'రైతు సమస్యలు తెలిసిన వ్యక్తి కేసీఆర్' | solipeta ramalinga reddy speech in assembly | Sakshi
Sakshi News home page

'రైతు సమస్యలు తెలిసిన వ్యక్తి కేసీఆర్'

Published Wed, Sep 30 2015 10:35 AM | Last Updated on Sat, Aug 11 2018 6:44 PM

solipeta ramalinga reddy speech in assembly

హైదరాబాద్: రైతు ఆత్మహత్యలు నివారించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఆయన మాట్లాడారు. రైతు సమస్యలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. అన్నదాతల సమస్యలను తీర్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు.

రైతాంగ సమస్యలపై ప్రతిరోజు సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారని తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతాంగాన్ని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. రైతు ఆత్మహత్యలు అత్యంత బాధాకరమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement