
ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సభాసంఘం
హైదరాబాద్: ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై తెలంగాణ ప్రభుత్వం మూడు శాసన సభా సంఘాలు ఏర్పాటు చేసింది. అలాగే వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చైర్మన్ గా 13 మందితో కమిటీ ఏర్పాటయింది. హౌసింగ్ సొసైటీ అక్రమాలపై ఎమ్మెల్యే రమేష్ చైర్మన్ గా, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చైర్మన్ గా కమిటీలు ఏర్పాటయ్యాయి. రాబోయే మూడు నెలల్లో ఈ కమిటీలు సభకు నివేదికలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.