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగదు, బంగారు కమ్మలు, చైను, ముక్కు పుడక లాక్కెళ్లాడు. బాధితురాలు స్పృహ కోల్పోయింది. కొన్ని గంటల తర్వాత తీవ్ర గాయాలతో గ్రామంలోకి వెళ్లి గ్రామస్థులకు విషయం చెప్పింది. అనంతరం స్థానికులు ఆమెను పుంగనూరు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలించారు. గ్రామ సమీపంలో తచ్చాడుతున్న నిందితుడు గురుమూర్తిని పట్టుకున్న గ్రామస్థులు మూకుమ్మడిగా రాళ్లు, కట్టెలతో కొట్టి చంపేశారు. డీఎస్పీ గంగయ్య, సీఐ గంగిరెడ్డి, ఎస్ఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గురుమూర్తికిది అలవాటే.. వనమలదిన్నెకు చెందిన గురుమూర్తి గతంలోనూ మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అతనిపై పుంగనూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. గురుమూర్తి ఒంటరి మహిళలపై దాడులు, అత్యాచారాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం అతని భార్య, పిల్లలు వదిలి వెళ్లిపోయారు. -
Photo Story: మనసున్న పోలీస్
సోమవారం మధ్యాహ్నం.. జనగామ పట్టణం.. లాక్డౌన్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ బాబుకు.. మండుటెండలో ఊతకర్ర సాయంతో డెబ్బై ఏళ్ల వృద్ధురాలు అడుగులో అడుగేసుకుని వస్తూ కనిపించింది. ఆమెనా స్థితిలో చూసి చలించిన బాబు వివరాలు ఆరాతీయగా, తన పేరు కౌసల్య అంటూ ఓ చీటీ చేతిలో పెట్టింది. అందులోని నంబర్కు ఫోన్చేస్తే అవతలి నుంచి స్పందన లేదు. అప్పటికే ఆకలిదప్పులతో నీరసించిపోయిన వృద్ధురాలు ‘అయ్యా! నాకు చేతకావట్లే.. ఈడెవరూ తెలియదు. నీ దయ సారూ!’ అంటూ చేతులు జోడించింది. మనసు ద్రవించిన ఆయన, తన కోసం తెచ్చుకున్న ఆహారాన్ని అందించారు. చేతిలో కొంత పైకం పెట్టారు. ఓ వాహనాన్ని ఆపి.. ఆమెను నర్మెట్టలో దించాలని డ్రైవర్ను రిక్వెస్ట్ చేసి ఎక్కించారు. ఆమె క్షేమ సమాచారం తెలుసుకోవడం కోసం డ్రైవర్ ఫోన్ నంబర్ను తీసుకున్నారు. – జి.వేణుగోపాల్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, జనగామ చదవండి: ఎమ్మెల్సీ కవిత చొరవ: నిండు గర్భిణికి అండగా నిలిచి.. -
తోటలోకి బాలుడు, ప్రశ్నించిన వృద్ధురాలిపై దారుణం
ఒంగోలు(ప్రకాశం జిల్లా): పదిహేడేళ్లు బాలుడు ఓ వృద్ధురాలిని హత్య చేసి, ఆపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలను ఒంగోలు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి.ప్రసాద్ గురువారం మీడియాకు వెల్లడించారు. టంగుటూరు మండలం మల్లవరప్పాడుకు చెందిన నాగినేని రంగారావు తన రొయ్యల చెరువుల వద్ద రెండు నెలలుగా పశ్చిమ బెంగాల్కు చెందిన 17 ఏళ్ల బాలుడు పని చేస్తున్నాడు. ఈనెల 14న రంగారావు తన బొప్పాయితోటలో పని చేసేందుకు బాలుడిని పంపాడు. అదే రోజు తోటలో రంగారావు తల్లి వెంకట రవణమ్మ(63) హత్యకు గురైంది. బొప్పాయి తోటలో పని చేసుకుంటున్న తన తల్లిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారంటూ ఈనెల 15న రంగారావు టంగుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో బాలుడి వ్యవహారం బట్టబయలైంది. 14వ తేదీన తోటకు వెళ్లి గేటు తీస్తున్న బాలుడితో అక్కడే కలుపుతీస్తున్న రంగారావు తల్లి వెంకట రవణమ్మ(63) గొడవ పడింది. అది కాస్తా దూషణల వరకు వెళ్లింది. ఆగ్రహించిన బాలుడు తనను దూషించిన రవణమ్మను తోటలో ఉన్న దోకుడుపారతో తలపై బలంగా మోదాడు. మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ ఆమె వద్ద ఉన్న కండువాతో మెడకు బిగించాడు. ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్టు భావించి ఫెన్సింగ్ పక్కనే ఉన్న బండరాయితో తలపై మోది హత్య చేశాడు. అంతటితో ఆగక ఆమెపై లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడని పోలీసుల విచారణలో స్పష్టం కావడంతో బాలుడిని గురువారం మధ్యాహ్నం టంగుటూరులో పోలీసులు అదుపులోకి తీసుకుని, జువైనల్ కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో సింగరాయకొండ సీఐ యు.శ్రీనివాసరావు, టంగుటూరు ఎస్సై నాయబ్రసూల్ ఉన్నారు. చదవండి: రైస్పుల్లింగ్: రాగిపాత్రకు రంగుపూసి.. దుర్గ హత్య కేసు: అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు -
Andhra Pradesh: కరోనాను జయించిన 90 ఏళ్ల బామ్మ
తాడికొండ: 90 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. గుంటూరు జిల్లా తాడికొండ గ్రామానికి చెందిన పర్వతం లక్ష్మీదేవి(90)కి రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆమె అడవితక్కెళ్ళపాడులోని క్వారంటైన్ కేంద్రంలో చేరింది. 12 రోజుల క్వారంటైన్లో వైద్యుల సలహాలు, సూచనలను పాటించింది. ఇటీవల జరిపిన పరీక్షలో నెగిటివ్ రావడంతో శనివారం ఆమె ఇంటికి చేరుకుంది. చదవండి: వైరల్: క్వారంటైన్లో ఎమ్మెల్యే చిందులు కరోనా వేళ.. పాడి వ్యాపారి వినూత్న ఆలోచన -
కరోనాను జయించిన వందేళ్ల బామ్మ
సారవకోట: ఆత్మస్థైర్యంతో ఉంటే ఎలాంటి సమస్య ఎదురైనా బయటపడవచ్చని నిరూపించారు ఓ వందేళ్ల వృద్ధురాలు. కరోనా మహమ్మారి సోకినా భయపడకుండా వైద్యుల సలహాలు పాటిస్తూ సురక్షితంగా కోలుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. సారవకోట మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన 100 ఏళ్ల బామ్మ యాళ్ల సీతారామమ్మకు ఏప్రిల్ 20న కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆమెను కుటుంబ సభ్యులు హోం ఐసొలేషన్లో ఉంచారు. సకాలంలో మందులు వేసుకుంటూ, వైద్యుల సలహాలు పాటించడంతో ఆమె కోలుకున్నారు. ఆహారం ఇలా... ♦ఉదయం నిమ్మరసంతో కూడిన తేనె, గుడ్డు అల్పాహారంలో ఇడ్లీ, అట్లు, పూరీలు వంటివి ♦రెండు గంటల విరామం తర్వాత మజ్జిగ ♦మధ్యాహ్న భోజనంలో చికెన్, చేపలు, గుడ్లతో పాటు అన్నం. సాయంత్రం బొప్పాయి, యాపిల్ ♦రాత్రి భోజనంలో కాకరకాయ బెల్లం కూర, గుడ్డు, ఇతర కూరగాయలతో అన్నం. ♦పడుకునే ముందు ఎండు ద్రాక్ష ♦మొదటి నుంచి అలవాటు ప్రకారం నీరు ఎక్కువగా తాగానని సీతారామమ్మ చెప్పారు. మందులు.. ప్రభుత్వం అందించిన హోం ఐసొలేషన్ కిట్తో పాటు వైద్యుల సలహా మేరకు కొన్ని మందుల్ని వినియోగించారు. ఈమె మనవడు యాళ్ల భూషణరావు స్థానిక పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తుండటంతో ఈమె ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం ఈమె ఆక్సిజన్ స్థాయి 97 నుంచి 98 వరకు ఉంది. చదవండి: ఆటలే అస్త్రాలు: కరోనాతో ‘ఆడుకుంటున్నారు..’ కరోనా కట్టడికి ఏపీ బాటలో ఇతర రాష్ట్రాలు -
ఒంట్లో బాగోలేదని: బామ్మను ఇంట్లోకి అనుమతించని మనుమరాలు
సాక్షి, వేములవాడ: ఆమె శతాధిక వృద్ధురాలు.. నిలువనీడలేదు.. మండుటెండలు.. పైగా అనారోగ్యం.. జీవిత చరమాంకంలో ఆ బామ్మకు ఎంత కష్టం! మాతృ దినోత్సవం రోజునే ఈ ముసలమ్మకు ఎంత కష్టం! తలదాచుకునేందుకు దిక్కులేక బిక్కుబిక్కుమంటోంది.. రోడ్డు పక్కన టెంట్ కింద మూలుగుతోంది. ఎములాడ రాజన్నకు కూడా ఆమె మూగరోదన వినిపించనట్టుంది! ‘బామ్మా.. మా ఇంటికి రా’అని ఆపన్నహస్తం అందించేవారే కరువయ్యారు. మానవత్వం మంటగలిసింది. వివరాలు... రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన పంబి వెంకటస్వామి తన తల్లి తులసమ్మ(103), భార్యతో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం తులసమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఆమె చనిపోతే తమకు అరిష్టమని భావించి ఇంటి యజమానులు వారిని బయటకు వెళ్లగొట్టారు. దీంతో వెంకటస్వామి తల్లి, భార్యను తీసుకుని అదే పట్టణంలో ఉంటున్న తన కుమార్తె సునీత ఇంటికి వెళ్లాడు. అయితే, సునీత, ఆమె కుమారుడు శ్రీకాంత్, కూతురు.. బామ్మను ఇంట్లోకి రానివ్వలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న బామ్మకు ఏమైనా అయితే మంచిది కాదని భావించి, ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. దీంతో వెంకటస్వామి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సూచనతో మళ్లీ అద్దె ఇంటికి వెళ్లినా యజమానులు అనుమతించలేదు. గత్యంతరంలేక మళ్లీ తన కూతురి ఇంటికి వెళ్లాడు. మళ్లీ ఆమె ససేమిరా అనడంతో రోడ్డు పక్కన టెంట్ వేసుకొని దాని కిందే తన తల్లితో కలసి తలదాచుకుంటున్నారు. పోలీసులు స్పందించి వెంకటస్వామి కూతురు, మనుమడు, మనుమరాలుకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చదవండి: వేల ఏళ్ల క్రితమే కరోనా కజిన్ సిస్టర్! -
బామ్మకు బజారే దిక్కయింది..
వేములవాడ : రక్తం సంబంధం కుదరదు పొమ్మంటే.. ఆ వృద్ధురాలికి బజారు దిక్కయింది. మానవత్వంలేని మనవరాలి పనితో శతాధిక వయసులో రోడ్డుపైనే గడిపేస్తోంది. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణానికి చెందిన వెంకట స్వామికి నలుగురు కూతుళ్లు. ఇందులో ఇద్దరు కూతుర్లు చనిపోయారు. పెద్ద కూతురికి తానే స్వయంగా ఇల్లు నిర్మించి ఇచ్చాడు. తన తల్లి (బామ్మ) చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే తాను కిరాయికి ఉంటున్న ఇంటివారు వెళ్లి పొమ్మన్నారు. దీంతో గత్యంతరం లేక వెంకటస్వామి తన తల్లిని తీసుకొని తన కూతురు సునీత ఇంటికి చేరాడు. అయితే, మనవరాలు శతాధిక వృద్ధురాలిని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో వెంకటస్వామి కూతురి ఇంటి ముందు టెంట్ వేసుకుని బజార్లోనే తల్లిని పడుకోబెట్టి అక్కడే కూర్చుండిపోయాడు. మాతృ దినోత్సవం రోజున బామ్మకు జరిగిన ఇబ్బందిపై కాలనీవాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
బావిలో నుంచి కేకలు.. అసలు ఏం జరిగిందంటే..?
రేణిగుంట: మండలంలోని అత్తూరు గ్రామ శివారు న ఉన్న వ్యవసాయ బావిలో పడిన ఓ వృద్ధురాలిని గాజులమండ్యం పోలీసులు కాపాడారు. అత్తూరు గ్రామానికి చెందిన సుబ్బమ్మ(80) కాలకృత్యాలు తీర్చుకునేందుకు శనివారం ఉదయం గ్రామ శివారుకు వెళ్లే క్రమంలో పొరపాటున కాలు జారి వ్యవసాయ బావిలో పడి.. మోటారు పైపును పట్టుకుని కేకలు వేసింది. అటుగా వెళుతున్న స్థానికులు గాజులమండ్యం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ శ్రీనివాసులు ఆదేశాలతో కానిస్టేబుళ్లు శివకుమార్, మహేష్ ఘటన స్థలానికి చేరుకున్నారు. బావికి మెట్లు లేకపోవడంతో ఆమెను బయటకు తీసేందుకు ఓ మంచానికి తాళ్లు కట్టి బావిలోకి వదిలారు. ఆమె మంచంపైకి చేరుకోవడంతో ఆమెను మెల్లగా గట్టుకు చేర్చారు. దీంతో స్థానికులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు వెంటనే స్పందించి ఈమేరకు కానిస్టేబుళ్లు శివకుమార్, మహేష్ను అభినందించి రివార్డు ప్రకటించారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: కరోనా చీకట్లో మానవత్వపు చిరు దీపం సీనియర్ జర్నలిస్టు గోపి హఠాన్మరణం -
కరోనా భయంతో వృద్ధురాలిని గెంటివేసిన ఇంటి యజమాని
జగ్గయ్యపేట అర్బన్: కరోనా వచ్చిందని 65 ఏళ్ల వృద్ధురాలిని ఇంటి యజమాని అమానుషంగా నడిరోడ్డు మీదకు నెట్టేసిన ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శనివారం చోటుచేసుకుంది. బొజ్జ సామ్రాజ్యం అనే వృద్ధురాలు పట్టణ శివారులోని పద్మావతినగర్లోని అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు గతంలో ఇంటిని అమ్మేసి కన్న తల్లిని ఒంటరిగా వదిలేసి ఆ డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమె అద్దె ఇంట్లో ఉంటూ పెన్షన్ డబ్బుతో జీవనం వెళ్లదీస్తోంది. ఆమెకు కరోనా సోకిందన్న సమాచారం తెలుసుకున్న ఇంటి యజమాని సామాన్లతో సహా బయటకు గెంటేశాడు. దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు ఆరుబయట దీనావస్థలో పడి ఉండటంతో విషయం తెలుసుకున్న స్థానిక సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ చినబాబు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి ఇంటి యజమానిని హెచ్చరించి తిరిగి ఆమెను ఇంటిలోకి చేర్చారు. మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా ఇల్లు, పరిసరాలు శానిటేషన్ చేయించారు. వెంటనే ఎస్ఐ ఈ విషయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వృద్ధురాలిని స్థానిక గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లో చేర్చుకుని వైద్య సేవలందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. -
‘నా వయసు 97 ఏళ్లు.. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా’
కరోనా వైరస్ రాకుండా అడ్డుకునేందుకు వేస్తున్న వ్యాక్సిన్ను వేసుకునేందుకు కొందరు జంకుతున్నారు. వ్యాక్సిన్ వలన ఎలాంటి దుష్ప్రభావాలు లేవని అవగాహన కల్పిస్తున్నా చాలా మంది వ్యాక్సిన్ వేసుకునేందుకు భయపడుతున్నారు. ఈ క్రమంలో ఓ బామ్మ వ్యాక్సిన్ వేసుకునేందుకు చూపిస్తున్న ఉత్సాహం చూస్తే వేరే వారూ కూడా వ్యాక్సిన్ వేసుకునేంత ఉత్సాహం వస్తోంది. ‘నా వయసు 97 ఏళ్లు. నేను మొదటి వ్యాక్సిన్ మార్చి 9వ తేదీన తీసుకున్నా. వ్యాక్సిన్ వేసుకున్నాక ఎలాంటి నొప్పి, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. రెండో డోసు బాకీ ఉంది. మే 9వ తేదీన టీకా వేసుకోవడానికి ఎదురుచూస్తున్నా. వ్యాక్సిన్ వేసుకునేందుకు ఎవరూ భయపడొద్దు. వ్యాక్సిన్ సురక్షితం.. అది మీ మంచికే. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా సాధారణ జీవితం పొందవచ్చు.’ అని ఇంగ్లీష్లో మాట్లాడి ఔరా అనిపించింది. ఈ వీడియోను సీనియర్ జర్నలిస్ట్ లతా వెంకటేశ్ ట్వీట్ చేశారు. అవ్వ ఉత్సాహం చూసిన నెటిజన్లు ‘అవ్వా నీకు దండమే..!’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘అవ్వను చూసైనా నేర్చుకోండి. అందరూ వ్యాక్సిన్ వేసుకోండి.’ చదవండి: కరోనా రోగి ప్రాణం నిలిపిన వలంటీర్లు: సీఎం ప్రశంస చదవండి: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు Hope this young lady can convert some sceptics pic.twitter.com/WYXpPMrKhd — Latha Venkatesh (@latha_venkatesh) May 8, 2021 -
కరోనాను జయించిన 92 ఏళ్ల బామ్మ
నాదెండ్ల (చిలకలూరిపేట): కరోనా బారి నుంచి 92 ఏళ్ల బామ్మ కోలుకుంది. గుంటూరు జిల్లా గణపవరం గ్రామానికి చెందిన సింగు కామేశ్వరమ్మ ఏప్రిల్ 16న అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించి కరోనా పాజిటివ్గా నిర్ధారించారు. ఆస్పత్రిలో కొన్ని రోజులు చికిత్స పొంది కోలుకుంది. అనంతరం ఆమె డిశ్చార్జయ్యి గత నెలాఖరున ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉంది. చదవండి: త్వరలో ఏపీకి 9 లక్షల కోవిడ్ టీకాలు జలమార్గంలో చేరుకున్న ఆక్సిజన్ ట్యాంకర్లు -
గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి
పట్నంబజారు(గుంటూరు): 80 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై కేసు నమోదైంది. గుంటూరు నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూరు మండలం కిష్కిందపాలేనికి చెందిన వృద్ధురాలు 15 సంవత్సరాల క్రితం కూలీ పనుల నిమిత్తం వచ్చి కామాక్షి నగర్లో నివాసం ఉంటోంది. ఏడాది క్రితం భర్త మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారిలో ఇద్దరు కుమారులు మృతి చెందారు. ప్రస్తుతం ఉన్న కుమారుడు, కుమార్తెలకు వివాహం కావడంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో ఒంటరిగా నివశిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంటి తలుపులు కొట్టినట్లు శబ్ధం రావడంతో కుమారుడు వచ్చాడనుకుని తలుపులు తీసింది. గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై దాడి చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేకలు వేస్తున్నప్పటికీ నోరు మూసి చిత్రహింసలకు గురి చేశాడు. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత స్పృహలోకి వచ్చిన సీతమ్మ స్థానికులకు విషయాన్ని తెలిపింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి దారుణం: కామంతో కళ్లు మూసుకుపోయి.. -
నాలుగేళ్లుగా నమ్మకంగా నటించి ఆటో డ్రైవర్ దారుణం
రాజమహేంద్రవరం: అమ్మా.. ఎక్కడికి వెళ్లాలి. రమ్మంటారా.. బ్యాంకుకా పదండి వెళ్దాం.. అంటూ నమ్మకస్తుడిగా నటించిన ఓ ఆటో డ్రైవర్ చివరికి ఆ వృద్ధురాలిని హత్య చేసి బంగారం కాజేశాడు. అప్పులు, ఖర్చుల కోసమే ఈ ఘటనకు పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. నిందితుడి నుంచి 116 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు రాజమహేంద్రవరం అర్బన్ ఏఎస్పీ (లా అండ్ ఆర్డర్) ఎ.లతామాధురి తెలిపారు. దీనిపై శుక్రవారం బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. గత నెల 4న రాత్రి హుకుంపేట ఆదర్శనగర్లో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు జంగా నారాయణమ్మ (60) హత్యకు గురైంది. ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఆమె ముక్కు, నోరు మూసివేసి హత్య చేసి బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు వచ్చిన ఫిర్యాదుపై బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి కేసు నమోదు చేశారు. అర్బన్ ఎస్పీ శేమూషీ బాజ్పాయ్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, ఈస్ట్జోన్ డీఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో బొమ్మూరు, రాజానగరం ఇన్స్పెక్టర్లు లక్ష్మణరెడ్డి, సుభాష్లు, ఎస్సైలు దర్యాప్తు చేపట్టారు. అనుమానం వచ్చి హుకుంపేట ఆదర్శనగర్ పార్కు వద్ద ఉంటున్న ఆటో డ్రైవర్ చుక్కా లోవరాజును ఆవ రోడ్డులో బొమ్మూరు ఇన్స్పెక్టర్ లక్ష్మణరెడ్డి అరెస్టు చేశారు. అతన్ని విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. లోవరాజు సొంతూరు విజయవాడ. అక్కడ గతంలో అతనిపై దొంగతనాల కేసులున్నాయి. పదేళ్ల కిందట ఆయన రాజమహేంద్రవరానికి వచ్చి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. హత్యకు గురైన జంగా నారాయణమ్మకు లోవరాజు ఆటోడ్రైవర్గా పరిచయం అయ్యాడు. ఆమెకు నమ్మకస్తుడిగా ఉంటూ సుమారు నాలుగేళ్ల నుంచి ఆసుపత్రులకు, బ్యాంకు పనులకు, దేవాలయాలు, బంధువుల ఇళ్లకు తన ఆటోలో కిరాయికి తిప్పుతూ ఉండేవాడు. అంతా గమనించి.. నారాయణమ్మ ఒంటరిగా ఉంటుందని, ఆమె వద్ద బంగారం ఉందని గమనించాడు. ఆ బంగారం దొంగిలించి అప్పులు, కుటుంబ అవసరాలు తీర్చుకోవాలని నిందితుడు భావించాడు. ముందుగానే హత్యకు పథకం వేశాడు. గత నెల 4న రాత్రి 8 గంటలకు ఎవరూ లేని సమయంలో లోవరాజు ఆమె ఇంట్లోకి ప్రవేశించి హత్య చేసి, ఒంటి మీద బంగారాన్ని దోచుకుపోయాడు. ఈ కేసులో చివరికి నిందితుడిని అరెస్ట్ చేసి సుమారు రూ.4 లక్షల విలువైన 116 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ లతామాధురి తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఇన్స్పెకర్లు లక్ష్మణరెడ్డి, సుభాష్లను, బొమ్మూరు పీఎస్ సిబ్బంది, డీఎస్పీ క్రైం పార్టీని ఎస్పీ శేముషీ బాజ్పాయ్ అభినందించారు. చోరీ కేసులలో నిందితుల అరెస్ట్ అర్బన్ ఈస్ట్ జోన్ డీఎస్పీ రవికుమార్, ప్రకాష్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాస్లకు వచ్చిన సమాచారం మేరకు గురువారం మధ్యాహ్నం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఇద్దరు అంతర్రాష్ట్ర చోరీ నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ లతామాధురి తెలిపారు. విశాఖపట్నానికి చెందిన బందు గోవింద్, వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్కు చెందిన ఆలమురి సంజీవరెడ్డిలను అరెస్టు చేసి వారి నుంచి సుమారు 9 కాసుల బంగారు ఆభరణాలు, రూ.51 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు గత రెండు నెలల్లో రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో ఆరు నేరాలు చేశారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఇంటి ప్రహరీ దూకి కిటికీ తెరిచి చూస్తుండగా వాచ్మెన్ చూడటంతో పరారయ్యారు. టుటౌన్ పరిధిలో రెండు, ప్రకాష్నగర్ పరిధిలో రెండు, బొమ్మూరు రెండు, కాకినాడ సీసీఎస్ పరిధిలో ఒకటి, ఒంగోలు ఒకటి, చిత్తూరు జిల్లా అలిపిరి పరిధిలో పలు దొంగతనాలు చేశారు. బందు గోవిందుపై రాజమహేంద్రవరం, విశాఖపట్నం, కడప, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు జిల్లాల్లో సుమారు 15 కేసులు ఉన్నాయి. ఐదు కేసుల్లో శిక్ష కూడా పడింది. వారిని పట్టుకుని చోరీ సొత్తు రికవరీ చేసిన పోలీసులను అర్బన్ ఎస్పీ అభినందించారని లతామాధురి తెలిపారు. -
తాడుతో గొంతు నులిమి చంపి..
తోటపల్లిగూడూరు(నెల్లూరు జిల్లా): మండలంలోని నరుకూరు వృద్ధాశ్రమంలో ఓ వృద్ధురాలి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 11 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ హరనాథరెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కోవూరు మండలం పడుగుపాడుకు చెందిన అమర్తలూరు రత్నమ్మ(74) రెండేళ్లగా మండలంలోని శ్రీ వాసవీ ఆర్యవైశ్య వృద్ధాశ్రమంలో ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన రత్నమ్మ కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై అదే నెల 22న తన మేనత్త కనిపించడం లేదంటూ రత్నమ్మ మేనల్లుడు పోబోలు వెంకటేశ్వర్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే రత్నమ్మకు వరసకు కోడలు అయిన పడారుపల్లికి చెందిన మాకం సుజాతపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు వెలుగుచూశాయన్నారు. రత్నమ్మ ఒంటిపై ఉన్న బంగారంపై కాజేసే దురుద్దేశంతో ఆమెను అంతం చేసేందుకు సుజాత పన్నాగం పన్నిందన్నారు. సుజాత తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న సుందరయ్య కాలనీకి చెందిన గెరిక సైదులు, అతని స్నేహితుడు పగడాల సాయి సహాయంతో రత్నమ్మ హత్యకు కుట్ర చేసిందన్నారు. సుజాత ఫిబ్రవరి 16న నెల్లూరుకు వచ్చిన రత్నమ్మను నమ్మకంగా సుందరయ్య కాలనీలో సైదులు ఇంటికి రప్పించిందన్నారు. ముగ్గురు కలిసి రత్నమ్మను తాడుతో గొంతు నలిమి చంపి ఆమె ఒంటిపై ఉన్న 11 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకుని మృతదేహాన్ని చెన్నై–కోల్కతా రహదారిలో సర్వేపల్లి కాలువలో పారేశారన్నారు. అయితే వారం రోజులుగా రత్నమ్మ మృతదేహం కోసం గాలించినా జాడ తెలియలేదన్నారు. బుధవారం ఈ హత్య కేసులో నిందితులు మాకం సుజాతతో పాటు గెరిక సైదులు, పగడాల సాయి నుంచి ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచామన్నారు. ఈ హత్య కేసును ఛేదించడంలో కృషి చేసిన స్టేషన్ సిబ్బందికి రివార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో కృష్ణపట్నం సీఐ ఖాజావలి, స్థానిక ఎస్సై ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: నగ్నంగా బైక్పై హల్చల్ : పోలీసుల వేట! ఇంటర్ ఫెయిల్.. భద్రమ్ సినిమా చూసి దారుణం -
విజేత: అప్పుడ స్పానిష్ ఫ్లూ.. ఇప్పుడు కరోనా
వాషింగ్టన్ : ఒకప్పుడు రోజులు అలా ఉండేవీ ఇలా ఉండేవీ... అప్పుడు అవీ ఇవీ తిని ఆరోగ్యంగా ఉండేవాళ్లమని చెప్పే పెద్దవాళ్ల మాటలను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తాం. కానీ వెనుకటి రోజుల్లో ఉన్న ఆహారపు అలవాట్ల ద్వారా వందేళ్ల క్రితం వచ్చిన స్పానీష్ ఫ్లూనూ, వందేళ్ల తరువాత ప్రస్తుతం వచ్చిన కోవిడ్–19ను జయించానని చెబుతోంది 105 ఏళ్ల బామ్మ. అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తోన్న లూసియా డెక్లర్క్ వయసు అక్షరాలా 105 సంవత్సరాలు. ఈ ఏడాది జనవరి 25 న ఆమె పుట్టిన రోజు కూడా జరుపుకుంది. విచిత్రంగా తన బర్త్డే రోజే ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. మొదట్లో కాస్త భయపడిన లూసియా తరువాత ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొని ఇప్పుడు కోవిడ్ బారినుంచి బయటపడ్డారు. రెండు ప్రపంచ యుద్ధాలు చూసిన లూసియా తన జీవిత కాలంలో ఎటువంటి జంక్ పుడ్ తీసుకోలేదని, రోజూ నానపెట్టిన కిస్మిస్లు తినడం వల్లే నేను ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నారు. లూసియాకు ఇద్దరు కొడుకులు, ఐదుగురు మనవళ్లు, మనవరాళ్లు, 12 మంది మునిమనవళ్లు, మనవరాళ్లు, 11 మంది మరోతరం మునిమనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. ‘‘కోవిడ్–19 విజృంభిస్తున్న తొలినాళ్లలో వయసుమళ్ళిన పెద్దవాళ్లు ఎందరో కరోనా కాటులో ప్రాణాలు కోల్పోయారు. మా బామ్మ ఆ కోవకు చెందినవారైనప్పటికీ ఆమె.. జంక్ఫుడ్ జోలికీ వెళ్లకుండా పసుపురంగులోని కిస్మిస్లను రోజూ తినడం వల్ల ఆరోగ్యంగా ఉన్నారు’’ అని లూసియా 53 ఏళ్ల మనవరాలు చెప్పింది. ఇప్పటికైనా జంక్ఫుడ్ను వదిలి సంప్రదాయ వంటకాలు తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకొందాం. చదవండి: కన్ను తాకితే కరోనా వచ్చింది! -
మాస్క్ తీసి ఫొటో దిగు నాయనా..
గంభీరావుపేట (సిరిసిల్ల): ఇష్టమైన నాయకులు, సెలెబ్రిటీలు కనిపిస్తే చాలు.. ప్రతీ ఒక్కరు సెల్ఫీ దిగుతుంటారు. అలాగే, చంద్రకళ అనే వృద్ధురాలు కూడా మంత్రి కేటీఆర్తో సెల్ఫీ దిగాలనుకుంది. సోమవారం సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండల కేంద్రంలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్కు ఆ బామ్మ ఎదురు వచ్చింది. ‘ఏం కావాలమ్మా?’అని కేటీఆర్ అడగగా.. ‘నీతో సెల్ఫీ దిగాలని వచ్చిన బిడ్డా..’అని బదులిచ్చింది. దీంతో కేటీఆర్ ఆమెతో సెల్ఫీ దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే, కేటీఆర్ మాస్కు ధరించి ఉండటంతో ‘మాస్కు తీసి ఫొటో దిగు నాయనా..’అని అడిగింది. ఆమె కోరిక మేరకు కేటీఆర్ మాస్కు తీసి ఫొటో దిగారు. (చదవండి: కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అంతా గప్చుప్!) (పాత వేపచెట్టు : భారీ జరిమానా) -
యూపీలో దారుణం: 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం
లక్నో: వావివరుసలు.. వయసు బేధం లేకుండా కామాంధులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు దేశంలో జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఎనభై ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు ఆలయానికి వెళ్లొచ్చేలోపు ఆ ముసలావిడపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లా ఖరేలా పట్టణం సమీప గ్రామంలో ఫిబ్రవరి 2వ తేదీన కుటుంబసభ్యులు ఆలయానికి వెళ్లారు. దీంతో ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించి ఆ పెద్దావిడపై అత్యాచారం చేశారు. ఇంటికి చేరిన కుటుంబసభ్యులకు ఈ విషయం వివరించి ఆమె కన్నీటి పర్యంతమైంది. ఆమె మనవడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే జలాల్పూర్ ప్రాంతంలోని హమీర్పూర్కు చెందిన పూల్చంద్, మరో వ్యక్తి నిందితులుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖరేలా ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. -
సర్పంచ్ బరిలో బామ్మ!
కళ్యాణదుర్గం రూరల్: ఏకంగా ఏడు పదుల వయస్సులో ఓ బామ్మ సర్పంచు బరిలో నిలబడింది. ఎక్క డో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కాదు. కళ్యాణదుర్గం మండలంలో నూతన పంచాయతీగా ఆవిర్భవించిన పీటీఆర్ పల్లి తండాకు సర్పంచ్ అభ్యర్థిగా సుగాలి సీతమ్మతో స్థానికులు బుధవారం నామినేషన్ వేయించారు. ఈ విషయంలో ఆమెను అన్ని విధాలుగా భర్త శంకర్నాయక్ ప్రోత్సహించారు. మొట్టమొదటి సారి పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని పెద్దావిడకు కట్టబెట్టేందుకు ఏకగ్రీవం చేయాలని తండావాసులు భావిస్తున్నారు. (చదవండి: పురోహితులకు డిమాండ్) -
ఎమీ హాకిన్స్.. మరో గంగవ్వ
టాలెంటును ప్రదర్శించడానికి వయసు అడ్డురాదని చెబుతున్నారు 110 ఏళ్ల ఎమీ హాకిన్స్. ఒకే ఒక్కపాటతో ఈ బామ్మగారు ఓవర్ నైట్ స్టార్గా ఎదిగారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో బాగా పాపులర్ అయిన ‘‘ఇట్స్ ఏ లాంగ్ వే టు టిప్పరరే’’ అనే పాటను ఎమీ పాడింది. దానిని ఆమె మనవరాలు సోషల్ మీడియా ప్లాట్ఫాం టిక్టాక్లో అప్లోడ్ చేయడంతో ఎమీ హాకిన్స్ పేరు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అంతేగాకుండా ఈ వీడియో సాంగ్ను లక్షమందికి పైగా చూశారు. వేల్స్నగరానికి చెందిన ఎమీ ఒకప్పుడు డ్యాన్స్ ట్రూప్లో నర్తకిగా పనిచేసేవారు. అయితే ఇన్నేళ్లలో రాని గుర్తింపు తాజాగా ఆమె పాడిన ఒక పాటకు వచ్చింది. గత వారంలో ఆమె 110 వ ఏటలోకి అడుగుపెట్టగా, ఆ సెలెబ్రేషన్స్లో భాగంగా ఎమీ లాంగ్ వేటు పాట పాడింది. దాన్ని టిక్టాక్లో షేర్ చేయగా అత్యధిక వ్యూస్తో దూసుకుపోతోంది. వరల్డ్వార్–1 ముగిసే సమయానికి ఎమీకి ఏడేళ్లు. 1911 కార్డిఫ్లో ఎమీ జన్మించినప్పటికీ తన చిన్నతనం మొత్తం న్యూపోర్ట్లో గడిపారు. ఎమీకి ఐదుగురు సోదరులతోపాటు ఒక సోదరి కూడా ఉన్నారు. ఆమె తన 14వ ఏట డ్యాన్సర్గా గుర్తింపు తెచ్చుకోగా, ఒక నృత్య బృందంతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. (చదవండి: విషాదాన్ని మిగిల్చిన కొరియన్ దేవకన్య) 1937లో సైన్ రైటర్ జార్జ్ హాకిన్స్ను వివాహం చేసుకుని చాలా కాలం పాటు న్యూపోర్ట్లో నివసించారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఎమీ హాకిన్స్ ఫైర్ వాచర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె దక్షిణ వేల్స్లోని మోన్మౌత్షైర్లోని తన నివాసంలో నాలుగు తరాల వారసులతో కలిసి జీవిస్తున్నారు. బామ్మ పాటను టిక్టాక్లో షేర్ చేయాలన్న నిర్ణయం ఇంతటి సంతోషాన్ని ఇస్తుందనుకోలేదు. బామ్మకు సోషల్ మీడియా అంటే ఏంటో పెద్దగా తెలీదు. కానీ ఆమె ఒకపాటతో సింగింగ్ సెన్సేషన్గా నిలవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఆమెకు దక్కిన సూపర్ బర్త్డే గిఫ్ట్గా భావిస్తున్నామని మనవరాలు ఫ్రీమన్ చెప్పుకొచ్చింది’’. -
విషాదం: అగ్నికి ఆహుతి, మాంసపు ముద్దగా..
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుడిసెకు నిప్పంటుకుని ఓ వృద్ధురాలు సజీవ దహనమైంది. ఈ సంఘటన ఇంద్రవెల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఇంద్రవెల్లి మండలం హిరాపూర్ గోపాలపూర్ శివారులో ఓ వృద్ధురాలు గుడిసెలో నివాసం ఉంటోంది. శుక్రవారం గుడిసెలో ఉన్న పత్తికి నిప్పంటుకోవటంతో.. ఆ అగ్ని కీలలు గుడిసెకు ఎగబాకాయి. దీంతో గుడిసె మొత్తం పెద్ద మంటతో తగలబడిపోయింది. వృద్ధురాలు అగ్నికి ఆహూతైంది. మాంసపు ముద్దగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వంట చేస్తున్న సమయంలో సంభవించిన అగ్ని ప్రమాదమే వృద్ధురాలిని బలితీసుకుందని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ( జక్రాన్ పల్లి ఎంపీడీఓ భారతి ఆత్మహత్యాయత్నం) -
వైద్యమందక ఎవరూ మరణించకూడదు
సాక్షి, హైదరాబాద్: పాము కాటు, ఇతర అత్యవసర వైద్యసేవలు అవసరమైన సందర్భాల్లో దురదృష్టకర మరణాలను నివారించడా నికి గ్రామీణ ప్రాథమిక వైద్య కేంద్రా (పీహెచ్సీ)ల్లో అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు, యాంటీవినం ఇంజెక్షన్లు, మెడికల్ కిట్లతోపాటు శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారులను ఆదేశించా రు. ‘పేదలు, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజల కు గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సదుపాయాలను నిరాకరించకూడదు. అవసరమైనప్పుడు అత్యవసర వైద్యం పొందడానికి ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం అడ్డు రాకూడదు’ అని ఆమె పేర్కొన్నారు. ఓ నిరుపేద దళిత వృద్ధురాలి దుస్థితిని తెలు సుకుని చలించిన గవర్నర్ .. ఆమెను బుధవారం రాజ్భవన్కు ఆహ్వానించి మధ్యా హ్న భోజనంతో ఆతిథ్యం ఇ చ్చారు. రెండు, మూడు నెలలకు సరిపడా నిత్యావసర వ స్తువులు, రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. నిలువ నీడలేక... జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామా నికి చెందిన బండిపెల్లి రాజమ్మ(75) నిలువ నీడలేక వీధుల్లో చెట్ల కింద నివాసముంటోంది. దివ్యాంగ కొడుకు ఆమెపై ఆధారపడి ఉన్నాడు. సకాలంలో సరైన వైద్య సదుపాయం లభించక అనారోగ్యంతో ఆమె కోడలు, పాము కాటుకు గురై మనవరాలు మృతి చెందారు. మనవరాలికి సకాలంలో పాముకాటుకు విరుగుడుగా ఇవ్వాల్సిన యాంటీవీనం ఇంజెక్షన్ను చేయకపోవడంతో ఆమె మరణించింది. అనారోగ్యానికి గురైన రాజమ్మ అల్లుడు కూడా సరైన వైద్యం అందక మరణించాడు. ఈ విషయాలు తెలుసుకుని గవర్నర్ తీవ్రంగా చలించారు. నిరుపేద వృద్ధ మహిళ, ఆమెపై ఆధారపడిన వికలాంగ కొడుకు బాగోగులను చూడాలని జనగామ జిల్లా అధికారులతోపాటు స్థానిక ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులను గవర్నర్ ఆదేశించారు. గవర్నర్ చొరవతో రాజ్భవన్లో భోజనం చేస్తున్నానని రాజమ్మ ఆనందంతో కంటనీరుపెట్టింది. రాజమ్మ కోసం ఇంటిని నిర్మించడానికి రూ.1.60 లక్షల విరాళాలను సేకరించడంతోపాటు తన వ్యక్తిగత సహాయంగా రూ.80 వేలు అందించిన పాలకుర్తి ఎస్ఐ గండ్రతి సతీశ్ చొరవను గవర్నర్ కొనియాడారు. రాజమ్మకు అండగా నిలిచిన ఆ గ్రామ మాజీ సర్పంచ్ మణెమ్మను గవర్నర్ సత్కరించారు. డాక్టర్ బి.కృష్ణ, స్వచ్ఛంద కార్యకర్త మహేందర్ల కృషిని గవర్నర్ ప్రశంసించారు. వీరిద్దరూ వృద్ధ మహిళకు తోడుగా రాజ్ భవన్కు వచ్చారు. వృద్ధురాలికి ఆర్థిక సాయం అందించిన ఎస్ఐకి ఆ మొత్తాన్ని గవర్నర్ తమిళిసై తిరిగి ఇచ్చేయడం విశేషం. -
పదేళ్లుగా మంచినీళ్లు ముట్టని ముసలవ్వ
సాక్షి, తరిగొప్పుల(వరంగల్) : ఈ ఫొటోలో ఉన్న అవ్వను చూశారా.. ఓ విలక్షణ లక్షణం ఆమె సొంతం. అదేంటో తెలిస్తే.. ఎవరైనా, ఔరా.. అనక మానరు! దాహమంటే.. ఏమిటో ఆమెకు తెలియదు. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా పదేళ్లపాటు ఆమె చుక్కనీరు ముట్టితే ఒట్టు! బుక్కెడు బువ్వ తినకుండా ఉపాసం ఉండొచ్చుకానీ.. గుక్కెడు మంచి నీళ్లు తాగకుండా ఉండలేం. అలాంటిది పదేళ్లుగా చుక్క నీరు తాగకుండా ఉంటోంది జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన పింగిళి ప్రమీల (70). ఆకలేసినప్పుడు అన్నం తిన్నా మంచినీళ్లు మాత్రం తాగదు. అన్నం తిన్నప్పుడు ఛాతీ భాగంలో తట్టుకున్నట్టు అనిపిస్తే.. నాలుకపై కొంచెం కారం వేసుకుంటే సరిపోతుందని ఈమె చెబుతోంది. పదేళ్ల క్రితం వరకు మంచినీళ్లు తాగిన ప్రమీలకు ఒక్కసారిగా తాగునీటిపై అనాసక్తి ఏర్పడటంతో మానేసినట్లు చెబుతోంది. చదవండి: చికెన్.. చికెన్.. మటన్.. చికెన్ చదవండి: కరోనా సోకితే 8 నెలలు సేఫ్? -
అయ్యో పాపం: పింఛన్ కోసం వెళ్లి..
ధన్వాడ (నారాయణపేట): పింఛన్ తీసుకునేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు క్యూ లైనులో కుప్పకూలి మృతి చెందింది. ఈ సంఘటన నారాయణ పేట జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ధన్వాడ మండల కేంద్రానికి చెందిన మిద్దెలి నర్స మ్మ (80) కొంత కాలంగా హైదరాబాద్ లో తన కొడుకు వద్ద ఉంటుంది. మంగళవారం పింఛన్ తీసుకునేందుకు స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో క్యూలైన్లో నిల్చున్న ఆమె అకస్మాతుగా కళ్లు తిరిగి కిందపడి పోయింది. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్లో నారాయణపేట ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే పింఛన్ తీసుకోవడానికి చివరిరోజు అని చెప్పడంతో చాలామంది పింఛన్దారులు తరలివచ్చారు. పోస్టాఫీసుకు పింఛన్ డబ్బులు ఆలస్యంగా రావడం, త్వరగా ముగించడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వృద్ధులు అనేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బిడ్డ కోసం యాచకురాలిగా..
కేవీబీపురం: తల్లి ఒంటరిదైపోతుందన్న ఆలోచనతో కొడుకు పెళ్లి చేసుకోకుండా తల్లి సేవలోనే జీవించాడు. అయితే విధి చిన్నచూపు చూడడంతో కిడ్నీ దెబ్బతిని అతడు మంచం పట్టాడు. బిడ్డ అనారోగ్యానికి గురై.. కదలలేని స్థితికి చేరడంతో 90 ఏళ్ల వయస్సులో ఆ తల్లి యాచకురాలిగా మారింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అంజూరు పంచాయతీ జయలక్ష్మీపురం గ్రామానికి చెందిన రామలింగయ్య(54) తాపీ మే్రస్తిగా జీవించేవాడు. ఇతని తండ్రి సుబ్రమణ్యం చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి కుప్పమ్మ (90) కూలీ పనులు చేసి తన ఇద్దరు బిడ్డలను సాకింది. ఈ క్రమంలో పెద్ద కుమారుడు క్రిష్ణయ్య వివాహం తరువాత వేరు కాపురంతో దూరమయ్యాడు. అప్పటి నుంచి చిన్నకుమారుడు రామలింగయ్య పెళ్లి చేసుకోకుండా తల్లిని కంటికిరెప్పలా కాపాడేవాడు. అయితే నాలుగేళ్ల క్రితం కిడ్నీలు దెబ్బతినడంతో మంచానికే పరిమితమై కదల్లేని స్థితికి చేరాడు. దీంతో బిడ్డను కాపాడుకునేందుకు ఆ వృద్ధురాలు పడరాని పాట్లు పడుతోంది. తనకు వచ్చే పింఛన్ సొమ్ము రూ.3 వేలతో బిడ్డకు చిన్నపాటి వైద్యసేవలందిస్తూ.. రక్షించుకునేందుకు తాపత్రయపడుతోంది. తనకున్న రెండెకరాలను అమ్మి.. కుమారుడి స్నేహితుల సహాయంతో చైన్నైలో వైద్యం అందించానని.. అయితే పరిస్థితిలో మార్పురాలేదని ఆ వృద్ధురాలు వాపోయింది. ఆపరేషన్కు రూ.8 లక్షలు ఖర్చువుతుందని వైద్యులు సూచించినట్లు తెలిపింది. అయినా కోలుకుంటాడనే గ్యారంటీ లేదని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో యాచకురాలిగా మారినట్లు వాపోయింది. అధికారులు, దాతలు స్పందించి తమకు భోజన సదుపాయం, మందులైనా అందిస్తే.. బతికినంతకాలం రుణపడి ఉంటానని కన్నీటి పర్యంతమవుతోంది. -
‘ఎవరూ లేని నాకు ఇదే జీవనోపాధి.. కానీ!’
సాక్షి, న్యూఢిల్లీ: తమ వ్యాపారం సాగడం లేదంటూ కన్నీరు పెట్టుకున్న ‘బాబా క దాబా’ వృద్ధ దంపతుల వీడియో ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతేగాక వారిని ఆదుకోవాలని విజ్ఞప్తులు రావడంతో ప్రజలంతా వారి స్టాల్కు క్యూ కట్టడం మొదలు పెట్టారు. దీంతో రాత్రికి రాత్రే వారి కన్నీటి గాథ సుఖాంతం అయ్యింది. ఈ క్రమంలో మంగళవారం మరో 80 ఏళ్ల వృద్దురాలి హృదయ విదారక వీడియో వెలుగులోకి వచ్చింది. రోటివాలి అమ్మగా పేరొందిన ఈ వృద్దురాలు ఆగ్రాలో 15 ఏళ్లుగా రోడ్డ పక్కనే రోటి, మీల్స్ తాలిని విక్రయిస్తు జీవిస్తోంది. కరోనా నేపథ్యంలో రోడు సైడ్ ఫుడ్ను ప్రజలు తినడానికి జంకుతుండటంతో ఆమె వ్యాపారం సాగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వృద్దురాలికి ఆర్థిక సాయం అందించాలంటూ విజ్క్షప్తులు వస్తున్నాయి. (చదవండి: సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో) ఆగ్రాలో రోటివాలి అమ్మగా ప్రసిద్ది చెందిన ఈ వృద్దురాలి పేరు భగవాన్ దేవి. తన భర్త మరణించడంతో ఇద్దరు కుమారులు ఆమెను ఒంటరిగా వదిలేశారు. దీంతో వృద్దురాలు ఆగ్రాలో సెయింట్ జాన్స్ కాలేజీ సమీపంలో రోడ్డు పక్కనే రోటీలు చేసి అమ్ముకుంటుంటోంది. రోడ్ సైడ్ స్టాల్ కావడంతో కరోనా నేపథ్యంలో ఆమె దగ్గర టిఫిన్ తినడానికి ఎవరూ ముందుకురావడం లేదు. దీనికి తోడు తన టిఫిన్ సెంటర్ తీసేయాల్సిందిగా అధికారులు చెప్పడంతో ఆమె వ్యాపారం, జీవనం ప్రశ్నార్థకంగా మారింది. ‘నాకు ఇద్దరూ కుమారులు. ఎవరూ నాకు సహాయం చేయరు. వారే నాతో ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒంటరిగా బతుకుతున్న నాకు ఈ టిఫిన్ సెంటరే జీవనోపాధి. ఇది కూడా ఇక్కడి నుంచి తీసేయమంటున్నారు. ఈ టిఫిన్ సెంటర్ తీసేసి ఎక్కడికి వేళ్లనేను’ అంటూ ఏఎన్ఐతో గోడు చెప్పుకుంది. (చదవండి: మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాం) Agra: One octogenarian woman in Agra, Bhagvan Devi, popular as ‘roti wali amma’ is selling food at Rs. 20 near St. John College to earn livelihood; She says, “I have been doing this for over 15 years. But, there’s hardly any sale these days.” pic.twitter.com/WIJEWW5Hoo — ANI UP (@ANINewsUP) October 18, 2020 తనకంటూ శాశ్వత స్థలం ఉండాలని అర్ధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మానవతావాదులు స్పందిస్తున్నారు. ఆమెకు మద్దతు తెలుపుతూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ‘అమ్మకు సొంతంగా స్టాల్ ఏర్పాటు చేసేందుకు విరాళం ఇవ్వాలనుకుంటున్నాం. ఆమె బ్యాంక్ ఖాతా వివరాలను తెలపండి’, ‘ఒక సాయం అందించే ఇచ్చే చేయి పేదవారి జీవితాలలో మార్పు తెస్తుంది. మహమ్మారి వల్ల ఎంతో మంది నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 రూపాయలతో ఇతరుల ఆకలిని తీర్చిన రోటివాలి అమ్మకు తన కడుపు నింపుకోవడం కష్టమమైపోయింది’ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. -
నువ్వు నిజంగా సూపర్ బామ్మ!
ముంబై: ఏదైనా సాధించాలనే కోరిక ఉండాలే కానీ వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ 70 ఏళ్ల బామ్మ వీడియోను చూస్తే మీరు కూడా తప్పకుండా అది నిజమేనేమో అని అంటారు. ఈ వీడియోలో ఒక మహిళ నాసిక్లో ఏటవాలుగా ఉండే హరిహర్ కోటను 70 ఏళ్ల వయసులో ఎక్కి చూపించింది. ఈ వీడియోని చూసిన వారందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఈ వయసులో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారంటూ కీర్తిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా నిలుస్తోంది. హరిహర్ కోట నాసిక్ లోని ఇగత్పురి నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది రాక్ కట్ మెట్లకు ప్రసిద్ది చెందింది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుధా రామన్ దీనిపై ట్వీట్ చేస్తూ ధృడసంకల్పం ఉండటం వలనే ఆమె ఈ వయసులో కూడా అనుకున్నది సాధించగలిగింది అని చెప్పారు. At the age of 70 yrs, with her sheer determination she made it. Salutes to that willpower. #Inspired pic.twitter.com/fKkk8e7nw8 — Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) October 10, 2020 చదవండి: బెడిసికొట్టిన రసగుల్లా బిర్యానీ; నెటిజన్ల ఫైర్ -
బిడ్డా.. నా కోసం వచ్చావా!
ప్రత్తిపాడు: ఏది ఏమైనా తల్లి ప్రేమకు మించిన అమృతం లేదు. పేగు తెంచుకుని పుట్టిన వారెన్ని కష్టాలు పెట్టినా తల్లికి వారిపై ఉండే ప్రేమానురాగం తరిగిపోదు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం ఈ చిత్రం. నరసరావుపేటకు చెందిన మల్లమ్మ అనే వృద్ధురాలిని కుమారుడే నిర్ధాక్షిణ్యంగా అర్ధరాత్రి తీసుకువచ్చి ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులోని బస్షెల్టర్లో వదిలేసి వెళ్లిపోయాడంటూ గురువారం ‘సాక్షి’లో ‘అమ్మా’నుషం శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనం అన్ని శాఖల అధికారులను కదిలించింది. తహసీల్దార్ ఎం.పూర్ణచంద్రరావు, ఎంపీడీవో టీవీ విజయలక్ష్మిల ఆదేశాల మేరకు సీడీపీవో వి.సుజాతదేవి గొట్టిపాడు సెక్టార్ ఇన్చార్జి సూపర్వైజర్ వై.రాజ్యలక్ష్మిని ఘటనా స్థలానికి పంపారు. మల్లమ్మ పరిస్థితిని పరిశీలించగా ఆమె బాగా నీరసంగా ఉండటంతో పాటు అనారోగ్యంగా ఉండటం గమనించి పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రత్నశ్రీకి సమాచారం అందించారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలను వృద్ధురాలి వద్దకు పంపి వైద్య పరీక్షలు నిర్వహించారు. మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కొడుకును పిలిపించిన పోలీసులు.. పేగు బంధాలను ప్రశ్నించేలా ఉన్న ఈ అమానవీయ ఘటనపై ప్రత్తిపాడు ఎస్ఐ డి.అశోక్ స్పందించారు. ఉదయాన్నే కానిస్టేబుల్ను నరసరావుపేటకు పంపి వాకబు చేయించారు. చివరికి చిరునామా తెలుసుకుని కొడుకు నాగిరెడ్డిని ప్రత్తిపాడు స్టేషన్కు పిలిపించి విచారించారు. తల్లిదండ్రులపై ఇలా వ్యవహరించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలిని ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో కొడుకుకు అప్పగించారు. ఆస్పత్రిలో కొడుకును చూసిన ఆ తల్లి కన్నీటి పర్యంతమయ్యింది. వచ్చావా బిడ్డా.. నా కోసం వచ్చావా.. మా నాయనే.. అంటూ కొడుకు గెడ్డం పట్టుకుని బోరున విలపించింది. ఈ దృశ్యాన్ని చూసిన వారి కళ్లు చెమర్చాయి. -
అనుబంధం, ఆత్మీయత.. అంతా ఒక బూటకం
సాక్షి, ఒడిశా: కుష్ఠు వ్యాధి ఒకప్పుడు భయంకరమైనది. అయితే కుష్ఠు వ్యాధికి మందులు వచ్చిన తరువాత అది ప్రమాదకరమైన వ్యాధి కాదని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు, ప్రభుత్వం చెబుతూనే ఉన్నా నేటికీ అనేక మంది కుష్ఠు వ్యాధి గ్రస్తులను అంటరాని వారిగానే పరిగణిస్తున్నారు. వారిని చూస్తే అసహ్యించుకుంటున్నారు. ఆఖరికి రక్త సంబంధీకులే వారిని దూరంగా నెడుతున్నారు. అలా కుటుంబ సభ్యులు వెళ్లగొట్టిన ఒక వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో ఒక కాలువ పక్కన సిమెంట్ పైపు గొట్టంలో తల దాచుకుంటూ దుర్భర జీవితం గడుపుతోంది. నవరంగపూర్ జిల్లా నందాహండి సమితి విమాలిగుడ గ్రామంలో ఈ పరిస్థితి కనిపించింది. గ్రామానికి చెందిన కమల బిశాయి(55)కి కుష్ఠు వ్యాధి ఉందని వైద్యులు వెల్లడించారు. మందులు వాడితే నయమవుతుందని తెలిపారు. అయితే కుష్ఠు వ్యాధి అంటే మహమ్మారి అని అది తమకు కూడా సోకవచ్చన్న భయంతో ఆమె ఇంటివారు మానవత్వాన్ని మరిచి ఇంటినుంచి వెళ్లగొట్టారు. ఏడాది కిందట ఆమె భర్త మరణించాడు. అందుచేత ఆమె తన కొడుకు, కోడలు వద్ద ఉంటోంది. ఆమె కాలివేలికి కురుపై కాలక్రమేణా పెద్దది కావడంతో హాస్పిటల్కు వెళ్లగా ఆమెకు కుష్ఠు వ్యాధి సోకిందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో ఆమె బందువులు, గ్రామస్తులు అంటరాని దానిగా చూడడం మొదలుపెట్టారు. ఆఖరికి కన్న కుమారుడు, కోడలు కూడా ఆమెను అంటరానిదిగా చూసి ఇంటి నుంచి బయటకు పంపివేశారు. గ్రామంలో నిన్నటి వరకు ఎంతో ఆదరంగా చూసిన ప్రజలు, చుట్టుపక్కల వారు, బంధువులు, మిత్రులు, ఆఖరికి కన్నకొడుకు, కోడలు తనను చీదరించుకుంటూ దరి చేరనీయక పోవడంతో ఆ వృద్ధురాలు ఖిన్నురాలైంది. ఆఖరికి ఆమెకు తిండి కూడా పెట్టేవారు లేక పోయారు. నిలువ నీడ లేని కమల బిశాయి సమీప కాలువ వద్ద గల పాడైన ఒక సిమ్మెంట్ పైపులో తల దాచుకుంటోంది. (ఒంటిపై చీరలు తీసి ప్రాణాలు కాపాడారు) రేషన్ బియ్యమే ఆధారం ఎండావానలకు ఆమె ఆపైపునే ఇంటిగా భావిస్తూ అందరికీ దూరంగా ఒంటరిగా ఉంటోంది. తనకు ఉన్న రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం ఇచ్చే బియ్యమే జీవనాధారం. ఆమె పగలు తిరుగుతూ సాయంత్రం పైపు వద్దకు చేరుకుంటూ పైపులో తల దాచుకుంటోంది. ఈ విషయం పంచాయతీ అధికారులకు తెలిసినా వారిలో మానవత్వం నిద్ర లేవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కుష్ఠు వ్యాధి నేడు అంటరాని వ్యాధి కాదని అధికారులు ప్రకటనలు చేస్తున్నా అటువంటి వారికి ఉచిత మందులు ఇచ్చి సేవలు చేస్తున్న లెప్రా ఇండియా లాంటి సంస్థలు ఉన్నా కమల బిశాయి లాంటి అభాగ్యులను నేటికీ సమాజానికి దూరంగా నెట్టేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆమెకు తగిన రక్షణ కల్పించి వైద్యం తో పాటు పునరావాసం కల్పించాలని విజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు. -
కొడుకూ కోడలే తరిమేశారయ్యా!
తిరుపతి క్రైం : జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రులకు ఏ లోటూ రాకుండా చూసుకోవడం బిడ్డల బాధ్యత. అయితే దీనిని గాలికొదిలేస్తున్న వారి సంఖ్య కొన్నేళ్ల కాలంలో పెరిగిపోతోంది. అసలే కరోనా ప్రజలను భయపెడుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఓ వృద్ధురాలిని నిర్దయగా వదిలించుకున్నారు. వివరాలు.. 40 రోజులుగా రుయా ఆస్పత్రిలో ఆవరణలో∙ఉంటున్న ఓ వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతోందని అర్బన్ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్రెడ్డి దృష్టికి వచ్చింది. ఆయన ఆదేశాలతో అలిపిరి సీఐ సుబ్బారెడ్డి మంగళవారం అక్కడికి చేరుకున్నారు. వృద్ధురాలి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన పేరు కాంతమ్మ అని, కొడుకులు, కోడళ్లు తరిమేయడంతో అనాథగా అయ్యానని కన్నీటిపర్యంతమైంది. దీంతో సీఐ ‘అమ్మ ఒడి’ వ్యవస్థాపకులు పద్మనాభనాయుడుతో మాట్లాడారు. వృద్ధురానికి ఆశ్రమానికి తరలించారు. అనంతరం ఆమె గురించి ‘సాక్షి’ పద్మనాభనాయుడితో ఫోన్లో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె తన పేరు మాత్రమే చెబుతోందని, కొడుకులు ఇద్దరు..కాదు..ఒకడే అని, తనది వల్లివేడు (పాకాల మండలం), రేణిగుంట, పుత్తూరు అని పొంతన లేకుండా చెబు తోందని ఆశ్రమ నిర్వాహకుడు చెప్పారు. కాలి బొటనవేలికి పెద్ద పుండు అయ్యిందని, ప్రస్తుతం ఆమెకు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని, ఆమె పూర్తిగా కోలుకున్నాక ఆమె కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుంటామని తెలిపారు. -
80 ఏళ్ల వృద్ధురాలిపై దాష్టీకం
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. నిలువ నీడలేని ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో ప్రాంగణంలో తలదాచుకుంది. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డ్ ఆ వృద్ధురాలిని విచక్షణారహితంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. దాంతో ఆస్పత్రి యాజమాన్యం.. సదరు సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించడమే కాక అతడి మీద కేసు నమోదు చేసింది. వివరాలు.. 80 ఏళ్ల వృద్ధురాలు ప్రయాగ్రాజ్లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆస్పత్రి ట్రామా సెంటర్ వెలుపల పడుకుని ఉంది. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డు సంజయ్ మిశ్రా ఆమెపై దెబ్బల వర్షం కురిపించాడు. సదరు గార్డు ఏ మాత్రం కనికరం లేకుండా వృద్ధురాలిని కొట్టడమే కాక కాలితో తన్నాడు. పాపం ఆ ముసలవ్వ నొప్పికి తాళలేక సాయం కోసం కేకలు వేసింది. ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి చోద్యం చూస్తున్నారు తప్ప గార్డును అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. (కానిస్టేబుల్ సమయస్ఫూర్తిపై ప్రశంసలు) ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాంతో ఆస్పత్రి యాజమాన్యం వృద్ధురాలిని అదే ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం అందిస్తున్నారు. అంతేకాక సదరు గార్డ్ సంజయ్ మిశ్రాను విధుల నుంచి తొలగించడమే కాక అతడి మీద కేసు నమోదు చేశారు. సదరు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని ఆస్పత్రి యాజమాన్యం బ్లాక్లిస్ట్లో చేర్చింది. ఈ ఘటనపై లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగడం శోచనీయం అన్నారు. అతడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
కరోనాను జయించిన 105 ఏళ్ల బామ్మ..
కరోనా పేరు చెబితే కుర్రాళ్లు సైతం వణికిపోయే పరిస్థితి. కానీ 105 ఏళ్ల వయస్సులోనూ ఓ బామ్మ..మహమ్మారిని విజయవంతంగా తిప్పికొట్టారు. వైద్యులు, నర్సుల సహకారంతో త్వరగానే కోలుకుని పెద్దాసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మనో నిబ్బరంతో ఉంటే కరోనా ఏమీ చేయదని చాటి చెప్పి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు పాతబస్తీలోని పెద్దపడఖానావీధికి చెందిన బి.మోహనమ్మ వయస్సు 105 ఏళ్లు. ఆమె భర్త మాధవస్వామి 1991లోనే మరణించారు. అప్పట్లో ఆయన బంగారు నగలు తయారు చేసే పనిలో ఉండేవారు. వీరికి ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. కుమారుల్లో ఒకరు ఇటీవలే మరణించారు. మరొకరు ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసి రిటైరయ్యారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్న మూడో కుమారుడు జయదాస్ నాయుడు వద్ద మోహనమ్మ ఉంటున్నారు. ఐదుగురు ఆడపిల్లల్లో పెద్ద కుమార్తెకు 82 ఏళ్లు, రెండో కుమార్తెకు 80 ఏళ్లు, మూడో కుమార్తెకు 70 ఏళ్ల వయస్సు. మిగిలిన ఇద్దరూ మరణించారు. ఇంత వయస్సులోనూ మోహనమ్మ తన పనులు తానే చేసుకుంటున్నారు. ప్రతిరోజూ యోగా, ధ్యానం, వాకింగ్ చేస్తారు. మితాహారం తీసుకుంటారు. ఇప్పటికీ కుమార్తెల ఊళ్లకు ఒక్కరే వెళ్లి వస్తుంటారు. ఆమె జీవితంలో ఎనిమిది మంది సంతానంతో పాటు 26 మంది మనవళ్లు, మనవరాళ్లు, 18 మంది మునిమనవలను కూడా చూశారు. కరోనా ఏమీ చేయలేకపోయింది! కర్నూలు నగరంలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో వలంటీర్లు ఇంటింటికీ తిరిగి 60 ఏళ్లు దాటిన వారందరికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా మోహనమ్మకు కూడా పరీక్షలు చేయించగా.. కరోనా పాజిటివ్గా గత నెల 19న నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. ఆసుపత్రిలోని ఎంఎం–4 వార్డులో ఉంచి చికిత్స చేశారు. ఆమెను వైద్యులతో పాటు నర్సులు, ఇతర సిబ్బంది ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. కరోనా నిర్ధారణ అయిన సమయంలోనూ ఆమెకు స్వల్ప జ్వరం మినహా ఇతరత్రా లక్షణాలు లేవు. ఆసుపత్రిలో చేరిన తర్వాత కొద్దిగా ఆయాసం రావడంతో ఆక్సిజన్ ఏర్పాటు చేశారు. అంతకు మించి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ ఎదుర్కోకుండానే కోలుకున్నారు. ఆసుపత్రిలో ఆమెకు తోడుగా కుమారుడు జయదాస్ నాయుడు ఉన్నారు. మోహనమ్మను గత నెల 31న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆరోగ్యకర అలవాట్ల వల్లే జయించా గతంలో నేనెప్పుడూ ఇలాంటి రోగాన్ని చూడలేదు. అప్పుడెప్పుడో ఒకసారి ప్లేగు వ్యాధి వచ్చిందని బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. నాకు బీపీ, షుగర్ ఉన్నా నియంత్రణలో ఉంటాయి. ఆరోగ్యకర అలవాట్ల వల్లే నేను కరోనాను జయించగలిగా. ఇప్పటికీ యోగా, ధ్యానం చేస్తుంటా. అవే నా ఆరోగ్య రహస్యాలు. – మోహనమ్మ -
ఆ అవ్వ చనిపోయింది..
పలమనేరు: కన్నవాళ్లు పట్టించుకోకుండా అవ్వను వదిలించుకున్నారు. అలా అడవికి చేరి అనాథలా పడి ఉన్న అవ్వ కథనం ‘సాక్షి’లో ప్రచురితమైంది. స్పందించిన తహసీల్దార్ ఆమెను చిత్తూరులోని అమ్మఒడి అనాథాశ్రమానికి చేర్చారు. అక్కడ అనారోగ్యంతో అవ్వ శనివారం మృతి చెందింది. పలమనేరు సమీపంలోని పెంగరగుంట అడవిలో 90ఏళ్ళ వృద్ధురాలు పడి ఉండగా స్థానికులు గుర్తించారు. దీనిపై గతనెల 12న ‘అడవిలో వదిలేశారు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన గ్రామ సచివాలయ సిబ్బంది ఆ వృద్ధురాలికి భోజనం పెట్టించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ శ్రీనివాసులు ఆమెను పలమనేరు ఏరియా ఆస్పత్రిలో చేర్పించి వైద్య సేవలు అందేలా చేశారు. ఆపై కొంత కోలుకున్నాక గత నెల 16న చిత్తూరులోని అమ్మఒడిలో చేర్పించి, నిర్వాహకులకు రూ.10వేల ఆర్థికసాయాన్ని అందించారు. అక్కడ సేదతీరుతున్న వృద్ధురాలు శనివారం మృతి చెందింది. విషయం తెలిసిన వెంటనే తహసీల్దార్ శ్రీనివాసులు అక్కడికి చేరుకున్నారు. అమ్మఒడి నిర్వాహకులతో కలసి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఆమె పాడెను సైతం తహసీల్దార్ శ్రీనివాసులు, అమ్మఒడి నిర్వాహకుడు పద్మనాభనాయుడు మోసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తహసీల్దార్ను జనం మెచ్చుకుంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో సొంతవాళ్లు చనిపోతేనే ముట్టుకోని ఈసమయంలో తహసీల్దార్ చూపిన చొరవను ప్రశంసిస్తున్నారు. -
కూటి కోసం
-
ఎల్లమ్మ.. బంగారం
నెల్లూరు(మినీబైపాస్): ఆమె వయసు 65 సంవత్సరాలు.. భర్త మృతిచెందాడు. సంతానం పట్టించుకోలేదు. ఎవరైనా సాయం చేస్తారా అని ఎదురు చూడలేదు. తన కాళ్లపై తాను నిలబడింది. రోళ్లు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతోంది. ♦ ఎల్లమ్మ సొంత ఊరు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. ♦ భర్త చనిపోవడం.. సంతానం అండగా లేకపోవడంతో 20 సంవత్సరాల క్రితం ఆమె నెల్లూరుకు వలస వచ్చింది. తన కాళ్లపై తాను నిలబడాలని నిర్ణయించుకుంది. ♦ నగరంలోని ప్రభుత్వాస్పత్రి సమీపంలో చిన్న గుడిసె వేసుకుని ఉంటోంది. వర్షం కురిస్తే అక్కడ తంటాలు పడుతూ ఉండాలి. ♦ రోళ్లు తయారుచేసి జీవనం పొందుతోంది. ♦ అనంతపురం నుంచి రాళ్లను తెప్పించుకుంటుంది. ♦ రోజుకు మూడు రోళ్లు తయారు చేస్తుంది. ♦ ఒక్కోటి సైజ్ని బట్టి రూ.150 నుంచి రూ.200కు విక్రయిస్తుంది. వచ్చిన డబ్బుతో జీవితాన్ని నెట్టుకొస్తోంది. కొంత తగ్గింది అండగా నిలవాల్సిన సంతానం ఎక్కడున్నారో తెలియదు. నాకు తెలిసింది ఇదే పని. 20 సంవత్సరాలుగా చేస్తున్నా. మిక్సీలు, గ్రైండర్లు రావడంతో రోళ్ల వినియోగం కొంత తగ్గింది. అయినా నా కాళ్లపై నేను నిలబడుతున్నా. సంపాదన తక్కువే అయినా ఎవరిపైనా ఆధారపడకుండా జీవిస్తున్నా. – ఎల్లమ్మ -
43 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని చేరిన వృద్ధురాలు
ముంబ : అనుకోని సంఘటనలతో ఏళ్ల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా వెళ్లిపోయిన వారు తిరిగి సోషల్ మీడియా ద్వారా మళ్లీ ఒకటవుతున్నారు. సోషల్ మీడియాతో అనార్థాలే కాదు.. మంచి సంఘటనలు సైతం జరుగుతాయని మరోసారి రుజువైంది. తాజాగా దాదాపు 43 ఏళ్ల తర్వాత పంచుబాయ్(90) అనే వృద్ధురాలు గూగుల్, వాట్సప్ సహయంతో తన కుటుంబాన్ని చేరుకుంది. మహారాష్ట్రలోని తాల గ్రామంలో నివసిస్తున్న నూర్ ఖాన్ కుటుంబానికి చెందిన పంచబాయ్ (అచ్చన్) గుగూల్, వాట్సప్ ద్వారా కనుగొన్నామని నూర్ ఖాన్ కుమారుడు ఇశ్రార్ ఖాన్ తెలిపాడు. గత నెలలో పంచబాయ్ మహారాష్ట్రకు చెందిన వారని తెలిసిందని చెప్పాడు. దీంతో వివరాలు కనుక్కొని అచ్చన్ మనవడు పృథ్వీ కుమార్ షిండేకు శనివారం అప్పజెప్పిన్నట్లు ఖాన్ చెప్పాడు. (డేంజర్ బెల్స్: ఒక్క రోజులో దాదాపు 55వేల కేసులు) ‘అచ్చన్(పంచుబాయ్) ఇలా మా ఇంటికి వచ్చింది’ అమరావతి జిల్లా బుందేల్ఖండ్ వద్ద మా తండ్రి నూర్ ఖాన్ 43 సంవత్సరాల క్రితం చుశాడని ఇశ్రాన్ ఖాన్ చెప్పాడు. అప్పుడు తను తేనెటీగల దాడిలో గాయపడి కనిపించింది. దీంతో అచ్చన్కు మా తండ్రి నాటు వైద్యం చేయించి తన గాయాలను తగ్గించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అటువైపు వెళ్తున్న మా తండ్రికి అచ్చన్ మళ్లీ అక్కడే కనిపించింది. తన దగ్గరికి వెళ్లి మీరు ఎవరూ, ఎక్కడికి వెళ్లాలని అని అడగ్గా తను ఏం చెప్పలేని పరిస్థితిలో ఉండటంతో ఆయన తనని ఇంటికి తీసుకువచ్చారని చెప్పాడు. ఇక అప్పటి నుంచి ఆమె అచ్చన్గా మాతో పాటే మా కుటుంబంలో వ్యక్తిగా ఉంటున్నారన్నాడు. పంచుబాయ్కి అచ్చన్ అనే పేరును ఆయనే పెట్టారని కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు ఆయన లేరని కొన్నేళ్ల క్రితం మరణించారన్నాడు. అయితే అచ్చన్ ఎక్కువగా ఉత్తర మరాఠీ పదాలను వాడేవాదని. అయితే మేము అచ్చన్ ఎవరో, ఎక్కడి నంచి వచ్చారో తెలుసుకునేందుకు చాలాసార్లు ప్రయత్నించాము కానీ తను చెప్పేది మాకు అర్థమయ్యేది కాదన్నాడు. ఈ క్రమంలో మే 4న మా కుటుంబమంతా కుర్చోని మాట్లాడుకుంటుండగా అచ్చన్ ఏదో చెప్పాడానికి ప్రయత్నించింది. తన మాటలను నేను గూగుల్లో రికార్డు చేశాను. గూగుల్ మ్యాప్ ద్వారా అచ్చన్ చెప్పిన మాటలను చూస్తే కంజమ్ నగర్ను చూపించింది. ఇక వెంటనే నేను కంజమ్ నగర్ మ్యాప్లో వెతకగా ఇది అమరావతి జిల్లాలోని పంచాయతి నగరంగా చూపించింది. ఇక వెంటనే గూగుల్ సహాయంతో కంజమ్ నగర్ పంచాయతీ అధికారి అభిషేక్ నెంబర్ కనుగొన్నాను. ఆయనతో మాట్లాడి వాట్సప్ ద్వారా అచ్చన్ ఫొటో పంపించాను. ఆయన అచ్చన్ కుటుంబం ఆ గ్రామంలోనే ఉందని, పేరు పంచుబాయ్ అని చెప్పడంతో మేమంతా ఎగిరి గంత్తేశామని ఇశ్రార్ ఖాన్ తెలిపాడు. ('చైనా దురాక్రమణకు మోదీ లొంగిపోయారు') ఖాన్ కుటుంబానికి ధన్యవాదాలు: పంచుబాయ్ మనవడు పంచాయతీ అధికారి అభిషేక్ మా నానమ్మ గురించి నాకు చెప్పడంతో ఖాన్ సపంద్రించానని పంచుబాయ్ మనవడు పృథ్వీ రాజ్ షిండే చెప్పాడు. వెంటనే తను ఖాన్ ఫొన్ చేసి ‘తను మా నానమ్మ పంచుబాయ్ అని, మా తాత తేజ్పాల్(పంచుబాయి భర్త) తండ్రి భైలాల్(పంచుబాయ్ కుమారుడు) తన కోసం చాలా వెతికారు.. తను కనిపించడం లేదని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. తన కోసం వెతికి వెతికి చివరికి వారు ఆశలు వదులుకున్నారు. మా తాత తేజ్పాల్ 2005లో మరణించగా మా తండ్రి భైలాల్ 3 సంవత్సరాల క్రితం చనిపోయారు’ అని కూడా చెప్పాడు. 43 ఏళ్లకు తన నానమ్మను ఇంటికి తీసుకువెళ్తున్నందకు చాలా సంతోషంగా ఉందని షిండే ఆనందం వ్యక్తం చేశాడు. అయితే బాధించే విషయం ఏంటంటే మా తాతయ్య, తండ్రి నానమ్మను చూడకుండానే కన్నుమూశారని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక మా నానమ్మ మమ్మల్ని.. మేము తనని చూడకుండా 40 ఏళ్లు గడిపామంటూ.. ఇనేళ్లు తన నానమ్మను జాగ్రత్తగా చూసుకున్న ఖాన్ కుటుంబానికి షిండే ధన్యవాదాల తెలిపాడు. (‘గూగుల్లోకి 6 కోట్ల షేర్చాట్ యూజర్స్’) -
ఇది మదురై కాదా..!
సాక్షి, తమిళనాడు: చెన్నై నుంచి రైలులో మదురై వస్తుండగా నిద్రించిన వృద్ధురాలు కేరళ రాష్ట్రం చేరుకుంది. అక్కడ మెంటల్ హాస్పిటల్లో 80 రోజుల నిర్బంధం తర్వాత కుమార్తె చెంతకు చేరింది. వివరాలు.. మదురై అరప్పాళయం ప్రాంతానికి చెందిన కస్తూరి (70). ఈమె కుమార్తె శ్రీప్రియ చెన్నైలో ఉంటున్నారు. ఈమెను చూసేందుకు కస్తూరి చెన్నైకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి మళ్లీ మార్చి 18వ తేది మదురైకు బయలుదేరారు. మదురై చేరుకున్న సమయంలో ఆమె నిద్రించడంతో రైలు కేరళ రాష్ట్రంలోని కొల్లంకు చేరుకుంది. అక్కడ అందరూ ఆమెను దిగమని చెప్పడంతో కస్తూరి లేచి ఇది మదురై కాదా! అంటూ దిక్కులు చూసింది. ఆమె వద్ద కేరళ పోలీసులు మలయాళంలో విచారణ జరపగా ఆమెకు అర్థం కాలేదు. పోలీసులకు ఆమె తమిళం తెలియలేదు. ఇలా ఉండగా కేరళలో కరోనా వైరస్ మొట్టమొదటగా ప్రవేశించినందున రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దీంతో వద్ధురాలిని మతిస్థిమితం లేని మహిళగా భావించి, ఆమెను మానసిక చికిత్సా కేంద్రంలో చేర్చారు. ఇలా ఉండగా శ్రీప్రియ తల్లికోసం 80 రోజులుగా గాలింపులు చేపడుతూ వచ్చింది. రెండు రోజుల క్రితం కేరళ నుంచి శ్రీప్రియకు ఒక ఫోన్ కాల్ అందింది. అందులో తన తల్లి కేరళ కోలికోడ్ మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు తెలిసింది. చదవండి: 11 నెమళ్లకు విషం పెట్టి చంపేశారు దీంతో తల్లిని విడిపించాల్సిందిగా మదురై కలెక్టర్ వినయ్కు శ్రీప్రియ విజ్ఞప్తి చేసింది. కోలికోడ్ కలెక్టర్తో మదురై కలెక్టర్ ఫోన్లో సంప్రదించి కస్తూరిని సోమవారం మదురైకు రప్పించారు. కలెక్టర్ సమక్షంలో అధికారులు శ్రీప్రియకు తల్లిని అప్పగించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మదురై రెడ్క్రాస్ నిర్వాహకులు చేశారు. శ్రీప్రియ మాట్లాడుతూ బాగున్న తల్లిని మతిస్థిమితం లేనట్లు కేరళ ఆసుపత్రిలో 80 రోజులు నిర్భంధించడం ఆవేదన కలిగిస్తున్నదని కన్నీటి పర్యంతం అయ్యారు. -
80 ఏళ్ల వృద్ధురాలు కరోనా విజేత
కర్నూలు(హాస్పిటల్)/నంద్యాల: కరోనా బారిన పడితే 65 ఏళ్లకు పైగా వయస్సున్న వారికి ఇబ్బందనే అంశాన్ని పటాపంచలు చేస్తూ కర్నూలుకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు కరోనా విజేతగా నిలిచింది. గురువారం ఆమెతో పాటు మరో ఆరుగురు కరోనాను జయించారు. కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆసుపత్రి నుంచి ముగ్గురు, నంద్యాల శాంతిరామ్ జిల్లా స్థాయి ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రి నుంచి నలుగురు డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి 80 ఏళ్ల వృద్ధురాలు డిశ్చార్జ్ కావడం విశేషం. డిశ్చార్జ్ అయిన వారిలో కర్నూలుకు చెందిన ముగ్గురు, నంద్యాలకు చెందిన ఇద్దరు, బండిఆత్మకూరు ఒకరు, వెలుగోడు ఒకరు ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 637కు చేరింది. వీరికి ఒక్కొక్కరికి రూ.2వేల ఆర్థిక సహాయం అందించినట్లు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. (కరోనా నుంచి కోలుకున్న 92 ఏళ్ల బామ్మ) తాజాగా ఐదుగురికి పాజిటివ్ జిల్లాలో తాజాగా మరో ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరంతా కర్నూలు నగరానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇక ఆదోనికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందాడు. మరో రెండు క్లస్టర్లలోకంటైన్మెంట్ తొలగింపు కర్నూలు(సెంట్రల్): జిల్లాలో మరో రెండు క్లస్టర్లలో కంటైన్మెంట్ను తొలగిస్తూ గురువారం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు. మహానంది మండలం అబ్బీపురం, తిమ్మాపురం, పగిడ్యాల మండలం నెహ్రూనగర్ క్లస్టర్లను నాన్ కంటైన్మెంట్గా మార్చారు. దీంతో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. ఇటీవల నంద్యాల మునిసిపాలిటీలోని మల్దార్పేట, గుడిపాటి గడ్డ, మూలన్పేట, చిప్పగిరి, నగరడోణ(చిప్పగిరి), బి.తాండ్రపాడు(కర్నూలు రూరల్) తదితర నాలుగు క్లస్టర్లలో కంటైన్మెంట్ను తొలగించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 31 క్లస్టర్లలో కంటైన్మెంట్ తొలగిపోయింది. జిల్లాలో మొత్తం 61 కంటైన్మెంట్ క్లస్టర్లు ఉండగా అందులో 31 నాన్ కంటైన్మెంట్గా మారడంతో 30 కంటైన్మెంట్ క్లస్టర్లుగా ఉన్నాయి. -
కరోనా కంటే కొడుకులే డేంజర్
-
ఆస్తి కోసం నా కుమారుడు ఇంట్లోంచి గెంటేశాడు
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: ఆస్తి కోసం తనను కుమారుడు ఇంట్లోంచి గెంటేశాడని ఓ వృద్ధురాలు ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఆ కమిషన్ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి గురువారం అమలాపురం పట్టణం కొంకాపల్లిలోని తన చిన్న కూతురు ఇంటి వద్ద ఉన్న బాధితురాలిని కలిసి విచారణ చేశారు. వివరాల్లోకి వెళితే.. మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన 72 ఏళ్ల సత్యవతికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు. గతంలోనే భర్త చనిపోయారు. ఆయన బతికి ఉండగానే పిల్లల పెళ్లిళ్లు, ఆస్తి పంపకాలు జరిగిపోయాయి. సత్యవతి జీవనాధారం కోసం ఆమె భర్త రెండు ఇళ్లు, ఐదు ఎకరాలు భూమి రాసి ఇచ్చారు. ఆ ఇంట్లోనే ఉంటూ వచ్చిన ఆదాయంతో జీవిస్తున్న ఆ తల్లిపై కుమారుడి నుంచి ఒత్తిడి మొదలైంది. ఇళ్లు, భూములు తన పేరున రాయాలని తల్లిని వేధించసాగాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. కాగా.. మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ బాధితురాలితో మాట్లాడారు. అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషాతో కూడా ఈ విషయమై చర్చించారు. మలికిపురం పోలీసులతో కూడా మాట్లాడి బాధితురాలికి న్యాయం చేయాలని సూచించారు. తమ కమిషన్ తరఫున ఆ కుమారుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విచారణలో అమలాపురం, రాజోలు ఐసీడీఎస్ సీడీపీవోలు విమల, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
కరోనాను జయించిన బామ్మ : బీర్తో సెలబ్రేషన్
వాషింగ్టన్ : చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ కరోనా కబళిస్తుంటే 103 ఏళ్ల బామ్మ మాత్రం మృత్యువు అంచుల దాకా వెళ్లి పూర్తిగా కోలుకుంది. కోలుకున్న శుభ సందర్భంగా ఆసుపత్రిలోనే చిల్డ్ బీర్స్తో సెలబ్రేట్ కూడా చేసుకుంది. అమెరికాలోని మసాచూసెట్స్ నగరానికి చెందిన స్టెజ్నా మే నెలలో కరోనా బారిన పడింది. అందులోనూ వృద్ధురాలు కావడంతో అప్పటికే ఆమె పరిస్థితి విషమించింది. దీంతో స్టెజ్నాపై కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. దీంతో ఆమె చివరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చేద్దాం అనుకున్నారు. కానీ అనూహ్యంగా స్టెజ్నా కరోనా నుంచి కోలుకుంది. చావు వరకూ వెళ్లిన బామ్మ తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడంతో వారి కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు. కోలుకున్న బామ్మ కూడా చిల్డ్ బీర్తో సెలబ్రేట్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె మనువరాలు షెల్లీ గన్ సోషల మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. దీంతో పలు పత్రికలు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ ప్రచురించాయి. (ట్విట్టర్ను మూసేస్తా : ట్రంప్ ) ఈ సందర్భంగా షెల్లీ మట్లాడుతూ, ‘మా బామ్మ తన జీవిత కాలంలో మా కోసం చాలా కష్టపడింది. ఈ వయసులో ఆమె కరోనాకు గురి కావడంతో మేం చాలా ఆందోళనకు గురయ్యాం. అంతేకాకుండా ఆమె పరిస్థితి కూడా విషమించడంతో ఆశలు వదులుకున్నాం. చివరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చేద్దాం అనుకున్నాం. కానీ బామ్మ కోవిడ్ను జయించింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. ఈ విషయాన్ని మేమే నమ్మలేకపోతున్నాం. అంటూ ఆనందం వ్యక్తం చేసింది'’ అంతేకాకుండా 103 ఏళ్ల వయసులోనూ కరోనా వైరస్ను తట్టుకుని కోలుకోవడంతో ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆస్పత్రి సిబ్బందే ఆమెకు చిల్డ్ బీర్ అందించారు. అది చూడగానే బామ్మ మరింత సంతోషంతో బీర్ను ఎంజాయ్ చేసింది అంటూ షెల్లీ పేర్కొంది. (ఎన్ 95 మాస్క్ల పేరుతో భారీ మోసం ) -
తల్లీ, తండ్రి లేనోడన్నా కనికరించలే..!
వనపర్తి: పుట్టుకతో వికలాంగుడు పెన్షన్ ఇప్పించండనీ ఎంత మందిని వేడుకున్నా కనికరించలేదని ఓ వృద్ధురాలు సాయం కోసం కలెక్టర్ను ఆశ్రయించారు. వికలత్వ శాతంను ధ్రువీకరించే సదరం సర్టిఫికెట్ మంజూరై రెండేళ్లు కావస్తోంది. ఇప్పటికీ ఆసరా పెన్షన్ మంజూరు చేయలేదు. నలుగురు కార్యదర్శులు మారినా మాకుమాత్రం పెన్షన్ రాలేదని ఆ వృద్ధురాలు మనవడిని చూస్తూ అధికారులను వేడుకుంది. స్పందించిన డీఆర్డీఓ పెన్షన్ కోసం దరఖాస్తు చేశారా అనే విషయంపై విచారణ చేయగా.. 2019 డిసెంబర్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన కె.అరుణ్కు ప్రభుత్వం నుంచి 2018 మే 9న సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. 47శాతం వికలత్వం ఉన్నట్లు ధ్రువీకరించారు. తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మనే పెంచుతోంది. (దయ.. ‘తల్లి’చేదెవరు!) -
అవ్వా! మాస్కు ధరించు: నా తల్లే..
సాక్షి, హైదరాబాద్ : ఇటు నాగరికత నేర్చిన అమ్మాయి.. అటు ఆధునికత తెలియని అవ్వ.. ఇద్దరూ కలిశారు.. ఆ తర్వాత ఏమైంది? ‘అవ్వా.. బాగున్నావా?’ అంటూ ఆప్యాయంగా ఆమె చేతుల్లో పండ్లు, కాసింత డబ్బు పెట్టిందా యువతి. పట్టించుకునే వారు లేక దీనంగా కూర్చున్న ఆ పండుటాకు ముఖంలో ఆనందం.. అక్కడితో ఇది ముగిసిపోయి ఉంటే ఇది రొటీన్ ‘చిత్రమే’ అయ్యేది. ఆ తరువాతే అసలు విషయం మొదలైంది.. ‘అవ్వా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖానికి మాస్కు ధరించాలి. చేతులు శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి.. ఇవి తప్పనిసరి’ అంటూ వాటిని వృద్ధురాలికిస్తూ జాగ్రత్తలు చెప్పిందా యువతి. ‘నా.. తల్లే’ అంటూ మురిసిపోయిందా వృద్ధురాలు. కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు అద్దం పట్టిన ఈ ‘చిత్రం’ ఆదివారం రాయదుర్గం రోడ్డులో ‘సాక్షి’ కంటపడింది. చదవండి : రోజు విడిచి రోజు స్కూలుకు.. -
కరోనా నుంచి కోలుకున్న 92 ఏళ్ల బామ్మ
పూణె : పక్షవాతం కారణంగా వీల్చైర్కు పరిమితమైన 92 ఏళ్ల ఓ బామ్మ కరోనా నుంచి కోలుకుంది. 14 రోజుల క్వారంటైన్ అనంతరం నిర్వహించిన కరోనా పరీక్షలో కోవిడ్ నెగిటివ్ రావడంతో ఆమె ఆరోగ్యంగా ఇంటికి చేరింది. ఏప్రిల్ నెల మొదటి వారంలో ఈ బామ్మతో పాటు ఆమె కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులకు కొవిడ్-19 పాజిటివ్ రావడంతో పుణేలోని సింబోసిస్ ఆస్పత్రిలో చేర్చించారు. ‘‘ఏడు నెలల క్రితం పక్షవాతం కారణంగా ఆమె ఎడమ వైపు శరీరం మొత్తం అచేతనంగా మారిపోయింది. కొవిడ్-19 పాజిటివ్ వచ్చిన తర్వాత ఆమెను 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి చికిత్స అందించాం. ఇప్పుడామె విజయవంతంగా కోలుకున్నారు. కరోనా వైరస్తో వృద్ధులకు ఎక్కువ ముప్పు ఉన్నప్పటికీ... ఈ వైరస్ వచ్చిన వారంతా చనిపోతారని భయపడాల్సిన అవసరం లేదు..’’ అని సింబోసిస్ యూనివర్సిటీ హాస్పిటల్ సీఈవో డాక్టర్ విజయ్ నటరాజన్ పేర్కొన్నారు. కాగా ఆమె కోలుకోవడం ద్వారా ఈ వైరస్ బారి నుంచి వృద్ధులు కూడా కోలుకోగలరని మరోసారి రుజువైందని వైద్యులు సింబోసిస్ వైద్యులు పేర్కొన్నారు. -
40 ఏళ్లుగా జననేంద్రియంలో రబ్బర్ రింగ్
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): ఓ 65 ఏళ్ల వృద్ధురాలికి 40 ఏళ్లుగా జననేంద్రియంలో రబ్బర్ రింగ్ అలాగే ఉండి పోయింది. ఇప్పుడు గర్భాశయ సమస్యలు రావడంతో ఆమె ఆసుపత్రికి రాగా వైద్యులు చికిత్స ద్వారా దానిని తొలగించారు. వివరాలను శనివారం కర్నూలు ప్రభుత్వసర్వజన వైద్యశాలలోని గైనిక్ విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్వోడి డాక్టర్ బి. ఇందిర తెలిపారు. తెలంగాణా రాష్ట్రం గద్వాల నియోజకవర్గం కశ్యాపురం గ్రామానికి చెందిన 65 ఏళ్ల మహిళ మూడు రోజుల క్రితం గైనిక్ విభాగం ఏడవ యూనిట్కు వచ్చింది. ఆమె తెల్లమైల, ఎర్రమైల, కడుపునొప్పి సమస్యలు వివరించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు జననేంద్రియంలో రబ్బరుతో చేసిన రింగు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయమై ఆమెను అడగగా 40 ఏళ్ల క్రితం చివరి ప్రసవ సమయంలో గర్భాశయం జారిందని, ప్రసవం చేసిన మంత్రసాని రబ్బర్ రింగ్ను జననేంద్రియంలో అమర్చిందని వైద్యులకు తెలిపింది. దీంతో గైనకాలజిస్టు డాక్టర్ సి.మల్లికార్జున్ ఆమెను ఆసుపత్రిలో చేర్చుకుని శనివారం రబ్బరు రింగును తొలగించారు. డాక్టర్ బి. ఇందిర మాట్లాడుతూ గర్భసంచి జారిన వారిలో ఆపరేషన్కు ముందు తాత్కాలిక చికిత్సగా రింగ్ పిస్సరిని వాడతారని, కొద్దిమంది సిగ్గుతో ఎవరికీ చెప్పుకోలేక డాక్టర్లకు చూపించుకోరన్నారు. అది యోని మార్గంలో ఎక్కువ సంవత్సరాలు ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తాయని, కొన్నిసార్లు క్యాన్సర్ సమస్యలు కూడా వస్తాయని తెలిపారు. సమావేశంలో డాక్టర్ శ్రీలత, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ మమత, డాక్టర్ వీణ పాల్గొన్నారు.