![80 Years old woman raped in Uttar Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/5/Old-woman.jpg.webp?itok=YPF7BGA5)
లక్నో: వావివరుసలు.. వయసు బేధం లేకుండా కామాంధులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు దేశంలో జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఎనభై ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు ఆలయానికి వెళ్లొచ్చేలోపు ఆ ముసలావిడపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లా ఖరేలా పట్టణం సమీప గ్రామంలో ఫిబ్రవరి 2వ తేదీన కుటుంబసభ్యులు ఆలయానికి వెళ్లారు.
దీంతో ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించి ఆ పెద్దావిడపై అత్యాచారం చేశారు. ఇంటికి చేరిన కుటుంబసభ్యులకు ఈ విషయం వివరించి ఆమె కన్నీటి పర్యంతమైంది. ఆమె మనవడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే జలాల్పూర్ ప్రాంతంలోని హమీర్పూర్కు చెందిన పూల్చంద్, మరో వ్యక్తి నిందితులుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖరేలా ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment