క్రైస్తవులకు అండగా ఉంటాం | TS YSRCP President Gattu Srikanth Reddy support on Christians | Sakshi
Sakshi News home page

క్రైస్తవులకు అండగా ఉంటాం

Published Mon, Dec 26 2016 4:06 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM

క్రైస్తవులకు అండగా ఉంటాం

క్రైస్తవులకు అండగా ఉంటాం

వైఎస్సార్‌సీపీ తెలంగాణ  అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి

మేళ్లచెరువు: క్రైస్తవుల కు అండగా ఉంటామని వైఎస్సార్‌ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు ఎస్సీ కాలనీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు సుఖసంతో షాలతో, శాంతియుత జీవనం గడుపుతూ సమాజాభివృద్ధికి పాటు పడాలన్నారు. క్రిస్టియన్లు ఎప్పుడు సహాయం అడిగినా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి క్రిస్టియన్లకు చేసిన సేవలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనంతరం క్రిస్మస్‌ కేక్‌ను కట్‌చేసి చిన్నారులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, కస్తాల ముత్తయ్య, పిల్లి మరియదాసు, జడ రామకృష్ణ, పెద్ది శివ, ప్రేమానందం, పొనగండ్ల సత్యనారా యణ రెడ్డి, కలగొట్ల వెంకటేశ్వరరెడ్డి, ధనపాటి రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement