నకిరేకల్ వద్ద రోడ్డు ప్రమాదం : ముగ్గురికి గాయాలు | Three injured in Road accident | Sakshi
Sakshi News home page

నకిరేకల్ వద్ద రోడ్డు ప్రమాదం : ముగ్గురికి గాయాలు

Published Sun, Jun 21 2015 11:20 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Three injured in Road accident

నకిరేకల్ : నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందన్‌పల్లి వద్ద ఇసుక ట్రాక్టర్, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే...  హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న ఓ కారు ఆదివారం ఉదయం చందన్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురిలో ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement