క్రమశిక్షణ.. వింత పోకడలకు పోతోంది. కామారెడ్డిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులు రిబ్బన్లు కట్టుకోలేదని.. కొంతమందికి జుట్టు కత్తిరించారో టీచర్. అమ్మాయిలు జడలు వేసుకుని, రిబ్బన్లు కట్టుకు రావాలన్న నిబంధన చాలా పాఠశాలల్లో ఉంది. చాలావరకు ప్రైవేటు పాఠశాలలు కూడా ఈ నిబంధన విధిస్తాయి.
అయితే, దాన్ని ఉల్లంఘించినవారిని టీచర్లు పిలిచి మందలిస్తారే తప్ప.. ఏకంగా ఇలా జుట్టు కత్తిరించిన ఘటన మాత్రం ఇంతకుముందు ఎక్కడా లేదు. ఈ సంఘటన పట్ల విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సదరు టీచర్ మంత్రాలు వేస్తోందంటూ వారు ఆందోళనకు దిగారు. దాంతో.. ఆ తల్లిదండ్రులకు సదరు టీచర్ క్షమాపణలు చెప్పారు.
రిబ్బన్లు కట్టుకోలేదని.. జుట్టు కత్తిరించారు!
Published Wed, Sep 10 2014 3:15 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
Advertisement
Advertisement