డెంగీతో విద్యార్థి మృతి
Published Mon, Jan 18 2016 11:32 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
భువనగిరి: నల్గొండ జిల్లా భువనగిరి ఒల్లిపెల్లి గ్రామంలో డెంగీతో ఓ విద్యార్థి మృతి చెందాడు. గ్రామానికి చెందిన వంశీరెడ్డి(16) జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. వంశీరెడ్డి భువనగిరి రెసిడెన్సియల్ స్కూల్లో 10 వ తరగతి చదువుతున్నాడు. వంశీ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement