ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: యువకుడు మృతి | One killed and one injured in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: యువకుడు మృతి

Published Fri, Oct 30 2015 5:09 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

సుల్తానాబాద్ (కరీంనగర్) : ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్  మండలం సుగ్లాంపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన సంపత్(27) తన స్నేహితుడు సతీష్‌తో పాటు ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు డీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపత్ అక్కడికక్కడే మృతి చెందగా.. సతీష్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement