ఏడాదిలో ఒక్క సెటిలర్‌కూ నష్టం జరగలేదు | One settlers of the year For both Loss did not | Sakshi

ఏడాదిలో ఒక్క సెటిలర్‌కూ నష్టం జరగలేదు

Published Fri, Jun 26 2015 3:45 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

ఏడాదిలో ఒక్క సెటిలర్‌కూ నష్టం జరగలేదు

ఏడాదిలో ఒక్క సెటిలర్‌కూ నష్టం జరగలేదు

తెలంగాణ ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క సెటిలర్ ధన, ప్రాణ, మాన నష్టం జరగలేదని.. ఈ సమయంలో సెక్షన్-8 అమలు చేయాల్సిన...

తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన
హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క సెటిలర్ ధన, ప్రాణ, మాన నష్టం జరగలేదని.. ఈ సమయంలో సెక్షన్-8 అమలు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. అదే సమయంలో సీమాంధ్రుల భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని సెక్షన్-8ను పూర్తిగా తొలగించవద్దని ఆమె డిమాండ్ చేశారు.

గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు బాగున్నాయని, ప్రస్తుత పాలనపై సెటిలర్లు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఏపీ ప్రభుత్వం అడుగుతున్న డిమాండ్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని, హైదరాబాద్‌లో ఏదో జరిగిపోతుందని తమ గురించి సెక్షన్-8 అమలు చేయాలనడం సరికాదన్నారు. సెక్షన్-8 రాజకీయాలకు, నేతలకు సంబంధించిన విషయం కాదని.. ఇది ఇక్కడ స్థిరపడ్డ కోటి 20 లక్షల సీమాంధ్రుల ఆత్మగౌరవమని ఇరు రాష్ట్రాల నేతలు గ్రహించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement