బోధన్ టౌన్ : అమ్మతనం అనేది దేవుడిచ్చిన వరం...అందుకే తొమ్మిది నెలల పాటు బరువనుకోకుండా అమ్మ తన బిడ్డను మోస్తుంది. తొమ్మిది నెలల తర్వాత లోకం చూసే తన బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. ఎంతో నిష్టంగా ఉంటుంది. కానీ ఆ అమ్మకు ఏం కష్టమొచ్చిందో..లేక తను క్షణికావేశంలో చేసిన తప్పును మొగ్గలోనే తుంచివేయూలనుకుందో ఏమో లోకం చూడని బిడ్డను మురుగుగుంతలో వదిలేసి వెళ్లిపోయింది. పట్టణంలోని శర్బతీకెనాల్లో గురువారం ఉదయం ఓ మగబిడ్డ మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు.