చింతపల్లి మండలం సాయిబాబా దేవాలయం సమీపంలో ప్రమాదవశాత్తూ ఓ కారు బోల్తా పడింది.
చింతపల్లి మండలం సాయిబాబా దేవాలయం సమీపంలో ప్రమాదవశాత్తూ ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో వినుకొండ పట్టణానికి చెందిన ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరు కారులో హైదరాబాద్ నుంచి వినుకొండ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.