మనోధైర్యం నింపేందుకే షర్మిల పరామర్శయాత్ర | sharmila paramarsha yatra to be started from 9th june | Sakshi
Sakshi News home page

మనోధైర్యం నింపేందుకే షర్మిల పరామర్శయాత్ర

Published Fri, Jun 5 2015 9:53 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

మనోధైర్యం నింపేందుకే షర్మిల పరామర్శయాత్ర

మనోధైర్యం నింపేందుకే షర్మిల పరామర్శయాత్ర

యాదగిరిగుట్ట(నల్లగొండ): మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తట్టుకోలేక గుండెపగిలి మృతి చెందిన వారి కుటుంబాల్లో మనోధైర్యం నింపేందుకే  వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శయాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. ఈ నెల 9 నుంచి నల్లగొండ జిల్లాలో చేపట్టనున్న పరామర్శ యాత్రకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాల వద్ద ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మృతిని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అనేకమంది కుటుంబాలను పరామర్శిస్తామని గతంలోనే జగన్‌మోహన్‌రెడ్డి నల్లకాలువలో ప్రకటించి సంగతిని గుర్తు చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలను పరామర్శించి, వారిలో మనోధైర్యం నింపేందుకు షర్మిల ఈ యాత్రను చేపట్టారని పేర్కొన్నారు.  ఈ యాత్ర జిల్లాలో 9 నుంచి12వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో 9, 10 తేదీల్లో సాగుతుందన్నారు.

 

ఈ యాత్రకు పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. షర్మిల యాత్ర కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన గాదె నిరంజన్‌రెడ్డి, స్టేట్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ సిద్ధార్థ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్న, రాష్ట్ర కార్యదర్శులు కుసుమ కుమార్‌రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి, వడ్లోజు వెంకటేశ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గూడూరు జైపాల్‌రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement