child
-
మానసికంగా వేధిస్తున్నారు మీ ఇంట్లో పిల్లను ఇలాగే చేస్తావా: Pothina Mahesh
-
చంద్రబాబుకు చిన్నారి షాక్
సాక్షి, నెల్లూరు జిల్లా: కందుకూరు సభలో చంద్రబాబుకు చిన్నారి షాక్ ఇచ్చింది. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సభలో దీప్తి అనే విద్యార్థిని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇవాళ కందుకూరు సీఎం వస్తున్నారు కాబట్టే చెత్త ఎత్తేశారంటూ దీప్తి వ్యాఖ్యానించింది. రోజూ ఇలాగే కందుకూరులో వీధులు శుభ్రం చేయాలని విద్యార్థిని దీప్తి కోరింది.సిబ్బంది, అధికారులు పనితీరు ఎలా ఉందో దీప్తి మాటలు బట్టి అర్థమవుతోంది. చిన్నారి మాటలు సభికులను నిర్ఘాంత పోయేలా చేశాయి. ప్రభుత్వ పనితీరును తన ముందే ఆ చిన్నారి బయటపెట్టడంతో షాక్కు గురైన చంద్రబాబు.. ఆమె మాట్లాడినంత సేపు మౌనంగా ఉండిపోయారు. అంతలోనే తేరుకుని.. టాపిక్ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. -
నాలుగేళ్ల చిన్నారిపై బాలుడి లైంగిక దాడి
యలమంచిలి రూరల్: మొబైల్లో పోర్న్ వీడియో చూసిన ఓ 13 ఏళ్ల బాలుడు నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాకలో ఈ ఘటన జరిగింది. బాలిక కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామంలో టీడీపీ వార్డు సభ్యురాలి కుమారుడు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం తన ఇంటికి సమీపంలో ఆడుకుంటూ బాలికను సమీపంలో ఉన్న డాబాపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లడం, రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు చిన్నారిని ప్రశ్నించగా.. జరిగిన విషయం చెప్పింది.బాలుడు చేసిన అఘాయిత్యాన్ని తల్లికి చెప్పి మందలిద్దామని వెళ్లిన బాలిక కుటుంబీకులపైనే బాలుడి తల్లి ఎదురుదాడికి దిగింది. మీ ఇష్టం వచ్చింది చేసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. దీంతో శనివారం రాత్రే యలమంచిలి రూరల్ పోలీసులకు బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అయితే అఘాయిత్యానికి పాల్పడిన బాలుడి తల్లి, బంధువులు టీడీపీకి చెందిన వారు కావడంతో ఆదివారం ఉదయం వరకూ కేసు నమోదు చేయలేదు.అనంతరం వైఎస్సార్సీపీ నేతలు పోలీసులను ప్రశ్నించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికను విశాఖ కేజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇలాంటి పని ఎందుకు చేశావంటూ ప్రశ్నించారు. తన తల్లి మొబైల్ ఫోన్లో ఓ పోర్న్ వీడియో చూసి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు బాలుడు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. బాలిక కుటుంబానికి వైఎస్సార్సీపీ పరామర్శవైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాలిక కుటుంబాన్ని పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పరామర్శించారు.అఘాయిత్యానికి పాల్పడ్డ బాలుడి తల్లి టీడీపీ నాయకురాలు కావడం, బాధితులనే ఆమె బెదిరిస్తోందని తెలుసుకున్న ధర్మశ్రీ.. బాలిక కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. -
ఆరేళ్ల బుడతడు.. వెయ్యి కిలోమీటర్లు పరిగెడుతూ అయోధ్యకు..
భక్తిలో గొప్ప శక్తి ఉందని పెద్దలు అంటారు. దీనికి పలు ఉదాహరణలు కూడా చెబుతారు. అటువంటి భక్తిని మదిలో నిలబెట్టుకున్నవారు అద్భుతాలు చేస్తుంటారు. ఈ కోవలోకే వస్తాడు ఆరేళ్ల బుడతడు మొహబ్బత్. ఈ చిన్నారికి రామ్లల్లాను చూడాలని అనిపించింది. అంతే తాను ఉంటున్న పంజాబ్ నుంచి అయోధ్యకు పరుగున ప్రయాణమయ్యాడు.నెల రోజులకుపైగా సమయంపంజాబ్ నుంచి యూపీలోని అయోధ్య(Ayodhya)కు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంది. ఇంతదూరం ప్రయాణించేందుకు మొహబ్బత్ ఎటువంటి బస్సు,రైలును ఉపయోగించలేదు. పరిగెడుతూనే గమ్యాన్ని చేరుకున్నాడు. ఇందుకోసం మొహబ్బత్కు నెల రోజులకుపైగా సమయం పట్టింది. ఎలాగైతేనేం చివరకు జనవరి 7 నాటికి అయోధ్య చేరుకుని, సరికొత్త రికార్డు సృష్టించాడు. ఫజిల్కా నుంచి ప్రయాణంపంజాబ్లోని ఫజిల్కా నుంచి మొహబ్బత్(mohabat) తన పరుగును ప్రారంభించాడు. తొలుత ఓ సైనికాధికారి ఆ చిన్నారి ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీని తరువాత మొహబ్బత్ ఒక నెలా ఇరవై మూడు రోజులు పరిగడుతూ అయోధ్యకు చేరుకున్నాడు. ఈ ప్రయాణంలో మొహబ్బత్ తల్లిదండ్రులు కూడా అతని వెంట ఉన్నారు. వారు ఈ ప్రయాణ సమయంలో అయోధ్య ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్తో టచ్లో ఉన్నారు. మొహబ్బత్ను పరుగును చూసి దారిలోని పలు గ్రామాల ప్రజలు ఆశ్చర్యపోయారు. అలాగే ఆ చిన్నారికి స్వాగతం పలుకుతూ, ప్రశంసలు కురిపించారు.పర్యావరణాన్ని కాపాడాలంటూ సందేశంమొహబ్బత్ తాను పరుగుసాగిస్తూ మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించాడు. అలాగే పర్యావరణాన్ని కాపాడాలంటూ సందేశమిచ్చాడు. ఈ సందర్భంగా మొహబ్బత్ తండ్రి రింకూ కుమార్ మాట్లాడుతూ తమ కుమారుడు యూకేజీ చదువుతున్నట్లు తెలిపారు. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలను చూశాక, మెహబ్బత్ అయోధ్యకు పరిగెత్తుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నాడన్నారు. బాలల దినోత్సవం(Children's Day) సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మొహబ్బత్ అయోధ్యకు పరుగు ప్రారంభించాడన్నారు.ప్రతిరోజూ 20 కిలోమీటర్ల దూరం..మొహబ్బత్ రాముని భక్తుడని, ప్రతిరోజూ 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం పరిగెడుతూ, అయోధ్యకు చేరుకున్నాడన్నారు. గతంలో మొహబ్బత్ పంజాబ్లోని అబోహర్ నుండి లూథియానాకు పరుగుసాగించాడన్నారు. అప్పుడే అయోధ్యకు పరిగెత్తాలని నిర్ణయించుకున్నాడని రింకూ కుమార్ తెలిపారు. కాగా తమ కుమారుడిని అందరూ రన్ మెషిన్ మొహబ్బత్ అని పిలుస్తున్నారన్నారు. తమ కుమారుడు భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడాకారుడు అవుతాడని చాలామంది అంటున్నారని రింకూ కుమార్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: డెలివరీ బాయ్.. జడ్జిగా మారితే.. యాసిన్ షా సక్సెస్ స్టోరీ -
ఆమె ఇళయరాజానా లేక రెహమానా..?
ఆమె ఇళయరాజానా లేక రెహమానా అనే సందేహం వస్తుంది ఇంగ్లండ్కు చెందిన అల్మా ఎలిజబెత్ డీషర్ను చూస్తే. చిన్నవయసులోనే కచరీలు చేసే స్థాయికి ఎదిగితే అనుమానం రాదూ?రెండేళ్ల వయసు నుంచే అల్మా పియానో వాయించడం మొదలుపెట్టింది. ఆ వయసులోనే స్పష్టంగా పాటలు పాడటం మొదలుపెట్టింది. అంత చిన్నవయసులో తన ఆసక్తి చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆమె మూడో పుట్టినరోజు నాడు చిన్న వయెలిన్ని బహుమతిగా ఇచ్చారు. దాన్ని ఆటబొమ్మలా కాక, వాయిద్యంలా చూసి సాధన చేయడం మొదటుపెట్టింది అల్మా. ఏడాదిలోనే వయోలిన్ వాయించడంలో ఎంతో ప్రతిభ చూపింది అల్మా. ఐదో ఏట నుంచి పియానోపై సొంతంగా బాణీలు కట్టడం మొదలుపెట్టింది. అయితే అవన్నీ అస్పష్టంగా ఉండేవి. ఆరో ఏట నుంచి స్పష్టంగా అనేక బాణీలు కంపోజ్ చేసింది. 2013లో తన 8వ ఏట ఆ బాణీలన్నీ కలిపి ఆల్బమ్గా విడుదల చేశారు ఆమె తల్లిదండ్రులు. పదేళ్ల వయసుకు అల్మా వయోలిన్ వాయించడంలో మరింత నేర్పు సాధించింది. పూర్తి స్థాయి కచేరీకి అవసరమైన కంపోజిషన్ను రూపొందించింది. ఆమె ప్రతిభ చూసి అందరూ తనను మెచ్చుకున్నారు. మరి అల్మా స్కూల్ సంగతులేంటి? ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులు ఆమెను స్కూల్కి పంపారు. కానీ అక్కడి పాఠాలు ఆమెకు నచ్చలేదు. దీంతో మొదటిరోజే ఆమె స్కూల్ మానేసింది. అప్పట్నుంచి ఇంట్లోనే అమ్మానాన్న ఆమెకు చదువు చెప్పడం మొదలుపెట్టారు. కళాకారులకు స్వేచ్ఛ కావాలని, ఎవరూ అడ్డుకోని స్వతంత్రం కావాలని అంటున్నారు. బాల సంగీతకారురాలిగా పేరు పొందిన అల్మా ‘ది స్వీపర్ ఆఫ్ డ్రీమ్స్(2012), ‘సిండ్రెల్లా’(2015), ‘ది ఎంపరర్స్ న్యూ వాల్డ్జ్(2023) వంటి సంగీత రూపకాలను స్వరపరిచి, ప్రదర్శించింది. 2021లో లియోనార్డో డావిన్సీ అంతర్జాతీయ పురస్కారం అందుకుని, ఆ పురస్కారం అందుకున్న చిన్నవయస్కురాలిగా రికార్డు సాధించింది. అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇస్తోంది. (చదవండి: రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్మ్యాన్ -
టీనేజ్ పిల్లలకు ఈజీగా వంట నేర్పించండిలా..!
ఇల్లు అంటే మొదట చెప్పుకోవాల్సింది వంటిల్లే. ఇల్లు ఎంత పెద్దదైనా చిన్నదైనా ప్రధానంగా ఉండాల్సిన గది వంటగది. ఆ వంటగదిలోకి అడుగుపెట్టకుండా పెద్దయిపోయే పిల్లల తరం కాదిది. సరదాగా వంటగదిలో ప్రయోగాలు చేస్తున్న కొత్త యువతరం మొదలైంది. రాబోయే ఏడాది యూత్ ట్రెండ్ అంతా వంటగది కేంద్రంగా ఉండబోతోంది. అలాగే టీనేజ్లో ఉన్న పిల్లలకు తల్లితో అనుబంధం పెరిగేది వంటగదిలోనే. ఇందుకోసం చదువుకున్న తల్లి పాటిస్తున్న నాలుగు సూత్రాలివి. పిల్లలను వంటగదిలోకి ఆహ్వానించేటప్పుడు, వారి చేత వంట చేయించేటప్పుడు వాళ్లకు ఇష్టమైన వంటనే చేయాలి, వారి చేత చేయించాలి. వంటల పుస్తకం లేదా ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోమని సూచించాలి. ఇంటికోసం వంట చేయడమే కాకుండా చారిటీ కోసం వంట చేయడం అలవాటు చేయాలి. ఏదైనా వండి వాటిని అమ్మగా వచ్చిన డబ్బును అనాథలకు ఇవ్వడం ఒక పద్ధతి. అలాగే అనాథాశ్రమం, వృద్ధాశ్రమంలో ఉండే వాళ్ల కోసం వండి తీసుకెళ్లి పంచడం అలవాటు చేయాలి. తల్లి తనతోపాటు పిల్లలను కూడా కుకరీ క్లాసులకు తీసుకెళ్లడం ద్వారా అందరూ కలిసి ఒక కొత్త వంటను నేర్చుకోవడం, కలిసి వండడం గొప్ప అనుభూతి. అనుబంధాల అల్లిక కూడా. పిల్లలకు ఒక మోస్తరుగా వంట వచ్చిన తర్వాత ఓ చిట్కా పాటించవచ్చు. ఒక రోజు పూర్తిగా లంచ్కి అవసరమైన మెనూ అంతా వాళ్లే సిద్ధం చేయాలి. అంటే ఆ ఒక్కరోజుకు చెఫ్గా నియామకం అన్నమాట. ఏం వండాలో నిర్ణయించుకుని, అవసరమైన వాటిని మార్కెట్ నుంచి తెచ్చుకుని, వండి, వడ్డించడం వరకు వారిదే బాధ్యత అన్నమాట. ఆ రోజు సర్వీస్కి గాను బయటి నుంచి వచ్చిన షెఫ్కి ఇచ్చినట్లే పిల్లలకు కూడా పేమెంట్ ఇవ్వాలి. మోడరన్ ఉమెన్ చాలామంది ఇలా పిల్లలను వారానికోరోజు షెఫ్ డ్యూటీకి సిద్ధం చేస్తున్నారు కూడా. ఏం వెతికారో తెలుసా? మన యువత 2024లో కూడా ఇంటర్నెట్లో వంటల కోసం విపరీతంగా సెర్చ్ చేసినట్లు చె΄్తోంది గూగుల్. ఇంతకీ ఈ ఏడాది ఏయే వంటకాల కోసం వెతికారో తెలుసా? పోర్న్స్టార్ మార్టినీ... దీని పేరు మీద అనేక అభ్యంతరాలున్నాయి. కానీ అదే పేరుతో వ్యవహారంలో ఉంది. ఈ లండన్ లోకల్ డ్రింక్ని వెనీలా వోడ్కా, ఫ్రూట్ లిక్కర్, వెనీలా షుగర్లతో చేస్తారు. రెండవ స్థానంలో మన మామిడికాయ పచ్చడి ఉంది. మూడవ స్థానంలో ఉత్తరాది వంటకం ధనియా పాంజిరి ఉంది. ధనియాల పొడి, చక్కెర, నెయ్యి, రకరకాల గింజలతో చేస్తారు. ఇది కృష్ణాష్టమి రోజు చేసే నైవేద్యం. ఆయుర్వేదం సూచించిన ఆరోగ్య మూలికలతో చేసే ఔషధాహారం. నాలుగో స్థానంలో ఉన్న మన ఉగాది పచ్చడే. ఐదవస్థానంలో ఉన్న ఆహారం ఉత్తరాది రాష్ట్రాల చర్నామృత్. పాలు, చక్కెర, పెరుగు, తేనె, నెయ్యి, తులసి ఆకులు, డ్రై ఫ్రూట్స్, కుంకుమపువ్వుతో చేస్తారు. మన పంచామృతం వంటిది. పూజాదికాలలో భగవంతునికి నివేదన చేసి ప్రసాదంగా పంచుతారు. ఆరో స్థానంలో ఉన్నది భూటాన్ వాళ్ల ఇమాదత్శీ. మీగడ పెరుగులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు నానబెట్టి తింటారు. ఆహారప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. ఇక ఉదయాన్నే తాగే వెచ్చటి కాఫీ కోసం అది కూడా రెస్టారెంట్ స్టైల్ క్రీమీ కాఫీ ఎలా చేయాలోనని సెర్చ్ చేశారు. ఎనిమిదో స్థానంలో ఉన్నది కంజి. ఇది ఉత్తరాదిన హోలీ సందర్భంగా తాగే డ్రింక్లాంటిదే. బీట్రూట్, క్యారట్, ఆవాలు, ఇంగువతో చేసి రాత్రంతా పులియ బెడతారు. యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోబయాటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. జీర్ణశక్తిని పెంచుతుంది. శక్కర్ పారా... ఇది మహారాష్ట్ర వంటకం. గోధుమ పిండి, చక్కెర కలిపి చేస్తారు. గోధుమ పిండిలో చక్కెర బదులు ఉప్పు, జీలకర్ర కలిపి కూడా చేస్తారు. పిల్లలకు చక్కటి చిరుతిండి, పెద్దవాళ్లకు టీ టైమ్ స్నాక్. ఇక పదవ వంటకం చమ్మంతి... ఇది కేరళ కొబ్బరి పచ్చడి. మన తెలుగు వాళ్లకు కూడా అలవాటే. కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండుతో చేస్తారు. ఇడ్లీ, దోశె, అన్నంలోకి కూడా బాగుంటుంది. గూగుల్ ఇచ్చిన లిస్ట్ చూస్తే ఈ వంటకాల గురించి సెర్చ్ చేసింది యూత్ అని చెప్పకతప్పదు. ఎందుకంటే ఇవన్నీ సులువుగా చేయగలిగిన వంటలే. పండుగల సమయంలో మాత్రమే చేసే ధనియా పాంజిరి, ఉగాది పచ్చడి, చర్నామృత్ల కోసం సెర్చ్ చేశారంటే వాళ్లు వంటలో చెయ్యి తిరిగిన వాళ్లు కాదని ఒప్పుకోవాల్సిందే. అలాగే మామిడికాయ పచ్చడి, కొబ్బరి పచ్చడి కూడా. ఇక మనవాళ్లు ఆసక్తిగా బయటి వంటకాల కోసం తొంగి చూసింది లండన్ డ్రింక్, క్రీమీ కాఫీల విషయంలో మాత్రమే. ఇవి కూడా యూత్ ఇంటరెస్ట్ జాబితాలోనివే. మరో విషయం... బాదం పప్పులు నానబెట్టి రోజూ తినడానికి కారణాలు, ప్రయోజనాలను తెలుసుకున్నారు. అలాగే ఆలివ్ ఆయిల్ గురించి కూడా. -
చిట్టి గుండెకు గట్టి భరోసా
చిట్టి గుండె కూడా లయ తప్పుతోంది.. గట్టిపడేలోపే గండాల్లో చిక్కుకుంటోంది!గట్టెక్కించి ఆ బుజ్జి గుండెకు నూరేళ్ల భరోసానిస్తోందిశ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్!ఎక్కడో కాదు.. తెలంగాణ, సిద్దిపేటలో!ఇక్కడ అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు మందులు సహా చికిత్స అంతా ఉచితమే! చిన్నారితో పాటు తల్లితండ్రులకూ ఉచిత భోజన, వసతి సౌకర్యాలున్నాయి.∙గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేటఏటా ప్రపంచవ్యాప్తంగా 13. 5 లక్షల మంది పిల్లలు గుండె లోపాలతో పుడుతున్నట్లు అంచనా. ఇందులో మన దేశంలోనే 2.4 లక్షల మంది ఉండగా.. వాళ్లలో 60వేల మందికి హార్ట్ సర్జరీ అనివార్యమవుతోంది. కానీ 10వేల మంది చిన్నారులకు మాత్రమే ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఫలితంగా చాలామంది మృత్యువాత పడుతున్నారు. కొందరు పిల్లలు అనారోగ్య సమస్యలతోనే జీవనపోరాటం చేయాల్సి వస్తోంది. ఇలాంటి చిన్ని హృదయాలకు ఆరోగ్య భరోసా కల్పించేందుకు శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. 2012లో శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్స్ని ప్రారంభించింది. అందులో భాగంగా రాయ్పూర్ (ఛత్తీస్గఢ్), పల్వాల్ (హరియాణ), ముంబై (మహారాష్ట్ర), ముద్దహళ్లి(కర్ణాటక)లో చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్స్ని ఏర్పాటు చేసింది. ఆ వరుసలోనిదే సిద్దిపేటలోని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్ కూడా! ఇవికాకుండా మరో అయిదు ప్రాంతాల్లో మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లనూ ఏర్పాటుచేసి వైద్యసేవలతో పేదలకు అండగా నిలుస్తోందీ ట్రస్ట్. ఐదు చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్లలో ఇప్పటి వరకు 5,86,366 మంది చిన్నారులకు ఓపీ సేవలను అందించారు. అందులో 33,772 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేశారు. విదేశాల నుంచి వస్తున్న పిల్లలకూ అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. సిద్దిపేటలో..శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ రీసెర్చ్.. ఐదెకరాల విస్తీర్ణంలోని వంద పడకల ఆసుపత్రి. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ హార్ట్ సర్జన్ల బృందం సేవలను అందిస్తోంది. మాజీ క్రికెటర్, శ్రీ సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు సునీల్ గావస్కర్ కూడా ఈ సెంటర్ను సందర్శించారు.ఫొటోలుః కె సతీష్ఓన్లీ దిల్ .. నో బిల్ శ్రీ సత్యసాయి సంజీవని చిన్న పిల్లల ఆసుపత్రిలో కేవలం దిల్ మాత్రమే ఉంటుంది. బిల్ ఉండదు. ఇక్కడ ట్రీట్మెంట్ పొందిన పిల్లల తల్లిదండ్రుల్లో ఒక భరోసా కనిపిస్తోంది. ∙సునీల్ గావస్కర్, ఇండియన్ మాజీ క్రికెటర్, సత్యసాయి ట్రస్ట్ సభ్యుడున్యాయం చేస్తున్నాం.. మేము చదివిన చదువుకు సత్యసాయి ట్రస్ట్ ద్వారా న్యాయం చేస్తున్నాం. ఇప్పటి వరకు రెండువేలకు పైగా హార్ట్ సర్జరీలు చేశాం. హార్ట్కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను వెంటనే డాక్టర్స్కి చూపించాలి.∙డాక్టర్ అమితా శర్మ, అనఘా తులసి, భూషణ్ఫ్రీగా చేస్తారని తెలిసి..మా పాపకు తరచు అనారోగ్యం చేస్తుండటంతో హాస్పిటల్లో చూపిస్తే గుండెలో రంధ్రం ఉందని గుర్తించారు. సర్జరీ చేయాలన్నారు. సత్యసాయి చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్లో ఫ్రీగా చేస్తారని తెలిసి ఇక్కడికి వచ్చాం. పాపకు సర్జరీ అయింది.∙శాలిని యాదవ్, ఉత్తర్ప్రదేశ్ బరువు పెరగట్లేదని.. మా బాబు బరువు పెరగట్లేదని డాక్టర్కి చూపిస్తే హార్ట్లో హోల్ ఉందని తేల్చారు. తెలిసినవాళ్ల ద్వారా సత్యసాయి హాస్పిటల్కి వచ్చాం. పైసా తీసుకోకుండా బాబుకు సర్జరీ చేశారు. ∙బోలేశ్వర్, రాయ్పూర్, ఛత్తీస్గఢ్సేవే లక్ష్యంగా.. శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆసుపత్రులన్నిట్లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సేవే లక్ష్యంగా కొనసాగుతున్నాం.∙సి. శ్రీనివాస్, చైర్మన్, శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ -
57 గంటల తర్వాత బోరు బావి నుంచి బయటకు.. ప్రాణాలు కోల్పోయిన ఆర్యన్
జైపూర్: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల బోరు బావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడు ఆర్యన్ ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 57 గంటల పాటు శ్రమించారు. 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి ఈ క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్ష చేసిన డాక్టర్లు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విషాదం సంఘటన రాజస్థాన్ రాష్ట్రం దౌస జిల్లాలో చోటు చేసుకుంది.STORY | Race against time to save 5-year-old Aryan stuck in Rajasthan borewellREAD: https://t.co/LlJCz15soaVIDEO: (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/KqVqlNJmo7— Press Trust of India (@PTI_News) December 11, 2024వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో సోమవారం ఐదేళ్ల ఆర్యన్ మధ్యాహ్నం 3గంటల సమయంలో బోరుబావిలో పడిపోయాడు. బోరుబావిలో పడ్డ గంట తర్వాత ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు కదిలి వచ్చాయి. బోరుబావిలో పడ్డ బాలుడి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు, జేసీబీలు,డ్రిల్లింగ్ మెషిన్లతో ఓ వైపు బాలుడి కోసం బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో నిర్విరామంగా మట్టి తవ్వుతుంటే మరోవైపు బోరుబావిలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ పంపాయి. ఎన్డీఆర్ఎఫ్ ఆపరేషన్లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. నీటి మట్టం దాదాపు 160 అడుగుల వరకు ఉంటుందని అంచనా వేశారు. భూగర్భంలో ఆవిరి కారణంగా బాలుడి కదలికలను కెమెరాలో బంధించడంలో ఇబ్బంది మారింది. అదే సమయంలో భద్రతా సమస్యలు కూడా తలెత్తుతాయని అంచనా వేశారు. అయినప్పటికీ, 57 గంటల పాటు శ్రమించి బోరుబావి నుంచి ఆపస్మారక స్థితిలో ఉన్న ఆర్యన్ సురక్షితంగా బయటకు తీశారు. గ్రీన్ కారిడార్ ద్వారా అధునాతన లైఫ్ సపోర్ట్ సిస్టమ్తో కూడిన అంబులెన్స్లో ఆర్యన్ను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్ష చేసినా డాక్టర్లు ఆర్యన్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. -
150 అడుగుల బోరుబావిలో బాలుడు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
జైపూర్: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని బోరు బావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 17 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రం దౌస జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాలోని కలిఖడ్ గ్రామంలో సోమవారం (డిసెంబర్9న) ఘటన చోటు చేసుకోగా మంగళవారం (డిసెంబర్ 10) ఉదయం వరకు నిర్విరామంగా బాలుడిని బావి నుంచి బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు,పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో సోమవారం ఐదేళ్ల ఆర్యన్ బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం కదిలి వచ్చింది. ఓ వైపు బాలుడి కోసం బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో నిర్విరామంగా మట్టి తవ్వుతుంటే మరోవైపు బోరుబావిలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ పంపుతుంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. #WATCH दौसा, राजस्थान: दौसा में खेलते समय एक 5 वर्षीय बच्चा बोरवेल में गिर गया। बचाव अभियान जारी है।DM देवेंद्र कुमार ने बताया, "बच्चा करीब 150 फीट गहराई में है, उसे लगातार ऑक्सीजन दिया जा रहा है। मेडिकल टीम मौके पर मौजूद है। SDRF, NDRF और सिविल डिफेंस की टीमें मौके पर पहुंच गई… pic.twitter.com/JECEDzVtxv— ANI_HindiNews (@AHindinews) December 9, 2024బోరు బావి ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ దేవేంద్ర కుమార్ కొద్ది సేపటి క్రితం మాట్లాడుతూ.. ‘‘150 అడుగుల లోతులో ఉన్న బాలుడు ఆర్యన్ ఆరోగ్యం బాగుంది. ఆక్సీజన్ పంపుతున్నాం. బాలుడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బావిలోకి కెమెరాలను పంపాము. బాలుడిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఎంతవీలైతే అంత తొందరగా బాలుడిని రక్షించాలనే’’ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.బోరుబావిలో బాలుడు పడ్డాడనే సమాచారంతో స్థానికులు, జిల్లా ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. బాలుడి ఆచూకీ గురించి ఆరా తీస్తున్నారు. ఆర్యన్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్ధిస్తున్నారు. -
కిడ్స్పై కోల్డ్ వార్! 'పొడి' చెయ్యనియ్యొద్దు
చలికాలంలో చిన్నారుల చర్మాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. వాళ్లు చిన్నపిల్లలు కావడంతో తమ చర్మం గురించి ఎరుక, శ్రద్ధ వాళ్లలో ఉండదు. కానీ పిల్లల్లో ముఖం, పెదవులు పగలడం, కాళ్ల దగ్గరా పగుళ్లు రావడం వంటి అంశాలతో తల్లిదండ్రులు వారికోసం ఆందోళన పడుతుంటారు. ఇది చలికాలం కావడంతో టీనేజీ లోపు చిన్నారులకు వచ్చే చర్మ సమస్యల గురించి అవగాహన కోసం ఈ కథనం.చలికాలంలో చర్మం పొడిబారడం, పగుళ్లూ పిల్లలందరిలోనూ... ఆ మాటకొస్తే చాలామంది పెద్దవాళ్లలోనూ కనిపించేదే. కొందరు పిల్లల్లో జన్యుపరంగానే కొన్ని ప్రోటీన్లలోపం వల్ల చర్మం పొడిబారడం, ఎర్రబారడమన్నది ఎక్కువగా జరుగుతుంటుంది. మామూలుగా చర్మం బయటి కాలుష్యాలూ, వాతావరణం ప్రభావం, రాపిడి వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తుందన్నది తెలిసిందే. అయితే ఇలా పొడిబారి, ఎర్రగా మారడంతో.. కల్పించాల్సినంత రక్షణ కల్పించలేదు. ఇలా జరగడాన్ని ‘అటోపిక్ డర్మటైటిస్’గా చెబుతారు. అయితే ఈ సమస్య తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండక... చిన్నారి చిన్నారికి మారుతుంది. పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ చర్మ సమస్య, పరిష్కారాలు తెలుసుకుందాం. ఇటీవల వాతావరణంలో కాలుష్యాలు బాగా పెరగడం, పిల్లలు గతంలోలా ఆరుబయట మట్టిలో ఆడక΄ోవడం, అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం, తల్లిపాలకు బదులు డబ్బాపాలపై ఆధారపడటం, పిల్లలు సిజేరియన్ ప్రక్రియతో పుట్టడం వంటి కారణాలతో చిన్నారుల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) సరైనవిధంగా నియంత్రితం కావడం లేదు. దాంతో డాక్టర్లు పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్ను ఎక్కువగా చూస్తున్నారు.ఈ సమస్యలో మొదట చర్మం పొడిబారి, ఎర్రగా మారి దురద వస్తుంటుంది. పిల్లలు పదే పదే గీరుతుండటంతో చర్మం కాస్త మందంగా మారుతుంది. ఆ తర్వాత దురద మరింతగా పెరుగుతుంది. ఈ రెండు ప్రక్రియలూ ఒక సైకిల్ (ఇచ్–స్క్రాచ్ సైకిల్)లా నడుస్తుంటాయి. ఈ అటోపిక్ డర్మటైటిస్ అన్నది నెలల పిల్లలు మొదలుకొని, ఏడాది వయసు వారి వరకు కనిపించవచ్చుపిల్లల్లో 12 నెలల వయసు వరకు... ప్రభావితమయ్యే భాగాలుచర్మం ఎర్రబారడమన్నది ముఖంపై కనిపిస్తుంటుంది గాని నిజానికి చర్మంపై శరీరంలోని ఏ భాగంలోనైనా ఇలా జరగవచ్చు.΄పాకే పిల్లల్లో సాధారణంగా వాళ్ల మోకాళ్లు నేలతో ఒరుసుకు΄ోతుంటాయి కాబట్టి వీళ్లలో మోకాళ్ల వద్ద ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది.ఏడాదీ రెండేళ్ల పిల్లల్లో... ఈ వయసు పిల్లల్లో చర్మం ప్రభావితం కావడంమన్నది చర్మం ముడుతలు పడే ్ర΄ాంతాల్లో ఎక్కువ. రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో...ఈ వయసు పొడిబారడం మోకాళ్ల కిందనున్న చర్మంలో చాలా ఎక్కువ. ముఖం మీద చర్మం పెద్దగా పగలదు. పెదవులు చీలినట్లుగా కావడం, కంటి చుట్టూ నల్లటి ముడతలు, మెడ మురికిపట్టినట్లుగా నల్లగా కనిపించడం, కాళ్ల వేళ్లకింద పగుళ్లు (ఫిషర్స్), చేతి గీతలు కాస్త ప్రస్ఫుటంగా కనిపించడం, వెంట్రుకలు ఉన్నచోట బొబ్బల్లా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో...ఏడు కంటే తక్కువ వయసు పిల్లలతో పోలిస్తే ఏడు నుంచి పధ్నాలుగేళ్ల వారిలో అటోపిక్ డర్మటైటిస్ లక్షణాల తీవ్రత తగ్గే అవకాశముంది. ఈ సమస్య ఉన్నవారిలో చర్మం పగిలి ఉండటంతో తరచూ వైరల్ ఇన్ఫెక్షన్లు... ఉదాహరణకు హెర్పిస్ సింప్లెక్స్ వంటివి; అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉదాహరణకు స్టెఫాలోకోకల్ వంటివి కనిపించవచ్చు. నివారణ / మేనేజ్మెంట్ అండ్ చికిత్స స్నానం చేయించే వ్యవధి ఎంత తక్కువైతే అంత మంచిది. గోరు వెచ్చని నీళ్లతోనే స్నానం చేయించాలిస్నానం చేసిన వెంటనే పూర్తిగా తుడవకుండా టవల్తో అద్దుతూ ఆ తేమ మీదనే మాయిశ్చరైజర్ పట్టించాలి కాళ్లూ, చేతులు ఎక్కువగా పొడిబారతాయి కాబట్టి మాయిశ్చరైజర్ను రోజుకు రెండు మూడుసార్లయినా పట్టించడం మంచిది ఉలెన్ దుస్తుల వల్ల పిల్లలకు ఇరిటేషన్ ఎక్కువగా వస్తుంటుంది. అందుకే వాటికి బదులు కాటన్ దుస్తులు ధరింపజేయడం మేలు దోమల వల్ల కూడా పిల్లల చర్మంపై దుష్ప్రభావం పడే అవకాశముంది. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి స్కూలుకు వెళ్లే వయసు పిల్లలకు షూజ్తో కాటన్ సాక్స్ వాడటం, గట్టి చెప్పులకు బదులు కాస్త మెత్తటి పాదరక్షలు వాడితే కాళ్ల పగుళ్ల వల్ల కలిగే బాధలు తగ్గుతాయి సమస్య మరింత తీవ్రమైతే డర్మటాలజిస్టులను కలవాలి. సమస్య తీవ్రతను బట్టి వారు తగిన చికిత్స అందిస్తారు.(చదవండి: కంటికి ‘మంట’ పెట్టేస్తది.. సిగరెట్ అంటించకండి!) -
చిన్నారిపై వీధి కుక్కల దాడి
అగనంపూడి: గ్రామ సింహాలు చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన విశాఖలో జరిగింది. జీవీఎంసీ 85వ వార్డు ఫార్మాసిటీ నిర్వాసిత కాలనీ పానకాలయ్యపేట బోనంగికి చెందిన సిద్ధనాతి నూక అప్పారావు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి అప్పారావు భార్య లక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటుండగా, అప్పారావు పనిమీద బయటకు వెళ్లాడు.రోడ్డు మీద ఆడుకుంటున్న వీరి కుమార్తె యక్షిత (3)పై రెండు వీధి కుక్కలు దాడి చేయగా శరీరం వెనుక భాగం, మెడ, తలపై కూడా తీవ్రంగా గాట్లు పడ్డాయి. స్థానికులు కుక్కలను తరిమికొట్టి పాపను రక్షించి కేజీహెచ్కు తరలించారు. ప్రాణాపాయ స్థితి తప్పినట్లు వైద్యులు చెప్పారు. -
కల్కి అవతారమంటూ బాలుడికి పూజలు
భువనేశ్వర్: రాష్ట్రంలో ఓ బాలుడు కల్కి అవతారిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ వైఖరి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం (ఎస్సీపీసీఆర్) స్వయంగా కేసు నమోదు చేసింది. స్థానిక ఖండగిరి ప్రాంతంలో శ్రీ వైకుంఠ ధామం ప్రాంగణంలో బాలుడు కల్కి అవతారిగా పూజలు అందుకుంటున్న ప్రసారం ఆధారంగా భరత్పూర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దుమారం తార స్థాయికి తాకింది. బాలల హక్కుల సంఘం ఈ మేరకు సమగ్ర నివేదిక దాఖలు చేయాలని భరత్పూర్ ఠాణా పోలీసులకు తాఖీదులు జారీ చేసింది. ఈ మేరకు 15 రోజుల గడువు మంజూరు చేసింది. బాలల సంక్షేమ కమిటి ఈ ప్రసారంపై విచారణ చేపట్టాలని ఎస్సీపీసీఆర్ ఆదేశించింది. వివాదంలో చిక్కుకున్న కల్కి అవతార బాలుడు ప్రముఖ భాష్యకారుడు కాశీనాథ్ మిశ్రా కుమారుడు. సాంఘిక మాధ్యమంలో ప్రసారమైన ఫొటోలు అభూత కల్పనగా ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాలపై లోతుగా విచారణ చేపట్టి వాస్తవాస్తవాల్ని వెలుగులోకి తేవాలని ఆయన అభ్యరి్థంచారు. -
మేము ఇప్పుడు నలుగురం: ప్రకటించిన రోహిత్ శర్మ, రితికా సజ్దే (ఫొటోలు)
-
ఈ స్టార్ యాక్టర్ స్టైలే వేరు.. పెద్దవాడినన్న సంగతే మరిచిపోయారు!
టాలీవుడ్ నటుడు జగపతిబాబు ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియా తన చిలిపి చేష్టల గురించి పోస్టులు పెడుతూనే ఉన్నారు. కేవలం నటనలో మాత్రమే ఆయన సిరీయస్.. రియల్ లైఫ్లో బిందాస్ అన్నట్లు తన టాలెంట్ను చూపిస్తున్నారు. ఇంతకీ మళ్లీ ఆయన ఏం చేశారని అనుకుంటున్నారా? అదేంటో మీరు ఓ లుక్కేయండి.హీరో జగపతి బాబు తాజాగా హైదరాాబాద్లోని ప్రసాద్ ఐమ్యాక్స్లో సందడి చేశారు. అదేంటీ థియేటర్లకు అందరూ వెళ్తారు.. అందులో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా? ఉందండి.. అదేంటంటే అక్కడ చిన్నపిల్లలు ఆడుకునేందుకు చాలా గేమ్స్ ఉన్నాయి. ఇంకేముంది మన హీరో వెంటనే చిన్నపిల్లాడిగా మారిపోయాడు. అక్కడున్న ఏ ఆటను వదలకుండా ఆడేశారు. చివరికీ టాయ్ ట్రైన్లో ప్రయాణించి చిల్ అయ్యారు. దీనికి సంబంధించిన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. పెద్దవాడికి బుల్లి కోరికలు క్యాప్షన్ ఇస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. ఈ ఏడాది మిస్టర్ బచ్చన్, గుంటూరు కారం సినిమాలతో మెప్పించిన జగపతిబాబు.. త్వరలోనే రిలీజ్ కానున్న కంగువాలో నటించారు. అంతేకాకుండా అల్లు అర్జున్ పుష్ప-2లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే నెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.Peddhavaddiki bulli korikkalu… pic.twitter.com/8mFpV9aO30— Jaggu Bhai (@IamJagguBhai) November 11, 2024 -
ఎక్కువసేపు నిద్రా? ఆందోళన వద్దు...
చాలామంది తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతోనో లేదా బద్ధకం అలవాటవుతుందనో పిల్లలను ఎక్కువ సేపు నిద్రపోనివ్వరు. వాళ్లు కంటి నిండా నిద్రపోకముందే నిద్రలేపేస్తుంటారు. కారణం... వాళ్లు అలా నిద్రపోతూ ఉండటం, చురుగ్గా లేకపోవడంతో వాళ్లకేమైందో అన్న ఆందోళన వాళ్లను అలా నిద్రలేపేలా చేస్తుంది.పిల్లలు కంటినిండా నిద్రపోకపోవడం వల్ల వాళ్లు చికాకుగా, చిరాగ్గా ఉంటారని తెలుసుకోవాలి. రానున్నది చలికాలం. ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా సేపు నిద్రపోవడం చాలా సాధారణం.చలికాలంలో ఎక్కువ సేపు నిద్ర ఎందుకు?పిల్లలు చలికాలంలో కొద్దిగా ఎక్కువగా నిద్రపోవడం చాలా సాధారణం. దీనికి మొదటి కారణం చలికాలంలో పగటి సమయం తక్కువ, రాత్రి నిడివి ఎక్కువ; రెండోకారణం వెలుగు తగ్గిపోయి చీకటి పడగానే నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ స్రావాలు పెరగడం, నిద్ర మేల్కోడానికి ఉపయోగపడే సెరటోనిన్ స్రావాలు తగ్గడం... వంటి మార్పుల వల్ల చలికాలంలో నిద్ర పెరుగుతుంది. పిల్లలు ఎక్కువసేపు పడుకోవడానికి కొన్ని కారణాలు... ⇒ బరువు ఎక్కువగా ఉన్న చిన్నారులు ⇒ శ్వాస తీసుకోవడంలో సమస్యలున్నప్పుడు ⇒ సర్కాడియన్ రిథమ్లో మార్పులు (మనుషుల్లో నిద్రపోవడం, నిద్రలేవడంలోని క్రమబద్ధతను నిర్వహించే రిథమ్ను సర్కాడియన్ రిథమ్ అంటారు) ⇒మెదడు పనితీరులో కొన్ని లోపాలు ∙దగ్గు, జలుబు, అలర్జీలకు వాడే కొన్ని మందులు ∙ఆహార పదార్థాలు, హర్మోన్లలో మార్పుల వల్ల నిద్ర వ్యవధిలో మార్పులు రావడం వంటి అంశాలు నిద్ర పెరగడానికి కారణమవుతాయి. మరి... ఎన్ని గంటల నిద్ర నార్మల్...? పిల్లల్లోగాని, పెద్దల్లోగాని ఖచ్చితంగా నిద్రపోవాల్సిన వ్యవధి ఇదీ అంటూ ఎవరూ నిర్దిష్టంగా, నిర్ధారణగా చెప్పలేరు. మనుషులకు ఎన్ని గంటల నిద్ర సరిపోతుందన్న అంశం ఎప్పుడూ చర్చనీయాంశమైన విషయమే. అయితే సాధారణంగా పిల్లలు 8–9 గంటల పాటు నిద్రపోవడాన్ని నార్మల్గా పరిగణించవచ్చు. రోజూ పది గంటలకు మించి నిద్రపోవడాన్ని మాత్రమే కొన్ని రుగ్మతలకు సూచికగా చెప్పవచ్చు. ఒక ఉజ్జాయింపుగా చె΄్పాలంటే రోజుకు పదిగంటల కంటే ఎక్కువ, నాలుగు గంటల కంటే తక్కువ నిద్రపోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చిన్నారులు ఈ వ్యవధి కంటే తక్కువగా నిద్రపోతుంటే ఒకసారి థైరాయిడ్ హార్మోన్ పరీక్షలు చేయించి, పిల్లల డాక్టర్ను సంప్రదించడం తప్పనిసరి. -
ప్రేమాకర్షణలు సహజం.. శాశ్వతం కావు
ఇంట్లో టీనేజర్స్ ఉన్నారంటే తల్లిదండ్రులకు గుండెల్లో గుబులే. ఎప్పుడేం మాట్లాడతారో, ఏం చేస్తారో, ఏ గొడవ తీసుకొస్తారో అని! అన్నింటికంటే భయపెట్టే అంశం.. ప్రేమ వ్యవహారాలు. పెళ్లికి ముందు శృంగారం కూడా పెరిగిందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే అంశం. కానీ కాలంతో పాటు అన్నీ మారుతూ ఉంటాయి. ఈ కాలం పిల్లలకు రిలేషన్స్, బ్రేకప్స్ సర్వసాధారణమయ్యాయి. కొందరు ఈ రిలేషన్స్లో పడి చదువును నిర్లక్ష్యం చేస్తే, మరికొందరు బ్రేకప్ వల్ల అనేక మానసిక సమస్యలకు లోనవుతున్నారు. అందుకే పిల్లలు ప్రేమలో పడ్డారని తెలియగానే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కొందరైతే తిడతారు, కొడతారు, కంట్రోల్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు. దీనివల్ల టీనేజర్లలో తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత పెరగడం తప్ప ఆశించిన ప్రయోజనాలు నెరవేరవు. దీనికన్నా టీనేజర్లతో ఓపెన్గా మాట్లాడటం, సరైన గైడెన్స్ను అందించడమే మంచిదని గుర్తించాలి. అదెలాగో ఈరోజు తెలుసుకుందాం. సెక్సువల్ డెవలప్మెంట్..సెక్సువల్ డెవలప్మెంట్ అనేది సహజమైన పరిణామం. పీరియడ్స్, వెట్ డ్రీమ్స్ లాంటి శారీరక మార్పులు, అపోజిట్ సెక్స్ పట్ల ఆసక్తి లాంటి భావోద్వేగ మార్పులు మొదలవుతాయి. ఇదంతా వారికి కొత్తగా, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్తో చర్చిస్తారు. లేదా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తారు. అందులో తప్పుడు సమాచారం అందే ప్రమాదం ఉంది. అందుకే ఈ అంశాలపై తల్లిదండ్రులే చర్చించాలి. అలా చర్చించడంలో ఎలాంటి తప్పూ లేదని గుర్తించాలి. ప్రేమ, ఆకర్షణ..టీనేజ్లో ప్రేమ, ఆకర్షణ సహజమైన భావోద్వేగాలు. నచ్చిన వ్యక్తి పట్ల బలమైన ఆకర్షణను కలిగి ఉంటారు. అదే ప్రేమ అని భ్రమపడుతుంటారు. ఇది చూసి తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. కానీ చాలా సందర్భాల్లో ఈ ఆకర్షణ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కొందరిలో ఎక్కువకాలం కొనసాగవచ్చు. అయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు.పిల్లలను జడ్జ్ చేయకుండా, వారి క్రష్, లవ్ గురించి ఓపెన్గా మాట్లాడండి, తప్పొప్పులు, పర్యవసానాల గురించి చర్చించండి. అప్పుడే వాళ్లు తమ భావోద్వేగాలను సరైన రీతిలో అర్థం చేసుకోగలుగుతారు. సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.టీనేజ్ సెక్స్..యవ్వనంలో సెక్స్ అనే అంశం చాలా సున్నితమైనది. యవ్వనంలో వచ్చే హార్మోన్ మార్పుల వల్ల లేదా సోషల్ మీడియా లేదా ఫ్రెండ్స్ ప్రభావం వల్ల టీనేజ్ సెక్స్ పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఈ దశలో టీనేజర్లకు సరైన గైడెన్స్ అవసరం. అది ఫ్రెండ్స్ ద్వారానో, పోర్న్ ద్వారానో వచ్చేకంటే, పేరెంట్స్ ద్వారా అందడం అవసరం. భయపెట్టడం, నియంత్రించడం కంటే గైడెన్స్ ద్వారానే పిల్లలను సరైన దారిలో నడపగలమని గుర్తించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలు ఎలాంటి సందేహాలనైనా అడగడానికి, వారి భావాలు పంచుకోవడానికి అవకాశాన్ని ఇవ్వాలి ∙సెక్సువల్ డెవలప్మెంట్, రిలేషన్స్ గురించి కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలి ∙ తాత్కాలిక ఆకర్షణలు, టీనేజ్ లవ్, సంపూర్ణ ప్రేమ మధ్య తేడాలు అర్థం చేసుకునేందుకు సహాయపడాలి ∙సోషల్ మీడియా ప్రభావం, స్నేహితుల ఒత్తిళ్లను అర్థం చేసుకోవడానికి సహాయపడాలి ∙టీనేజర్ల ఫ్రీడమ్, తల్లిదండ్రుల గైడె¯న్స్ మధ్య బ్యాలె¯న్స్ సాధించాలి ∙పేరెంట్స్ చర్చించలేని అంశాల గురించి చెప్పేందుకు సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి.టీనేజర్లు చేయాల్సింది..టీనేజ్లో జరిగే మార్పుల గురించి చదవాలి, అవగాహన పెంచుకోవాలి. పేరెంట్స్తో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవాలి టీనేజ్ లవ్, ఇన్ఫాచ్యుయేషన్ సహజమైన విషయాలని, శాశ్వతం కావని గుర్తించాలి తొందరపాటు చర్యల వల్ల వచ్చే ఎమోషనల్ పెయిన్ గురించి అవగాహన పెంచుకోవాలి ఈ వయసులో ప్రేమ వ్యవహారాల కంటే అకడమిక్ సక్సెస్ ముఖ్యమని అర్థం చేసుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి కొత్త ఆసక్తులు, హాబీలను కనుగొనేందుకు సమయం కేటాయించాలి మైండ్ఫుల్నెస్, జర్నలింగ్, నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం వంటి పనుల ద్వారా ఎమోష¯న్స్ను నియంత్రించుకోవడం ప్రాక్టీస్ చేయాలి సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేసుకోవాలి. నిజమైన సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలి ఒత్తిడి, ఆందోళన లేదా నిరాశగా అనిపిస్తే సైకాలజిస్ట్తో మాట్లాడి సహాయం తీసుకోవాలి. -
ఆరు నెలల పాపకు ప్రాణం పోసిన అంకురా హాస్పిటల్ ..
స్త్రీ, శిశు ఆరోగ్యంలో ప్రత్యేక సేవలందించే ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ అంకురా ఫర్ ఉమెన్ & చిల్డ్రన్ ఆస్పత్రి అరుదైన ఘనతను సాధించింది. మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఆరు నెలల పాపకు ప్రాణం పోసి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అత్తాపూర్లోని అంకురా హాస్పిటల్ వైద్య బృందం సదరు శిశువుకి అత్యాధునికి చికిత్స అందించి పెరిటోనియల్ డయాలసిస్ చేయించారు. తద్వారా ఆ చిన్నారికి కొత్త జీవితాన్ని అందించడమే గాక తల్లిదండ్రులలో కొండంత ఆశను నింపారు.చిన్నారిని అంకురా హాస్పిటల్కు తీసుకువచ్చినప్పుడు..వివిధ అనారోగ్యాలతో తీవ్రమైన స్థితిలో ఉంది. వేగంగా శ్వాస తీసుకోవడం, తీవ్రమైన నిర్జలీకరణం, మూడు నుంచి నాలుగు నెలల వరకు బరువు పెరగకపోవడం, పొటాషియం స్థాయిలు తక్కువగా ఉండటం, శరీరంలో ఆమ్లం పెరగడం వంటి సమస్యలతో ఉంది. అత్యవసర పరిస్థితిని గుర్తించిన అత్తాపూర్ అంకురా ఆసుపత్రికి చెందిన పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ ఖలీల్ ఖాన్ వెంటనే చిన్నారిని ఐసీయూలో చేర్చి వెంటిలేటర్పై ఉంచారు. క్లినికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా, శిశువు మూత్రపిండ గొట్టపు అసిడోసిస్తో బాధపడుతున్నట్లు తేలింది.అత్తాపూర్లోని అంకురా హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అంకుష్ కొమ్మవార్ మాట్లాడుతూ.. "క్లినికల్ పరీక్ష ఫలితాల ఆధారంగా, రోగి మూత్రపిండ గొట్టపు అసిడోసిస్తో బాధపడుతున్నట్లు నిర్ధారించాము. శిశువుకు మూత్రం, మూత్రపిండాలు రావడంలో ఇబ్బంది ఉంది. రోగికి పెరిటోనియల్ డయాలసిస్ అనేది సాధారణంగా పని చేయడం లేదు. కాబట్టి ఈ ప్రక్రియ గురించి పిల్లల తల్లిదండ్రులతో చర్చించి, వారి ఆమోదం పొందిన తర్వాత, డాక్టర్ రవిదీప్ పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ మార్గదర్శకత్వంలో వైద్య బృందం అత్యంత సున్నితమైన, కష్టతరమైన ప్రక్రియను నిర్వహించింది. తల్లిదండ్రుల సహాకారంతో అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యుల మార్గదర్శకత్వంలో చికిత్స అందించారు. ఫలితంగా శిశువు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. బరువు పెరిగింది. అలాగే ఇంటరాక్టివ్ వయస్సు తగిన విధంగా మైలురాళ్లను చేరుకుంది. చిన్నారిని విజయవంతంగా డిశ్చార్జి చేశారు.ఈ మేరకు హైదరాబాద్లోని అంకురా హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ వున్నం మాట్లాడుతూ.. "అంకురా హాస్పిటల్లో ప్రాణాలను కాపాడటం, రోగుల శ్రేయస్సును నిర్ధారించడం మా లక్ష్యం. శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన వైద్యుల బృందం మా వద్ద ఉంది. అత్తాపూర్లోని అంకురా హాస్పిటల్లో ఆ శిశువుకి అందించిన అపూర్వమైన సంరక్షణ ఇందుకు నిదర్శనం. అంకురా హాస్పిటల్లో ఖచ్చితమైన ప్రణాళిక, నైపుణ్యంతో కూడిన బృందం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో రోగులకు సేవలందిస్తోందని చెప్పుకొచ్చారు. (చదవండి: 'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి అమూల్యమైన సలహాలు.!) -
రతన్ టాటా నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలివే..!
బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మన మధ్య లేకున్నా..తన మంచితనంతో అందరి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి. భావితరాలకు స్ఫూర్తి. వ్యాపారా సామ్రాజ్యంలో పారిశ్రామిక వేత్తలకు గురువు. వ్యక్తిత్వ పరంగా విద్యార్థులకు, యువతకు ఆదర్శం ఆయన. అలాంటి వ్యక్తి నుంచి ప్రతి చిన్నారి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలెంటో చూద్దామా..!నిరాడంబరత..టాటా గ్రూప్నే కాకుండా మన దేశం స్వరూపాన్నే తీర్చిదిద్దిన.. ఆ మహనీయుడి జీవన విధానం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆయన అంత పెద్ద వ్యాపార దిగ్గజమే అయినా సాధారణ జీవన విధానాన్నే ఇష్టపడతారట. అందుకు ఉదాహరణ ఈ కథ..ఒకరోజు ఎల్ఈడీ టీవీ బిగించటానికి రతన్ టాటా ఇంటికి వెళ్లిన టెక్నీషియన్ ఆయన సాధారణ జీవితం చూసి ఆశ్చర్యపోయాడట. ఎందరో సంపన్నుల ఇళ్లకు వెళ్లి వాళ్ల వైభోగాన్ని చూసిన అతడు టాటా ఇల్లూ అలాగే ఉంటుందనుకున్నాడు. తీరా వెళ్లి తలుపు తడితే సాధారణ షార్ట్స్, పైన ఒక బనీనుతో ఉన్న రతన్ స్వయంగా తలుపు తీశారట. టీవీ బిగించాల్సిన రూమ్లోకి తీసుకెళ్లారట. ఆ గది సైతం ఎంతో సాదాసీదాగా, పాతకాలం నాటి ఫర్నిచర్తో ఉందట. ఆ సాంకేతిక నిపుణుడు బిగించిన టీవీ కూడా అతి సాధారణమైన 32 అంగుళాల సోనీ టీవీ!సమస్యలను స్వీకరించే గుణం..రతన్ టాటా పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తుంటారు. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్ స్టర్ చంపేందుకు ప్రయత్నించాడు. అప్పట్లో టెల్కోగా పిలవబడే టాటా మోటార్స్లో లేబర్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్నకు వ్యతిరేకంగా, ఓ యూనియన్ను నియంత్రించేందుకు సదరు గ్యాంగ్ స్టర్ ప్రయత్నించాడు. అల్లరిమూకలతో టాటా మోట్సార్లో దాడులకు తెగపడ్డాడు. ఆఖరికి ప్లాంట్లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురి చేశాడు. అయినా రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. దీంతో గ్యాంగ్స్టర్ సమ్మెకు పిలుపునివ్వడంతో..దాడులకు బయపడి కార్మికులు పనిచేయడమే మానేశారు. అయితే కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్లోనే మకాం వేసి రోజూవారి పనులు పూర్తి చేశారు. అలా చివరికి రతన్ టాటా పట్టుదల ముందు గ్యాంగ్ స్టర్ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు.నైతిక విలువలు..టాటా వ్యాపారంలో నైతిక విలువలకు పెద్దపీట వేశారు. కష్టమైన వ్యాపార నిర్ణయాలను ఎదుర్కొన్నప్పుడు కూడా నిజాయితీ విషయంలో రాజీ పడేందుకు నిరాకరించారు. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. కఠిన పరిస్థితులు ఎదురైన మన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకుండా వ్యవహరించడం అనేది అత్యంత గొప్ప విషయం. ఇది విశ్వసనీయతకు నిదర్శనం. అదే మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది అనేందుకు టాటానే నిదర్శనం. దానగుణం..ముఖ్యంగా టాటా ట్రస్ట్ల ద్వారా చేసిన రతన్ టాటా దాతృత్వ ప్రయత్నాలు.. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే అతని నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. అతను ఆరోగ్య సంరక్షణ, విద్య , సామాజిక కారణాలపై అధికంగా పెట్టుబడులు పెట్టారు. ఇక్కడ ఒక వ్యక్తి విజయం అనేది వ్యక్తిగత లాభం మాత్రమే కాదని, దాంతో ఇతరుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావచ్చని.. తన ఆచరణతో చూపించారు.పట్టుదల..టాటా తన పదవీ కాలంలో ఆర్థిక మాంద్యం నుంచి వ్యాపార వైఫల్యాల వరకు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎక్కడ పట్టు సడలించక.. విజయం దక్కేవరకు పట్టు వదలని విక్రమార్కుడిలా కష్టపడి ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఎదురు దెబ్బలనేవి జీవితంలో భాగమని, వాటికే కుదేలవ్వకూడదని చాటిచెప్పారు. ఇన్నోవేషన్, విజన్ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు అయిన టాటా నానో లాంచ్ వంటి వినూత్న ఆలోచనలకు రతన్ టాటా పేరుగాంచారు. మధ్యతరగతి భారతీయులు కూడా కారు కొనుక్కో గలిగేలా చేయడమే ఈ కారు లక్ష్యం. ఇక్కడ టాటా ఫార్వర్డ్-థింకింగ్, రిస్క్ తీసుకేనే ధైర్యం మనకు కనిపిస్తున్నాయి. అవసరమనుకుంటే రిస్క్ తీసుకోవాలి. ఒకవేళ ఫెయిలైన ఒక మంచి అనుభవం లభించడమే గాక సృజనాత్మకంగా ఆలోచించేందకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే అందులో ఎదురయ్యే లాభ నష్టాలను బేరీజు వేసుకుని ముందుకు వెళ్లే సామార్థ్యం పెరుగుతుంది. చివరి వరకు ఆయన జీవితాన్ని చాలా అపరూపంగా తీర్చిదిద్దుకున్నారు. అంతేగాదు మరణం సమీపించే వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండేవారని సన్నిహిత వర్గాల సమాచారం. కెరీర్ని, వ్యక్తిగత జీవితాన్ని ఎలా మమేకం చేసుకోవాలో ఆచరించి చూపిన వ్యక్తి. వయసు అనేది శరీరానికే గానీ మనసుకు గాదు అంటూ ఆరు పదుల వయసులోనూ యువకుడిలా చురుకుగా పనిచేస్తూ యువతకు, ఎందరో వ్యాపారా దిగ్గజాలకు స్ఫూర్తిగా నిలిచారు. పైగా ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా బతికే ఉండటం అంటే ఏంటో చేసి చూపించారు టాటా. (చదవండి: రతన్ టాటా ఎలాంటి వంటకాలు ఇష్టపడేవారంటే..!) -
Monkeypox Virus: గుజరాత్ బాలునికి మంకీపాక్స్?
భోజ్పూర్: బీహార్లో మంకీపాక్స్ వైరస్ కేసు నమోదయ్యింది. గుజరాత్ నుంచి భోజ్పూర్ వచ్చిన ఒక బాలునిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. శరీరమంతటా దద్దుర్లు, పొక్కులు వచ్చిన ఓ బాలుడిని భోజ్పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ బాధితునికి ప్రథమ చికిత్స అందించారు. తర్వాత బాధిత బాలుడిని ఏసీఎంవో వైద్యులు డాక్టర్ కేఎన్ సిన్హా వద్దకు తరలించారు.మంకీ పాక్స్ అనుమానిత బాధితుని గుర్తించినట్లు డాక్టర్ కెఎన్ సిన్హా తెలిపారు. బాధితుని రక్త నమూనాను మైక్రోబయాలజీ విభాగానికి పంపించామన్నారు. స్థానికంగా ఐసోలేషన్ ఏర్పాట్లు లేకపోవడంతో, బాధితుడిని పట్నాలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించామన్నారు. బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బాలుని శరీరంపై వారం రోజులుగా దద్దుర్లు ఉన్నాయి. అప్పుడప్పుడు బాధితుడు వణుకుతున్నాడు. ఆ బాలుడు ఆరు నెలలుగా గుజరాత్లో ఉన్నాడు. బాధితుడు ఉన్న ప్రాంతానికి కేరళ నుంచి కొందరు వచ్చారని బాలుని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా బాలుని కుటుంబ సభ్యులలో ఎవరిలోనూ మంకీపాక్స్ లక్షణాలు కనిపించలేదు. బాధిత బాలునికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: వందేభారత్ రైళ్ల కొనుగోలుకు పలు దేశాల ఆసక్తి -
రీల్స్ పిచ్చి.. బావి అంచున కూర్చొని పిల్లాడితో మహిళ వేషాలు
యువతతోపాటు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో రీల్స్పిచ్చి రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలో పాపులర్ కావాలని వింత చేష్టలతో రెచ్చిపోతున్నారు. అడ్డదిడ్డమైన ప్రయత్నాలు చేసి ప్రాణాలను సైతం ప్రమాదంలో నెట్టేస్తున్నారు. తాజాగా ఓ మహిళ సైతం రీల్స్ కోసం తన ప్రాణాలే కాకుండా తన బిడ్డ ప్రాణాలనే పణంగా పెట్టింది.బావి అంచున ప్రమాదకరంగా కూర్చొన్న మహిళ.. ఒక చేతితో పిల్లాడిని పట్టుకొని రీల్ చేసింది. పాటకు అనుగుణంగా డ్యాన్స్ కదలికల కోసం బాలుడిని నిర్లక్ష్యంగా పలుమార్లు చేతులు మార్చింది. బావిలోకి ప్రమాదకరంగా వేలాడిన ఆ బాలుడు ఆమెను గట్టిగా పట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. అతడి శరీరం బావి పైన గాలిలో వేలాడుతూ ఉంది.ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. పిల్లవాడి రిస్క్ గురించి పట్టించుకోని ఆ మహిళ రీల్ పిచ్చిపై నెటిజన్లు మండిపడున్నారు. పిల్లవాడి గురించి పట్టించుకోని ఆమె రీల్కు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీల్ వ్యామోహంలో బాలుడి ప్రాణాలను పణంగా పెట్టిందని ఆరోపించారు.Family court in custody case: Only mother can love child more. Even more than father.Le mother:#ParentalAlienation pic.twitter.com/mc1kl5ziFj— Raw and Real Man (@RawAndRealMan) September 18, 2024 -
పరువు కాదు ముఖ్యం: ఆటిజం పిల్లలకు మాటివ్వండి!
యుకేలో ముప్పై ఏళ్లుగా పిల్లలు, టీనేజర్లు, వారి కుటుంబాలతో కలిసి పనిచేయడంలో నైపుణ్యం కలిగిన పీడియాట్రిక్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ సియాన్ విల్సన్. ఆటిజంలో క్లినికల్ స్పెషలిస్ట్గా స్కూళ్లు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. సోషల్ కోచ్గా సేవలు అందిస్తున్నారు.భారతదేశం పిల్లల్లో డిజేబిలిటీ ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయంపై సమీక్ష జరపడానికి ఇండియాకు వచ్చారు. పాతికేళ్లుగా చిల్డ్రన్ డిజేబిలిటీస్ పై వర్క్ చేస్తున్న మాధవి ఆదిమూలం, సియాన్ విల్సన్ లు యుకెలోనూ, ఇండియాలోనూ ఉన్న పరిస్థితులు, అమలు చేయాల్సిన విధానాల గురించి హైదరాబాద్లోని మాదాపూర్లో జరిగిన ఈవెంట్లో డిజేబిలిటీ చిల్డ్రన్ తల్లిదండ్రులతో కలిసి చర్చించారు.నాటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాల వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక థెరపిస్ట్గా పిల్లల వృద్ధికి దోహదపడేవారు. ఇప్పుడు తల్లితండ్రీ మాత్రమే కాదు ఒంటరి తల్లుల సంఖ్య పెరుగుతున్న ఈరోజుల్లో పిల్లల పెంపకం సమస్యగానే మారుతోంది అంటున్నారు నిపుణులు.స్పెషలిస్ట్లు ఎక్కువ‘‘యుకేలో స్పెషల్ చిల్డ్రన్ డెవలప్మెంట్కి సంబంధించిన విధానం, ఖర్చు అంతా అక్కడి కౌన్సిల్ చూసుకుంటుంది. కొన్నాళ్లుగా ఇండియాలోని ప్రముఖ చైల్డ్ డెవలప్మెంట్ క్లినిక్స్తో సంప్రదింపులు చేస్తున్నాను. ఇక్కడితో పోల్చితే యుకేలో స్పెషల్ చిల్డ్రన్ని చాలా చిన్నవయసులోనే గుర్తించడంలో అవగాహన అక్కడి పేరెంట్స్కు ఎక్కువ ఉంది. ఆటిజం చైల్డ్లో స్పీచ్ థెరపీ ద్వారా సరైన మెరుగుదలను తీసుకురావడానికి వారి స్థితిని బట్టి నార్మల్ స్కూల్ స్టూడెంట్స్తో కలుపుతారు. అయితే, అలాంటి ఒక చైల్డ్కి ఒక టీచర్ చొప్పున లెర్నింగ్ స΄ోర్ట్ అసిస్టెంట్ను కేటాయిస్తారు. అంటే, తన వయసు పిల్లలతో కలిసి ఉండే దోరణి వల్ల ఆ స్పెషల్ చైల్డ్లో మానసిక ఆరోగ్యం బాగవుతుంటుంది. ఎవరూ కూడా ఈ విధానానికి అడ్డు చెప్పరు’ అంటూ దేశంలో స్పెషల్ చైల్డ్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తెలియజేశారు సియాన్ విల్సన్.పరువు కాదు ముఖ్యం‘చాలా మంది తల్లులు తమ పిల్లల్లో ఉన్న ఆటిజం సమస్యను గుర్తించడమే లేదు. ఒక వేళ ఏదైనా డిజేబిలిటీ ఉన్నా బయటకు తెలిస్తే పరువు ΄ోతుంది అనుకుంటున్నారు. ‘మా అమ్మాయి/అబ్బాయిని ట్యూషన్కో లేదో మ్యూజిక్, డ్యాన్స్ స్కూల్కో తీసుకెళుతున్నామని చెప్పి, తీసుకువస్తున్నామ’ని చెబుతున్నారు. టీనేజర్ స్థాయిలో ఉన్న పిల్లలను కూడా ఇంట్లోనే ఉంచుతున్నారు. వారికి ఎలాంటి థెరపీ ఇవ్వక΄ోవడం వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. దీంతో అప్పుడు నిపుణులను కలుస్తున్నారు. సమస్యను మొదట్లోనే గుర్తిస్తే, పరిష్కారం కూడా త్వరగా లభిస్తుంది’ అని వివరించారు థెరపిస్ట్ లక్ష్మీ ప్రసన్న.పరువుతో వెనకడుగు వేయద్దు‘‘అనన్య చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పేరుతో 19 ఏళ్లుగా ఆటిజం పిల్లలకు సేవలు అందిస్తున్నాను. మా బాబు స్పెషల్ కిడ్ అవడంతో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయిన నేను స్పెషలైజేషన్ చేసి, ఈ తరహా పిల్లల కోసమే పనిచేస్తున్నాను. ఇప్పుడు మా బాబు వయసు 24 ఏళ్లు. వాడు సంగీతంలో నైపుణ్యం సాధించడంతోపాటు ప్రదర్శనలు కూడా ఇస్తున్నాడు. మా బాబును ఇక్కడ సాధారణ స్కూల్లో చేర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. ఎడీహెచ్డీ ఆటిజం ఉన్న పిల్లల్లో మెరుగుదల కనిపిస్తున్నప్పుడు వారిని, మిగతా అందరిలాగే స్కూళ్లో చేర్చగలిగే శక్తిని కూడా అందించాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్లు సాధారణంగా ఎదుగుతారు. అంతేకాదు ఆటిజం పిల్లల పెంపకంలో వారిలో కొన్ని నైపుణ్యాలు కనిపిస్తుంటాయి. ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తూ ఉంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. తమకు తాముగా పనులు చేసుకోవడమే కాదు నైపుణ్యాలను కూడా చూపుతారు. అందుకే ఈ విషయాల్లో గ్రామీణ స్థాయిలోనూ అవగాహన క్యాంపులను నిర్వహిస్తున్నాం. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం. అక్యుపేషనల్ థెరపిస్ట్ల కొరత మన దగ్గర చాలా ఉంది. థెరపిస్ట్ల సంఖ్య, తల్లిదండ్రులలో అవగాహన పెరిగితే ఈ సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుంది’ అని వివరించారు మాధవి ఆదిమూలం.– నిర్మలారెడ్డిఫొటోలు: బాలస్వామి, సాక్షి -
చిన్ననాటి గాయాలను సరిదిద్దే.. ఇన్నర్ చైల్డ్ హీలింగ్!
బాల్యం వ్యక్తిత్వానికి పునాదిలాంటిది. బాల్యంలో మన అనుభవాలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలు సానుకూలంగా ఉండవచ్చు లేదా ప్రతికూలంగానూ ఉండవచ్చు. మనం పెరిగి పెద్దయ్యాక దైనందిన జీవితంలోని సంక్లిష్టతలను చాకచాక్యంగా మేనేజ్ చేస్తున్నప్పటికీ, బాల్యంలో అనుభవించిన నిర్లక్ష్యం, తగిలిన గాయాలు, అనుకున్నవి నెరవేరని బాధ నేటికీ అలాగే ఉండవచ్చు. ఆ గాయాలను నయం చేయకపోతే అవి యుక్తవయసు ప్రవర్తన, ఎమోషనల్ రియాక్ష¯Œ ్స, మానసిక సమస్యలుగా వ్యక్తమవుతాయి.ఉదాహరణకు.. బాల్యంలో నిర్లక్ష్యం, నిరాదరణ, తిరస్కరణకు లోనయినట్లయితే దాని ప్రభావం ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎంత విలువైన వ్యక్తిగా చూసుకుంటున్నారు, మీ సంబంధ బాంధవ్యాలను ఎంతవరకు నమ్మతున్నారనే దానిపై ప్రభావం చూపించవచ్చు. మీకు తెలియకుండానే మీ జీవిత భాగస్వామితో, సహోద్యోగితో, ఉన్నతాధికారితో మీ సంబంధాలను ప్రభావితం చేయవచ్చు.ఇలాంటి సందర్భాల్లోనే ఇన్నర్ చైల్డ్ వర్క్ లేదా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనే థెరపీ ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీ లోలోపల దాగి ఉన్న భావోద్వేగ గాయాలను పరిష్కరించుకోవచ్చు. మీరు మరింత ఎమోషనల్ ఫ్రీడమ్తో ముందుకు సాగవచ్చు. కొంచెం సంక్లిష్టమైన ఈ ప్రక్రియను మొదట సైకాలజిస్ట్ పర్యవేక్షణలో నేర్చుకోవడం మంచిది.ఇన్నర్ చైల్డ్ను గుర్తించడంమీ లోపల బాల్యం అలాగే ఉందని, అది అప్పుడప్పుడూ మాట్లాడుతూంటుందని, దాని మాటలు వినాలని గుర్తించడం మొదటి అడుగు. ఈ దశలో మీ బాల్యంలోని అనుభవాలను, భావోద్వేగాలను, అవసరాలను గుర్తించాలి.ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వడంవిజువలైజేషన్ ఎక్సర్సైజ్లు, డైరీ రాయం, డైలాగ్ టెక్నిక్స్ ద్వారా మీ ఇన్నర్చైల్డ్తో కనెక్ట్ అవ్వచ్చు. ఉదాహరణకు.. మీరు కళ్ళు మూసుకుని, చిన్నతనంలో మిమ్మల్ని మీరు ఊహించుకోవచ్చు, నిర్దిష్ట జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవచ్చు. లేదా మీ బాల్యం ఎలా ఉందో, ఎలా ఫీలయ్యేవారో ఊహించుకోవచ్చు. మీరెంత కరుణతో అర్థంచేసుకున్నారో మీ ఇన్నర్ చైల్డ్కు ఒక లేఖ రాయవచ్చు.ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఇలా...ఇన్నర్ చైల్డ్ చెప్పేది వినడం మీరు మీ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అయిన తర్వాత, తన భావాలు, భయాలు, అవగాహనను వినాలి. మీ ఇన్నర్ చైల్డ్ను ఎన్నో ఏళ్లుగా మీరు పట్టించుకుని ఉండరు. అందువల్ల తను మాట్లాడటానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. అందువల్ల తనను జడ్జ్ చేస్తారనే భయం లేకుండా తన భావోద్వేగాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలిగే అంతర్గత వాతావరణాన్ని కల్పించాలి. ఇందుకు చాలా ఓపిక, సహానుభూతి అవసరం.హీలింగ్ అండ్ రీపేరెంటింగ్ మీ చిన్నతనంలో లోపించిన ప్రేమ, సంరక్షణ, మద్దతు మీ యవ్వనానికి అందించడం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ లక్ష్యం. ‘రీపేరెంటింగ్’ అనే ఈ ప్రక్రియ.. మీరు మీ ఇన్నర్ చైల్డ్కు నచ్చిన వ్యక్తిగా మారడానికి అనుమతిస్తుంది. ‘నువ్వు సురక్షితంగా ఉన్నావు’, ‘నీకు నచ్చినట్టుగా నువ్వు ఫీలవ్వచ్చు’, ‘నిన్ను అందరూ ప్రేమిస్తున్నారు’ అని మీ ఇన్నర్ చైల్డ్కు భరోసా ఇవ్వడం ద్వారా మీ బాల్యంలో అందుకోలేకపోయిన ధైర్యాన్ని, ప్రేమను, ప్రోత్సాహాన్ని అందించాలి.ఇన్నర్ చైల్డ్ని ఇంటిగ్రేట్ చేయడం..మీ ఇన్నర్ చైల్డ్ను అడల్ట్ సెల్ఫ్తో ఇంటిగ్రేట్ చేయడం చివరిదశ. అంటే మీ ఇన్నర్ చైల్డ్ మీలో ఒక భాగమని అంగీకరించడం. మీ బాల్యంలోని అనుభవాలు, భావోద్వేగాలు మీ ఇప్పటి ఐడెంటిటీని ప్రభావితం చేస్తున్నాయని, మీరిద్దరూ ఒకటేనని గుర్తించడం. ఇది సెల్ఫ్ కంపాషన్ను, ఎమోషనల్ బ్యాలెన్స్ను పెంచుతుంది. – సైకాలజిస్ట్ విశేష్ -
TG: ఆర్టీసీ బస్సులో పుట్టిన చిన్నారికి జీవితకాల ఫ్రీ పాస్
సాక్షి,హైదరాబాద్: రాఖీ పౌర్ణమి రోజు గద్వాల డిపో ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్పాస్ అందిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.ఆర్టీసీ బస్సులు, బస్స్టేషన్లలలో పుట్టిన పిల్లలకు జీవితకాలం ఉచిత బస్పాస్ ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా ఈ చిన్నారికి ఉచిత బస్పాస్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.ప్రసవం చేసిన స్టాఫ్ నర్స్ అలివేలు మంగమ్మకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఏడాదిపాటు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంగళవారం (ఆగస్టు20) ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించారు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో గర్భిణీకి పురుటినొప్పులు రావడంతో కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ భారతి, డ్రైవర్ అంజిలతోపాటు నర్సు అలివేలు మంగమ్మను హైదరాబాద్లోని సంస్థ ప్రధాన కార్యాలయం బస్భవన్లో ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. -
బాల.. భళా..! వరల్డ్ రికార్డు సాధించిన హన్విద్..
కరీంనగర్: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు భాస్కరరాజు మనవడు (నాలుగు నెలల బాలుడు) హన్విద్కృష్ణ వరల్డ్ రికార్డు సాధించాడు. 347 ఫ్లాష్ కార్డ్స్ను గుర్తించడంలో నోబుల్ వరల్డ్ రికార్డు సాధించినట్టు భాస్కరరాజు సోమవారం తెలిపాడు. బాలుడు ఫ్లాష్ కార్డ్స్ గుర్తించిన వీడియోను ఆన్లైన్లో నోబుల్ సంస్థకు పంపించగా, అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.ఇవి చదవండి: కూతురు ఎంపీ.. తండ్రి పెత్తనం -
'అమ్మ తోడు.. నిన్ను వదిలిపెట్టను'.. మంచు మనోజ్ వార్నింగ్!
సోషల్ మీడియాలో పిల్లల ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయడంలో అప్రమత్తంగా ఉండాలని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్ చేశారు. ప్రస్తుత రోజుల్లో సామాజిక మాధ్యమాలు చాలా భయంకరంగా మారాయని తల్లిదండ్రులను హెచ్చరించారు. అయితే టాలీవుడ్ హీరో చేసిన పోస్ట్కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. చిన్నపిల్లలపై అసభ్యంగా ప్రవరిస్తూ వీడియోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.తాజాగా చిన్న పిల్లల భద్రతపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించారు. ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన సహించరానిదని ఆయన అన్నారు. ఫన్ ముసుగులో జరుగుతున్న ఈ దారుణాలు చాలా ప్రమాదకరమని తెలిపారు. ఏడాది క్రితం ఏపీ, తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునేందుకు ఇన్స్టా ద్వారా పి హనుమాన్ అనే వ్యక్తిని సంప్రదించాను.. కానీ అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదని మనోజ్ వెల్లడించారు. ఈ రోజు చూస్తే అతను పసిపిల్లలపై నీచమైన కామెంట్స్ చేస్తున్నాడని మంచు మనోజ్ రాసుకొచ్చారు. మన పిల్లలు, మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని.. ఇలాంటి వారిని అసలు ఉపేక్షించవద్దని తెలుగు రాష్ట్రాల పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు, అమెరికాలోని ఇండియన్ ఎంబసీని కోరారు. పి హనుమంతు.. అమ్మ తోడు.. నిన్ను వదిలిపెట్టను అంటూ అతనికి మంచు మనోజ్ వార్నింగ్ ఇచ్చారు. It’s appalling and intolerable to see individuals like @phanumantwo using social platforms to spread abuse and hate under the guise of humour. This behaviour is not only disgusting but also dangerous.Over a year ago, I reached out to him through Instagram to support women… https://t.co/jQVlZEPqph— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) July 7, 2024 -
'ఇలాంటివి చాలా భయానకం'.. మెగా హీరో మరో ట్వీట్!
సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణాలపై మెగా హీరో సాయిధరమ్ తేజ్ మరో ట్వీట్ చేశారు. పేరేంట్స్ చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో పిల్లల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయవద్దని ఆయన కోరారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మరో ట్వీట్ చేశారు సాయి ధరమ్ తేజ్. ఫన్నీ పేరుతో చిన్న పిల్లలను ట్రోల్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తాజాగా కొంతమంది యూట్యూబర్స్ ఓ తండ్రి, తన చిన్నారి కూతురి వీడియోను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.స్పందించిన భట్టి విక్రమార్కతాజాగా ఈ సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి స్పందించారు. ఇలాంటి క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.. తాము చిన్నపిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. సోషల్ మీడియా వేదికగా చిన్నపిల్లలను ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెడితే సహించేది లేదన్నారు. చిన్నపిల్లల భద్రత కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క ట్వీట్లో పేర్కొన్నారు.Thank you for raising this critical issue @IamSaiDharamTej garu, Child safety is indeed a top priority. we will ensure that our government takes necessary steps to prevent child abuse and exploitation on social media platforms. Let's work together to create a safer online… https://t.co/OGQ4NN4doh— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) July 7, 2024This is beyond gruesome, disgusting and scary.Monsters like these go unnoticed on the very much utilised social platform doing child abuse in the disguise of so-called Fun & Dank.Child Safety is the need of the hour 🙏🏼I sincerely request Hon'ble Chief Minister of Telangana… https://t.co/05GdKW1F0s— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 7, 2024 -
హత్రాస్ ఘటన: కుమార్తె కోసం ఆస్పత్రికి వెళ్లే సరికి..
యూపీలోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మంది మృతిచెందారు. ఈ ప్రమాదం యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ ఘటనలో తన 16 ఏళ్ల కుమార్తెను కోల్పోయిన ఒక తల్లి తన ఆవేదనను మీడియా ముందు వెల్లడించింది.బాధితురాలు కమల మాట్లాడుతూ ‘మేము గత 20 ఏళ్లుగా సత్సంగానికి హాజరవుతున్నాం. ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. ఈ దుర్ఘటనలో నేను నా కుమార్తెను కోల్పోయాను. నా కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎవరో ఫోన్ చేశారు. మేము ఆస్పత్రికి చేరుకునే సమయాకే నా కుమార్తె మరణించింది. ఈ విషయాన్ని వైద్యులే స్వయంగా తెలిపారు’ అని పేర్కొంది.భోలే బాబా సత్సంగం సికంద్రరావు కొత్వాలి ప్రాంతంలోని జిటి రోడ్డులోని ఫుల్రాయ్ గ్రామ సమీపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 40 వేల మంది పాల్గొన్నారు. నిర్వహకులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగి విషాదం చోటుచేసుకుంది. #WATCH | Mother of a 16-year-old who died in the Hathras stampede, Kamala says, " We have been attending the Satsang for the last 20 years and such an incident has never happened...'Parmatama' (Bhole Baba) left around 2-2:30 pm and after that, the incident happened...I lost my… pic.twitter.com/QnAazDZvAa— ANI (@ANI) July 3, 2024 -
బోరుబావిలో పడిన ఏడాదిన్నర చిన్నారి మృతి
గుజరాత్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమ్రేలి జిల్లా సురగపర గ్రామంలో 100 అడుగుల లోతైన బోరుబావిలో పడి , ఏడాదిన్నర వయసుగల బాలిక ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 17 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఈరోజు(శనివారం) తెల్లవారుజామున ఆ బాలికను బోరుబావిలో నుంచి బయటకు తీశారు. అయితే అధికారులు ఆ చిన్నారిని ప్రాణాలతో కాపాడలేకపోయారు.రెస్క్యూ టీం ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బోరుబావిలో దాదాపు 50 అడుగుల లోతులో ఆ చిన్నారి చిక్కుకుపోయింది. తమ కుమార్తె మృతి చెందడంలో తల్లిదండ్రులు పెద్ద పెట్టున రోదిస్తున్నారు. ఆ ప్రాంతమంతా శోక సంద్రంగా మారిపోయింది. ప్రమాద స్థలంలో అంబులెన్స్ , అగ్నిమాపక దళం, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. బాలికకు ఆక్సిజన్ అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.అగ్నిమాపక దళ అధికారి హెచ్సీ గాధ్వి మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు పొలంలో పనులు చేసుకుంటున్నారని తెలిపారు. ఏడాది వయసుగల ఆ చిన్నారికి పాలు తాగించిన తరువాత తల్లిదండ్రులు పనులకు వెళ్లారన్నారు. ఇంతలో వారికి తమ కుమార్తె కేకలు వినపించాయి. వారి కుమార్తె బోరు బావిలో పడిపోయిందని అక్కడున్న పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రులకు తెలిపారు.వెంటనేవారు పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక అధికారులను, ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని అక్కడికి రప్పించారు. రెస్క్యూ బృందం ఆ చిన్నారి బోరుబావిలోని 50 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఆ చిన్నారి తలకిందులుగా ఉందని, ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని అధికారులు గుర్తించారు. దీంతో ఆ చిన్నారికి ఆక్సిజన్ సరఫరా చేశారు. తరువాత రోబోట్ మెషీన్ను కూడా పిలిపించారు. అది ఆ చిన్నారి తలను పట్టుకుని బయటకు తీయడానికి ప్రయత్నించింది. అయితే అప్పటికే ఆ చిన్నారి ఆక్సిజన్ అందక అపస్మారక స్థితికి చేరుకుంది. బయటకు తీసుకువచ్చిన వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. #WATCH अमरेली, गुजरात: अग्निशमन अधिकारी एचसी गढ़वी ने कहा, "करीब 12:30 बजे सूचना मिली थी की एक बच्ची जो करीब डेढ़ साल की है वो बोरवेल में गिर गई है। तुरंत हमारी रेस्क्यू टीम यहां पहुंची। हमने कैमरे से देखा कि बोरवेल करीब 45 फीट गहरा है। बच्ची को सांस देने के लिए ऑक्सीजन दिया जा… https://t.co/4fF7YMHnzO pic.twitter.com/CjQ6J1jTdQ— ANI_HindiNews (@AHindinews) June 14, 2024 -
పిల్లల దత్తతకు డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శిశువుల (పిల్లల) దత్తతకు డిమాండ్ పెరుగుతోంది. సంతాన భాగ్యంలేని వేలాది మంది దంపతులు అనాధ బిడ్డలను పెంచుకొనేందుకు పోటీ పడుతున్నారు. తమకు శిశువులను దత్తత ఇస్తే వారిని బాధ్యతగా పెంచి ప్రయోజకులను చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దత్తత ప్రక్రియను నిర్వహిస్తుంది. సమీకృత బాలల సంరక్షణ పథకం(ఐసీపీఎస్)లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లోని 14 ప్రత్యేక దత్తత ఏజేన్సీలు (శిశు గృహాలు) ఉన్నాయి. వాటి పరిధిలో 110 మంది పిల్లలు (శిశువులు) ఉన్నారు. కాగా, శిశువుల దత్తత కోసం ఏకంగా 1,018 మంది దంపతులు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దత్తత నిబంధనలకు లోబడి అధికారులు అర్హులైన దంపతులను ఆచి తూచి ఎంపిక చేస్తారు. 2020 నుంచి 2024 వరకు మొత్తం 325 మంది పిల్లలను దత్తత ఇవ్వగా వారిలో 186 ఆడ శిశువులు ఉండటం గమనార్హం.నిర్లక్ష్యానికి గురైన బిడ్డలకు వరం దత్తత..కుటుంబ నేపధ్యంలో వదిలివేసిన, నిరాశ్రయమైన, నిర్లక్ష్యానికి గురైన పిల్లల సంరక్షణ, రక్షణకు దత్తత అనేది గొప్ప వరం. అటువంటి పిల్లలకు ప్రేమతో కూడిన కుటుంబ వాతావరణం లభిస్తుంది. అనాథ పిల్లలను దత్తత ద్వారా కుటుంబాల్లోకి తిరిగి చేర్చడమే ముఖ్య ఉద్ధేశం. దత్తత అనేది కుటుంబాల కోసం పిల్లలను ఇవ్వడం కాదు.. పిల్లల కోసం కుటుంబాలను అందించడమే ప్రధానంగా ఉంటుంది. అనాథలైన బిడ్డలకు వసతి, విద్య, వారి ప్రతిభా సామర్థ్యాలు పెంపొందించడంతోపాటు వారికి ప్రేమ, వాత్సల్యం అందించేందుకు దోహదం చేస్తుంది. పిల్లల సరైన అభివృద్ధికి అవసరమైన భావోద్వేగ, శారీరక, మానసిక భద్రతను అందిస్తుంది. పిల్లలు సామాజిక దుర్వినియోగానికి గురికాకుండా నివారిస్తుంది. జాతీయ స్థాయిలో ప్రత్యేక ఏజెన్సీదత్తతకు సంబంధించిన అన్ని విషయాలను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం 1990 జూలై 3న జాతీయ స్థాయిలో ‘సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (సీఏఆర్ఏ)’ ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. సీఏఆర్ఏ 2011 ఫిబ్రవరిలో ‘చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ – గైడెన్స్ సిస్టమ్ (కేరింగ్స్)’ పేరుతో ప్రత్యేకంగా అధికారికంగా https://cara.wcd.gov.in అనే వెబ్సైట్ ప్రారంభించింది. ఈ వెబ్సైట్ ద్వారా దత్తతకు ఆన్లైన్ దరఖాస్తులు, గైడ్లైన్స్ వంటి అనేక అంశాలను పారదర్శకంగా పర్యవేక్షిస్తుంది. దత్తత ప్రక్రియ సులభతరం చేయడంతోపాటు వాటిలో కీలకపాత్ర పోషించే ఏజెన్సీల జవాబుదారీతనాన్ని పెంచుతుంది. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో దత్తతకు ముందు తర్వాత కూడా ఆన్లైన్ పర్యవేక్షణ చేస్తుంది. -
అమ్మకానికి ఆడ శిశువు
-
ఆడుకుంటూ కారులో ఎక్కి ఊపిరాడక.. మణుగూరులో విషాద ఘటన
భద్రాద్రి కొత్తగూడెం, సాక్షి: ముక్కుపచ్చలారని చిన్నారి జీవితం.. మూడేళ్లకే ముగిసింది. బుడి బుడి అడుగులేస్తూ ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారిని మృత్యువు కారు రూపంలో కబళించింది. డోర్లు లాక్ కావడంతో అందులోనే ఊపిరాడక కన్నుమూసింది. మణుగూరు సాంబాయిగూడెంలో ఈ విషాదం చోటు చేసుకుంది. సాయి లిఖిత అనే చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి బయట ఉన్న కారు ఎక్కింది. డోర్లు లాక్ కావడంతో రాత్రంతా అందులోనే ఉండిపోయింది. ఉదయం నిద్ర లేచిన తల్లిదండ్రులు ఆందోళనతో బిడ్డ కోసం అంతా గాలించారు. చివరకు కారులో స్పృహ తప్పి పడి ఉన్న చిన్నారిని గుర్తించారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన ఫలితం దక్కలేదు. అప్పటికే సాయి లిఖిత ఊపిరాడక కన్నుమూసిందని వైద్యులు ధృవీకరించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించగా.. స్థానికంగా విషాదం నెలకొంది. -
Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
సాక్షి, వికారాబాద్: జిల్లోలోని తాండూర్లో దారుణం చోటుచేసుకుంది. పెంపుడు కుక్క స్వైర విహారం చేసింది. తాండూరు పట్టణం బసవేశ్వర నగర్కు చెందిన దత్తు, లావణ్య దంపతుల కుమారుడు ఐదు నెలల పసి కందును పెంపుడు కుక్క పీక్కుతింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పెంపుడు కుక్కను చంపేశారు. తాండూరు పట్టణం బసవేశ్వర నగర్లో ఘటన చోటుచేసుకుంది. -
నేను మంచి తల్లినా కాదా?! మామాఎర్త్ సీఈఓ పోస్టు వైరల్
ఒకప్పుడు ఆడవాళ్లంటే వంటింటికే పరిమితం అయ్యేవారు. అరకొర చదువులు చదివించి.. చిన్న వయసులోనే పెళ్లి చేసి అత్తరింటికి పంపిచేశారు. అమ్మాయిలకు పెద్ద చదువులు చెప్పించడం, ఉద్యోగాలకు పంపడం అన్న మాటే లేదు. కానీ రోజులు, పరిస్థితులు మారాయి. నేటి కాలంలో మగవారితో సమానంగా చదువుతున్నారు అమ్మాయి. ఇటు ఉద్యోగాలు కూడా చేస్తూ తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు పెళ్లి అయ్యాక ఓ వైపు ఇంటిని చూసుకుంటూ మరోవైపు ఉద్యోగం చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే కొన్నిసార్లు వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతలను రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. సగటు వర్కింగ్ విమెన్కు ఉండే సవాళ్లు తాజాగా బ్యూటీ బ్రాండ్ మామాఎర్త్ సహ-వ్యవస్థాపకురాలు, సీఈఓ గజల్ అలఘ్కు కూడా ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ భావోద్వేగ పోస్టు నెట్టింట్లో వైరల్గా మారింది. గజల్ తన కొడుకును తొలిరోజు పాఠశాలకు తీసుకెళ్లాలని అనుకుంది. కానీ తనకున్న పనుల వల్ల అది సాధ్యపదడలేదు. దీంతో ఆమె ఎంతో బాధపడిపోయింది. కుమారుడితో కలిసి మొదటి రోజు పాఠశాలకు వెళ్లకపోడంతో ‘నేను చెడ్డ తల్లినా?’ అనే ప్రశ్న తన మదిలో మెదిలినట్లు చెప్పుకొచ్చింది. చివరికి తన కొడుకును వాళ్ల నానమ్మతో స్కూల్కు పంపినట్లు పేర్కొంది. ‘నా కుమారుడిని తొలి రోజు పాఠశాలకు తీసుకెళ్లడానికి కుదర్లేదు. అప్పుడు ను మంచి తల్లిని కాదా? అనే ప్రశ్న నా మదిలో మెదిలింది. ఆ సమయంలో చాలా ఏడ్చా. బాధ పడ్డా. ధైర్యం తెచ్చుకొని వాళ్ల నాన్నమ్మతో స్కూల్కి పంపించా. మీరు ఎంత కోరుకున్నా కొన్నిసార్లు సెలవు తీసుకోవడం కుదదు. అది ఎంత విలువైనది అయినా సరే. అలా మొదటిరోజు స్కూల్కు వెళ్లేందుకు కుమారుడు చూపిన ఉత్సాహం, చిరునవ్వు, కన్నీళ్లు, పాఠశాల్లో అడుగు పెట్టగానే ఉపాధ్యాయులు, పిల్లల్ని చూసి కలిగే ఆందోళన.. ఇవన్నీ చూడలేకపోయా’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. అదేవిధంగా తన కుటుంబ సపోర్ట్ను కూడా అలఘ్ ఈ పోస్టులో వివరించారు. నేను, వరుణ్ అలగ్, కుమారుడు అగస్త్య, మా అత్త ఐదేళ్ల కిత్రం ఉమ్మడి కుటుంబంలో ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు నాలుగుతరాల వాళ్లంతా ఒకే ఇంట్లోనే ఉంటున్నాం. ఉద్యోగం చేస్తున్న ప్రతిఒక్కరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. సొంతవాళ్లే కావాలనేం లేదు. దగ్గరి బంధువులు, అర్థం చేసుకునే స్నేహితులున్నా పర్లేదు. అయితే, ప్రతీ విషయంలోనూ లాభాలు, నష్టాలు ఉంటాయి. అయినప్పటికీ ఉమ్మడి కుటుంబం అనేది పిల్లలకు అద్భుతమైన వాతావరణం. తల్లులు కెరీర్ లక్ష్యాలను పక్కనపెట్టకుండా.. ప్రేమ, రక్షణ అందించే ప్రదేశం’ అంటూ సుదీర్ఘ మైన పోస్ట్ రాసుకొచ్చారు. -
ప్రెగ్నెన్నీ సమయంలో పిల్లి మాంసం తినడంతో..పాపం ఆ బిడ్డ..!
మన పెద్దవాళ్లు ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకునే ఆహారాలు బిడ్డపై ఎఫెక్ట్ చూపిస్తాయని పదేపదే చెప్పేవారు. అది ఎంతవరకు నిజమో గానీ!.. ఇక్కడొక మహిళ ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తే అది నిజమేనేమో..! అని అనుకుంటారు. ఆమె తన పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఏం జరిగిందంటే..ఫిలిప్పీన్స్కు చెందిన అల్మా అనే మహిళకు రెండేళ్ల కొడుడు జారెన్ గమోంగన్ ఉన్నాడు. అతడు ముఖం, శరీరాన్ని కప్పి ఉంచేలా పెద్ద వెంట్రుకలతో జన్మించాడు. దీన్ని అరుదైన 'వేర్వోల్ఫ్ సిండ్రోమ్'గా పిలుస్తారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 నుంచి 100 వరకు ఉన్నాయి. అయితే జారెన్ కడుపులో ఉండగా తల్లి అల్మా అడవి పిల్లులు తినాలనే కోరిక ఎక్కువగా ఉండేదట. అదీగాక అక్కడ అపయావో ప్రాంతంలో పిల్లితో చేసే వంటకం బాగా ప్రసిద్ధి. దీంతో ఒక రోజు నల్లపిల్లిని తెచ్చుకుని వండుకుని తింది. అప్పుడు ఆమెకు ఏమి అనిపించలేదు. ఎప్పుడైతే తన కొడుకు ఇలా మెడ, వీపు, చేతులు, ముఖంపై ఓ ఎలుగుబంటి మాదిరిగా జుట్టుతో ఉండటంతో పశ్చాత్తాపం చెందడం మొదలు పెట్టింది అల్మా. తాను గర్భవతిగా ఉండగా ఆ నల్లపిల్లిని తినడం కారణంగా తన కొడుకు ఇలా పుట్టాడని, ఆ పిల్లి శాపం తనకు తగిలిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తోటి స్థానికులు, గ్రామస్తులు కూవా అల్మాతో అడవి పిల్లి తినడం వల్లే ఇలా జరిగిందని అనడంతో దాన్నేనమ్మడం మొదలు పెట్టింది. ఐతే అందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు. ఇక్కడ ఆమె జారెన్ కంటే ముందు ఓ కుమార్తె ఉంది. ఆమెకు ఈ పరిస్థితి లేదు. కొడుకు అరుదైన పరిస్థితిని చూసి అల్మా తాను చేసిన పనికి నిందించుకుంటూ విలపిస్తోంది. వైద్యులను ఆశ్రయించినా అల్మాకు నిరాశ ఎదురయ్యింది. ఎందుకంటే వైద్యులు అల్మా కొడుకు జారెన్కు అనేక వైద్య పరీక్షలు చేసి అతడు హైపర్ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితితో బాధపడుతున్నట్లు తెలిపారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ డెర్మటాలజీ ప్రకారం..ఈ హైపర్ట్రికోసిస్ అనేది సాధారణంగా మానవుడికి ఉండే జుట్టు కంటే అధికంగా ఏ భాగంలోనైనా పెరగొచ్చు. ఇది అరుదైన వ్యాధి అని, దీనికి చికిత్స లేదని తేల్చి చెప్పారు. అయితే జారెన్ ఇలాంటి అరుదైన పరిస్థితితో పుట్టినప్పటికీ మంచి యాక్టివ్గా అందరిలానా ఉండటం విశేషం. ఐతే ఒక్కోసారి వేడి వాతావరణంలో ఈ దట్టమైన వెంట్రుకల కారణంగా దురద పుడుతుందని చెబుతున్నాడని అల్మా వాపోయింది. తాను చాలా సార్లు జుట్టుని కత్తిరించడానికి ప్రయత్నించానని, అయితే అది పొడవుగా మందంగా ఉండటంతో కత్తిరించిన కొద్ది దట్టంగా పెరుగుతున్నట్లు చెప్పుకొచ్చింది అల్మా. అయితే లేజర్ హెయిర్ రిమూవల్ వంటి చికిత్సలు అధిక జుట్టు పెరుగుదలను తగ్గించగలవని వైద్యులు సూచించారు. దీంతో అల్మా, ఆమె భర్త తన కుమారుడి హెయిర్ రిమూవల్ సెషన్లకు నిధులు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఏదీ ఏమైనా ప్రెగ్నెన్సీ సమయంలో శిశువుకి హానికరం అనిపించేవి తీసుకోకుండా ఉంటేనే మంచిది. దేనిల్ల కొన్ని రకాల రుగ్మతలు వస్తాయన్నిది సరిగా వైద్యులు సైతం నిర్థారించలేరు, చెప్పలేరు అనేది గుర్తించుకోండి. (చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
చిన్నారులు బరువు పెరుగుతున్నారా? అయితే జాగ్రత్త!
మన దేశంలో అప్పుడే పుట్టిన ఆరోగ్యకరమైన పిల్లలు రెండున్నర కిలోల నుంచి 3 కిలోల వరకు బరువుంటారు. పిల్లల బరువు అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. తల్లిదండ్రుల జీన్స్, తల్లి ఆహారపు అలవాట్లు, గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి వచ్చిన రుగ్మతలు, తల్లి బరువు వంటి అంశాలపై పిల్లల బరువు ఆధారపడి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఎక్కువ తేడా లేకుండా.. ఈ బరువుకు కాస్త అటు ఇటుగా ఉన్న పిల్లలూ ఆరోగ్యంగా పుట్టినట్టే. కొన్ని సూచనలతో చిన్నారులు ఆరోగ్యంగా బరువు పెరుగుతున్నారో లేదో తెలుసుకోవచ్చు. పిల్లలు పుట్టాక మొదటి వారంలో– పుట్టినప్పుడు ఉన్న బరువు కంటే మొదట్లో కాస్త తగ్గుతారు. నిర్దిష్టంగా చెప్పాలంటే మొదటి వారం పదిరోజుల్లో పుట్టిననాటి బరువులో 5 శాతం నుంచి 10 శాతం బరువు తగ్గుతారు. ఇక రెండోవారం నుంచి క్రమేణా బరువు పెరుగుతూపోతారు. మొదటి మూడు నెలల్లో దాదాపు రోజుకు 20 నుంచి 30 గ్రాములు పెరుగుతూ పోతే... మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు రోజుకు 10 నుంచి 15 గ్రాముల వరకు పిల్లలు బరువు పెరుగుతారు. ఇలా చూస్తే మొదటి ఐదునెలల్లో పుట్టినప్పటికంటే రెట్టింపు (డబుల్) బరువు, ఏడాదికి మూడు రెట్ల (ట్రిపుల్) బరువు పెరగాలి. కానీ పాపలందరూ ఇలాగే పెరగాలని లేదు. కాస్త అటు ఇటుగా ఉన్నా అది ఆరోగ్యకరమైన బరువే. అయితే ఈ లెక్కకు దూరంగా ఉంటే మాత్రం తగినంత బరువు పెరగడం లేదని అర్థం చేసుకోవాలి. తల్లి నుంచి రెండు రకాల పాలు.. బిడ్డ పాలు తాగేప్పుడు తల్లి నుంచి రెండు రకాల పాలు వస్తాయి. మొదట వచ్చే పాలను ఫోర్ మిల్క్ అంటారు. రెండోసారి పాలను హైండ్ మిల్క్గా పేర్కొంటారు. అంటే ఈ హైండ్ మిల్క్ పాప కాసిన్ని పాలు తాగాక వస్తాయి. నిజానికి ఫోర్ మిల్క్ కంటే.. హైండ్ మిల్క్ చాలా బలవర్ధకమైనవి. బరువు పెరగడానికి ఇవే ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫోర్ మిల్క్ను ప్రసవం కాగానే స్రవించే ముర్రుపాలతో ΄÷రబాటు పడవద్దు. ముర్రుపాలు వేరు, ఫోర్ మిల్క్ వేరు. పుట్టగానే స్రవించే ముర్రుపాలు శిశువుకు చాలా మంచివి. రోగనిరోధకతను ఇస్తాయి. ఫోర్ మిల్క్ అంటే... పాలు పట్టడం మొదలు పెట్టగానే మొదట స్రవిస్తాయి. ఓ పది–పదిహేను గుటకల తర్వాత హైండ్ మిల్క్ స్రవిస్తాయి. తగినంత బరువు పెరగడం లేదంటే.. తల్లి పాలు సరిపోక పోవడం లేదా బిడ్డ సరిగా తాగకపోవడం, బిడ్డ పూర్తిగా తాగకుండా మధ్యలోనే నిద్రపోవడం, పాలు తాగకపోవడానికి కొన్నిసార్లు తల్లి వైపునుంచి, మరికొన్నిసార్లు బిడ్డ వైపు నుంచి కూడా కారణాలు ఉండవచ్చు. తల్లి బిడ్డకు పాలు సరిగా పట్టకపోవడం జరగవచ్చు. పాలు పడుతున్నప్పుడు చిన్నారి దృష్టి పాల నుంచి పక్కకు మళ్లవచ్చు. పాలపీక అలవాటు చేయడం వల్ల చిన్నారులు పాలు సరిగా తాగరు. ఎనీమియా, యూరినరీ ఇన్ఫెక్షన్స్, చెవిలో ఇన్ఫెక్షన్స్, అలర్జీల వంటిఆరోగ్యపరమైన సమస్య ఉన్నా బరువు పెరగకపోవచ్చు. బరువు పెరగడానికి.. రెండు మూడు గంటలకు ఓమారు పాలు పట్టించాలి. ∙ఓ రొమ్ము పట్టించాక ఆ రొమ్ము నుంచి పాలు పూర్తిగా తాగిందో లేదో నిర్ధారణ చేసుకోవాలి. ఇందుకు చేయాల్సింది... బిడ్డ పూర్తిగా పాలు తాగాక చిన్నారికి అదే రొమ్మును అందిస్తే ముఖం తిప్పుకోవడం, రొమ్ము అందుకోకపోవడం చేస్తుంది. ఓ రొమ్ములోని పాలు పూర్తిగా పట్టించాక రెండో రొమ్ము కూడా అందించాలి. అప్పుడు ఆ రెండో రొమ్ము పాలు తాగకపోయినా– బిడ్డ సంతృప్తిగా ఉంటే పూర్తిగా పాలు తాగినట్లే. బిడ్డకు పాలు సరిపోతున్నాయో లేదో తెలుసుకోడానికి రోజులో ఎన్నిసార్లు పక్క తడుపుతోందన్న అంశం కూడా ఓ సూచన. పాప పగటిపూట కనీసం నాలుగయిదుసార్లు పక్క తడుపుతుంటే.. పాలు సరిపోతున్నాయని అనుకోవచ్చు. చికిత్స ఎప్పుడంటే..? పైన పేర్కొన్న అంశాలను జాగ్రత్తగా గమనిస్తూ, పాప బరువును ప్రతివారం పరీక్షిస్తూ ఉండాలి. అప్పటికీ బిడ్డ బరువు వయసుకు తగి నంతగా పెరగడం లేదంటే... ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో వైద్యపరీక్షల ద్వారా తెలుసుకుని, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. — డా. శివనారాయణరెడ్డి వెన్నపూస, నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రిస్ట్ ఇవి చదవండి: చల్లచల్లని కూల్ కూల్ -
Ugadi2024 అంజలి ‘పాప’ ఎంత ముద్దుగుందో..! (ఫోటోలు)
-
వైద్యుల నిర్లక్ష్యం : ఆసుపత్రి గేటు వద్దే ప్రసవం, చివరికి!
జైపూర్: నవమాసాలు నిండిన నిండు గర్భిణిని కుటుబ సభ్యులు కాన్పు కోసం ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యులు పట్టించుకోలేదు. అడ్మిషన్కు నిరాకరించారు. దీంతో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆమె ఆసుపత్రి గేటువద్దే బిడ్డను ప్రసవించిన ఘటన ఆందోళన రేపింది. రాజస్థాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గర్భిణీ స్త్రీకి అడ్మిషన్ నిరాకరించి,నిర్లక్ష్యంగా వ్యవహరించి వైద్యులపై రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముగ్గురు రెసిడెంట్ వైద్యులను సస్పెండ్ చేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యులు కుసుమ్ సైనీ, నేహా రాజావత్, మనోజ్ను సస్పెండ్ చేశామని వైద్య విద్య అదనపు ముఖ్య కార్యదర్శి శుభ్రా సింగ్ వెల్లడించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే, తక్షణమే విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సరిగ్గా పర్యవేక్షించని కారణంగా కన్వాటియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. రాజేంద్ర సింగ్ తన్వర్కు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశామన్నారు. -
కర్ణాటక: బోరుబావిలో పడ్డ బాలుడిని క్షేమంగా బయటకు తీసిన SDRF
-
జగనన్న చొరవ.. ఆ బాలుడి గొంతు పలికింది
సాక్షి, హైదరాబాద్/అమరావతి: ప్రమాదవశాత్తు స్వరపేటిక పూర్తిగా చితికిపోయి క్లిష్టపరిస్థిత్లులో చికిత్స కోసం ఎదురు చూస్తున్న తొమ్మిదేళ్ల బాలుడికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసాతో పునర్జన్మ లభించింది. మాట కోల్పోయిన అతడు ఇప్పుడు గలగలా మాట్లాడగలుగుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని నకరికల్లుకు చెందిన షేక్ ఖాజాబీ, బాజీ దంపతులకు తొమ్మిదేళ్ల కొడుకు మహ్మద్ ఉన్నాడు. ఫిబ్రవరి 29న స్కూల్కి వెళ్లిన బాలుడు తోటి పిల్లలతో ఆడుకుంటూ ఇనుప చువ్వ మీద జారిపడ్డాడు. ఆ చువ్వ గొంతులో బలంగా గుచ్చుకోవడంతో అతడి శ్వాసనాళం, స్వరపేటిక పూర్తిగా చితికిపోయాయి. దీంతో మాట నిలిచిపోయి, శ్వాస పీల్చుకోవడానికి సైతం ఇబ్బందిగా మారింది. బాలుడిని నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వెంటిలేటర్ సహాయంతో అంబులెన్స్లో హైదరాబాద్ తరలించారు. మహ్మద్ను పరిశీలించిన నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు శ్వాస తీసుకోవడానికి తాత్కాలికంగా ఒక కృత్రిమ పైప్ అమర్చి, మరింత మెరుగైన వైద్యం కోసం కాంటినెంటల్ హాస్పిటల్కు వెళ్లాలని సూచించారు. అరుదైన శస్త్రచికిత్సతో.. కాంటినెంటల్ హాస్పిటల్స్ లేరింగాలజిస్ట్ స్పెషలిస్ట్ దుష్యంత్ బృందం మహ్మద్ను పరిశీలించి అతడికి అతికష్టమైన, అరుదైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయాలని నిర్ధారించారు. లెరింగాలజీలో ఫెలోషిప్ చేసిన నిష్ణాతులైన వైద్యులు మాత్రమే ఈ సర్జరీ చేయగలరని, ఏ మాత్రం తేడా వచ్చినా తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందుకు రూ.6 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అయితే.. అంత ఖర్చు భరించే స్తోమత లేని ఆ పేద తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సోషల్ మీడియా ద్వారా బాలుడి ఆరోగ్య స్థితిని తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అతడి ఆరోగ్యాన్ని చక్కదిద్దేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఏపీ సీఎంవో అధికారులు కాంటినెంటల్ హాస్పిటల్స్కు ఫోన్చేసి.. బాలుడికి చికిత్సతోపాటు ఆరోగ్యం చక్కబడటానికయ్యే ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. వెంటనే వైద్యులు బాలుడికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి శ్వాసనాళాన్ని పునరుద్ధరించి.. క్లిష్టమైన స్వరపేటికను బాగు చేశారు. దీంతో బాలుడికి మాటొచ్చింది. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు ఖాజాబీ, బాజీ మాట్లాడుతూ.. కష్టకాలంలో తమ కుటుంబాన్ని సీఎం జగన్ ఆదుకున్నారని, ఉచితంగా చికిత్స చేయించారని కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ సాయం చేయకపోతే తమబిడ్డ జీవితాంతం మూగవాడిగా ఉండేవాడని పేర్కొన్నారు. -
Delhi: బోరు బావిలో చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
దేశ రాజధాని ఢిల్లీలోని ఒక బోరుబావిలో చిన్నారి పడిపోయింది. ఈ ప్రమాదం ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంట్లో చోటుచేసుకుంది. కేశోపూర్ మండి సమీపంలోని ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంట్లోని 40 అడుగుల లోతైన బోరుబావిలో ప్రమాదవశాత్తూ ఓ చిన్నారి పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ, ఎన్డిఆర్ఎఫ్, ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారిని రక్షించేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీ అగ్నిమాపక శాఖ సిబ్బంది మాట్లాడుతూ బోరుబావిలో పడిన చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. ఎన్డిఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ వీర్ ప్రతాప్ సింగ్తో పాటు ఆ శాఖ బృందం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. బాధిత చిన్నారిని బయటకు తీసుకువచ్చేందుకు ఆ బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి , చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు కృషి చేస్తున్నారు. #WATCH | Delhi: A child fell into a 40-foot-deep borewell inside the Delhi Jal Board plant near Keshopur Mandi. The NDRF team has reached the site along with Inspector-in-charge Veer Pratap Singh from NDRF. It will soon start rescue operations by digging a new borewell parallel… pic.twitter.com/CbD4GAKzR3 — ANI (@ANI) March 10, 2024 -
బాలరాముని చిత్రపటాలకు ఆదరణ.. కోట్లలో వ్యాపారం!
అయోధ్యలో బాలరాముడు కొలువైనది మొదలు ఆ ప్రాంతపు తీరు తెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు అయోధ్య ఆర్థిక వ్యవస్థ ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. అయోధ్యకు ప్రతిరోజూ రెండు నుండి మూడు లక్షల మంది రామభక్తులు తరలివస్తున్నారు. అయోధ్యకు వస్తున్నవారంతా ఎంతో ఉత్సాహంతో శ్రీరామునికి సంబంధించిన వస్తువులను కొనుగులు చేస్తున్నారు. రామాలయంలో దర్శనం ముగించుకున్నాక భక్తులు శ్రీరాముని చిత్రపటాలను కొనుగోలు చేసేందుకు షాపింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్య మార్కెట్లో చిన్న సైజు శ్రీరాముని చిత్రపటం నుంచి పెద్ద సైజు చిత్రపటం వరకూ అన్నీ విరివిగా అమ్ముడవుతున్నాయి. అలాగే రామాలయం నమూనా చిత్రం, కీ చైన్, స్టిక్కర్, మాగ్నెట్ స్టాండ్, లాకెట్, బాలరాముని చిత్రాన్ని ముద్రించిన జెండాతో సహా 20 నుండి 30 రకాల వస్తువులను భక్తులు కొనుగోలు చేస్తున్నారు. అయోధ్యకు చెందిన వ్యాపారి అశ్వనీ గుప్తా మాట్లాడుతూ, రాముని చిత్రాలను భక్తులు ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇది తమ వ్యాపారస్థాయిని విపరీతంగా పెంచుతున్నదన్నారు. ఫలితంగా చాలామందికి ఉపాధి కూడా లభిస్తున్నదన్నారు. అయోధ్యలో భక్తుల రద్దీ పెరగడంతో ఇక్కడి వ్యాపారాలు కూడా బాగా సాగుతున్నాయి. ముఖ్యంగా బాలరాముని చిత్రాలకు గిరాకీ అనూహ్యంగా పెరిగింది. కోట్ల రూపాయల మేరకు బాలరాముని చిత్రాల వ్యాపారం సాగుతోంది. -
చదువుకో తమ్ముడా... చదువుకో చదువుకుంటే కలలు పండే కాలమే నీదవుతది
దిల్లీలోని కమలానగర్ మార్కెట్కు దగ్గరలో ఉన్న ఫుట్పాత్పై కూర్చున్న ఒక పిల్లాడు శ్రద్ధగా చదువుకుంటూనే మరో వైపు హెయిర్ బ్యాండ్లను అమ్ముతున్నాడు. ఇది చూసిన హ్యారీ అనే ఫోటోగ్రాఫర్ పిల్లాడితో మాటలు కలిపాడు. ఆరో క్లాసు చదువుతున్న పవన్ తన కుటుంబానికి సహాయంగా ఉండడం కోసం పుట్పాత్పై హెయిర్ బ్యాండ్లు అమ్ముతుంటాడు. అలా అని చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయడు. ఏ రోజు పాఠాలు ఆ రోజు శ్రద్ధగా చదువుకుంటాడు. తన కుటుంబ స్థితిగతులను హ్యారీకి చె΄్పాడు పవన్. ఇన్స్టాగ్రామ్లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో తక్కువ టైమ్లోనే పది మిలియన్లకు పైగా వ్యూస్తో దూసుకు΄ోయింది. పవన్ కుటుంబానికి అండగా నిలబడడానికి చాలామంది ముందుకు రావడం మరో విశేషం. -
బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? ఎలా దరఖాస్తు చేయాలి?
భారతదేశంలోని ప్రతీ ఒక్కరికి ఆధార్ కార్డు ఎంతో అవసరం. అటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలన్నా, ఇటు విద్యా సంబంధిత విషయాలకైనా ఆధార్ తప్పనిసరి. ‘ఆధార్’ అనేది దేశంలోని అన్ని ప్రాంతాల్లో చెల్లుబాటు అయ్యే ప్రధాన గుర్తింపు కార్డు అని చెప్పుకోవచ్చు. ఆధార్ కార్డును దేశంలోని అందరికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేస్తుంది. అయితే బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి? దీనిని ఎవరికి జారీ చేస్తారనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంటుంది. ఈ ప్రత్యేక కార్డును దేశంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలకు జారీ చేస్తారు. ఇది నీలి రంగులో ఉన్న కారణంగానే దీనిని బ్లూ ఆధార్ కార్డు అని అంటారు. సాధారణ ఆధార్ కార్డుకు ఇది భిన్నంగా ఉంటుంది. పెద్దల మాదిరిగా కాకుండా, పిల్లలకు కార్డులు జారీ చేయడానికి బయోమెట్రిక్ డేటా అవసరం లేదు. దీనికి బదులుగా యూఐడీకి లింక్ అయిన ఆ చిన్నారుల తల్లిదండ్రుల సమాచారం, వారి ఫొటోల ఆధారంగా పిల్లలకు బ్లూ ఆధార్ కార్డు జారీ అవుతుంది. అయితే, పిల్లలకు ఐదేళ్లు దాటాక ఆధార్ కార్డు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఫొటో కూడా అవసరమవుతుంది. పిల్లల జనన ధృవీకరణ పత్రం లేదా ఆసుపత్రి డిశ్చార్జ్ స్లిప్ను చూపించి నవజాత శిశువుకు సంబంధించిన బాల్ ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. -
ఈ ట్విన్స్ చిరుహాసానికి దక్కిన పదం.. 'షాయరీ ఆన్ స్నో'
చిన్నారుల వచ్చిరాని మాటలు భలే ముద్దు ముద్దుగా ఉంటాయి. వారితో గడుపుతుంటే రోజులే తెలియవు. అలాంటిది చిన్నారులకు సంబంధించిన వీడియోలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెటిజన్లను ఇట్టే ఆకర్షిస్తాయి. అమాయకత్వంతో కూడిన ఆ మాటలు వింటే ఎంతటి పెద్దవాళ్లైన చిన్న పిల్లాడిలా మారిపోవాల్సిందే. అంతలా ఆకట్టుకుంటాయి వారి మాటలు చేష్టలు. అందులోనూ ట్వీన్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అలాంటి ట్విన్ సిస్టర్స్కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అందులో.. ఆరు సంవత్సరాల వయసు ఉన్న కశ్మీరి ట్విన్ స్విస్టర్స్ జైబా బింటీ తలిబ్, జైనబ్ బింటీ తలిబ్ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. కశ్మీర్లో ఫస్ట్ స్నోఫాల్ను సెలబ్రెట్ చేసుకోవడానికి సంబంధించిన వీడియో ఇది. ఒకేరకం దుస్తులు ధరించి, మంచుతో నిండిన వీధిలో నిలబడి 'హమ్ యహా పే బహుత్ జాదా ఎంజాయ్ కర్ రహే హై. మస్తీ కర్ రహే హై' అంటూ పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న మాటలు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర 'షాయరీ ఆన్ స్నో' కాప్షన్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో పదకొండు మిలియన్లను దక్కించుకుంది. ఇవి చదవండి: Pillala Katha: పాపన్న కొలువు! -
Ap: రూ.15 లక్షల ఇంజెక్షన్.. ఉచితంగా అందించిన ప్రభుత్వం
సాక్షి,తూర్పుగోదావరి: పేదలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుంటుందని మరోసారి రుజువైంది. రాజమండ్రిలో హీమోఫిలియా వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) నుంచి ప్రభుత్వం భారీ సాయం అందజేసింది. సీఎంఆర్ఎఫ్ ద్వారా 15 లక్షల రూపాయల విలువైన అరుదైన ఇంజెక్షన్ను స్విట్జర్లాండ్ నుంచి తెప్పించి మరీ బాలుడికి చికిత్స అందించారు. కార్డియాలజిస్ట్ పీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజమండ్రి ఆస్పత్రిలో బాలుడికి ఇంజెక్షన్ చేశారు. ఇదీచదవండి.. ఏపీ అసెంబ్లీ అప్డేట్స్ -
‘పెళ్లెప్పుడు?’ పిల్లాడి ప్రశ్నకు రాహుల్ ఏమన్నారు?
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్లోని కిషన్గంజ్లో కొనసాగింది. ఈ సమయంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్గా మారింది. ఈ పర్యటనలో రాహుల్ గాంధీని ఆరేళ్ల బుడ్డోడు మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగాడు. దీనికి రాహుల్ గాంధీ సరదా సమాధానం ఇచ్చారు. అదేమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోవాల్సిందే! ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఉన్న రాహుల్ను ఆ కుర్రాడు ఈ ప్రశ్న అడగగానే రాహుల్ గాంధీ కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అర్ష్ అనే ఆరేళ్ల బాలుడు రాహుల్ గాంధీకి సంబంధించి ఓ బ్లాగ్ క్రియేట్ చేశాడు. దానిలో ఆ కుర్రాడు రాహుల్ గాంధీని కాబోయే ప్రధానిగా అభివర్ణించాడు. ఆ కుర్రాడు రాహుల్ గాంధీని ‘మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అని అడిగాడు. దీనికి రాహుల్ సమాధానమిస్తూ ‘ఇప్పుడు నేను పనిలో బిజీగా ఉన్నాను. తర్వాత ఆలోచిస్తాను’ అని అన్నారు. తరువాత వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కాగా బీహార్ వచ్చిన రాహుల్ను చూసేందుకు జనం తరలివచ్చారు. ఈ యాత్ర మణిపూర్లో ప్రారంభమై పశ్చిమ బెంగాల్ మీదుగా బీహార్కు చేరుకుంది. -
ఆ చిన్నారికి తన కన్నీళ్లు, చెమటే అలర్జీ!
కొందరూ చెప్పేందుకు, వినేందుకు బాధకరంగా ఉండే చిన్న చిన్న వాటితో వర్ణనాతీతమైన బాధ అనుభవిస్తుంటారు. ఆ వ్యాధి ఇది అని కూడా నిర్థారించలేక వైద్యులు సైతం తలపట్టుకుంటారు. అత్యంత విచిత్రమైన రుగ్మతలతో కొందరూ చిన్నారులు బాధపడుతుంటారు. వారికి, వారిని కన్నవారికి చెప్పుకోలేని ఆవేదన ఇది. ఎందువల్ల ఆ సమస్య ఉత్ఫన్నమవుతోంది నిర్థారించిన అందుకు సరైన చికిత్స విధానం లేక మరో సమస్య. పగవాడికి కూడా ఈ సమస్య వద్దు అనేలా ఉంటాయి ఆ ఆరోగ్య సమస్యలు. ఇక్కడ అలాంటి విచిత్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది ఓ చిన్నారి. వివరాల్లోకెళ్తే..క్వీన్స్లాండ్లోని కర్యాన్ జిమ్మ్ అనే మహిళ తన 11 ఏళ్ల కూతురు సుమ్మా విలియమ్స్ పడుతున్న ఆవేదన గురించి కన్నీటిపర్యంతమయ్యింది. తాను మొదట్లో తన చిన్నారికి వచ్చిన సమస్యను వడదెబ్బగా తప్పుగా అర్థం చేసుకున్నానట్లు తెలిపింది. ఏడ్చినా, చెమట పట్టినా..ఒక్కసారిగా ఆమె చర్మం ఎర్రగా మారి ప్రతి చోట పగళ్లు ఏర్పడటం జరుగుతోంది. దీంతో తాను తన కూతురు బయట ఎండకు ఎక్స్పోజ్ కావడంతో అలా అయ్యి ఉంటుందని భావించి తేలిగ్గా తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే అది కాస్త తీవ్రమైన దురదతో కూడిన మంటతో బ్రిస్బేన్లోని ఆస్పత్రిలో చేరే వరకు ఆ సమస్య ఏంటన్నది తనకు తెలియలేదని ఆవేదనగా చెప్పుకొచ్చింది ఆ చిన్నారి తల్లి. అక్కడ వైద్యులు ఆమె కన్నీళ్లు, చెమటే ఆమెకు అలెర్జీగా పరిణిమించి ఇలా మంటతో కూడిన దురద వచ్చి ఎర్రగా అవుతున్నట్లు వెల్లడించారు. శరీరంపై పగుళ్లుకు కారణం అదేనని చెప్పడంతో తాము షాక్కి గురయ్యినట్లు పేర్కొంది. ఆ అలెర్జీని తామరకు సంబంధించిన చర్మ వ్యాధిగా వైద్యులు నిర్థారించినట్లు తెలిపింది. అంతేగాదు తన కూతురిని తీసుకుని బయటకు వెళ్లిన ప్రతి చోట ఆమెను చూసి వడదెబ్బకు గురయ్యిందా? అని అందరూ అడుగుతున్నట్లు చెప్పుకొచ్చింది ఆ తల్లి. తన కూతురుకి డ్యాన్స్ అంటే ఇష్టమని, అందులో ఆమె మంచి నర్తకిగా అవార్డు కూగా గెలుచుకుందని చెప్పుకొచ్చింది. అయితే డ్యాన్స్ చేస్తే కచ్చితంగా చెమట పడుతుంది. దీంతో ఆమె ఆ చర్మ సమస్యను ఫేస్ చెయ్యక తప్పడం లేదు. కన్నీళ్ల అంటే ఎప్పుడో పరిస్థితిని బట్టి వచ్చేవి, కానీ చెమట అనేది మనం శ్రమించినా, లేదా టెన్షన్ పడ్డ ఆటోమెటిక్గా వచ్చేవి. దీంతో ఆ చిన్నారికి ఈ సమస్య వర్ణనాతీతంగా మారింది. ప్రస్తుతం ఆ చిన్నారికి ఈ సమస్యను వైద్యులు వివిధ ఇంజెక్షన్లతో నివారించే ప్రయత్నం చేస్తున్నారు. తన కూతురు పదేపదే తన స్నేహితుల్లా తన చర్మం ఎందుకు లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటుదంటూ ఆ చిన్నారి తల్లి ఆవేదనగా చెబుతోంది. కాగా, ముర్డోక్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం..ప్రపంచంలోనే అత్యధికంగా తామరకు సంబంధించిన చర్మ వ్యాధితో ఆస్ట్రేలియాలోని చిన్నారులే ఎక్కువుగా బాధపడుతున్నట్లు సమాచారం. (చదవండి: దేశంలోనే తొలి 'చేతి మార్పిడి' శస్త్ర చికిత్స! అదికూడా కిడ్నీ మార్పిడి..) -
ఘోరం: కేన్సర్ చిన్నారిని గంగలో ముంచి..
నమ్మకం మనిషి ఎదుగుదలకు సాయపడాలే తప్ప ప్రాణాల మీదకు తీసుకురాకూడదు. ప్రస్తుత సమాజంలో నమ్మకాలను మూడనమ్మకాలుగా మార్చుతున్నారు. విశ్వాసాల పేరుతో మానవత్వాన్ని మరచి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తమతోపాటు ఇతురల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మూఢ నమ్మకం పేరుతో జరిగిన అలాంటి ఓ అమానవీయ ఘటనే తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. అనారోగ్యం బారిన పడిన కొడుకుని నయం చేసేందుకు తల్లిందండ్రులు చేసిన ప్రయత్నం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. ఢిల్లీకి చెందిన కుటుంబంలో అయిదేళ్ల చిన్నారి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే పిల్లాడి తల్లిదండ్రులు మూఢ విశ్వాసాలను నమ్మి పిల్లవాడిని హరిద్వార్ తీసుకెళ్లలనుకున్నారు. అక్కడి గంగ నదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల ఏదో అద్భుతం జరిగి బాలుడి ఆరోగ్యం కుదుటపడుందని గుడ్డిగా విశ్వసించారు. అనుకున్నది పనిగా బుధవారం ఢిల్లీ నుంచి ట్యాక్సీలో బయల్దేరారు. అప్పటికే అస్వస్థతకు గురైన బాలుడు.. హరిద్వార్కు చేరుకునే సమయానికి అతని పరిస్థితి మరింత దిగజారిపోయింది. చదవండి:మార్కులు తక్కువ వచ్చాయని... హరిద్వార్లోని హర్కీ పౌరికి వద్దకు వచ్చిన బాలుడి తల్లిదండ్రులు వాగు ఒడ్డున మంత్రాలు పఠించారు. పిల్లవాడిని గంగనాదిలో స్నానం చేయించేందుకు నీటిలో ముంచారు. పసివాడు భయంతో ఏడుస్తూ గట్టి అరిచినా పట్టించుకోకుండా గంగంలో పదేపదే ముంచాడు. బాధతో కొడుకు అల్లాడుతుంటే ఆ తల్లి మాత్రం వెకిలి నవ్వుతో ‘ నా పిల్లవాడు లేచి నిలబడతాడు.. అది నా వాగ్దానం’ అంటూ చెబుతోంది. చివరికి ఊపిరాడక చిన్నారి నీటిలోనే చనిపోయాడు. ఈ దృశ్యాలను ఘాట్కు అవతలివైపు ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్లో రికార్డ్ చేశాడు. అనంతరం అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు ఘాట్ వద్దకు చేరుకునేసరికి పిల్లవాడు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు, అత్తను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు హర్ కీ పైరీ ఎస్హెచ్ భావన కైంతోలా తెలిపారు. -
మీ చిన్నారులలో ఈ సమస్యా..? అయితే వెంటనే ఇలా చేయండి!
'చిన్నపిల్లల చర్మం చాలా కోమలంగా ఉంటుంది. చలికాలంలో వారి చర్మం పొడిబారడంతో అనేక సమస్యలు వస్తాయి. మొదటే మృదువైన చర్మం. దానికి తోడు చలికాలంలో పొడిబారి పగలడం, చిట్లడం వంటి అనర్థాలు చోటు చేసుకుంటాయి. వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘అటోపిక్ డర్మటైటిస్’ అంటారు. ఈ సీజన్లో నెలల పిల్లలు మొదలు.. ఎదిగిన పిల్లల్లోనూ అనేక వయసు చిన్నారులో కనిపించే అటోపిక్ డర్మటైటిస్ సమస్యలు, వాటికి పరిష్కారాలను తెలిపే కథనమిది.' అటోపిక్ డర్మటైటిస్లో మొదట్లో చర్మం పొడిబారి, దురదతో ఎర్రగా మారుతుంది. పిల్లలు ఆ ప్రాంతంలో పదే పదే గీరుతుండటంతో చర్మం కాస్త మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘లైకెనిఫికేషన్’ అంటారు. ఇది జరిగాక దురద ఇంకా పెరుగుతుంది. దాంతో మరీ ఎక్కువగా గీరడం, దేనికైనా రాస్తుండటంతో చర్మం మరింత మందమవుతుంది. ఈ ప్రక్రియలు ఒకదాని తర్వాత మరొకటి ఒక సైకిల్లా (ఇచ్ అండ్ స్క్రాచ్ సైకిల్) సాగుతుంటాయి. కొందరిలో ఇదొక దీర్ఘకాలిక సమస్య (క్రానిక్)గా కూడా మారవచ్చు. ఎందుకిలా జరుగుతుందంటే.. చలికాలంలో చెమ్మ (తేమ) ఇగిరిపోతూ ఉండటంతో చర్మం పొడిబారడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఇలాంటప్పుడు చర్మం పొడిబారి, ఎర్రబారుతుంది. కుటుంబ ఆరోగ్య చరిత్రలో ఆస్తమా, డస్ట్ అలర్జీలు ఉండేవారిలో అటోపిక్ డర్మటైటిస్ సమస్య ఎక్కువ. వివిధ వయసుల పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్ తీవ్రత ఇలా.. రోజుల పిల్లల నుంచి 12 నెలల వరకు.. ఈ వయసు పిల్లల్లో చర్మం ఎర్రబారడం ప్రధానంగా ముఖంపైన, మెడ దగ్గర కనిపిస్తుంటుంది. అయితే కొందరిలో దేహంలోని ఏ ప్రాంతంలోనైనా ఇలా జరిగే అవకాశముంది. ఉదాహరణకు పాకే పిల్లల్లో వాళ్ల మోకాళ్లు నేలకు ఒరుసుకుపోతుండటం వల్ల మోకాళ్ల దగ్గర ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది. ఏడాది నుంచి రెండేళ్ల పిల్లల్లో.. ఈ వయసు పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్తో చర్మం ప్రభావితం కావడమన్నది చర్మం ముడతలు పడే ప్రాంతాల్లో ఎక్కువ. అంటే.. మోచేతులు, మోకాళ్ల వెనక భాగం, మెడ పక్కభాగాలు, ముంజేయి, పిడికిలి, మడమ వంటి ప్రాంతాల్లో అన్నమాట. ఈ వయసు పిల్లల్లో చర్మం ముడుత వద్ద ఒక గీతలా (స్కిన్లైన్) ఉన్నచోట్ల దురద వచ్చి, అది పగులు బారుతున్నట్లవుతుంది. రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో.. ఈ వయసు పిల్లల్లో చర్మం పొడిబారడం కాస్త ఎక్కువ. పైగా ఈ పొడిబారడమన్నది మోకాళ్ల కింది భాగంలో ఎక్కువ. అందుకే ఈ వయసు పిల్లల కాళ్లు.. పొడి బారినప్పుడు బయట ఆడి వచ్చినట్లుగా తెల్లగా కనిపిస్తుంటాయి. ముఖం పెద్దగా పగలదు. కానీ... పెదవులు పొడిబారి, పగుళ్లలాగా వస్తుంది. పెదవుల చుట్టూ చర్మమంతా పగుళ్లుబారి ఓ సరిహద్దులా స్పష్టంగా కనిపిస్తూ, ఆ భాగం మంట పుడుతుంటుంది. దీన్ని ‘పెరీ–ఓరల్ డర్మటైటిస్’ అంటారు. ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో.. ఏడేళ్ల వయసు నుంచి (అంతకంటే తక్కువ వయసు పిల్లలతో పోలిస్తే) పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా పెరుగుతూ పోతుంటుంది. కాబట్టి ఈ వయసునుంచి లక్షణాల తీవ్రత క్రమంగా తగ్గుతూ పోతుంది. అయితే ఈ వయసు పిల్లల్లోనూ చర్మం పొడిబారుతుంది. ఈ సమస్యలతో పాటు కొందరిలో సైనుసైటిస్ కూడా ఉండవచ్చు. చికిత్స / మేనేజ్మెంట్ తొలి దశ చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్): అటోపిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లలకు తొలి దశల్లో చికిత్స చాలా తేలిక. చర్మంపై పొడిదనాన్ని తగ్గించడానికి వైట్ పెట్రోలియమ్ జెల్లీ, లిక్విడ్ పారఫీన్ ఆయిల్ వంటివి రాస్తే చేస్తే చాలు. పగుళ్లు, దురద, పొడిదనం తగ్గుతాయి. దాంతో గీరుకోవడం తగ్గుతుంది. రాత్రి నిద్రపడుతుంది. అలర్జీని ప్రేరేపించే అంశాలను నివారించడం: సబ్బులు, డిటర్జెంట్లు.. అలర్జీని ప్రేరేపిస్తున్నాయా అన్నది చూసుకోవాలి. అలా జరుగుతుంటే.. సబ్బులను, డిటర్జెంట్లను మార్చాలి. ఘాటైన సబ్బులకు బదులు మైల్డ్గా ఉండే క్లెన్సెర్స్ తో శుభ్రం చేసుకోవాలి. పిల్లల్ని పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. పిల్లల్లో అలర్జీ కలిగించే ఆహారాన్ని గుర్తించి (ముఖ్యంగా నట్స్, సీ ఫుడ్), ఒకవేళ ఆ ఆహారాలతో అలర్జీ వస్తుంటే వాటి నుంచి దూరంగా ఉంచాలి. పూత మందులతో చికిత్స: పిల్లలకు ఎమోలియెంట్స్ అని పిలిచే.. లిక్విడ్ పారఫీన్, గ్లిజరిన్, మినరల్ ఆయిల్ వంటివి పూయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. స్నానం చేయించిన వెంటనే ఎమోలియెంట్స్ పూయాలి. తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఎమోలియెంట్స్ పూశాక వాటిపైన పూతమందుగా వాడే స్టెరాయిడ్స్ కూడా వాడవచ్చు. పైపూతగా వాడే స్టెరాయిడ్స్ను ఎక్కువ రోజులు వాడకుండా ఉండేందుకు టాపికల్ క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్ క్రీమ్ వాడవచ్చు. డాక్టర్ల సలహా మేరకు పైపూత యాంటీబయాటిక్, స్టెరాయిడ్ కాంబినేషన్స్ను వాడవచ్చు. నోటిద్వారా తీసుకోవాల్సిన మందులు: నిద్రకు ముందు డాక్టర్ సలహా మేరకు నాన్ సెడెటివ్ యాంటీహిస్టమైన్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. రెండోదశ చికిత్స: మొదటిదశ చికిత్స (ఫస్ట్లైన్ ట్రీట్మెంట్)తో అంతగా ఫలితం లేనప్పుడు స్టెరాయిడ్ డోస్ పెంచడమూ, అప్పటికీ గుణం కనిపించకపోతే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సి రావచ్చు. అల్ట్రా వయొలెట్ రేడియేషన్ చికిత్స: కొంతమంది పిల్లలకు అల్ట్రావయొలెట్ బి– కిరణాలతో చికిత్సతో మంచి ఫలితాలు వస్తాయి. మూడో దశ చికిత్స (థర్డ్ లైన్ ట్రీట్మెంట్): నోటిద్వారా కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వడం లాంటి ఈ థర్డ్ లైన్ ట్రీట్మెంట్ అంతా పూర్తిగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే జరగాలి. వెట్ ర్యాప్ టెక్నిక్.. అటోపిక్ డర్మటైటిస్ తీవ్రత ఎక్కువగా ఉంటే ‘వెట్ ర్యాప్ టెక్నిక్’తో మంచి ఫలితాలుంటాయి. చర్మమంతా పగుళ్లు ఉన్న పిల్లలకు మొదట ఎమోలియెంట్స్ పూయాలి. ఆ తర్వాత ఒంటిపైన బ్యాండేజ్ను ఒక పొరలా కట్టి, దాన్ని గోరువెచ్చని నీటితో తడపాలి. దానిపైన మరో పొరలా పొడి బ్యాండేజ్ వేయాలి. ఇలా వేసిన బ్యాండేజీని ప్రతి పన్నెండు గంటలకు ఒకమారు మార్చాలి. దీన్నే వెట్ ర్యాప్ టెక్నిక్ అంటారు. దీంతో అటోపిక్ డర్మటైటిస్ తీవ్రతను తగ్గించవచ్చు. లక్షణాలు.. చర్మం పొడిబారి దురదలు వచ్చాక గుల్లలు, నీటిగుల్లలూ రావచ్చు. ఎర్ర బారినచోట చర్మం పొట్టు కట్టినట్లు అవుతుంది. మందంగానూ (లైకెనిఫికేషన్) మారుతుంది. కొన్నిసార్లు కాస్తంత పొట్టు రాలడంతోపాటు అక్కడ గాటు కూడా పడవచ్చు. మందంగా తెట్టుకట్టిన చర్మం పై పొర లేచిపోయినప్పుడు అక్కడ ద్రవం ఊరుతుండవచ్చు (ఊజింగ్). ఈ దశలోనూ చికిత్స అందకపోతే సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంది. డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్ ఇవి చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ మిరాకిల్ జ్యూస్ తాగితే..! -
22న పుట్టేవారంతా సీతారాములే..!
జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభం కానుంది. అలాగే బాలరాముని ప్రతిష్ఠాపన మహోత్సవం కూడా జరగనుంది. దేశంలోని చాలామంది ఆరోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తున్నారు. దీంతో తమకు ఆరోజు పుట్టబోయే చిన్నారులకు రాముడు లేదా సీత అనే పేరుపెట్టాలని చాలామంది తహతహలాడుతున్నారు. దేశంలోని పులువురు గర్భిణులు తాము జనవరి 22న బిడ్డకు జన్మనివ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ఆరోజు తమకు పుట్టబోయే పిల్లలకు రాముడు లేదా సీత అనే పేరు పెట్టాలని నిర్ణయించుకుంటున్నారు. యూపీలోని మీరట్కు చెందిన ఒక సీనియర్ డాక్టర్ మాట్లాడుతూ పలువురు గర్భిణులు జనవరి 22న డెలివరీ చేయాలని తమ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. అబ్బాయి పుడితే రాముడు అని అమ్మాయి పుడితే సీత అని పేరు పెడతామని వారు చెబుతున్నారన్నారు. ఇది కూడా చదవండి: వారికి శ్రీరాముడు ‘మామ’? బంధుత్వం ఎలా కలిసింది? -
పోలీసు, మావోయిస్టుల కాల్పుల్లో పసికందు మృతి
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో పోలీసులు, మానోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని మాట్వాండిలో సోమవారం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో ప్రమాదవశాత్తు మాట్వాండికి చెందిన ఆరు నెలల పసికందు మృతి చెందగా.. తల్లి గాయాల పాలైంది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి పోలీసులు సాయం అంధించారు. పోలీసులు, మానోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు నక్సలైట్లకు గాయాలు అయ్యాయి. చదవండి: గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ను టెర్రరిస్టుగా ప్రకటించిన భారత్! ఇంతకీ నేపథ్యం ఏంటంటే.. -
గంపెడు సంతానం దీర్ఘాయుష్షుకు గ్యారెంటీ కాదు!
ఎక్కువ సంతానం ఉంటే అంత దీర్ఘాయువు ఉంటుందని విశ్వసించేవారు మన పెద్దవాళ్లు. కానీ అది వాస్తవం కాదని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. త్వరితగతిన పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యువులు మనిషి ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. ఈ పరిశోధన మనిషి వృధాప్య రహస్యాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని సుగమం చేసిందన్నారు. ఇక్కడ పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యువులు మనిషి జీవితకాలంపై ఎలా బలంగా ప్రభావం చూపిస్తున్నాయో అనేదాని గురించి చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పునురుత్పత్తి మనిషి జీవితకాలం తగ్గిపోవడానికి లింకప్ చేయబడి ఉంటుందన్న సరికొత్త విషయాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. త్వరితగతిన పిల్లలను కనడాన్ని ప్రోత్సహించే జన్యువులు తక్కువ జీవిత కాలన్ని సూచిస్తాయని అన్నారు. ఈ మేరకు మిచిగాన్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో తొందరగా తల్లిదండ్రులుగా మారిన వారి జీవితకాలం సుమారు 76 ఏళ్ల వరకే ఉంటున్నట్లు వారి సంభావ్యత జన్యువుల సంబంధం ఆధారంగా నిర్థారించారు. ఈ ఆవిష్కరణ వృధాప్య రహస్యన్ని చేధించే పరిశోధనను సులభతరం చేస్తోందన్నారు శాస్త్రవేత్తలు. అలాగే ఈ సృష్టి మానవుడికి ఇచ్చే జీవిత దశలు చాలా ఆశ్చర్యకరంగానూ, సంక్లిష్టంగానూ ఉంటాయన్నారు. ఈ అధ్యయనంలో దాదాపు 2 లక్షల మంది పైగా వ్యక్తులు పాల్గోన్నారు. వారందరి జన్యువులు, పునరుత్పత్తి, వారి జీవిత కాలాన్ని సేకరించి ఆ డేటా ఆధారంగా ఈ కొత్త విషయాన్ని కనుగొన్నామని అన్నారు. జీవశాస్త్రవేత్త జియాంజీ జాంగ్ మనషి జీవిత కాలన్ని జన్యుపరంగా పునురుత్పత్తి చాలా బలంగా పరస్పర సంబంధం కలిగి ఉందన్నారు. అంటే ఇక్కడ పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యు పరివర్తనలే జీవితకాలాన్ని తగ్గిస్తాయి. ఇది కాస్త హాస్యస్పదంగా అనిపిస్తున్నా కాస్త నిశితంగా గమనిస్తే గర్భ నిరోధకం, గర్భస్రావం, తదితరాల ఆరోగ్య సంరక్షణపై ప్రభావం చూపుతాయన్నది వాస్తవం. కాబట్టి పునరుత్పత్తి అనేది మనిషి ఆయుర్దాయంపై ప్రభావం చూపుతుందన్నది పరిశోధకులు వాదన. అదే సమయంలో ఇక్కడ జన్యు సంసిద్ధత తోపాటు కొంత పర్యావరణ కారకాలు కూడా మనిషి జీవితకాలం తగ్గిపోయేందుకు కారణమని చెబుతున్నారు. ఇక్కడ పునురుత్పత్తి, జీవితకాలం మద్య జరగుతున్న జన్యు ఉత్ఫరివర్తనాలకు సంబంధించిన సంక్లిష్ట చర్యను అర్థం చేసుకుంటే వృద్ధాప్య రహస్యాన్ని సులభంగా చేధించగలమని అన్నారు. ఈ అధ్యయనాలు వృధాప్యం(వయసు) అనేది సహజ ప్రక్రియ అని, అది పునరుత్పత్తి అనే అంశంపైనే బలంగా ఆధారపడి ఉందని చెబుతున్నాయన్నారు. ఎందుకంటే? మన ఫిట్నెస్ అనేది పునురుత్పత్తి ఆధారంగానే సెట్ చేసి ఉంటుంది. అందువల్ల పునరుత్పత్తి ప్రక్రియ పూర్తవ్వడం పైనే లైఫ్ స్పాన్ నిర్ణయించబడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (చదవండి: కలవరపెడుతున్న 'జాంబీ డీర్ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?) -
‘రామనంది’ సంప్రదాయం ఏమిటి? అయోధ్యలో పూజారులెవరు?
అయోధ్యలోని రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం 2024, జనవరి 22న జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశంలోని పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ‘రామనంది’ సంప్రదాయంలో అయోధ్య రామాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సంప్రదాయం భవిష్యత్తులోనూ కొనసాగనుంది. ఇంతకీ ‘రామనంది’ శాఖను ఎవరు స్థాపించారు? ఈ సంప్రదాయంలోని నియమాలు ఏమిటి? రామనంది శాఖను జగత్గురు శ్రీ రామానందాచార్య స్థాపించారు. ఈ శాఖ బైరాగిల నాలుగు పురాతన శాఖలలో ఒకటి. దీనిని బైరాగి శాఖ, రామవత్ శాఖ, శ్రీ శాఖ అని కూడా పిలుస్తారు. కాశీలోని పంచగంగా ఘాట్ వద్ద రామనంది శాఖకు చెందిన పురాతన మఠం కూడా ఉంది. ఈ శాఖకు చెందిన వారు ప్రధానంగా శ్రీరాముని పూజిస్తారు. ఈ శాఖలోని వారు జపించే మంత్రం ‘ఓం శ్రీరామాయ నమః’ ఈ శాఖను అనుసరించేవారు శుక్లశ్రీ, బిందుశ్రీ, రక్తశ్రీ మొదలైన తిలకాలను ధరిస్తారు. రామనంది శాఖకు శ్రీరాముడు ప్రధాన దైవం. ఈ వర్గానికి చెందిన వారు బాలునిరూపంలోని శ్రీరాముని పూజిస్తారు. అంటే చిన్నపిల్లలను ఎంత అల్లారుముద్దుగా చూసుకుంటారో అదేవిధమైన తీరులో భగవంతుని పూజిస్తారు. వీరు పూజా విధానంలో బాలరాముడిని ప్రతిరోజూ ఆకర్షణీయంగా అలంకరిస్తారు. శ్రీరాముని చిన్న పిల్లవానిగా భావించి.. ఉదయాన్నే నిద్ర లేవడం, స్నానం చేయించడం, గోరుముద్దలను తినిపించడం లాంటివి తమ పూజా విధానంలో భాగంగా ఆచరిస్తుంటారు. రామనంది శాఖ కొన్ని వందల ఏళ్లుగా అయోధ్యలోని రామాలయంలో పూజలు నిర్వహిస్తోంది. నూతన రామాలయంలో కూడా బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ అనంతరం రామనంది వర్గానికి చెందిన పూజారులే ఇక్కడ సమస్త పూజలు చేయనున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు రాకండి! -
ఏడేళ్లకే పోలీసయ్యాడు !
-
పిల్లలు స్మార్ట్ఫోన్లు అధికంగా వాడుతున్నారా? హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్?
ప్రస్తుత కాలంలో ఎవరింట చూసినా పిల్లల చేతిలో స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ఐపాడ్లు ఉండవలసిందే! స్మార్ట్ఫోన్లు అధికంగా వాడుతున్న పిల్లలు కదలకుండా ఒకేచోట కూర్చొని ఉంటారు. దీనివల్ల వారు చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు ఫోన్ లేదా టీవీ చూస్తూ ఉంటే కాస్త ఎక్కువే తినేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం, కీళ్ల సమస్యలు, గుండె జబ్బులు వంటి వాటి బారిన పడే ప్రమాదం పెరిగిపోతుంది. వీటన్నింటి నుంచి రక్షించాలంటే పిల్లలు స్మార్ట్ఫోన్ వాడకుండా చేయాలి. అదెలాగో చూద్దాం. పిల్లల మనసు అద్దం లాంటిది. తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న ఇతర పెద్దలు ఏం చేస్తున్నారో చూసి అదే అలవాటు చేసుకుంటారు. కాబట్టి ఇంట్లో ఉన్న సమయంలో తల్లిదండ్రులు, ఇతర పెద్దలూ స్మార్ట్ఫోన్, లాప్టాప్ వంటివి చూడకూడదని గుర్తుంచుకోండి. పిల్లలకు ఫోన్ చూస్తూ తినే అలవాటు ఉంటే, వాళ్లకు ఆకలిగా ఉన్నప్పుడే అన్నం పెట్టండి. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు అల్లరి చేయరు. మొబైల్ గురించి ఆలోచించరు. తిండిపైనే ధ్యాస పెడతారు. మొబైల్ లేకుండా ఐదు నిమిషాల పాటు వారికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. పేచీ పెట్టకుండా సరిగ్గా తింటే, ఈ సమయాన్ని పెంచవచ్చు. పిల్లలకు తినిపించేటప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఉండండి. వంటకాలు ఎలా ఉన్నాయో అడగండి. నవ్వుతూ... కబుర్లు చెబుతూ, జోకులేస్తూ, సరదాగా గడిపితే మొబైల్ ఫోన్ చూపించి తిండి పెట్టాల్సిన అవసరం ఉండదు. చిన్నప్పటినుంచి పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. ముందు బొమ్మల పుస్తకాలతో మొదలు పెట్టండి. ఆ తర్వాత పజిల్స్ పూర్తి చేయడం, కథల పుస్తకాలు, వార్తా పత్రికలలో పిల్లలకోసం కేటాయించే కథనాలను చదవడం అలవాటు చేయడం వల్ల వారి దృష్టి స్మార్ట్ఫోన్ పైకి మళ్లదు. పిల్లలకు బాల్యం నుంచి చుట్టుపక్కల పిల్లలతో ఆటలు ఆడటం అలవాటు చేయాలి. వారి వయసు పిల్లలు లేకపోతే మీరే వారితో ఆడుకోండి. కాసేపు ఔట్డోర్ ఆటలు, కాసేపు చెస్, క్యారమ్స్ వంటివి ఆడటం అలవాటు చేస్తే స్మార్ట్ఫోన్ బారిన పడకుండా స్మార్ట్గా తయారవుతారు. -
నాడు కసబ్ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది?
అది 2008.. నవంబర్ 26.. ముంబైలోని శివాజీ టెర్మినస్ స్టేషన్.. పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గంలో వచ్చిన ఉగ్రవాదులు జనం మధ్య విధ్వంసం సృష్టించారు. రైల్వేస్టేషన్లో ఉగ్రవాదులు దాదాపు 50 మందిని హతమార్చారు. ఈ ఘటనలో 100 మంది గాయపడ్డారు. ఈ దారుణ మారణకాండ ముగిశాక.. ఉగ్రవాది అజ్మల్ కసబ్పై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఓ తొమ్మిదేళ్ల బాలిక దేశంలో చర్చనీయాంశంగా నిలిచింది. ఆ బాలిక పేరు దేవిక రోత్వాన్. దాడి జరుగుతున్న సమయంలో ఆమె శివాజీ టెర్మినస్లో ఉంది. నాటి దాడిలో ఆమె కాలికి గాయమైంది. కోర్టులో కసబ్ను గుర్తించిన అతి పిన్న వయస్కురాలు దేవిక. ఆ సమయంలో ఆ చిన్నారికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఒక ఫొటోలో ఆ చిన్నారి ఊత కర్రల సాయంతో కోర్టుకు చేరుకున్న ఫొటో ఉంది. అయితే దేవిక జీవితం ప్రస్తుతం సమస్యల వలయంలో చిక్కుకుంది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఆమెకు ఇప్పుడు 24 ఏళ్లు. జనం ఆమెను గుర్తుంచుకుని, కలుసుకునేందుకు వస్తుంటారు. దేవిక కుటుంబానికి గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం నుంచి రూ.13 లక్షల పరిహారం అందింది. ప్రస్తుతం దేవిక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఆమె ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఆమె తండ్రికి కూడా ఎక్కడా ఉద్యోగం లభించడం లేదు. ప్రభుత్వం ఇస్తామన్న ఇల్లు కోసం ఆమె ఎదురుచూస్తోంది. గతంలో దేవిక కుటుంబం ముంబైలోని చాల్లో ఉండేది. అయితే ఆమెకు పునరావాసం కల్పించడంలో భాగంగా వారి కుటుంబానికి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇచ్చారు. అయితే దీనికి కూడా ఆమె రూ.19 వేలు అద్దె చెల్లించాల్సి వస్తోంది. దేవిక తాను పోలీసు అధికారిని కావాలని ఆశపడుతోంది. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆమె గత కొంత కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతోంది. తాను ఐపీఎస్ అధికారిగా మారాక ఉగ్రవాదాన్ని అంతం చేస్తానని దేవిక మీడియాకు తెలిపారు. ఇది కూడా చదవండి: ఈ ఐదుగురు.. 26/11 అమర వీరులు! -
పిల్లల పెరుగుదల: సరైన పోషకాల స్వీకరణ, ప్రాముఖ్యత
పిల్లల్లో పోషకాహార లోపం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రజారోగ్య సమస్య. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మిలియన్ల మంది పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. బాల్యం వేగవంతమైన వృద్ధి దశలో పిల్లల ఎత్తు బరువు వంటి కీలక మైలురాళ్లు. పిల్లల్లో ఎదుగుదల పోషకాహార లోపం, ఆహారపు అలవాట్లు , శారీరక శ్రమ, వివిధ జీవనశైలి కారకాలతో ముడిపడి ఉంటుంది. స్టన్నింగ్ (వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం) అండర్ వెయిట్ (వయసుకు తగ్గ బరువులేకపోవడం) వేస్టింగ్ (ఎత్తుకు తగ్గ బరువు తక్కువ) లాంటివి కీలక అంశాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 నివేదిక ప్రకారం, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 149 మిలియన్ల మంది పిల్లలు వయసు తగ్గ ఎత్తు ఎదగలేదు. భారతదేశంలో వీరి వాటా దాదాపు మూడింట ఒక వంతు. ఐదేళ్లలోపు వయస్సున్న 40.6 మిలియన్ల మంది పిల్లలు స్టన్నింగ్ కేటగిరీలో నమోదైనారు. సరియైన విజ్ఞానం లేకపోవడం, విద్యాపరమైన విజయాలు, ఉత్పాదకత కోల్పోవడం లాంటివి మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలతో పాటు, ఎదుగుదలపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుంది. ఇది పిల్లల జీవితంలో వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకుండా నిరోధిస్తుంది. పోషకాహార లోపాలు రోగనిరోధక శక్తి క్షీణించడం, ప్రవర్తనా సమస్యలు, ఎముకల ఆరోగ్యం క్షీణించడం, కండరాల్లో శక్తి లేకపోవడం లాంటి ప్రమాదాలకు దారితీయవచ్చు. పిల్లలు ఎదగడానికి, నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన మైలురాళ్లను చేరుకోవడానికి సరైన పోషకాహారం అవసరమైన పునాదులేస్తాయి. పిల్లలకు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు,కొవ్వుతో పాటు కాల్షియం, విటమిన్ D, విటమిన్ K, అర్జినిన్ వంటి సూక్ష్మపోషకాలతో సహా సరైన మొత్తంలో మాక్రోన్యూట్రియెంట్లు అవసరం. పిల్లల వృద్ధి, ఎగుదలలో పోషకాహార జోక్యం కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ గణేష్ కధే, మెడికల్ అండ్ సైంటిఫిక్ అఫైర్స్, అబోట్ న్యూట్రిషన్ బిజినెస్ తెలిపారు. తల్లిదండ్రులు వివిధ స్థూల పోషకాలు, సూక్ష్మపోషకాలతో కూడిన సమతుల్య పోషకాహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. అబాట్, పోషకాహార లోపం పరిష్కారాల కోసం అబాట్ సెంటర్ను ప్రారంభించడంతోపాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కృషి చేయనుంది. నిపుణులు, భాగస్వాముల సహకారంతో, పిల్లలతో సహా, ఇతర జనాభా కోసం పోషకాహార లోపాన్ని గుర్తించడం, చికిత్స , నివారించడంపై దృష్టి ఈ కేంద్రం దృష్టి సారిస్తుంది. పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్రొఫెసర్ పెడ్రో అలార్కోన్ దీనిపై మరిన్ని వివరాలు అందిస్తూ స్టంటింగ్ పై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పోషకాహారం పాత్రను అర్థం చేసుకొని తల్లిదండ్రులు ఓవర్ నూట్రిషన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. పోషకాహార సప్లిమెంట్ పానీయాలను సేవించడం ద్వారా పోషకాహార లోపాన్ని పూరించు కోవచ్చు. అవసరమైన విటమిన్లు, ఖనిజాల స్వీకరణలో కూడా దోహద పడతాయి. ఇది పోషకాల స్వీకరణ సామర్థ్యాన్ని పెంచడం లాంటిదే. దీంతో తీసుకున్న ఆహారంలోని శక్తిని పిల్లల శరీరాలు సంపూర్ణంగా స్వీకరిస్తాయని వివరించారు. పిల్లల ఎదుగుదలకు ప్రోటీన్లు, విటమిన్లు మినరల్స్ కీలకం, అయితే కొన్నిసార్లు కాల్షియం, ఐరన్ జింక్ వంటి 50శాతం పోషకాలు మాత్రమే పిల్లవాడు తినే ఆహారం నుండి లభిస్తాయి. కనుక ఈ విషయంలో పోషకాహార సప్లిమెంట్లు ద్వంద్వ పాత్రను పోషిస్తాయి. ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాల శోషణను మెరుగుపరుస్తాయి. ఇటీవలి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సర్వేలో పట్టణ ప్రాంతాల్లో 33.8శాతం మంది పిల్లలు ఉన్నారని తేలిందని సికింద్రాబాద్, యశోద హాస్పిటల్స్ పీడియాట్రిక్స్, నియోనాటాలజీ విభాగాధిపతి DNB పీడియాట్రిక్స్ ప్రోగ్రాం హెడ్ డాక్టర్ డీరమేష్ తెలిపారు. గ్రామీణ తెలంగాణలో 33 శాతం మంది సరైన ఎదుగుదలకు తోడ్పడటానికి, పిల్లలకు ఐదు ఆహార సమూహాల నుండి వచ్చే స్థూల మరియు సూక్ష్మ పోషకాల మంచి మిశ్రమం కూరగాయలు, పండ్లు, ప్రోటీన్, పాల ఉత్పత్తులు, ఇంకా తృణధాన్యాలు వల్ల ఆరోగ్యకరమైన సంపూర్ణ ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పిల్లలకు అందేలా తల్లిదండ్రులు ఆహారాన్ని అందించాలి. సమతుల్య ఆహారం, అవసరమైనప్పుడు పోషకాహార సప్లిమెంట్ డ్రింక్స్ లాంటి ఆకర్షణీయమైన కలయికతో పిల్లల అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం తోపాటు, పూర్తి సామర్థ్యాన్ని స్వీకరించే శక్తినిస్తుందని పేర్కొన్నారు. -
15 ఏళ్లకే అమ్మ.. 33కు అమ్మమ్మ.. కొత్త ట్విస్ట్ ఇదే!
తల్లి అయ్యే వయసులో అమ్మమ్మగా మారిన ఓ మహిళ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆమె హృదయం ఇప్పుడు మరొకరిని కోరుకుంటోంది. ఆమె ఆ దేశంలో అతి పిన్న వయస్కురాలైన అమ్మమ్మ టైటిల్ను గెలుచుకుంది. ఇప్పుడు ఆ మహిళ తన 34 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లికూతురుగా ముస్తాబవుతోంది. రేచెల్ మెక్ఇంటైర్ అనే మహిళ యునైటెడ్ కింగ్డమ్లో ఉంటోంది. మీడియా కథనాల ప్రకారం ఆమె ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన అమ్మమ్మ. కుమార్తెకు జన్మనిచ్చినప్పుడు రేచెల్ వయసు కేవలం 15 సంవత్సరాలు. పెరిగి పెద్దయిన ఆ కుమార్తెకు వివాహం జరిగింది. ఆమె కూడా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఫలితంగా రేచెల్ తన 33 సంవత్సరాల వయసులో అమ్మమ్మగా మారింది. రేచెల్ జీవిత చిత్రం ఎంతో ఆసక్తికరం. ఈ అమ్మమ్మ ఇప్పుడు మరోమారు పెళ్లికూతురు అవుతోంది. మూరత్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు రేచెల్ తన కుమార్తెకు చెప్పింది. వీరి ప్రేమకు కుమార్తె కూడా మద్దతు పలికింది. కొంతకాలం క్రితం ఆమె మూరత్తో తొలి చూపులోనే ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు. ‘మూరత్ ప్రవర్తన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే అతనిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయానికి నా కుమార్తె కూడా మద్దతు తెలిపిందంటూ’ పెళ్లి కుమార్తెగా మారబోతున్న రాచెల్ సంబరపడుతూ మీడియాకు తెలిపింది. ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్ ఎన్నికలతో భారత్, పాక్, చైనాలకు లింకేమిటి? -
పసితనంలోనే పొదుపు పాఠాలు.. ఎందుకంటే..
కొందరు ఎంత సంపాదించినా నెలాఖరుకు ఏమీ మిగిల్చరు. కొద్దిమంది జీతం అంతంతమ్రాతం అయినా సరైన ఆర్థిక ప్రణాళికతో నగదు పోగు చేస్తారు. డబ్బు నిర్వహణ గురించి తెలియకపోతే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న మనీ మేనేజ్మెంట్ను పిల్లలకు చిన్నప్పుడే పరిచయం చేయాలి. సరైన ఆర్థిక పాఠాల్ని ఇంట్లోనే నేర్పించాలి. ఈ విషయాలపై పిల్లలకు ఎంత తొందరగా అవగాహన కల్పిస్తే అంత మంచిది. చిన్న వయసులో పిల్లలకు నేర్పాల్సిన కనీస అంశాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. జీవితంలో డబ్బు పాత్ర ఎంటో వారికి వివరించాలి. ఎలా సంపాదిస్తారు? అందుకు ఎలాంటి మార్గాలను ఎంచుకుంటారు? వంటి అంశాల్ని వారికి తెలియజేయాలి. ఈ దశలోనే అవసరాలు.. సౌకర్యాలకు మధ్య తేడా ఏంటో ఉదాహరణతో చెప్పాలి. ‘రూపాయి ఆదా చేస్తే.. రూపాయి సంపాదించినట్లే..’ ఈ సూత్రం పిల్లలకు చిన్నప్పుడే నేర్పించాలి. అప్పుడే వారికి ప్రతి రూపాయి విలువ అర్థమవుతుంది. పొదుపు చేస్తే వచ్చే లాభాలను ప్రత్యక్షంగా చూపించాలి. వారితో పొదుపు చేయించి వారికి కావాల్సిన వస్తువుల్ని వాటితోనే కొనివ్వండి. అప్పుడు వారికి ఇంకా సులభంగా అర్థమవుతుంది. పొదుపు గురించి వారికి అర్థమవుతుందనే దశ వచ్చిన తర్వాత నెమ్మదిగా పెట్టుబడుల గురించి వివరించాలి. దీర్ఘకాలికంగా వారికి చేకూరే ప్రయోజనాలను తెలపాలి. ఇంట్లో మీరు చేసిన పెట్టుబడిని.. దాని వల్ల కలిగిన లాభాల్ని వారికి ప్రత్యక్షంగా చూపించాలి. పోస్టాఫీసులు, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి చిన్న చిన్న పెట్టుబడి మార్గాల్ని అలవర్చండి. ఇదీచదవండి: నంబర్ ప్లేట్కే రూ.141 కోట్లు.. కారు విలువ ఎంతంటే.. చాలా మంది ఖర్చు చేసిన తర్వాత మిగిలిన సొమ్ముతో పొదుపు చేస్తారు. కానీ పొదుపు చేసిన తర్వాత అవసరాలకు వెచ్చించాలి. ఆదాయానికి తగ్గట్టే ఖర్చు చేయాలనే సూత్రాన్ని పిల్లలకు వివరించాలి. అందుకోసం ఆర్థిక ప్రణాళిక ఎలా వేసుకోవాలో తెలియజేయాలి. ఇంట్లో ఆదాయం.. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం.. ఎంత పొదుపు చేస్తున్నాం అనే విషయాలను చూపించాలి. వారికి కూడా ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేయాలి. దానికి అనుగుణంగానే ఖర్చు చేయమని చెప్పాలి. అత్యవసర సమయంలో మన ఆర్థిక అవసరాల నిమిత్తం తీసుకునే రుణాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి. ఎలాంటి సమయంలో అప్పు తీసుకోవాలి? ఎప్పుడు ఇతరులకు ఇవ్వాలి అనే విషయాలను వివరించాలి. సకాలంలో చెల్లించకపోతే ఉండే రిస్క్ను తెలియజేయాలి. అలాగే మార్కెట్లో ఉన్న వివిధ రకాల రుణ సదుపాయాలు, వాటి లబ్ధిని చెప్పాలి. ప్రజలు ఎదో ఒక పనిచేసి సంపాదిస్తుంటారు. మరి ప్రభుత్వానికి ఎలా ఆదాయం సమకూరుతుందనే అనుమానం పిల్లలకు ఉంటుంది. సర్కార్కు ఎలా ఆదాయం వస్తుందో వివరించాలి. పన్నుల విధానం ఎలా ఉంటుందో తెలపాలి. వాటిని ఎలా వసూలు చేస్తారో చెప్పాలి. పిల్లలు కాస్త పెద్ద వారైతే జీఎస్టీ విధానంపై అవగాహన కల్పించాలి. ఇదీచదవండి: విప్రోలో ఉద్యోగం వదిలి.. వ్యవసాయంతో రూ.205 కోట్లు సంపాదన డబ్బు నిర్వహణ, ఆదాయ-వ్యయాల నమోదు, ఆర్థిక ప్రణాళిక కోసం అనేక యాప్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని పిల్లలకు పరిచయం చేయాలి. అవి ఎలా వినియోగించాలో వివరించాలి. ఈఎంఐ, ఇన్సూరెన్స్ ప్రీమియం వంటి వాటిని లెక్కించేందుకు ఉన్న కాలిక్యులేటర్లను పరిచయం చేయాలి. వివిధ పేమెంట్ యాప్స్ పనితీరును వివరించాలి. ఈ-పేమెంట్స్ వల్ల కలిగే లాభాలను తెలియజేయాలి. -
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి!
దేశరాజధాని ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. తూర్పు ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలోని ఒక నివాస భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, ఒక చిన్నారి సహా 26 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మంటలు చెలరేగినప్పుడు భవనంలో 60 మంది ఉన్నారని, వీరిలో కొందరు భవనంపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కాగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, 26 మందిని ప్రమాదం బారి నుంచి కాపాడారు. అలాగే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో భవనంలో తొక్కిసలాట జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని కిటికీ పక్కన నిచ్చెనను ఏర్పాటు చేసి, ప్రమాదంలో చిక్కుకున్నవారిని ఒక్కొక్కరిగా రక్షించారు. ప్రమాదం జరిగిన షకర్పూర్ ప్రాంతంలో వీధులు చాలా ఇరుకుగా ఉండడంతో మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇది కూడా చదవండి: హమాస్ చెరలో తొమ్మిది నెలల చిన్నారి.. విడుదలయ్యేనా? -
చాలా బాధ కలిగింది, ప్రతీదీ నిజం కాదు..ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు!
Deeply Disturbed Zara Patel Reacts: నటి రష్మిక మందన్న వైరల్ డీప్ఫేక్ వీడియోకు సంబంధించిన ఒరిజినల్ వీడియో బ్రిటిష్-ఇండియన్ఇన్ఫ్లుయెన్సర్ జారా పటేల్దే. ఈ నేపథ్యంలో తన ఫేస్తో రష్మిక ముఖంతో ఏఐ ద్వారా క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియో వివాదంపై జారా పటేల్ స్పందించారు. ఈ సంఘటన తనను చాలా ఆవేదనకు గురిచేసిందన్నారు. ఈ సంఘటనతో ఇంటర్నెట్లో మహిళలు, అమ్మాయిల భద్రతపై మరింత ఆందోళన కలుగుతోందని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రముఖ నటి ముఖాన్ని ఉపయోగించి ఎవరో డీప్ఫేక్ వీడియోను రూపొందించినట్లు తన దృష్టికి వచ్చిందనీ, ఈ వీడియోతో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ ఫేక్ వీడియో చూసి చాలా ఆందోళన చెందాను అంటూ జారా పటేల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా రష్మికకు తను సానుభూతిని ప్రకటించారు. ఇకపై సోషల్ మీడియాలో యువతులు, మహిళలు ఏదైనా పోస్ట్ చేయాలంటేనే భయపడాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇంటర్నెట్లో వస్తున్న ప్రతీదీ నిజం కాదు. దయచేసి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి అంటూ ఆమె నెటిజన్లుకు సూచించారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: గాయని చిన్మయి శ్రీపాద ఫైర్) కాగా సంచలనం రేపిన టాలీవుడ్ నటి రష్మిక డీప్ఫేక్ వీడియో ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరో భయంకర కోణంపై ఆందోళన రాజేసింది. సోషల్ మీడియాలో బిగ్బీ, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: కేంద్ర మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ) హీరోయిన్లు, సెలబ్రిటీ మహిళలతోపాటు, సాధారణ మహిళలు, టీనేజ్ అమ్మాయిల ఉనికికి ముప్పుగా మారుతోందంటూ ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. (రష్మిక డీప్ ఫేక్ వీడియో : ఎమ్మెల్సీ కవిత రియాక్షన్) -
ఛత్తీస్గఢ్ చిన్నారికి ప్రధాని మోదీ లేఖ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తన చిత్రం గీసిన చిన్నారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేకంగా లేఖ రాశారు. గురువారం ప్రధాని మోదీ ఛత్తీస్గఢ్లోని కాంకేర్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆకాంక్ష అనే చిన్నారి తన చిత్రం గీసి తీసుకువచ్చింది. ప్రధాని మోదీ ఆ చిన్నారిని గమనించి, వేదికపైకి పిలిపించుకున్నారు. వివరాలడిగి ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు. శనివారం చిన్నారి ఆకాంక్షకు ఆయన ఒక లేఖ రాశారు. నేటి బాలికలే దేశ ఉజ్వల భవిత అని పేర్కొన్నారు. నువ్వు తీసుకువచ్చిన స్కెచ్ నాకు చాలా బాగా నచ్చింది. నాపై నువ్వు చూపిన అభిమానం, ప్రేమకు ధన్యవాదాలు. నీకు ఎల్లప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి. భవిష్యత్తులో నువ్వు విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. రాబోయే 25 ఏళ్లు మీలాంటి చిన్నారులకు ముఖ్యమైన రోజులు కానున్నాయి. ఈ కాలంలో ముఖ్యంగా దేశయువతతోపాటు మీలాంటి పుత్రికలు భారత్ కలలను నెరవేరుస్తారు. దేశ భవిష్యత్తుకు కొత్త దిశను అందిస్తారు’అని ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు. -
నాగకేసరి చెట్ల నుంచి జీవ ఇంధనం
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఆసక్తి, విషయ పరిజ్ఞానం, సాధించాలనే తపన ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపించింది ఓ గిరిపుత్రిక. తల్లిదండ్రులు తనని చదివించలేని పరిస్థితుల్లో ఉన్నా, మొక్కవోని దృఢ సంకల్పంతో ఉన్నత చదువుల్లో ప్రతిభ చూపారు రాజేంద్రపాలేనికి చెందిన దిబ్బ చంద్రవతి. ఆమె తల్లిదండ్రులు దిబ్బ సుందర్రావు, సింగారమ్మ కూలీలు. చంద్రవతి పదో తరగతి మండలంలోని పెదమాకవరం పాఠశాలలోను, ఇంటర్ పాడేరు బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ విశాఖలో చదివారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో రెండేళ్లు ఎంఫిల్ చేశారు. పీహెచ్డీలో భాగంగా ‘నాగ కేసరి చెట్ల నుంచి జీవ ఇంధన తయారీ’పై పరిశోధనకు శ్రీకారం చుట్టారు. యూనివర్సిటీ ఆచార్యులు ఎస్బీ పడాల్ పర్యవేక్షణలో పరిశోధన నిర్వహించారు. దీనిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురణలు జరగడంతో ఆమెను డాక్టరేట్ వరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో విలువైన ఔషధాలు ఉన్నాయని తెలిపారు. ఆదిమజాతి గిరిజనులు వృక్షాలతో అన్యోన్యంగా ఉంటారని, వివిధ రకాల రోగాలకు వారి పరిసరాల్లో పెరిగే మొక్కలు, చెట్లను ఉపయోగిస్తారని చెప్పారు. అడవిలో పెరిగే నాగ కేసరి చెట్ల నుంచి సేకరించిన విత్తనాలను నూనెగా మార్చి జీవ ఇంధనంగా తయారు చేశామని ఆమె వివరించారు. తక్కువ ఖర్చుతో ఇంధనాన్ని తయారు చేయవచ్చునని తెలిపారు. పరిశోధన పూర్తి కావడంతో ఏయూ ఉప కులపతి పీవీజీడీ ప్రసాద్ రెడ్డి నుంచి ఈనెల తొమ్మిదిన డాక్టరేట్ అందుకున్నట్టు ఆమె తెలియజేశారు. -
ప్రపంచ ఆకలి సూచీలో...మనకు 111వ స్థానం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆహార సూచీ–2023లో భారత్ 111వ స్థానంలో నిలిచింది. గురువారం విడుదల చేసిన ఈ సూచీలో మొత్తం 125 దేశాల్లో మనకు ఈ ర్యాంకు దక్కింది. దీన్ని లోపభూయిష్టమైనదిగా కేంద్రం కొట్టిపారేసింది. ‘ఇది తప్పుడు ర్యాంకింగ్. దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన బాపతు‘ అంటూ మండిపడింది. అన్ని రకాలుగా పీకల్లోతు సంక్షోభంలో మునిగిన పాకిస్తాన్ (102), అంతే సంక్షోభంలో ఉన్న శ్రీలంక (60)తో పాటు బంగ్లాదేశ్ (81), నేపాల్ (61) మనకంటే చాలా మెరుగైన ర్యాంకుల్లో ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 28.7 స్కోరుతో ఆకలి విషయంలో భారత్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదిక చెప్పుకొచ్చింది. 27 స్కోరుతో దక్షిణాసియా, సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికా ప్రాంతాలు ఆకలి సూచీలో టాప్లో ఉన్నట్టు చెప్పింది. ‘భారత బాలల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా 18.7గా ఉంది. ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 3.1 శాతం, 15–24 ఏళ్ల లోపు మహిళల్లో రక్తహీనత ఉన్నవారి సంఖ్య ఏకంగా 58.1 శాతం ఉన్నాయి‘ అని పేర్కొంది. వాతావరణ మార్పులు, కల్లోలాలు, మహమ్మారులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటివి ఆకలి సమస్యను ఎదుర్కోవడంలో అవరోధాలుగా నిలిచాయని సర్వే పేర్కొంది. ఇదంతా అభూత కల్పన అంటూ కేంద్రం మండిపడింది. ‘ఇది తప్పుడు పద్ధతులు వాడి రూపొందించిన సూచీ. కేవలం 3,000 మందిపై నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఆధారంగా పౌష్టికాహార లోపం శాతాన్ని నిర్ధారించడం క్షమార్హం కాని విషయం. దాంతో బాలల్లో వాస్తవంగా కేవలం 7.2 శాతమున్న పౌష్టికాహార లోపాన్ని ఏకంగా 18.7గా చిత్రించింది. దీని వెనక దురుద్దేశాలు ఉన్నాయన్నది సుస్పష్టం‘ అంటూ విమర్శించింది. -
పిల్లల్లో టాన్సిల్స్ సమస్య ఎందుకొస్తుందంటే..!
పిల్లల్లని వేధించే వాటిలో టాన్సిల్స్ సమస్య ఒకటి. చాలామంది పిల్లలు దీనిబారినపడి పెద్దల్ని నానా ఇబ్బందులు పెడుతుంటారు. ఆఖరికి సర్జరీ చేయించి తీసేయడం జరుగుతుంది. అసలు ఎందుకొస్తుంది. దీన్ని నివారించాలంటే ఏం చేయాలి తదితరాల గురంఇచ ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో చూద్దాం. కొన్ని సార్లు ఇబ్బంది పెట్టినా కూడా టాన్సిల్స్ మంచివి. మనం తీసుకున్న ఆహారంలో ఉండే బాక్టీరియా లాంటి కొన్ని రకాల క్రిములని ఈ టాన్సిల్స్ అడ్డుకుంటాయి. ఒంట్లో బాగా వేడి చేస్తే ఈ టాన్సిల్స్ వాపు చేసి నొప్పి పెడతాయి. టాన్సిల్స్ రావడానికి ప్రధాన కారణం వేడి చేసే పదార్దాలు తినడం (ఫ్రిడ్జ్లో నీరు తాగడం,. కూల్ డ్రింక్స్, మసాలాలు, కారం, పచ్చళ్ళు లాంటివి అన్నమాట). వాతావరణానికి తగ్గట్లు ఆహారపు అలవాట్లలో కొంచెం మార్పు చేసుకుంటే టాన్సిల్స్ పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఒకవేళ మీరు నొప్పితో బాధపడుతుంటే డాక్టరు దగ్గరకి వెళ్లేముందు ఒక్కసారి ఇది చేసి చూడండి. రాళ్ళ ఉప్పు వేసిన వేడి నీరు గొంతు వరకు పోసుకుని పుక్కిలించండి. ఇలా రోజుకి 4 సార్లు చొప్పున 2 రోజులు చేయండి. 90% వరకు నొప్పి మాయం అవుతుంది. అలానే తాగే నీరు కూడా వేడి గా ఉండేలా చూసుకోండి. అదే వృద్దులకు గొంతులో నొప్పి కఫాన్ని తగ్గాలంటే..మెత్తగా దంచి జల్లించి న కరక్కాయ పొడి, తేనెలో కలిపి రెండు పూటలా చప్పరించాలి. ఉదయం లేవగానే గోరు వెచ్చని మంచినీరు రెండు గ్లాసులు త్రాగాలి.రాత్రి పడుక్కోడానికి అరగంట ముందు రెండు చిటికెల పసుపు, నాలుగు మిరియాలు ( దంచిన ముక్కలు) పంచదార కొంచెం ( షుగరు లేకపోతే ఉంటే మెత్తని ఎండు ఖర్జూరం పొడి) ఒక గ్లాసు పాలు లో మరిగించి, వడకట్టి త్రాగాలి. వృద్ధులుకి ఏది ఇచ్చినా అది ద్రవ రూపంలో లేదా మెత్తని పౌడర్ రూపంలో ఉండాలి అయినా కూడా నొప్పి తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్లండి. టాన్సిల్స్కి చిన్నపాటి సర్జరీ ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు, నవీన్ నడిమింటి (చదవండి: బొమ్మలు వేస్తూ ఆ ఫోబియాను పోగొట్టకుంది! ఏకంగా గొప్ప ఆర్టిస్ట్గా..) -
స్కూలు టాయిలెట్లో శిశు జననం.. మాయమైన తల్లి
రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలోగల కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమాజానికి తలవంపులు తెచ్చే ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ రాత్రి వేళ ఒక పాఠశాల టాయిలెట్లో ఆడ శిశువుకు జన్మనిచ్చి, అక్కడి నుంచి పరారయ్యింది. ఆ నవజాత శిశువు రాత్రంతా టాయిలెట్లో రోదిస్తూనే ఉంది. ఉదయం పాఠశాల తెరిచినప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టాయిలెట్లోని నవజాత శిశువును చూసిన పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం పాఠశాల సిబ్బంది ఆ శిశువును స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శిశువును ఉదయ్పూర్కు తరలించారు. ప్రస్తుతం అక్కడ శిశువు పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెత్కియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రివేళ స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోని మరుగుదొడ్డిలో ఓ గుర్తుతెలియని మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆ మహిళ నవజాత శిశువును అక్కడే వదిలి వెళ్లిపోయింది. ఆ శిశువు రాత్రంతా టాయిలెట్లో ఏడుస్తూనే ఉంది. అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో చుట్టుపక్కల వారికి వెంటనే ఈ విషయం తెలియలేదు. మర్నాటి ఉదయం పాఠశాల తెరిచినప్పుడు టాయిలెట్లో నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో కొందరు విద్యార్థులు అక్కడికి వెళ్లారు. అక్కడ రక్తంతో తడిసిన శిశువు ఏడుస్తుండటాన్ని వారు గమనించారు. వారు వెంటనే ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపారు. దీంతో ఈ విషయం కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నవజాత శిశువును స్థానిక రిషభదేవ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం శిశువును ఉదయ్పూర్కు తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఉదయ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపధ్యంలో గుర్తు తెలియని మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ పోలీసులకు ఎటువంటి సమాచారం లభించలేదు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: ప్రపంచ జనాభాలో 1,280 మంది మాత్రమే మిగిలిన విపత్తు ఏది? నాడు ఏం జరిగింది? -
చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని వాగు దాటించిన బాబాయి
కెరమెరి(ఆసిపాబాద్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం లక్మాపూర్లో బాహుబలి సినిమాలో జరిగినట్లు ఓ ఘటన చోటు చేసుకుంది. ఆ సినిమాలో మహేంద్ర బాహుబలిని శివగామి తన చేతిలో పట్టుకుని నదిని దాటినట్లుగా.. లక్మాపూర్ వాగులో ఓ వ్యక్తి చంటి బిడ్డను ఇలా చేతుల్లో పట్టుకుని వాగు దాటాడు. గ్రామానికి చెందిన రాథోడ్ కృష్ణ, సుజాత దంపతుల కూతురు (8 నెలలు) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మరోవైపు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామ శివారులోని వాగు ఉప్పొంగుతోంది. దీంతో పాపను ఆస్పత్రికి తీసుకెళ్లే వీల్లేక మూడు రోజులు వేచి చూశారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. సాయంకోసం కృష్ణ తన తమ్ముడు సాయిప్ర కాశ్ను తీసుకుని బయల్దేరారు. అయితే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సాయిప్రకాశ్ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని గొంతు వరకు నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటారు. తర్వాత చిన్నారి తల్లిదండ్రులు కూడా వాగుదాటారు. అనంతరం ముగ్గురూ కెరమెరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. తిరిగి ఇదే రీతిలో వాగుదాటి ఇంటికి వెళ్లారు. కాగా, ఈ వాగుపై 2016లో వంతెన నిర్మాణం ప్రారంభించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని ఆ ప్రాంతవాసులు చెపుతున్నారు. దీంతో ఏటా వానాకాలంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని లక్మాపూర్ వాసులు వాపోతున్నారు. చదవండి: వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి -
గాలి తగిలితే వణుకు, నీటిని చూస్తే భయం.. రేబిస్తో 14 ఏళ్ల బాలుడు మృతి!
ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో రేబిస్తో 14 ఏళ్ల బాలుడు హృదయవిదారక స్థితిలో కన్నుమూశాడు. నాలుగు రోజుల క్రితం బాలునిలో రేబిస్ లక్షణాలు కనిపించాయి. గాలికి, నీటికి భయపడటంతో పాటు చీకటిలో ఉండేందుకు ఇష్టపడసాగాడు. పిల్లాడి విచిత్ర ప్రవర్తన, అనారోగ్య పరిస్థితులను గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. ఈ ఉదంతం విజయ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని చరణ్సింగ్ కాలనీలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన యూకూబ్ పెద్ద కుమారుడు సాబేజ్ను నెల రోజుల క్రితం కుక్క కరిచింది. భయం కారణంగా సాబేజ్ ఈ విషయాన్ని ఇంటిలోని వారికి చెప్పలేదు. అయితే నాలుగు రోజుల క్రితం ఆ కుర్రాడిలో రేబిస్ లక్షణాలు బయటపడ్డాయి. మొదట్లో ఇంటిలోని వారికి ఏమీ అర్థం కాలేదు. అయితే రానురాను సాబేజ్ ఆరోగ్యం క్షీణించసాగింది. పిల్లాడి ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు సాబేజ్ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యపరీక్షలు చేసిన అనంతరం వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. వైద్యం అందని స్థితిలో సాబేజ్ హృదయవిదారక స్థితిలో కన్నుమూశాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమారునిడి చికిత్స కోసం ఘాజియాబాద్లోని ఎంశ్రీం ఆసుపత్రితో పాటు మీరఠ్, ఢిల్లీలోని జీటీబీ, ఎయిమ్స్ ఆసుపత్రులకు చికిత్స కోసం తీసుకువెళ్లామన్నారు. అయినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సాబేస్ను పొరుగింటిలోని వారి కుక్క కరిచింది. ఒక మహిళ ఆ కుక్కను సంరక్షిస్తోంది. అలాగే ఆమె వీధి కుక్కలను ఆహారం కూడా అందిస్తుంటుంది. దీంతో ఐదారు కుక్కలు ఆమె ఇంటి వద్దనే ఉంటాయి. ఆ మహిళ పెంచుకుంటున్న కుక్క కరవడంతోనే తమ కుమారుడు మరణించాడని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లాడికి జరిగిన విధంగా ఎవరికీ జరగకూడదని వారు అంటున్నారు. ఈ ఉదంతం నేపద్యంలో నగరపాలక అధికారులు ఆ కుక్కను పెంచుకుంటున్న మహిళకు నోటీసు అందజేశారు. తదుపరి చర్యలకు ఉపక్రమించారు. ఇది కూడా చదవండి: విద్యాదానం వీరి జీవన విధానం! -
సీఎం జగన్ మానవత్వం.. చిన్నారి వైద్యానికి రూ.41.5 లక్షల సాయం
అమలాపురం రూరల్: బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. ఆమె వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక పలివెల బ్లెస్సీ కొన్నాళ్లుగా తలనొప్పితో బాధపడుతోంది. తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా.. బ్రెయిన్ క్యాన్సర్గా వైద్యులు నిర్ధారించారు. చికిత్సకు రూ.41.50 లక్షలు అవుతుందని చెప్పారు. బిడ్డకు చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో తండ్రి రాంబాబు తల్లడిల్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న అమలాపురం పర్యటనకు వచ్చిన సీఎం జగన్ దృష్టికి తన బిడ్డ సమస్యను రాంబాబు.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ద్వారా తీసుకువెళ్లారు. ఆ చిన్నారి సమస్య విని చలించిపోయిన సీఎం జగన్ రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి విశ్వరూప్ భార్య బేబీమీనాక్షి, కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ సోమవారం ఆ కుటుంబానికి అందజేశారు. చదవండి: దమ్ము లేకనే.. దత్తపుత్రుడు -
విమానంలో చిన్నారికి గుండెపోటు.. ప్రాణం పోసిన ఎయిమ్స్ డాక్టర్లు
న్యూఢిల్లీ: ప్రాణం పోయడంలో దేవుడి తర్వాత దేవుడిగా డాక్టర్లనే కొలుస్తూ ఉంటారు. ఈ మాటను నిజం చేస్తూ ఎయిమ్స్ డాక్టర్లు రెండేళ్ల చిన్నారికి ఊపిరి పోశారు. బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో రెండేళ్ల చిన్నారికి గుండెపోటు రావడంతో అదే విమానంలో ఉన్న ఐదుగురు ఎయిమ్స్ డాక్టర్లు అత్యవసర ట్రీట్మెంట్ నిర్వహించి బిడ్డ ప్రాణాలు కాపాడారు. బెంగుళూరు నుంచి ఢిల్లీ పయనమైన విస్తార విమానం UK -814లో రెండేళ్ల చిన్నారికి ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి కొద్దిసేపటిలోనే పల్స్ ఆగిపోయింది. బిడ్డ చర్మం నీలిరంగులోకి మారిపోయి శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. దీంతో విమానాన్ని నాగ్పూర్కు మళ్లిస్తున్నట్లు సిబ్బంది అత్యవసర ప్రకటన చేసింది. విషయం తెలుసుకున్న అదే విమానంలో ప్రయాణిస్తున్న ఎయిమ్స్ డాక్టర్లు వెంటనే అప్రమత్తమై బాలికకు సీపీఆర్ నిర్వహించారు. విమానం నాగ్పూర్కు చేరేవరకు బిడ్డ ప్రాణాలను అదిమి పట్టుకున్నారు. ఎలాగోలా ఐవీ క్యానులాను అమర్చగలిగారు. బిడ్డ యధాతథంగా ఊపిరి తీసుకునేంతవరకు ఎయిమ్స్ డాక్టర్లు చాలా శ్రమించారు. చిన్నారిని నాగ్పూర్కు తరలించిన తర్వాత సర్జరీ నిర్వహించగా ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు అక్కడి వైద్యులు. అత్యవసర పరిస్థితుల్లో చిన్నారికి ఇంట్రా కార్డియాక్ రిపేర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎయిమ్స్ వైద్యులు డా.నవదీప్ కౌర్, డా.దమన్దీప్, డా.రిషబ్ జైన్, డా.ఒయిషికా, డా.అవిచల తక్షక్లను అభినందిస్తూ ఢిల్లీ ఎయిమ్స్ ఎక్స్(ఒకపుడు ట్విట్టర్)లో వారికి అభినందనలు తెలుపుతూ చిన్నారితో సహా డాక్టర్ల ఫోటోలను షేర్ చేసింది. #Always available #AIIMSParivar While returning from ISVIR- on board Bangalore to Delhi flight today evening, in Vistara Airline flight UK-814- A distress call was announced It was a 2 year old cyanotic female child who was operated outside for intracardiac repair , was… pic.twitter.com/crDwb1MsFM — AIIMS, New Delhi (@aiims_newdelhi) August 27, 2023 ఇది కూడా చదవండి: రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నాడని.. 27 ఏళ్ల కుమారుని హత్య! -
‘ఏంట్రా ఇదంతా’..‘ఎవర్రా మీరు’.. ‘ఇదేందిది’.. వీటికి బాప్ ఈ వీడియో!
సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. కొందరు కారును హెలికాప్టర్గా మారుస్తారు. మరికొందరు ఇటుకలతో కూలర్ను తయారు చేసేస్తారు. తాజాగా వీటన్నింటికి మించిన ఒక వీడియో వైరల్గా మారింది. దీనిని చూసినవారంతా నోరెళ్ల బెడుతున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లాడి తెలివిని చూసి, అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటి పిల్లలు మొబైల్ ఫోను చూడటంతో ఎంత బిజీ అయిపోయారంటే వారు ఒక్క నిమిషం కూడా ఫోనును విడిచిపెట్టడం లేదు. ఒక కుర్రాడు ఒకవైపు చదువుకుంటున్నట్లు నటిస్తూ, దొంగచాటుగా మొబైల్ ఫోన్ ఎలా చూస్తున్నాడో ఈ వీడియోలో కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పిల్లవాడు టేబుల్పై కూర్చుని చదువుకోవడంతో పాటు అతని ముందున్న గోడకు ఆనుకుని, తీగతో మొబైల్ వేలాడదీయడాన్ని మనం గమనించవచ్చు. పిల్లాడు మొబైల్ చూడటంతో మునిగివుండగా, అప్పుడే తలుపు తెరిచి గదిలోకి ప్రవేశించింది ఆ కుర్రాడి తల్లి. ఇలా తల్లి తలుపు తెరవగానే.. గోడకు వేలాడుతున్న మొబైల్ వెంటనే టవల్ వెనుకకు చేరుకుంది. ఆ తల్లి గది నుండి బయటకు వెళ్లగానే మొబైల్ఫోన్ మళ్లీ ఆ పిల్లాడి ముందు కనిపిస్తుంది. ఆ కుర్రాడు మొబైల్ ఫోనును తన తల్లికి తెలియకుండా దాచేందుకు ఎలా ప్రయత్నిస్తున్నాడో వీడియోలో స్పష్టగా కనిపిస్తుంది. ఈ వీడియో @TheFigen_ పేరుతో X (ట్విట్టర్)లో షేర్ అయ్యింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 3.6 మిలియన్లకు పైగా వీక్షణలు దక్కాయి. ఈ వీడియోను చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఆ పిల్లవాడిని స్మార్ట్ బాయ్ అని పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: ‘అత్యంత క్రూరుడైన సోదరుడు!’.. బెంబెలెత్తిస్తున్న కుర్రాడి రాఖీ ఖర్చుల లిస్టు! Smart boy 😂pic.twitter.com/lXKoy7ZVK6 — Figen (@TheFigen_) August 24, 2023 -
పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి మార్గాలు?
నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి వయస్సు పదేళ్లలోపే ఉంటుంది. వారి ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూల సాధనాలు ఏవి? – భానుశ్రీ పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?.. చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా ఎదుర్కొనే సందేహం ఇది. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, సాధారణంగా పదేళ్ల కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను వైవిధ్యం ఉండేలా చూస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీల్లో అస్థిరతలు సహజంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్ను తగ్గిస్తుంది. మీ దగ్గర ఉన్న ఏక మొత్తాన్ని ఏదైనా డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి.. దాని నుంచి ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎన్టీపీ) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి. మూడేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేయాలి. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. మార్కెట్లలో అస్థిరతలను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా? – శ్రవణ్ పెద్దింటి అస్థిరతలనేవి ఈక్విటీల సహజ లక్షణం. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో ఈక్విటీ పెట్టుబడులను కదలించకుండా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. ఈక్విటీల్లో మీ పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ చర్యలు అవసరం. అలాగే, సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ అస్థిరతల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో కరెక్షన్లు నిజంగా మంచి అవకాశాలను తెస్తాయి. ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను తక్కువ ధరకే సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, మీడియాలో వచ్చే గందరగోళ సమాచారం ఇన్వెస్టర్లను నిరాశకు, అయోమయానికి, భయానికి గురి చేస్తుంది. దాంతో వారు ప్రతికూల సమయాల్లో పెట్టుబడులు చేయడానికి వెనుకాడుతుంటారు. పైగా కొందరు అమ్మకాలు కూడా చేస్తుంటారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో తప్పకుండా సిప్ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోవడానికి వీలుంటుంది. -
పట్టుతప్పి పట్టాలపై పిల్లాడు.. క్షణాల్లో స్పందించిన కార్మికుడు.. కన్నార్పనీయని వీడియో!
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు భగవంతుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడని అంటారు. ఇది నిజమని అప్పుడప్పుడు నిరూపితమవుతుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో దీనిని నిరూపిస్తోంది. ఈ వీడియోలో ఒక పిల్లాడు తల్లి చేతుల నుంచి జారి రైలు పట్టాలపై పడిపోవడం, సరిగ్గా అదే సమయానికి రైలు వస్తుండటం.. ఇంతలోనే ఒక వ్యక్తి ఆ పిల్లాడిని కాపాడటం కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ముందుగా రైల్వే స్టేషన్ వద్ద ఒక పిల్లాడు తన తల్లి చేయి పట్టుకుని నడుస్తుండటాన్ని గమనించవచ్చు. కొంచెం ముందుకు వెళ్లాక ఆ పిల్లాడు తల్లి చేతుల నుంచి జారి పట్టాలపై పడిపోతాడు. దీనిని గమనించిన ఆ పిల్లాడి తల్లి గాభరా పడిపోతూ ఉంటుంది. పిల్లవాడిని పైకి లాగేందుకు తన చేయి అందించే ప్రయత్నం చేస్తుంటుంది. అయితే ఆ మార్గంలో రైలు వస్తుండటంతో ఆమె భయపడిపోతుంది. ఇంతలో మరోవైపు నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆ పిల్లాడిని ప్లాట్ఫారంపైకి ఎక్కిస్తాడు. తాను కూడా వేగంగా ప్లాట్ఫారంపైకి ఎక్కిపోతాడు. ఇదంతా రెండుమూడు సెకెన్లలో జరిగిపోతుంది. ఇంతలో రైలు అత్యంత వేగంగా ఆ పట్టాల మీదుగా వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో @Suhan Raza పేరుతో షేర్ అయ్యింది. క్యాప్షన్లో ఈ రైల్వే ఉద్యోగి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పిల్లాడిని కాపాడినందుకు అతనికి హ్యాట్సాఫ్ అని రాశారు. ఇది కూడా చదవండి: అందమైన గడ్డం ఆమెకే సొంతం.. మరో గడ్డం బామ్మతో తలపడి.. Salute to this railway staff employee who did not care for his life and saved the life of a blind child who fell on the railway track. 🙏👌#railway #earthquake #TrainAccident #ElvishArmy𓃵 #patlama #ISRO #SaveIndianMuslims pic.twitter.com/7ZoAzHup4V — Suhan Raza (@SuhanRaza4) August 8, 2023 -
నేటి నుంచి మిషన్ ఇంద్రధనుస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి చిన్నారికి వ్యాధి నిరోధక టీకాలు వేయడమే లక్ష్యంగా మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ప్రతినెలా ఆరు రోజుల చొప్పున మూడునెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో ఆమె ప్రత్యేకంగా మిషన్ ఇంద్రధనస్సు, నులిపురుగుల మాత్రల పంపిణీపై మాట్లాడారు. మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ఈ నెల 7 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరలా సెప్టెంబర్ 11 నుంచి 16వ తేదీ వరకూ, అక్టోబర్ 9 నుంచి 14వ తేదీ వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే నిర్వహించిన సర్వేలో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని చిన్నారులు 3,009 మందిని గుర్తించామన్నారు. వారితో పాటు ఇంకా వ్యాధినిరోధక టీకాలు వేయించుకోని వారు ఉంటే వారికి కూడా వేయనున్నట్లు తెలిపారు. అందుకోసం జిల్లాలో 422 సెçషన్స్(స్థలాలు)ను ఎంపిక చేసి వ్యాక్సినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం చివరికి మీజిల్స్–రూబెల్లా నిర్మూలనకు లక్ష్యాల ఏర్పాటులో భాగంగా మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని పట్టిష్టంగా అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 5.50 లక్షల ఆల్బెండాజోల్ మాత్రలు.. ఈ నెల 10న నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు(ఆల్బెండాజోల్) మింగించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. విద్యాశాఖ అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 19 ఏళ్లులోపు ఉన్న పిల్లలకు మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. మొత్తం 4,67,550 మందికి వేయాలనేది లక్ష్యం కాగా, 5.50 లక్షల మాత్రలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆ మాత్రలను విజయవాడలోని జోనల్ కమిషనర్లు, మండలాల్లోని ఎంఈఓలు, మెడికల్ ఆఫీసర్ల ద్వారా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు సరఫరా చేసినట్లు తెలిపారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా నులిపురుగుల మాత్రలు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆమె తెలిపారు. -
చిన్నారి కుటుంబానికి సీఎం జగన్ ధైర్యం.. తక్షణ సాయం
సాక్షి, కృష్ణా: సాయం కోరితే చాలూ.. అప్పటికప్పుడే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించగలిగే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆ విషయంలో ఆయన మంచి మనసుకు అద్దం పట్టే సందర్భాలు ఇప్పటికే చాలా చూశాం. తాజాగా విజయవాడలోనూ ఓ నిరుపేద కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. ఆ ఇంటి బిడ్డకు చికిత్స కోసం తక్షణ సాయం అందించాలని అధికారులకు ఆదేశించారు. శ్రీనివాసరావు-కల్లగుంట శ్యామలాదేవి మధురానగర్లో నివాసం ఉంటున్నారు. వీళ్లకు ఓ పాప ఉంది. అయితే 14 నెలల ఆ చిన్నారినిక కంటి క్యాన్సర్ సోకింది. దీంతో స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక భారం ఎక్కువైపోతుండడంతో సీఎంను కలిసి తమ వ్యథను వినిపించాలనుకున్నారు. ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతున్న సంగతి తెలిసి.. ఏ కన్వెన్షన్ హాల్కు వెళ్లారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో.. ఆయన దగ్గరుండి వాళ్లను సీఎం జగన్ దగ్గరికి తీసుకెళ్లారు. చిన్నారి స్థితి గురించి తెలుసుకున్న సీఎం జగన్ అధైర్య పడొద్దని.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన ప్రక్కనే వున్న ఎన్టిఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ కలెక్టరు డా. పి సంపత్ కుమార్ కుమార్ ను తక్షణ ఆర్ధిక సహాయానికి ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలతో.. జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి పిలిపించుకుని రూ. లక్ష చెక్కును తక్షణ సాయం రూపంలో అందజేశారు. చిన్నారి చికిత్సకు ప్రభుత్వం తరపు నుంచి అవసరమైన సాయం అన్నివిధాల అందజేస్తామని హామీ ఇచ్చారు. -
బాచుపల్లిలో విషాదం: రోడ్డుపై గుంతకు బలైన చిన్నారి
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై గుంతకు చిన్నారి బలైంది. గుంతలో బండి పడటంతో చిన్నారి ఎగిరి రోడ్డుపై పడింది. చిన్నారిపై నుంచి స్కూల్ బస్సు వెళ్లడంతో పాప అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నారిని తన తండ్రి బండి మీద తీసుకెళ్తుండగా బాచుపల్లి పరిధిలో రెడ్డీస్ ల్యాబ్ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. అతివేగంగా వెనుక నుంచి బైక్ను బస్సు డ్రైవర్ ఢీకొట్టాడు. బైక్పై నుంచి ఎగిరిపడిన ఎనిమిదేళ్ల దీక్షిత బస్సు వెనుక చక్రాల కింద పడి మృతిచెందింది. డ్రైవర్ రహీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దీక్షిత 2వ తరగతి చదువుతోంది. చదవండి: ఒక్కగానొక్క కుమార్తె.. స్నానం చేసేందుకు బాత్రూమ్కు వెళ్లి, నీటి కొళాయిని తాకగానే.. -
''నువ్వెలా పుట్టావే మాకు.. బొత్తిగా తెలివితేటల్లేవు, మార్కులు రావు''
లాలస పదో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. లాలసకు చిన్నప్పటి నుంచీ మంచి మార్కులు వచ్చేవి కావు. దాంతో పేరెంట్స్ చాలా ఆందోళన చెందేవారు. స్కూళ్లు మాన్పించినా, ట్యూషన్లు పెట్టించినా లాలస మార్కుల్లో ఎలాంటి మార్పూ లేదు. దాంతో ‘నువ్వెలా పుట్టావే మాకు.. బొత్తిగా తెలివితేటల్లేవు, మార్కులు రావు’ అని విమర్శిస్తుండేవారు. ఇప్పుడు పదో తరగతిలో కూడా అవే మార్కులు వస్తే కష్టమని, స్నేహితుల సలహా మేరకు కౌన్సెలింగ్కి తీసుకువచ్చారు. లాలస పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత.. వారు ఫిక్స్డ్ మైండ్సెట్తో ఉన్నారని, లాలసపై కూడా అదే రుద్దారని అర్థమైంది. తెలివితేటలు, సామర్థ్యం పుట్టుకతో వస్తాయని, వాటిని ఎప్పటికీ అభివృద్ధి చేసుకోలేరని నమ్మడమే ఫిక్స్డ్ మైండ్సెట్. ఈ మైండ్సెట్ ఉన్నవారు ఒకట్రెండు సార్లు ఫెయిలయితే జీవితమంతా ఫెయిల్యూరేనని భావిస్తారు. ఇతరులు ఏమనుకుంటారోనని ఆందోళన చెందుతారు. పేరెంట్స్, టీచర్స్ ప్రభావమే ఎక్కువ పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే ప్రాథమిక రోల్ మోడల్స్. వాళ్లు నిరంతరం పేరెంట్స్ని గమనిస్తుంటారు. వారి నుంచి మాట, నడక, నడత, ఆలోచన, ప్రవర్తన నేర్చుకుంటారు. పిల్లలందరూ గ్రోత్ మైండ్సెట్తో, జీనియస్లు కాగల సామర్థ్యంతోనే పుడతారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల ఆసక్తిగా ఉంటారు. దాన్నుంచి వీలైనంత ఎక్కువ నేర్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో తప్పులు చేస్తారు.. విఫలమవుతారు. అలాంటి సందర్భాల్లో ఫిక్స్డ్ మైండ్సెట్ ఉన్న పేరెంట్స్, టీచర్స్ వారిని తప్పుబడతారు, విమర్శిస్తారు, దండిస్తారు. దాంతో పిల్లలు కూడా అదే ఫిక్స్డ్ మైండ్సెట్ని అడాప్ట్ చేసుకుంటారు. తమకు పుట్టుకతో తెలివితేటలు లేవని, వాటిని ఇప్పుడు పెంచుకోలేమని నమ్ముతారు, ఉన్నదానితో సర్దుకుపోతారు, కొత్త ప్రయత్నాలు ఆపేస్తారు. లాలాస విషయంలో జరిగింది అదే. ఫిక్స్డ్ మైండ్సెట్ని అలవరచుకున్న లాలస తన వైఫల్యాలకు పేరెంట్స్ని, టీచర్స్ని, స్కూల్ని నిందిస్తోంది. పేరెంట్స్ కోరుకున్న మార్కులు సాధించడానికి షార్ట్కట్స్ అన్వేషిస్తోంది. మైండ్సెట్ మార్చుకోవచ్చు మన జీవితం మొత్తం మైండ్సెట్పైనే ఆధారపడి ఉంటుంది. ఒక పరాజయం ఎదురైనప్పుడు ఫిక్స్డ్ మైండ్సెట్ ఉన్నవారు బాధపడతారు, ఏడుస్తారు, డిప్రెషన్లో కూరుకుపోతారు. గ్రోత్ మైండ్సెట్ ఉన్నవారు ఆ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు. ఫిక్స్డ్ మైండ్సెట్ ఉన్నవారు ఎప్పుడూ ఇతరుల ఆమోదం కోరతారు. మొబైల్ ఫోన్, మొబైల్ గేమ్స్ లాంటి చిన్న చిన్న విషయాల నుంచి ఆనందం పొందుతూ, దాంతోనే తృప్తిపడతారు. లాలస కూడా అదే చేస్తోంది. అయితే ఈ ఫిక్స్డ్ మైండ్సెట్ని మార్చవచ్చని, మార్చుకోవచ్చని.. జీనియస్ మైండ్సెట్ లేదా గ్రోత్ మైండ్సెట్ని డెవలప్ చేసుకోవచ్చని ఆమె పేరెంట్స్కి వివరించాను. అయితే వెంటనే కౌన్సెలింగ్ మొదలుపెట్టమన్నారు. అది ఒకటి రెండు సెషన్ల కౌన్సెలింగ్తో జరిగే పనికాదని, కనీసం ఆరు నెలల పాటు కోచింగ్ అవసరం ఉంటుందని, అందులో పేరెంట్స్ కూడా పనిచేయాలని చెప్పాను. అందుకు వారు సంతోషంగా అంగీకరించారు. జీనియస్ మైండ్సెట్ సాధ్యమే జీనియస్ మైండ్సెట్ పుట్టుకతో రాదు, పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు. లేదా ప్రత్యేక శిక్షణ ద్వారా నేర్చుకోవచ్చు. జీనియస్ మైండ్సెట్ ఉన్న పేరెంట్స్ తమ పిల్లలను ప్రతిదీ ప్రశ్నించమని, నేర్చుకోమని ప్రోత్సహిస్తారు. ఏది అవసరమో, ఏది కోరికో, ఏది తప్పో, ఏది ఒప్పో ఓపిగ్గా వివరిస్తారు. వైఫల్యాలకు తిట్టకుండా వాటి నుంచి పాఠాలు ఎలా నేర్చుకోవాలో, వాటిని సానుకూలంగా ఎలా మార్చుకోవచ్చో నేర్పిస్తారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు కూడా అలాంటి మైండ్సెట్నే అలవరచుకుంటారు. అందుకే ముందుగా పేరెంట్స్ తమ మైండ్సెట్ మార్చుకోవడం ద్వారా పిల్లల మైండ్సెట్ని మార్చవచ్చు. అలాంటి మైండ్సెట్ పేరెంట్స్కి కూడా సక్సెస్ని, సంతోషాన్ని అందిస్తుంది. జీనియస్ మైండ్సెట్ కావాలంటే.. పరిమితులన్నీ మనం సృష్టించుకున్నవేనని అర్థంచేసుకోవాలి, వాటిని బ్రేక్ చేసేందుకు ప్రయత్నించాలి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలి, కొత్త మార్గాలను అన్వేషించాలి. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకూడదు. మీకు మీరు మాత్రమే పోటీ అని తెలుసుకోవాలి. పరీక్షల కోసం, మార్కుల కోసం కాకుండా లోతుగా అధ్యయనం చేయాలి. జీవితంలో ఎప్పుడూ విజయాలే ఉండవు, పరాజయాలు వస్తాయి. అయితే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మీకన్నా ప్రతిభావంతులైన వ్యక్తులతో కాలం గడపండి.. వారి నుంచి నేర్చుకోండి. ఏ విషయంలోనైనా మీ స్ట్రాటజీ పనిచేయకపోతే దాన్ని పక్కన పెట్టేసి కొత్త వ్యూహంతో ముందుకు సాగండి. --సైకాలజిస్ట్ విశేష్ -
పాస్పోర్ట్ ఫొటోకు సహకరించని చిన్నారి.. శభాష్ అనిపించుకుంటున్న తండ్రి ఐడియా!
చంటిపిల్లలతో ఏదైనా పనిచేయించాలంటే తల్లిదండ్రులకు తల ప్రాణం తోకకువస్తుంటుంది. అదొక పెద్ద టాస్క్లా మారిపోతుంది. చిన్నపిల్లలకు హెయిర్ కటింగ్ చేయించాలన్నా, ఇంజక్షన్ చేయించాలన్నా, ఫొటో తీయాలన్నా అది పెద్దలకు శక్తికి మించిన పనిగా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఏడుపునకు దిగితే ఇక తల్లిదండ్రుల తల పట్టుకోవాల్సిందే. అయితే ఇటువంటి సమయంలో ఒక తండ్రి అనుసరించిన పద్దతి ఎంతో చక్కగా ఉన్నదంటూ, అతనిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఒక తండ్రి తన కుమార్తెకు పాస్పోర్ట్ సైజ్ ఫొటో తీయించాలనుకున్నాడు. అయితే అతని కుమార్తె ఫొటోకు అనుగుణంగా కుర్చీలో కూర్చొనేందుకు సహకరించ లేదు. ఆ చిన్నారి కుర్చీలో కూర్చుంటేనే ఫొటో తీయగలనని ఫొటోగ్రాఫర్ అన్నాడు. దీనికి అతని తండ్రి సమాధానమిస్తూ తన కుమార్తె తన చంకలో నుంచి దిగడం లేదని, కుర్చీలో కూర్చొనేందుకు సహకరించడం లేదని తెలిపాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలని? ఫొటోగ్రాఫర్ అడగగా, నా దగ్గర ఒక ఐడియా ఉందని తండ్రి సమాధానమిచ్చాడు. కుమార్తెకు ఫొటో తీయించేందుకు ఆ తండ్రికి వచ్చిన ఐడియా ఏమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. తన కుమార్తెకు ఫొటో తీయించేందుకు ఆ తండ్రి కుర్చీలో కూర్చుని, తనపై ఒక తెల్లని వస్త్రాన్ని కప్పుకున్నాడు. ఒడిలో కుమార్తెను కూర్చోబెట్టుకున్నాడు. తరువాత ఆ చిన్నారికి ఫొటో తీశారు. దీనికి సంబంధించిన ఫొటో ట్విట్టర్లో వైరల్గా మారింది. ఈ ఫొటో చూసిన యూజర్స్ తండ్రి అనుసరించిన టెక్నిక్ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఒక యూజర్ ‘మీ అమ్మాయి ఎంతో ముద్దొస్తోంది. మీరు ఎంతో తెలివైనవారు’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘నా కుమారుని పాస్పోర్ట్ సైజ్ ఫొటో కూడా ఇలానే తీయాల్సి వచ్చిందని’ పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: అది ‘వితంతువుల గ్రామం’.. పురుషుల అకాల మృతికి కారణమిదే..! Passport worker - We're gonna need the baby to sit on the chair for the photo. Dad - She won't let me put her down. Passport worker - You're gonna need to figure something out if you want a passport picture. Dad - I got an idea... pic.twitter.com/cx9sm5EsBl — Yair Menchel (@yairmenchel) July 20, 2023 -
చిన్నారుల ముక్కు నుంచి రక్తం వస్తుందా? చాలావరకు ఇది..
ఈ సీజన్లో పిల్లలు వానల్లో తడిసి, జలుబు చేసి ముక్కు చీదినప్పుడు రక్తం రావచ్చు. చిన్నారుల ముక్కు నుంచి రక్తస్రావం జరగడాన్ని ఎపిస్టాక్సిస్ అంటారు. చాలావరకు ఇది ఏమాత్రం ఆందోళనకరం కాదు. పిల్లల ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... పిల్లలు కాస్త ముందుకు ఒంగి కూర్చునేలా చూడాలి నోటితో గాలిపీల్చుకొమ్మని చెప్పాలి. రక్తస్రావం అవుతున్న ముక్కు రంధ్రం వైపు భాగాన్ని బొటనవేలు, చూపుడువేలుతో కాసేపు అలాగే నొక్కి పట్టి ఉంచాలి. ముక్కుపైన ఐస్ప్యాక్ లేదా కోల్డ్ ప్యాక్ ఉంచాలి. వాళ్లు గట్టిగా ముక్కు చీదకుండా చూడాలి. రక్తస్రావం తగ్గాక మళ్లీ అలా జరగకుండా ఉండేందుకు పిల్లల వేళ్ల గోళ్లు కత్తిరిస్తూ, వాళ్లు ముక్కులో వేళ్లు పెట్టుకుని గిల్లుకోకుండా చూడాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో రక్తస్రావం తప్పక ఆగిపోతుంది. ఒకవేళ ఆగకపోతే తక్షణం డాక్టర్ / ఈఎన్టీ స్పెషలిస్ట్ను కలవాలి. (చదవండి: ఏజెన్సీ ప్రాంతాలను కలవరపెట్టే 'మలేరియా'..తస్మాత్ జాగ్రత్త లేదంటే..) -
నడక చైర్లోని పసివాడు.. పైకప్పు కూలిపోయేంతలో.. వైరల్ వీడియో!
ఇంటర్నెట్లో ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి వైరల్గా మారింది. ఈ వీడియో కంబోడియాకు చెందినది. ఒక మహిళ తమ ఇంటి పైకప్పు కూలిపోతున్న సమయంలో తన పిల్లవాడిని ఎలా కాపాడిందనేది ఈ వీడియోలో ఉంది. కొన్ని సెకెన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను కన్నుతిప్పుకోనీయకుండా చేస్తోంది. ఫాక్స్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన రాజధాని నోమ్ పెన్హ్లో చోటుచేసుకుంది. వీడియో ఉన్న కంటెంట్ ప్రకారం పిప్సర్ అనే మహిళ ఒక పిల్లవాడిని ఎత్తుకుని కనిపిస్తుంది. గదిలో ముగ్గురు చిన్నపిల్లలు ఉంటారు. ఆ తల్లికి ఏదో శబ్ధం వినిపించగానే ఇద్దరు పిల్లలతో సహా బయటకు పరిగెడుతుంది. అయితే ఇంకో పిల్లాడు అక్కడే నడక చైర్లో ఉంటాడు. ప్రమాదాన్ని గ్రహించిన ఆమె ఆ నడకచైర్లో ఉన్న పిల్లవాడిని కూడా లాక్కుని బయటకు వచ్చేస్తుంది. ఇంతలో ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోతుంది. ఆ తల్లి నడకచైర్లో ఉన్న పిల్లవాడిని కాపాడటంలో ఒక్క క్షణం జాప్యం చేసినా, ఆ పసిపిల్లవాడు ప్రమాదం బారిన పడేవాడని వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ ప్రమాదంలో పిల్లవాడిన కాపాడిన ఆ తల్లి ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ ఇంటిపై కప్పు మా మీద పడితే మేం చనిపోయేవాళ్లం. అందుకే మేము పరుగుపరుగున వచ్చేశాం అని తెలిపారు. ఇంటి యజమాని మీడియాతో మాట్లాడుతూ ఇంటి నిర్మాణం జరిగినప్పుడు వాటర్ ప్రూఫింగ్ సరిగా జరగలేదని, ఇప్పుడు కుర్తుస్తున్న భారీ వర్షాలకు ఇంటిపైకప్పు కుంగిపోయి, పడిపోయిందని తెలిపారు. నిర్మాణం సరిగా లేకపోవడం వలనే ఇలా జరిగిందన్నారు. అందుకే ఎవరైనా ఇంటిని కొనుగోలు చేసేముందు అన్ని అంశాలు సమగ్రంగా పరిశీలించుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి: భారత్, పాక్లను కలిపిన కేంబ్రిడ్జ్ స్నేహం.. గత 31 ఏళ్లుగా.. The #ceiling of a residence in Phnom Penh, #Cambodia, #collapsed in the living room. Luckily, the #mother inside the house acted quickly, picking up one child with one hand and holding a school bicycle having another child with the other. All her children were saved in the end. pic.twitter.com/aK9wXVsTvW — Warm Talking (@Warm_Talking) July 18, 2023