కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని మరమగ్గాల యజమానులు సోమవారం నుంచి బంద్ ప్రకటించారు.
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని మరమగ్గాల యజమానులు సోమవారం నుంచి బంద్ ప్రకటించారు. వారం పాటు ఉత్పత్తి నిలిపివేయాలని భావిస్తున్నారు. వస్త్ర నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోవటంతో మగ్గాలు నడపలేమంటూ ఈ మేరకు తీర్మానించారు. ఈ విషయమై ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, మగ్గాలు మూతబడటంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు.
(సిరిసిల్ల)