
దెబ్బలు తిన్న శేఖర్
దళితులపై ‘థర్డ్డిగ్రీ’ ప్రయోగం దుమారం మరువకముందే రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మరో దారుణానికి ఒడిగట్టారు.
అయితే, తన కూతురు కనిపించడంలేదంటూ ఎల్లయ్య సిరిసిల్ల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ పేరుతో ప్రేమికుడి స్నేహితులు శేఖర్, రజాక్, సన్నీ అనే యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రేమికులు ఎక్కడ ఉన్నారనే విషయం చెప్పాలంటూ గత శుక్రవారం నుంచి ఆదివారం వరకూ చితకబాదారు. ఆ తర్వాత వదిలేయడంతో సోమవారం విలేకరులను ఆశ్రయించారు. ప్రేమికులకు సహకరించారనే అనుమానంతో పోలీసులు తమను అదుపులోకి తీసుకోవడంతో ఆగ్రహించిన ఆమె బంధువులు ఫోన్చేసి తమను చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుల్లో ఒకరైన శేఖర్ చెప్పారు. దీనిపై సిరిసిల్ల సీఐ శ్రీనివాసరావును సంప్రదించగా, ప్రేమికుల వివరాలు తెలుసుకునేం దుకు ముగ్గురు యువకులను ఠాణాకు పిలిపించామన్నారు. ప్రేమికులు మేజర్లని తెలియడంతో వారిని వదిలివేశామని, తాము ఎవరినీ కొట్టలేదన్నారు.