Gattu Srikanth Reddy
-
బీజేపీలోకి గట్టు శ్రీకాంత్రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన డాక్టర్ గట్టు శ్రీకాంత్రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కలిశారు. ఈ సందర్భం గా వివిధ అంశాలపై చర్చించారు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాతీయ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రకటించారు. ఆ వెనువెంటనే ఆయన మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్తో కలసి వచ్చి సంజయ్తో భేటీ అయ్యారు. మంచి రోజు చూసుకొని పార్టీ ముఖ్యనేతల సమక్షం లో ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. చదవండి: (వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు రాజీనామా) -
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు రాజీనామా
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో పార్టీ విస్తరణ లేకపోవటంతో తన సొంత నియోజకవర్గమైన హుజూర్నగర్ ప్రజల అభిమతం మేరకు ఓ జాతీయపార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. 2007 నుంచి తాను పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్నానని, పార్టీలో తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గ బాధ్యతలతోపాటు జిల్లా ఇన్చార్జిగా, స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా.. ఇలా అవకాశాలు ఇస్తూ ఎంతో ప్రోత్సహించారని, ఇందుకు తానెప్పుడూ జగన్కు రుణపడి ఉంటానని అన్నారు. పార్టీని వీడాలని బాధతో నిర్ణయం తీసుకున్నానని, ఈ రోజు తనకు దుర్దినమేనని ఆయన అభివర్ణించారు. అద్భుతమైన పాలనతో ఏపీని ప్రగతిపథంలో ఉంచిన జగన్ మోహన్ రెడ్డికి భవిష్యత్తులో మరిన్ని గొప్ప అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా నిరుద్యోగులు అల్లాడుతుండటం బాధగా ఉందని, తాజాగా ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం తనను కలచివేసిందని అన్నారు. యాదాద్రి దేవాలయానికి నిధులు ఇవ్వటం తప్ప నల్లగొండ జిల్లాకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. దేశభక్తితో ముందుకు సాగుతున్న జాతీయ పార్టీలో చేరనున్నానని, తాను వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి హుజూర్నగర్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో డబ్బే గెలుస్తుందని, డబ్బు కావాలో, అభివృద్ధి కావాలో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. -
వైఎస్కు ఘనంగా నివాళి
సాక్షి,హైదరాబాద్: దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్లో పంజగుట్ట సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహానికి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి, ఇతరనాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు వైఎస్సార్ను స్మరించుకునే రోజని, ఉమ్మడి ఏపీలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. వైఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతీ గుడిసెకు, గుండెకు చేరుకోవడంతో ప్రజలకు మహానేత చిరస్థాయిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించేందుకు, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుకు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. అక్కడ అమలు చేస్తున్న పథకాలను తెలంగాణలోనూ చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, బి.సంజీవరావు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్, సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యాడ మహేష్కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు అమృతసాగర్, నేతలు జస్వంత్రెడ్డి, పిట్టా రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల హృదయాల్లో చెరగని స్థానం వైఎస్సార్కు కాంగ్రెస్ నివాళి సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేదల సంక్షేమమే పరమావధిగా పనిచేసి ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారని పలువురు కాంగ్రెస్ నేతలు కొనియాడారు. వైఎస్సార్ 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్, అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) కార్యాలయాల్లో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ నాయకులు మల్లు రవి, బొల్లు కిషన్, అఫ్జలుద్దీన్, కుమార్ రావ్, ప్రేమ్ లాల్ తదితరులు పాల్గొన్నారు. సీఎల్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. -
తెలంగాణలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 71వ జయంతి తెలంగాణలోనూ ఘనంగా జరిగింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి సర్కిల్లో కేక్ కట్చేశారు. నల్గొండ మిర్యాలగూడ నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతి వేడుకలలో భాగంగా గూడూరు, కొండ్రపోల్, బొత్తలపాలెం, దామచర్లలో కేక్ కట్ చేసి పేదలకు పండ్లను పంచిపెట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఇంజమ్ నర్సిరెడ్డి, మిర్యాలగూడ అధ్యక్షుడు పిల్లుట బ్రహ్మం, దామచర్ల అధ్యక్షుడు అన్నెం కరుణాకర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా భువనగిరిలోనిన కిసాన్ నగర్లో శక్తీ మిషన్ అధ్యక్షురాలు కర్తాల శ్రీనివాస్, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు కుతాడి సురేష్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బత్తులు సత్యనారాయణలు వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిరిసిల్ల వైఎస్సార్ జయంతిని సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జోగులాంబ గద్వాల ధరూర్ మండల కేంద్రంలో వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్ అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. -
'తెలంగాణలోను పార్టీనీ బలోపేతం చేస్తాం'
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అమీర్పేటలో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ జెండాను ఆవిస్కరించి కేక్ను కట్చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. నాడు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు కుమ్మక్కై వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇబ్బందులకు గురిచేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఏపీ వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసి వారి సమస్యలను పరిష్కరించడమే ఎజెండాగా మేనిఫెస్టో రూపొందించారు. అనంతరం జరిగిన ఎన్నికలలో పార్టీ అఖండ విజయం సాధించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు. కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలని, త్వరలో ఇక్కడ కూడా మంచి రోజులు వస్తాయని వెల్లడించారు. -
ఆరు నెలల్లోనే వైఎస్ జగన్కు ప్రజా దీవెనలు
రహమత్నగర్: ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆరునెలల్లోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజా మన్ననలు పొందారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. నగరంలోని రహమత్నగర్ డివిజన్ ఎస్పీఆర్హిల్స్, జూబ్లీహిల్స్లోని కార్మికనగర్, శ్రీనగర్కాలనీలోని గణపతి కాంప్లెక్స్ వద్ద వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గట్టు శ్రీకాంత్రెడ్డి పాల్గొని కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహణతో పాటు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, పేద మహిళలకు దుప్పట్లను పార్టీ నేతలు అందజేశారు. అనంతరం గట్టు మాట్లాడుతూ..ఎన్ని అవరోధాలు ఎదురైనా దివంగత మహానేత డా.వైఎస్సార్ చూపిన బాటలో అడుగుముందుకు వేసిన భగీరథుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. ఏపీలో దిశ చట్టాన్ని అమలు చేయడంతో ఇతర రాష్ట్రాలు కూడా ఆ చట్టం వివరాలు కోరుతున్నాయంటే జగన్ దార్శనికత అర్థం అవుతుందన్నారు. ఈ వేడుకల్లో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు డా ప్రపుల్లారెడ్డి, బి సంజీవరావు, బెజ్జంకి అనిల్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్రెడ్డి, వనపర్తి జిల్లా అధ్యక్షుడు జశ్వంత్రెడ్డి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం (21న) ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీనాయకులు, అభిమానులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి కోరారు. జగన్ జన్మదినం సందర్భంగా దైవసన్నిధానాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని, రక్త, అన్నదాన శిబిరాల నిర్వహణతో పాటు ఆస్పత్రుల్లో పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలని గురువారం ఓ ప్రకటనలో కోరారు. -
ఎన్కౌంటర్ను స్వాగతిస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ కేసు నిందితులకు సరైన శిక్ష పడిందని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్కౌంటర్ను స్వాగతిస్తున్నామని, సత్వర న్యాయం చేశారని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఇటువంటి శిక్షలే సరి అన్నారు. చట్టం తన పని చేసుకుపోతుందని భావిస్తున్నామని చెప్పారు. ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దారుణాలకు పాల్పడే వారికి వెంటనే శిక్షలు పడేలా చట్టాలను మరింత కఠినంగా మార్చాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. (చదవండి: ఎన్కౌంటర్: గుడిగండ్లలో ఉద్రిక్తత) -
హుజూర్నగర్లో టీఆర్ఎస్కు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతివ్వాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం టీఆర్ఎస్ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డిని కలసి మద్దతు కోరగా ఆయన సానుకూలంగా స్పందించి మద్దతు తెలిపారు. -
తెలంగాణ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్కు ఘన నివాళి
-
8న రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జయంతి: గట్టు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి తెలిపారు. అన్ని జిల్లా, అసెంబ్లీ, మండల కేంద్రాల్లోని వైఎస్సార్ విగ్రహాలను పూలమాలలతో అలంకరించి నివాళులర్పించాలని శనివారం ఒక ప్రకటనలో కార్యకర్తలకు సూచించారు. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఆస్పత్రులల్లో రోగులకు పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ లోటస్పాండ్లో ఉదయం 9 గంటలకు నిర్వహించే వైఎస్సార్ జన్మదిన వేడుకల్లో పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు పాల్గొనాలని శ్రీకాంత్రెడ్డి కోరారు. -
రాజ్యాంగ స్ఫూర్తికి పునరంకితం కావాలి
సాక్షి, హైదరాబాద్ : రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులందరూ పునరంకితం కావాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం ఉదయం హైకోర్టు ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలవద్దకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ పి.నవీన్రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ వి.ఈశ్వరయ్య, జస్టిస్ చంద్రయ్య, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకల్లో గట్టు శ్రీకాంత్రెడ్డి, కొండా రాఘవరెడ్డి తదితరులు అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందడుగు వేయాలి: గట్టు హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రం ముందడుగువేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఆకాంక్షించారు. లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో జాతీయజెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అమరుల ఆకాంక్షలు నెరవేరాలని, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, కొండా రాఘవరెడ్డి, బి.సంజీవరావు, మహిళావిభాగం అధ్యక్షురాలు అమృతాసాగర్, ఎస్సీసెల్ అధ్యక్షుడు నాగదేశి రవికుమార్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో .. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరుల త్యాగాల ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో నాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్నట్లు కాకుండా రాష్ట్రంలో కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు పాలన సాగిస్తుండడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, ముఖ్యనేతలు కె. దయాకర్రెడ్డి, అరవింద్కుమార్గౌడ్, బండ్రు శోభారాణి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలో.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఆదివారం శాసనసభ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ లక్ష్యాలు నెరవేరలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన సాగుతోందని, కుటుంబ కబంద హస్తాల్లో, అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్రానికి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మజ్లిస్ పార్టీ ఒత్తిడితో నిర్వహించడం లేదని ఆరోపించారు. డీజీపీ కార్యాలయంలో.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో సీఐడీ ఎస్పీ సుమతి, డీఎస్పీ వేణుగోపాల్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ యోగేశ్వర్రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
సాక్షి, హైదరాబాద్ : రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 12న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఏర్పాటై మార్చి 12 నాటికి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకొని, 9వ వసంతంలోకి అడుగుపెడుతోందని ఈ సందర్భంగా శ్రీకాంత్ పేర్కొన్నారు. దీన్ని పునస్కరించుకొని లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లోని పార్టీ నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తప్పక పాల్గొనా లని కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని కోరారు. -
వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో దైవసన్నిధానాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని ఆయ న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రక్తదానం, అన్నదానం, ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర జనవరి 9,10 తేదీల్లో విజయవం తంగా పూర్తి చేసుకోవాలని, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించి సీఎం కావాలని కోరుకుంటూ ప్రార్థనలు నిర్వహించాలన్నారు. -
వైఎస్.జగన్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గురువారం విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని భవిష్యత్తులో దాడులు జరగకుండా ఉండటానికి వైఎస్ జగన్కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీలో జగన్ చేపట్టిన పాదయాత్ర విశేష ప్రజాదరణ పొందిందన్నారు. ప్రతినిత్యం లక్షలాదిమంది ప్రజల్లో ఒక్కడిగా ఉంటూ వారి సమస్యలను వింటూ, వారికి న్యాయం జరిగేలా చూడాలని నిత్యం పరితపించే జననాయకుడు జగన్ అని పేర్కొన్నారు. లక్షలాదిమంది ప్రజలు బాసటగా నిలుస్తూ, స్వచ్ఛందంగా ఆయన అడుగులో అడుగు వేస్తూ బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఆయనకు వస్తున్న ప్రజాభిమానాన్ని తట్టుకోలేని కొందరు దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు ఏపీలో వైస్సార్సీపీ కార్యకర్తలపై మొదలైన దాడులు జననాయకునిపై దాడి వరకు చేరాయన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయనటానికి ఇది ఉదాహరణ అని అన్నారు. రాష్ట్ర ముఖ్యనేతపై దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. -
ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: ప్రజలంతా వైఎస్ జగన్ కోసం వేచి చూస్తుంటే జనం కోసం వైఎస్ జగన్ వేలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. సోమవారం వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. జనం కోసమే వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టారని, జగన్ కోసం జనం వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారని శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం ద్వారా ఒక చరిత్ర సృష్టిస్తే, ఇప్పుడు వైఎస్ జగన్ నవచరిత్ర సృష్టించారన్నారు. చరిత్ర సృష్టించాలన్నా, తిరగ రాయాలన్నా అది మహానేత వంశానికే సాధ్యమవుతుందన్నారు. ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలిగిస్తూ భవిష్యత్తు బాగుంటుందనే భరోసా ను పెంపొందిస్తూ పాదయాత్ర సాగుతోందన్నారు. పాదయాత్రలో సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలం తా వైఎస్ జగన్ ధృడమైన నాయకత్వాన్ని చూశారని, ఆయన వస్తే ఆశలు, ఆశయాలు తీరుతాయనే ప్రగా ఢ విశ్వాసం ప్రజల్లో నెలకొందన్నారు. మరే నాయ కుడు పాదయాత్ర చరిత్రను తిరగరాసే ప్రసక్తే ఉండదన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రఫుల్లారెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్ సీఎం ఎప్పుడు అవుతారా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు. ఆయన నాయకత్వంలోనే పేదవాడు గొప్పవాడుగా, రైతు రాజుగా అవుతారన్నారు. చంద్రబాబు, కేసీఆర్ పాలనలో దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు ప్రజలు చూస్తున్నారన్నారు. ఏపీలో పోలవరం, పట్టిసీమ, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులను ధనార్జన కోసం వాడుకుని అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కేసీఆర్, చంద్రబాబు దుర్నీతిని ఎండగడుతూ ప్రజల కోసం పనిచేస్తున్న వైఎస్సార్సీపీకి అండగా ఉండా లని ప్రజలను కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయ కులు బి.అనిల్కుమార్, బొడ్డు సాయినాథ్రెడ్డి, నాగదేశి రవికుమార్, బసిరెడ్డి బ్రహ్మానందరెడ్డి, వి.సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటియాత్ర!
మిర్యాలగూడ: పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్కి మిర్యాలగూడ ప్రజలు, కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల, కుల సంఘాల నాయకులు ఆదివారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఉక్రెయిన్లో వైద్య విద్య చదువుతున్న ప్రణయ్ తమ్ముడు అజయ్ మధ్యాహ్నం 2.40 గంటలకు ఇక్కడికి చేరుకున్నాడు. అనంతరం వినోభానగర్లోని నివాసం నుంచి 3.15 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. యాత్ర సాగుతున్నంత సేపూ ప్రణయ్ భార్య అమృత, తల్లిదండ్రులు బాలస్వామి, ప్రేమలత రోదిస్తూనే ఉన్నారు. వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల, కుల సంఘాల నాయకులు భారీగా తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. వినోభానగర్ శ్మశానవాటికలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం.. 7.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ప్రణయ్ని హత్య చేయించిన మారుతీరావును ఉరితీయాలని అంతియయాత్రలో స్నేహితులు, బంధువులు నినాదాలు చేశారు. నివాళులర్పిస్తున్న వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి, ప్రణయ్ అంతిమయాత్రలో పాల్గొన్నగోరటి వెంకన్న, ఇతర ప్రజా సంఘాల నేతలు వదినను, తండ్రిని పట్టుకొని రోదిస్తున్న ప్రణయ్ తమ్ముడు అజయ్ అంతిమయాత్రలో పాల్గొన్న నాయకులు... ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, ప్రజా కవి గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, జూలకంటి రంగారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాల్వాయి రజిని, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎల్లయ్య, న్యూ డెమొక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోవర్ధన్, ఐఎఫ్టీయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనురాధ, తెలంగాణ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, కుల నిర్మూలన వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండారు లక్ష్మయ్య, మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, విరసం నాయకురాలు ఉదయ కుమారి పాల్గొన్నారు. పలువురి పరామర్శ: ప్రణయ్ మృతదేహాన్ని సందర్శించి, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ రాములునాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు, మాజీ ఎమ్మెల్సీ భారతీరాగ్యానాయక్, మాజీ ఎమ్మెల్యేలు రామ్మూర్తి యాదవ్, చిరుమర్తి లింగయ్య, ఇండియన్ రైల్వే సర్వీసెస్ రిటైర్డ్ చీఫ్ జనరల్ భరత్ భూషణ్, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ మురళీమోహన్ ఉన్నారు. కఠినంగా శిక్షించాలి ప్రణయ్ హత్యలో నిందితులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రణయ్ మృతదేహాన్ని జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డితో కలసి సందర్శించి సంతాపం తెలిపారు. అనంతరం అమృత, ప్రణయ్ తల్లిదండ్రులను పరామర్శించి మాట్లాడారు. ఇంకా కులాల పేరుతో పరువు హత్యలు జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. -
ముందస్తు ఎన్నికలకు సన్నద్ధం కావాలి
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గట్టు శ్రీ,కాంత్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య సమావేశం జరిగింది. గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు, అభ్యర్థులు బలంగా ఉన్న స్థానాలు గుర్తిస్తున్నామని తెలిపారు. ఈ వివరాలన్నీ అధిష్టానానికి అందజేస్తామని చెప్పారు. ముందస్తు నేపథ్యంలో ఎన్నికల కమిటీ, కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పార్టీకి కార్యకర్తలే దేవుళ్లని, రాజకీయాల్లో ఓపిక ఎక్కువగా ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమై, మళ్లీ ముందస్తు ఎన్నికలు వచ్చేలా చేశారని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు బషీర్బాగ్లో రైతులపై కాల్పులు జరిపించి, ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని గుర్తుచేశారు. అలాంటి టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనైతికమన్నారు. అవసరం కోసం చంద్రబాబు ఎవరి కాళ్లయినా పట్టుకుంటారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకే ఎన్నికల్లో పాల్గొంటామని పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. సంపూర్ణ మద్దతున్నా కేసీఆర్ ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మతీన్ ముజాద్దాదీ, రాంభూపాల్రెడ్డి, మహేందర్రెడ్డి, అనిల్ కుమార్, ప్రపుల్లారెడ్డి, సంజీవరావు, పార్టీ మహిళా అధ్యక్షురాలు అమృతసాగర్, జీహెచ్ఎంసీ అధ్యక్షుడు సాయినాథ్రెడ్డి, వెల్లాల రామ్మోహన్, రవికుమార్, ఎస్ఈసీ సభ్యులు అక్కెనపల్లి కుమార్, బ్రహ్మానందరెడ్డి, జిల్లాల అధ్యక్షులు, ఇన్చార్జ్లు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
రేపు తెలంగాణ వైఎస్సార్సీపీ ముఖ్య సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10న ముఖ్య సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్పాండ్లో ఈ సమావేశం జరుగుతుంది. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఇన్చార్జ్లు, జిల్లా అధ్యక్షులు, ఎస్ఈసీ సభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు హాజరుకావాలని పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, తదితర అంశాలపై చర్చించనున్నారు. వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాజేంద్రనగర్కు చెందిన సయ్యద్ ఫాజిల్ అహ్మద్ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గట్టు శ్రీకాంత్రెడ్డి నియమించారు. రాష్ట్ర యూత్ విభాగం కార్యదర్శులుగా అల్లె అనిల్ కుమార్, గుండ తిరుమలయ్యను నియమించారు. -
ఏం సాధిస్తారు...
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ దాదాపు తొమ్మిది నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లి ఏం సాధించాలనుకుంటున్నదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి నిలదీశారు. హైదరాబాద్ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలన్నింటినీ టీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ ముఖ్య నేతల సమావేశం జరిగిందన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు. తీర్మానాన్ని వైఎస్ జగన్ నిర్ణయానికి అప్పజెప్పామని, ఆయన నిర్ణయం మేరకే ముందుకెళతామని శ్రీకాంత్రెడ్డి తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మొదటగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం గడువు ముగియక ముందే ముందస్తు పేరుతో ఎన్నికలకు ఎందుకు వెళుతున్నదో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
ఏ హామీ నెరవేర్చారని ముందస్తుకు వెళ్తున్నారు
-
‘కేసీఆర్ సరైన సమాధానం ఇవ్వాలి’..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రభుత్వం తొమ్మిది నెలల ముందే పోవటం ఏంటనేది కేసీఆర్ సరైన సమాధానం ఇవ్వాల్సి ఉందని తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా యువతకి ఉద్యోగాలు ఇచ్చారని ముందస్తుకు వెళ్తున్నారా..? ఏ హామీ నెరవేర్చారని ముందస్తుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ అభిమానులు అనేక మంది ఉన్నారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల హమీలను మరిచిన సంగతిని వైఎస్సార్ సీపీ ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ తెలంగాణలో ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందనేది తీర్మానం చేసి జాతీయ అధ్యక్షుడికి పంపిస్తామని అన్నారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడి నిర్ణయం ప్రకారం ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది నిర్ణయిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో పొత్తుల విషయం కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. -
‘హామీలను నెరవేర్చిన తరువాతే ఎన్నికలకు వెళ్లాలి’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలన్ని నెరవేర్చిన తరువాతనే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీల మేరకు వెంటనే లక్షన్నర ఉద్యోగాల ప్రకటన విడుదల చేయాలని కోరారు. దళితులకు మూడు ఎకారాల భూమి పంపిణీ చేయాలని అన్నారు. రాష్ట్రంలో 2.70 లక్షల డబుల్ బెడ్రుం ఇళ్లు ఇస్తానన్నాని.. కేవలం పదివేల ఇళ్లు మాత్రమే నిర్మించారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ ఏవిధంగా ప్రజలను ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. -
‘బ్రిటీష్ పాలనకంటే ఘోరంగా బాబు పాలన’
సాక్షి, కడప : తనను ప్రశ్నిస్తే జైలుకే అంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన బ్రిటీష్ పాలన కంటే ఘోరంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గట్టు శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా రాయచోటిలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గట్టు శ్రీకాంత్ రెడ్డితో పాటు కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. మైనారిటీల అక్రమ అరెస్టులపై వారు ధ్వజమెత్తారు. మైనారిటీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నారా హమారా, టీడీపీ హమారా.. ప్రభుత్వ కార్యక్రమమా.. పార్టీ కార్యక్రమమా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా మైనారిటీలు పడుతున్న ఇబ్బందులను గుర్తించని బాబుకు ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి భూటకపు ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. మైనారిటీ సంక్షేమానికి కట్టుబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. మైనారిటీలను వేధిస్తుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. బాబును ఊరికే పొగడాలంటే తమ వల్ల కాదని అన్నారు. చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోమని అడగటం నేరమా అని ప్రశ్నించారు. -
వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించండి
సాక్షి, హైదరాబాద్: అపరభగీరథుడు, దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో వైఎస్సార్కు ఘన నివాళులర్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వైఎస్సార్ విగ్రహాలను పూలమాలలతో అలంకరించాలన్నారు. అనంతరం రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఆస్పత్రులలో రోగులకు పండ్ల పంపిణీ, అనాథలకు వస్త్రాల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. -
‘బాబు’ బొమ్మతో ఓట్లకు పోతారా..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన మహానేత వైఎస్సార్ ఫొటో పెట్టుకోవడానికి జంకుతున్న ఆ పార్టీ నేతలు.. సిగ్గు లేకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకోవాలనుకోవడం నీతిమాలిన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు బొమ్మ పెట్టుకొని ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆ పార్టీ నేతలకు అసలు సిగ్గుందా? అని ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ‘నిరుద్యోగ గర్జన’సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు, నీళ్లు, నియామకాలంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఉద్యోగాల జాడలేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిన లక్ష ఉద్యోగాల భర్తీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. లోపభూయిష్టంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయడం, కోర్టు కేసులతో నియామకాల ప్రక్రియ ఆగిపోవడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేతకాని వ్యవస్థలా తయారైందని ఆయన మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 12 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని 19 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినా కోర్టు ద్వారా రద్దయ్యాయని తెలిపారు. నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఉద్యోగాలు భర్తీ చేసే వరకు ఉద్యమాన్ని ఆపబోమని హెచ్చరించారు. ఉద్యోగాలు భర్తీ చేశాకే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ, భగీరథ పథకాలు కమీషన్లు దండుకోవడానికేనని గట్టు ఆరోపించారు. ప్రాజెక్టు పనుల పురోగతి, నిధుల కేటాయింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులకే రీడిజైనింగ్ చేస్తూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా చేపట్టి ప్రాజెక్టులు ఏమీ లేవని ఆయన విమర్శించారు. ఆన్గోయింగ్ ప్రాజెక్టుల పనులు చేస్తూ గొప్పలు చెప్పుకోవడమే టీఆర్ఎస్ ప్రభుత్వానికి రివాజుగా మారిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి ప్రజలను వంచించడానికే ముందస్తు ఎన్నికల డ్రామాకు తెరలేపారని గట్టు ఆరోపించారు. వైఎస్సార్సీపీ సొంత ఎజెండాతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి బెజ్జంకి అనిల్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవరావు, డాక్టర్ ప్రపుల్లకుమార్రెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి అజయ్వర్మ, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి అక్కెనపల్లి కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉద్యోగాల భర్తీపై శ్వేత పత్రం విడుదల చేయాలి’
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులను, నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ గర్జన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎర్పడిన తరువాత ఎన్ని ఉద్యోగాలు కల్పించారో, ఎన్ని ఉద్యోగాలు ఖాళీ అయ్యయో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో టీఆర్ఎస్ మోసానికి పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, పేర్లు మార్చడం తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని.. అందుకు టైం షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తామని చెప్పడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. పాతిక లక్షల మందితో టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లు పెట్టడం కాదు.. పాతిక లక్షల మందికి నియామకాలు ఎప్పుడో చేపడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీకైనా ఓటమి తప్పదని సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణలో తిరగనీయకుండా చేయాలన్నారు. -
నేడు కరీంనగర్లో ‘నిరుద్యోగ గర్జన’ : గట్టు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగ గర్జన సభను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిరుద్యోగులు, పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకు ఆందోళన ప్రారంభమవుతుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయటానికి సీఎం కేసీఆర్కు చేతులు రావటం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని గట్టు డిమాండ్ చేశారు. -
నిరుద్యోగ గర్జన సభ వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం కరీంనగర్లో నిర్వహించాల్సిన నిరుద్యోగ గర్జన సభను వాయిదా వేసినట్లు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగ గర్జన సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జరిగిన ఈ మార్పును అంతా అర్థంచేసుకోవాలని కోరారు. ఈ నెల 24న జరగనున్న సభకు నిరుద్యోగులు, పార్టీ రాష్ట్ర, అన్ని జిల్లాల నాయకులు మరియు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆ దంపతులను చూస్తేనే నా జన్మ ధన్యమవుతుంది
రాజోళి (అలంపూర్) : ‘వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్రెడ్డి–భారతి దంపతులను చూస్తేనే నా జన్మ ధన్యమవుతుంది.. అపుడే నాకు ఆనందం అని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళికి చెందిన విద్యాసాగర్ పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డిని చూడా లని తన కోరిక అని ఆయన చెప్పిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్.. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన శనివారం రాజోళికి వచ్చి విద్యాసాగర్ను ఆయన నివాసం లో పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ తనకు, తన తల్లిదండ్రులకు వైఎస్.రాజశేఖర్రెడ్డి కుటుంబమంటే ప్రాణమని.. ఎప్పటికైనా పెద్దాయనను కలవాలని అనుకున్నా కుదరలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత జగన్ చూసినపుడల్లా కలవాలని, మాట్లాడాలని అనిపించినా కుదరడం లేదని తెలిపారు. సివిల్ ఇంజనీర్గా ఎన్నో ప్రాజెక్టుల్లో సేవలందించిన తనకు ఎక్కడా సరైన గౌరవం దక్కకపోగా.. వైఎస్ కుటుంబాన్ని చూడగానే తెలియని ధైర్యం వస్తుందని పేర్కొన్నారు. అయితే, పని చేసే సమయంలోనే నా రెండు కిడ్నీలు చెడిపోగా, అల్సర్ కూడా వచ్చిందని.. ఇంతలోనే తన కూతురు కూడా చనిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమార్తె కూడా జగన్ను చూడాలని కోరుకునేదని.. ఆమె కోరిక తీరకపోగా, తన కోరికైనా తీరుతుందో, లేదోనని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తాను జగన్ చూడాలనుకుంటున్న విషయం తెలుసుకుని ఆయన తరఫున శ్రీకాం త్రెడ్డిని పంపించడం ఆనందంగా ఉందని విద్యాసాగర్ తెలిపారు. ఇంత త్వరగా స్పందించే గుణం ఉండడంతోనే వైఎస్సార్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని, అందుకే జననేతగా పిలుస్తున్నారని తెలిపారు. విద్యాసాగర్కు అండగా ఉంటాం.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విద్యాసాగర్కు అన్ని విధాలుగా అండగా ఉంటా మని గట్టు శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించేలా సమస్య తెలుసుకునేందుకు తనను జగన్మోహన్రెడ్డి పంపించారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు కొండూరు చంద్రశేఖర్, జోగుళాంబ గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్, బీస మరియమ్మతో పాటు భూపాల్రెడ్డి, లక్ష్మీనారాయణ, చంద్రవాసులు రెడ్డి, బంగారు మహేశ్వర్ రెడ్డి, వంశీధర్రెడ్డి, రాజు, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. -
నిరుద్యోగులను వంచించిన టీఆర్ఎస్: గట్టు
సాక్షి, హైదరాబాద్: లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ హామీని విస్మరించి నిరుద్యోగులను పూర్తిగా వంచించిందని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి దుయ్యబట్టారు. ఖాళీగా వున్న ఉద్యోగాలకు ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని శనివారం ఓ ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాల భర్తీకి ఖమ్మం జిల్లాలో నిర్వహించాలనుకున్న నిరుద్యోగ గర్జనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించినందున అదే సభను ఈ నెల 21న కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగేళ్లుగా నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేసి అప్పులపాలవుతున్నారని వాపోయారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, కమీషన్ల కక్కుర్తికి సాగునీటి ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేయటానికి మాత్రం చేతులు రావటం లేదన్నారు. నిరుద్యోగ గర్జన సభకు నిరుద్యోగులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ఉద్యోగాల భర్తీలో విఫలం
నల్లగొండ టూటౌన్ : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేస్తుందని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్లగొండలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా íసీఎం కేసీఆర్ లక్షా 6వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించి నేటికీ 20వేలు కూడా భర్తీ చేయకపోవడం ప్రభుత్వం అసమర్థత అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, వాటిని ఎందుకు భర్తీ చేయలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి ఉద్యమ సమయంలో నిరుద్యోగులను వాడుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయకుండా మోసం చేసిందన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ కోచింగ్ సెంటర్లకు లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన అతి కొద్ది ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా కోర్టులోనే నానుతున్నాయన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటికి యుద్ధప్రాతిపదికన నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, విద్యార్థులు సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పార్టీ తరుపున ఆందోళనలు తీవ్రతరం చేస్తామని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిందే నిధులు, నియామకాలు, నీళ్ల కోసమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మేడిశెట్టి యాదయ్య, కోరె గోవర్ధన్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండీ ఫయాజ్, నాయకులు నరేష్గౌడ్, గాదరి రమేష్, మాచర్ల దశరథ, తదితరులు పాల్గొన్నారు. -
21న ఖమ్మంలో నిరుద్యోగ గర్జన
నల్లగొండ టూటౌన్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నిరుద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 21న ఖమ్మంలో నిరుద్యోగగర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండలో నిరుద్యోగ సమస్యలపై నిర్వహించిన సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికో బర్రె, ఇంటికో గొర్రెను ఇస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో కనీసం 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని అసమర్థ ప్రభుత్వమన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిశెట్టి యాదయ్య, కోరె గోవర్ధన్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఫయాజ్ పాల్గొన్నారు. -
‘సంతకాల సేకరణను విజయవంతం చేయాలి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘కొలువుల కోసం సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి జిల్లా, మండల, పట్టణ కేంద్రాల్లో ఆగస్టు 8 నుంచి 16 వరకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పట్టుదలతో నిర్వహించాలన్నారు. కార్యకర్తలు ప్రతీ ఇంటికి తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని నిరుద్యోగులను వంచించిన తీరును ఓటర్లకు వివరించాలని కోరారు. పార్టీ జూలై 25న మండల కేంద్రాలలో, ఆగస్టు 2న కలెక్టరేట్ల వద్ద ఉద్యోగ ధర్నాలు చేపట్టినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెప్పారు. నాలుగేళ్లుగా నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ, వేలకు వేలు ఖర్చు చేసి అప్పులపాలవుతున్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే పనిచేస్తుందని విమర్శించారు. -
కొలువుల కోసం సంతకాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కొలువులు భర్తీ కాక నిరుద్యోగులు పడిగాపులు కాస్తున్నారని, అయినా సర్కారు వారి గురించి ఆలోచించట్లేదని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. కొలువుల కోసం వైఎస్సార్సీపీ పోరుబాట పట్టిందన్నారు. శనివారం ఇక్కడ లోటస్పాండ్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని నిరుద్యోగులను వంచించిందన్నా రు. ఖాళీగా వున్న ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 25న మండల కేంద్రాలు, ఆగస్టు 2న కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యోగ ధర్నాలు విజయవంతమయ్యాయని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నా రు. నాలుగేళ్లుగా నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేసి అప్పుల పాలవుతు న్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, కమీషన్ల కోసం సాగునీటి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేయటానికి సీఎం కేసీఆర్కు చేతులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ ఏవిధంగా మోసం చేసిందో నిరుద్యోగులకు వివ రించాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. నిరుద్యోగుల పక్షాన పోరాటాన్ని మరింత ఉదృతం చేసేందుకు ప్రతి మండ ల, జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో ఆగస్టు 8 నుండి 16 వరకు కొలువుల కోసం సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలు పునిచ్చారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలన్నారు. వారి పక్షాన అండగా నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్టు 21న ఖమ్మంలో నిరుద్యోగ గర్జన నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. నిరుద్యోగ గర్జనకు నిరుద్యోగులు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వానికి నిరుద్యోగుల ఆకాంక్షను బలంగా వినిపించాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జె.మహేందర్రెడ్డి, మతీన్ ముజదుద్దీన్, బి.సంజీవరావు, బి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం జరుగుతోందని, తెలం గాణ రాష్ట్రం ఏర్పడితేనే లక్షల ఉద్యోగాలు మనకొస్తాయని కేసీఆర్ పదే పదే చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న కొత్త రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబంలో ఐదు ఉద్యోగాలొచ్చాయి. కానీ, విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న లక్షన్నర ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నాలో శ్రీకాంత్రెడ్డి ఆందోళనకారులనుద్ధేశించి మాట్లాడారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, కమీషన్ల కక్కుర్తి కోసమే కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. న్యాయస్థానాల చుట్టూ విద్యార్థులు... ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయటానికి ప్రభుత్వానికి చేతులు రావటం లేదని గట్టు వాపోయారు. టీఎస్పీఎస్సీ చేసిన తప్పిదాల వల్ల నిరుద్యోగులు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం అధికార మత్తులో జోగుతున్నారని విమర్శించారు. టీఎస్పీఎస్సీ నిర్ధిష్టమైన నియమ నిబంధనలు పొందుపరచకపోవటంతో 2016 నవంబర్లో నిర్వహించిన గ్రూపు–2 పరీక్షలు, 2017లో నిర్వహించిన గురుకుల పరీక్షల ఫలితాలు విడుదల కాలేదన్నారు. ‘సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో 1.07 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని, వాటిని భర్తీ చేస్తామన్న మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. లక్షల ఉద్యోగాలు కల్పించడం ఎలా సాధ్యమవుతాయని అవహేళన చేసేవిధంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు’ అని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తి అయినా కేవలం 12 వేల ఉద్యోగాలు భర్తీ చేసి చేతులు దులుపుకుందన్నారు. ఇయర్ క్యాలెండర్ ఏమైంది... ఆర్భాటం కోసమే జూన్ 2 నాడు ఉద్యోగాల ప్రకటనలు విడుదల చేస్తున్నారని శ్రీకాంత్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగుల కోసం ప్రతి సంవత్సరం ఇయర్ క్యాలెండర్ ప్రకటిస్తామని కేసీఆర్ ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కళ్లు కా యలు కాసేలా ఎదురుచుస్తున్నారన్నారు. ప్రభుత్వవైఖరిలో మార్పు రాకపోతే, పోరా టాన్ని దశలవారీగా ముందుకు తీసుకెళ్తామ న్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్ఏ రహమాన్ మాట్లాడుతూ నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తే 2019 ఎన్నికల్లో కేసీఆర్కి బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రఫుల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ది ఎలక్షన్, కలెక్షన్, కన్స్ట్రక్షన్ సిద్ధాంతమని విమర్శించారు. పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు వేలాది రూపాయల అప్పులు చేసి పిల్లల్ని కోచింగ్ సెంటర్లకు పంపుతున్నారన్నారు. పార్టీ యూత్ విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ మాట్లాడుతూ వైఎస్సార్ పథకాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. అనంతరం శ్రీకాంత్రెడ్డి, రెహమాన్, సాయినాథ్రెడ్డి, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, రామ్మోహన్ కలెక్టర్కు వినతిపత్రం అంజేశారు. -
ఉద్యోగాల భర్తీని మరచిన కేసీఆర్ : శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న సీఎం కేసీఆర్ సర్కారు ఖాళీల భర్తీని విస్మరించిందని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఉద్యోగాల భర్తీ కోసం వైఎస్సార్ సీపీ నాయకులు ధర్నాలు చేపట్టారు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఉద్యోగ ధర్నాలో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని మండిపడ్డారు. మూడు నెలల్లోగా ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేదంటే నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జిల్లాల్లో ఇలా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా : జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల్లో 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా జరిగింది. ఈ మేరకు డీఆర్వో మోహన్ లాల్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు నాడేమ్ శాంత కుమార్, భూపాలపల్లి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు అప్పమ్ కిషన్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకుడు రామకృష్ణ, వైఎస్సార్ సీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ పట్టణంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల్లో 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కలక్టరేట్ ముందు ధర్నా చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు ఏవో పి.సురేష్ బాబుకి వినతిపత్రం అందజేశారు. కరీంనగర్ జిల్లా : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కలెక్టరేట్ ముందు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఖమ్మం జిల్లా : జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ నందు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఉద్యోగ ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా వైఎస్సార్ సీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ బాబు విచ్చేశారు. పెద్దపల్లి జిల్లా : ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని పెద్దపల్లిలో కలెక్టరేట్ ముందు వైఎస్ఆర్సీపి జిల్లా అధ్యక్షులు గోవర్ధన శాస్త్రి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా : లక్షా 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సిరిసిల్లలో కలెక్టరేట్ ముందు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు రామ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. -
లక్ష ఉద్యోగాల భర్తీ కోసం ఆందోళనలు: గట్టు శ్రీకాంత్
సాక్షి హైదరాబాద్: ఇచ్చిన హామీ మేరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలన్న చిత్తశుద్ధి సీఎం కేసీఆర్లో కనపడటం లేదని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లుగా సీఎం కేసీ ఆర్ అసెంబ్లీలో, పలు సభల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నోసార్లు ప్రకటించారని శనివారం ఓ ప్రకటనలో గుర్తుచేశారు. ఇప్పటికీ ఆ దిశగా ప్రభు త్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు లక్షకు పైనే ఉన్నాయని.. వీటితో పాటు ఈ నాలుగేళ్లలో సుమారు 50 వేల మంది ఉద్యోగస్తులు పదవీ విరమణ పొందారని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే 1.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని గట్టు డిమాండ్ చేశారు. నాలుగేళ్లు పూర్తయినా లక్ష ఉద్యోగాలు భర్తీ చేయనందుకు నిరసనగా 25న మండల కేంద్రాల్లో ధర్నాలు చేశామన్నారు. దీనిపై స్పందన రాకపోవడంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేం దుకు రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 2న అన్ని జిల్లా కేంద్రా ల్లోని కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించి, కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు గట్టు పిలుపునిచ్చారు. -
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీలో పలు నియామకాలు చేపట్టారు. పార్టీని నమ్ముకొని దివంగత మహానేత వైఎస్సార్ ఆశయాల సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నవారికి కీలకబాధ్యతలు అప్పగించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్రెడ్డి క్రియాశీలంగా పనిచేస్తున్న నాయకులను ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులుగా నియమించారు. లింగారెడ్డి జస్వంత్రెడ్డి(వనపర్తి జిల్లా అధ్యక్షుడు), ముల్కల గోవర్ధన్శాస్త్రి (పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు), అప్పం కిషన్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు), షేక్ తజ్ముల్ హుస్సేన్ (నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు), మహ్మద్ సయ్యద్ ముఖ్తార్(వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా), వేమిరెడ్డి రోషిరెడ్డి(వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా, ఖమ్మం టౌన్ ఇన్చార్జ్), జన్ను విల్సన్ రాబర్ట్ (వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ కోఆర్డినేటర్గా), మాజిద్ఖాన్ (చాంద్రాయణగుట్ట నియోజకవర్గ కోఆర్డినేటర్గా) నియమితులయ్యారు. ఆ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పదవుల్లో నియమితులైనవారు తక్షణమే జిల్లాల్లో ప్రజాసమస్యలపై పోరాటాలకు సిద్ధపడాలని శ్రీకాంత్రెడ్డి సూచించారు. లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావటానికి జూలై 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, ఆగస్టు 2న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాలను కొత్త నాయకత్వం ప్రత్యేకశ్రద్ధతో విజయవంతం చేయాలని సూచించారు. -
నిరుద్యోగులను మోసం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోని విద్యార్థులు, నిరుద్యోగులు, యువత ఆశలు ఆవిరయ్యాయని.. వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. గురువారం హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 1.07 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తానని చెప్పారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయినా కేవలం 12 వేల ఉద్యోగాలే భర్తీ చేశారన్నారు. మిగిలి ఉన్న ఏడాదిలో లక్ష ఉద్యోగాల లక్ష్యం నెరవేరుతుందా అని ఆయన కేసీఆర్ను ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే మా ఉద్యోగాలు మాకొస్తాయని నాడు ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. టీఎస్పీఎస్సీ తప్పిదాలు నిరుద్యోగులకు శాపాలు టీఎస్పీఎస్సీ 2016 నవంబర్లో నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలు, 2017లో నిర్వహించిన గురుకుల పరీక్షల్లో తప్పిదాలు జరగడంతో ఫలితాలు విడుదల కాలేదని తెలిపారు. టీఎస్పీఎస్సీ చేసిన తప్పిదాల వల్ల నిరుద్యోగులు ఉన్నత న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులను తొలగించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. కేవలం ఆర్భాటం కోసమే జూన్ 2 నాడు ఉద్యోగాల ప్రకటనలు విడుదల చేస్తున్నారు తప్పా.. నిజంగానే నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగుల కోసం ప్రతి సంవత్సరం ఇయర్ క్యాలండర్ ప్రకటిస్తామని కేసీఆర్ ప్రగల్భాలు పలికారని కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాలుగేళ్ల నుంచి నేటి వరకు అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట అనేక బహిరంగ సభల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారని విమర్శించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉద్యోగ ఖాళీలు లక్ష పైన ఉండగా.. ఈ నాలుగేళ్లలో మరో 50 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారన్నారు. ఈ రకంగా చూస్తే ప్రభుత్వం భర్తీ చేయాల్సిన ఖాళీలు సుమారు 1.50 లక్షలు అని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండు చేశారు. ఆందోళన బాట పడతాం లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, ఆగస్టు 2న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్టు గట్టు శ్రీకాంత్రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ప్రఫుల్లా రెడ్డి, జి.రాంభూపాల్ రెడ్డి, బి.అనిల్ కుమార్, బి.సంజీవ రావు, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కె.అమృతా సాగర్, జీహెచ్ఎంసీ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి, రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎన్.రవికుమార్, ఎస్ఈసీ సభ్యుడు బి.బ్రహ్మా నందరెడ్డి, అక్కెనపల్లి కుమార్, వేముల శేఖర్ రెడ్డి , ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందుకే ఆయన రాజన్న అయ్యాడు
సాక్షి, హైదరాబాద్ : ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన గొప్ప నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు. దేశంలో ఏ ఒక్కనేత అందించని పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టారని అన్నారు. ఆదివారం వైఎస్సార్ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మట్లాడుతూ.. వైఎస్సాఆర్ ప్రవేశ పెట్టిన పథకాల కారణంగానే, ఆయన్ను రాజన్న అని పిలుచుకుంటారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అప్పటి వరకూ పాలకులు విస్మరిస్తే, కేవలం ఒక్క వైఎస్సార్ మాత్రమే తెలంగాణ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదలకు రెండు రూపాయలకే బియ్యం, పక్కా గృహాలు, ఉచిత విద్యుత్, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నకు రుణమాఫీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ప్రాణహిత, పాలమూరు రంగారెడ్డి పథకాలు పేర్లు మార్చినా వాటికి పునాదులు వేసింది మాత్రం వైఎస్సారే అని స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తేనే రాజన్న రాజ్యం వస్తుందని చెప్పారు. -
అందని ద్రాక్షలా లక్ష ఉద్యోగాలు
హైదరాబాద్: కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు అడియాసలే అయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడితే లక్షకుపైగా ఉద్యోగాలు వస్తాయని భావించి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడిచినా ఉద్యోగాల భర్తీ చేయడంలేదని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీస్ శాఖతో పాటు వివిధ కార్పొరేషన్లలో కొన్ని ఉద్యోగాలే భర్తీ చేసిందని... రెవెన్యూ, విద్యా, వైద్యారోగ్య, వ్యవసాయ శాఖల్లో కొలువులు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు మొండిచేయి చూపిస్తోందన్నారు. క్యాలెండర్ ఇయర్ ప్రకటిస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని గట్టు అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే గ్రూప్–2, గురుకుల పరీక్షల్లో తప్పిదాలు జరిగాయన్నారు. టీఎస్పీఎస్సీ పొరపాట వల్లే నిరుద్యోగులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. గత నాలుగేళ్లలో విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్లపై, ప్రస్తుత ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేయాలి: గట్టు
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్(పునాస) సీజన్కు సంబంధించిన ప్రణాళికను వ్యవసాయ శాఖ తక్షణమే సిద్ధం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేయడంలో తాత్సార్యం తగదని విమర్శించారు. శనివారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడు దల చేశారు. రైతులు అమ్మిన వరి ధాన్యానికి ప్రభుత్వం రూ.1,500 కోట్లు చెల్లించాలని కోరా రు. విత్తనాలు, ఎరువులు కొనటానికి డబ్బుల్లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులను పంపిణీ చేయాలని కోరారు. నకిలీ విత్తనాలను సరఫరా చేసే కంపెనీలపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసి వాటి లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి రైతులకు ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని కోరారు. ఇప్పటికైనా రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
‘శాట్స్’ కేసును సీబీఐకి అప్పగించాలి: గట్టు
సాక్షి, హైదరాబాద్: మెడికల్ సీట్ల కేటాయింపులో అర్హులైన స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు సీట్లు కేటాయించకుండా శాట్స్ అవినీతికి పాల్పడిందని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాం త్రెడ్డి ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా కింద సిఫారసుకు విద్యార్థులు సమర్పించిన పత్రాలను క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సారథ్యంలో ఏర్పాటైన కమిటీ పరిశీలించకుండా శాట్స్కు చెందిన డిప్యూటీ డైరెక్టర్, కోచ్లు పరిశీలించి సంతకాలు చేశారన్నారు. ఈ కేసును ఏసీబీ నుంచి సీబిఐకి అప్పగించాలని శ్రీకాంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి,హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలు పదవులకు నియామకాలు జరిగాయి. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా డా.మనోజ్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులుగా కె.ఇందిర, ఎం.జాహ్నవి, కార్యదర్శిగా నిమ్మల లలిత నియమితులైనట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
‘జన చైతన్య’ను బస్సు యాత్ర
కోస్గి(కొడంగల్) : టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టి రానున్న ఎన్నికల్లో రాజన్న కలలుగన్న ప్రజాసంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టనున్న జన చైతన్య బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రపుల్లారెడ్డి పిలుపునిచ్చారు. జూన్ మొదటి వారంలో నిర్వహించే ఈ యాత్రకు సంబంధించి గురువారం కొడంగల్ నియోజకవర్గంలో రూట్ మ్యాప్ను నిర్ణయించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తమ్మలి బాల్రాజ్ సమక్షంలో ఆయా మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సెంటిమెంట్ను కొనసాగిస్తూ.. ఈ యాత్రను చేవేళ్ల నుంచి ప్రారంభించేందుకు పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. ఆనాడు ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్ అమలు చేసిన పథకాలను వివరిస్తూ.. ప్రజలతో మమేకమై పార్టీని గ్రామీణ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు చేపడుతున్న ఈ జన చైతన్య బస్సు యాత్రకు వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. బస్సు యాత్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్రెడ్డి, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సాయినాథ్రెడ్డి, నాయకులు మల్లేష్, కిష్టప్ప, జావీద్, రవిగౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రాత్రి ఆయన సాక్షితో మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించి, మార్కెట్ యార్డులకు తరలించిన ధాన్యానికి గిట్టుబాటు ధరల్లేక సతమతమవుతుంటే, వర్షం రూపంలో మరో పిడుగు పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు ధాన్యం మొత్తం వర్షపు నీటిలో కొట్టుకుపోయిందని చెప్పారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించి.. మార్క్ఫెడ్, మిల్లర్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మార్కెట్ యార్డులకు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో కప్పి ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొక్కజొన్నలు అమ్మిన రైతులకు ఇవ్వాల్సిన రూ.200 కోట్ల బకాయిలను మార్క్ఫెడ్ చెల్లించడం లేదన్నారు. మార్క్ఫెడ్, ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే రూ.200 కోట్లు రైతులకు చెల్లించి, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తోన్న టీ సర్కార్
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సంక్షేమం కోసం పలు చట్టాలను అమలు చేసిన ఏకైక సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించి, కార్మికు లకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం, భద్రత విషయంలో శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. సింగరేణిలోని కారుణ్య నియామకాల విషయంలో తీవ్ర జాప్యం జరగడం వల్ల కార్మికులు, కార్మికుల పిల్లలు నష్టపోతున్నారని అన్నారు. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికుల భద్రతకు తగు చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారి సంక్షేమం పూర్తిగా విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగం కార్మికులకు అండగా ఉంటుందని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. అమలుకాని కార్మిక చట్టాలు పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ విభాగం అధ్యక్షుడు భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయడం లేదని, అసంఘటిత కార్మికుల సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. కార్మికుల సంక్షేమం, భద్రత, హక్కుల అమలు కోసం వారి పక్షాన వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ పోరాడుతుందని అన్నారు. అనంతరం గట్టు, ఓబుల్ రెడ్డి వివిధ విభాగాల్లో పనిచేస్తూ విశిష్ట సేవలందిస్తున్న రాజారెడ్డి, శ్రావణ్ కుమార్, సి.చంద్రశేఖర్ రెడ్డి, నారాయణమ్మ, ధనలక్ష్మి, రాజేందర్లకు మేడే కార్మిక అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ప్రఫుల్లా రెడ్డి, మతీన్, బి.సంజీవరావు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతు కుటుంబాలను ఆదుకోవాలి
మంకమ్మతోట (కరీంనగర్): పంటలు ఎండిపోయి.. దిగుబడి రాక.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 4 వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నా.. వారిని ఆదుకోవాలన్న కనీస బాధ్యత ప్రభుత్వానికి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఆదుకోవాలని హితవు పలికారు. రైతు కుటుంబాలను ఆదుకోవాలని, లేకుంటే రైతుల పక్షాన భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్సార్సీపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బెజ్జంకి అనిల్కుమార్, ప్రపుల్లా రెడ్డి, సంజీవరావు, మతీన్ ముజాహిద్దీన్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేష్ పాల్గొన్నారు. వివాహ వేడుకకు హాజరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు అక్కెనపెల్లి కుమార్ కూతురు అక్షిత వివాహం సురేశ్తో శనివారం నగరంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు గట్టు శ్రీకాంత్రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశ్వీరదించారు. -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పలు పదవులకు నియామకాలు జరిపినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, యూత్ విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు గురువారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా కొండూరు చంద్రశేఖర్ను నియమించామన్నారు. పార్టీ వనపర్తి జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడిగా సి.రమేశ్, ప్రధాన కార్యదర్శిగా వొడ్ల సుమంతాచారి, కార్యదర్శులుగా రాచురి ఆంజనేయులు, జె.రవికుమార్లను నియమించినట్లు వెల్లడించారు. -
ఉత్సవ విగ్రహాల్లా రైతు సమితులు
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో కష్టపడి పండించిన వరి, మినుములు, వేరుశనగ పంటలను మార్కెట్ యార్డులకు తరలించి రైతులు పడిగాపులు కాస్తున్నారని, వాటిని కొనే నాథుడే లేడని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యంగా రైతు సమన్వయ సమితులు పనిచేస్తాయని సీఎం కేసీఆర్ సదస్సులు పెట్టి గొప్పగా చెప్పారని, కానీ సమితులకు నిధులు కేటాయించకుండా, వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన వరి పంటను మార్కెట్ యార్డులకు తరలించారని.. ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొనకపోవడంతో కురిసిన వర్షాల కారణంగా తడిసి ముద్దయి రైతులు నష్టపోయారన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
ఘనంగా వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు
కోదాడ అర్బన్: వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ జన్మదిన వేడుకలను గురువారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గట్టు మాట్లాడుతూ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డిలకు ఆయురారోగ్యాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా త్వరలోనే రాష్ట్రంలో బస్సుయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేముల శేఖర్రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కస్తాల ముత్తయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు పిల్లి మరియదాసు, దేవిరెడ్డి లింగారెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, వాసు, విజయ్, రవీందర్, శ్రీకాంత్, వెంకన్న, రామయ్య పాల్గొన్నారు. -
త్వరలో వైఎస్సార్ జనచైతన్య బస్సుయాత్ర
సాక్షి, మేడ్చల్ జిల్లా: త్వరలో రాష్ట్రంలో వైఎస్సార్ జనచైతన్య బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అ«ధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నుంచి కరీంనగర్ జిల్లా వరకు పది రోజుల పాటు వైఎస్సార్ జనచైతన్య బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలకు మేలు చేసే అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విధానాలను కొనసాగించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆ పథకాలను కొనసాగించాలని చేపట్టనున్న జనచైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలంలోని అలంకృత గార్డెన్లో జరిగిన పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు, జిల్లాల అధ్యక్షుల సమావేశంలో గట్టు ప్రసంగించారు. రాష్ట్రంలో యాత్ర విజయ వంతం కావడానికి వీలుగా పలు కమిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అందరి శ్రేయస్సే లక్ష్యంగా మ్యానిఫెస్టో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా, బడుగు బలహీన వర్గాలతోపాటు అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టో)కు రూపకల్పన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం త్వరలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బస్సు యాత్రలో ఉపన్యాసకులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బాధ్యతలు నిర్వర్తిస్తారన్నారు. బస్సు యాత్ర కమిటీలివే... - జనచైతన్య బస్సు యాత్ర కమిటి చైర్మన్గా మతీన్, సభ్యులుగా మహేందర్రెడ్డి, కె. శివ కుమార్, కొండా రాఘవరెడ్డి, బొడ్డు సాయి నాథ్రెడ్డి, బి.అనిల్కుమార్, కె.అమృతా సాగర్, డాక్టరు ప్రఫుల్లారెడ్డి, బి.సంజీవరావు, వెల్లాల రామ్మోహన్, బెంబడి శ్రీనివాస్రెడ్డి, శాంతికుమార్, బండారు వెంకటరమణ - క్రమశిక్షణ సంఘం(కమిటీ) చైర్మన్గా మతీన్, సభ్యులుగా అనిల్, వెల్లాల రామ్మోహన్, బి.సంజీవరావు, మహేందర్రెడ్డి. - రూట్మ్యాప్ కమిటీ చైర్మన్గా వెల్లాల రామ్మోహన్, సభ్యులుగా బొడ్డు సాయినాథ్రెడ్డి, జి.శ్రీధర్రెడ్డి, ఎన్.రవికుమార్, బి.వెంకటరమణ, కుసుమ కుమార్, బెంబడి శ్రీనివాస్రెడ్డి, టి. జగదీశ్వర్ గుప్తా. ఆర్. చంద్రశేఖర్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, బండారు వెంకటరమణ. - కరపత్రాల కమిటీ చైర్మన్గా బి.అనిల్ కు మార్, సభ్యులుగా శాంతికుమార్, భగవంత్రెడ్డి, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, ఎన్.రవికుమార్ - పోస్టర్ కమిటీ చైర్మన్గా బొడ్డు సాయినాథ్రెడ్డి, సభ్యులుగా ఎం. భగవంత్రెడ్డి, బి. బ్రహ్మానందరెడ్డి. - లీగల్ అనుమతుల కమిటీ ఇన్చార్జిగా ఎం. సరోజ్రెడ్డి, - బస్సు యాత్ర సాంస్కృతిక (పాటల)కమిటీ ఇన్చార్జిగా ఎన్.రవికుమార్. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చట్టాలను తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు చుట్టాలుగా మార్చుకుని ఇష్టానుసారంగా పాలన సాగిస్తూ దళితులపై దాడులకు తెగబడుతున్నారన్నారు. అంబేడ్కర్ 127వ జయంతిని శనివారం లోటస్పాండ్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దాదా సాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి వచ్చే ప్రతిమాటకు అంబేడ్కరే స్ఫూర్తి అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి మతీన్, ప్రధాన కార్యదర్శి సంజీవరావు, రాష్ట్ర ఎస్సీసెల్ విభాగం అధ్యక్షుడు నాగదేశి రవికుమార్, వైఎస్సార్ సీపీ ఏపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి నంద మూరి లక్ష్మీపార్వతి, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ అధికార ప్రతినిధులు నారమల్లి పద్మజ, కాకుమాను రాజశేఖర్ మాట్లాడారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బొడ్డు సాయినాథ్రెడ్డి, డాక్టర్ ప్రపుల్లారెడ్డి, బెంబిడి శ్రీనివాస్రెడ్డి, చల్లా మధు, బి.మోహన్ కుమార్, పాలెం రఘునాథ్రెడ్డి, ఎం. సుధాకర్ రెడ్డి, సూరిబాబు, బుర్రా సురేశ్గౌడ్, బీవీఆర్ మోహన్రావు, రాజరాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీటీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య చేసిన విమర్శలకు వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ... రావుల, సండ్ర నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయిందని గుర్తుచేశారు. త్వరలో ఏపీలో కూడా ఖాళీ అవుతుందన్న భయం టీడీపీ నేతలకు పట్టుకుందన్నారు. ఆ భయంతోనే వైఎస్సార్ సీపీ అధినేతపై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. ఐదు కోట్ల ఏపీ ప్రజలు, హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే హర్షించాల్సింది పోయి టీడీపీ నేతలు విమర్శలకు దిగడం దారుణమన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబుతో మాట్లాడి మీ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని గట్టు టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ అని, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ సీటు కోసం ఇతర పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొంటూ దొరికిపోయారని విమర్శించారు. జగన్ గురించి ఇక తెలంగాణ టీడీపీ వారు ఎక్కడైనా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. -
కార్పొరేట్ల మేలుకే ప్రైవేట్ వర్సిటీ బిల్లు
హైదరాబాద్: ఉన్నత విద్యను వ్యాపారంగా మార్చి కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు తెచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయకుండా సౌకర్యాలు కల్పించకుండా నిధులు కేటాయించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందని గురువారం ఓ ప్రకటనలో ఆయన మండిపడ్డారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వస్తే ప్రభుత్వ వర్సిటీలు పూర్తిగా ఉనికి కోల్పోతాయని, ఫీజులు బాగా పెరిగి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లుతో కార్పొరేట్ దోపిడీకి గేట్లు బార్లాగా తెరిచారని ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు నష్టం చేసే ఈ బిల్లును వెనక్కి తీసుకోకుంటే తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
అవిశ్వాసానికి టీఆర్ఎస్ మద్దతివ్వాలి
మిర్యాలగూడ: పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్ ఎంపీలు మద్దతివ్వాలని వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి కోరారు. శనివారం ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా చేస్తున్న ఉద్యమం దేశంలోని విపక్ష పార్టీలన్నింటినీ కదిలించిందన్నారు. అవిశ్వాసానికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ కూడా కలసిరావాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ల సభ్యత్వాలను రద్దు చేయడం సరైందికాదన్నారు. మే నెలాఖరులో బస్సు యాత్ర రాష్ట్రంలో మే ఆఖరులో వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు గట్టు శ్రీకాంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర ఉంటుందన్నా రు. బస్సు యాత్ర షెడ్యూల్, నిర్వహణ కమిటీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు ఉంటాయని చెప్పారు. సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి పాల్గొన్నారు. -
త్వరలో వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో త్వరలోనే బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి తెలిపారు. సోమవారం లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఇన్చార్జుల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా గట్టు మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికల హడావిడి ప్రారంభమైందని.. అన్ని జిల్లాలో పార్టీ బలోపేతానికి వ్యూహాత్మకంగా బస్సుయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. నాటి దివంగత సీఎం వైఎస్సార్ తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేశారో యాత్రలో వివరిస్తామన్నారు. అలాగే తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కార్యాచరణను ప్రకటిస్తా మని చెప్పారు. మార్చి 13న పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కో–ఆర్డి నేటర్లతో బస్సు యాత్ర సన్నాహక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇందులో రూట్ మ్యాపు ఖరా రుతో పాటు బస్సు యాత్ర కమిటీలను కూడా ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం.. ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బస్సు యాత్రలో ఎండగడతామని గట్టు చెప్పారు. కాకతీయ, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. 31 జిల్లాల్లో ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి త్వరలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఒకేరోజు పాదయాత్రలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, జి.మహేందర్రెడ్డి, బి.అనిల్ కుమా ర్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్రెడ్డి, నాయకులు నాగదేశి రవికుమార్, బసిరెడ్డి బ్రహ్మానందరెడ్డి, అక్కెనపల్లి కుమార్, వరం గల్, మెదక్ జిల్లాల ఇన్చార్జులు వి.శేఖర్రెడ్డి, వెల్లాల రామ్మోహన్ పాల్గొన్నారు. -
పార్టీని బలోపేతం చేద్దాం
జోగిపేట(అందోల్): పార్టీని బలోపేతం చేసే దిశగా శ్రేణులు కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జోగిపేటలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఆయన నివాళులు అర్పించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వెళుతూ జోగిపేటలో కొద్దిసేపు ఆగి మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీని ఇస్తుందని అన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అక్కడ అధికారాన్ని చేపట్టగానే తెలంగాణలో కూడా ప్రత్యామ్నాయ శక్తిగా పార్టీని అభివృద్ధి చేసుకుంటామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైపు యువత ఆశగా చూస్తోందని తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. చాలా సందర్భాల్లో ఇతర పార్టీలు సైతం దివంగత నేత ఘనతను గుర్తు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపారు. అందోల్ నియోజకవర్గంలో దివంగత నేత అభిమానులు ఎంతో మంది ఉన్నారని, ఈ ప్రాంతం మీదుగా ఆ మహానేత నడిచారని, సేద్యానికి సింగూరు జలాలను అందించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేశారని, రైతులకు కూడా ఈ విషయం తెలుసని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సంజీవరావు, పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్రెడ్డి, సంగారెడ్డి జిల్లా యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బాగయ్య, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేశ్, జిల్లా కార్యదర్శి పరిపూర్ణ, జిల్లా నాయకులు బుచ్చయ్య, ప్రవీణ్కుమార్, అరవింద్ ఆయన వెంట ఉన్నారు. -
వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శుల నియామకం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, బెజ్జంకి అనిల్ కుమార్, బి. సంజీవ్రావు నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరి నియామకం జరిపినట్టు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులుగా బసిరెడ్డి బ్రహ్మానందరెడ్డి, అక్కెనపల్లి కుమార్, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా యలమంద నాయక్, పార్టీ కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్గా బెజ్జంకి అనిల్కుమార్, నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్గా నాగదేశి రవికుమార్, ఆదిలాబాద్ ఇన్చార్జ్గా అక్కెనపల్లి కుమార్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కాంపెల్లి గంగాధర్, జోగుళాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షుడిగా జెట్టి రాజశేఖర్ను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. అసెంబ్లీ కోఆర్డినేటర్లుగా: అదేవిధంగా పార్టీ అంబర్పేట్ అసెంబ్లీ కోఆర్డినేటర్గా ఎ. అవినాశ్గౌడ్, సూర్యాపేట అసెంబ్లీ కోఆర్డినేటర్గా పిట్ట రాంరెడ్డి, కోడంగల్ అసెంబ్లీ కోఆర్డినేటర్గా తమ్మళి బాల్రాజ్, ముషీరాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్గా సూరిబాబు, తంగతుర్తి అసెంబ్లీ కోఆర్డినేటర్గా బాలెంల మధులను నియమిస్తున్నట్లు గట్టు తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా ఇమామ్ హుస్సేన్ (శేరిలింగంపల్లి), మేస్రం శంకర్ (ఆదిలాబాద్), తాళ్లూరి వెంక టేశ్వర్లు (మంచిర్యాల), పిండి శ్రీకాంత్ రెడ్డి (ఎల్బీ నగర్), బి. మోహన్ రెడ్డి (పరిగి), దుబ్బాక గోపాల్ రెడ్డి (ఎల్బీ నగర్), దారెల్లి అశోక్ (మధిర), వారాల శ్రీనివాస్ (కరీంనగర్), మామిడి సంగమేశ్వర్ (వికారాబాద్), బి. రవీందర్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా సూరగంటి సుధాకర్ రెడ్డి(ఎల్బీ నగర్), కడపర్తి తిలక్రావు (నిర్మల్)లను నియమించినట్టు వివరించారు. -
రాష్ట్రానికి తీవ్ర అన్యాయం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర నిరాశనే మిగిల్చిందని, కొన్ని శాఖలకు మాత్రమే అరకొర నిధులను కేటాయించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా.. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. -
వాక్ విత్ జగన్ జయప్రదం చేయాలి
సాక్షి, హైదరాబాద్: ‘వాక్ విత్ జగన్’ కార్యక్రమాన్ని ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరగకుండా నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ఈ నెల 29న నెల్లూరు జిల్లాలో 1,000 కి.మీ. మైలురాయి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని కోరుతూ 29న పార్టీ నేతలు కొండా రాఘవ రెడ్డి యాదాద్రి జిల్లా యాదగిరి గుట్ట వద్ద, మతీన్ ముజాద్దీన్ నాంపల్లి దర్గా వద్ద, జి. రాంభూపాల్ రెడ్డి గద్వాల్ జిల్లా జోగుళాంబ దేవాలయం వద్ద, జి. మహేందర్ రెడ్డి వరంగల్ జిల్లా భద్రకాళి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేస్తారని ఆయన తెలిపారు. కె.శివకుమార్ రంగారెడ్డి జిల్లాలో జరిగే కార్యక్రమాల్ని పరిశీలిస్తారని పేర్కొన్నారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు ముందుండి నడిపించాలని శ్రీకాంత్రెడ్డి కోరారు. నగరంలో లోటస్పాండ్ నుంచి: హైదరాబాద్లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం లోటస్పాండ్ నుంచి పెద్దమ్మ గుడి వరకు నిర్వహించే వాక్ విత్ జగన్ కార్యక్రమాన్ని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారని వైఎస్సార్సీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్రెడ్డి చెప్పారు. ఈ పాదయాత్రలో గ్రేటర్ హైదరాబాద్ అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. -
2018లో చారిత్రక ఉద్యమాలు: గట్టు శ్రీకాంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులకు నిరంతరం పోరాటాలు చేసే విధంగా శక్తి నివ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. 2018లో చారిత్రక ఉద్యమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. -
విపక్ష పాత్రలో కాంగ్రెస్ విఫలం
హుజూర్నగర్: ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై దృష్టి.. అధికార పార్టీని ఎండగట్టాల్సిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని.. తానే ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలతో కలసివచ్చే పార్టీలు ఉంటే వాటితో పొత్తులు పెట్టుకోవడానికి తాము సిద్ధమన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పోటీలో నిలుపుతామని గట్టు పేర్కొన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి లక్షా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారని, నేటి వరకు కనీసం 20 వేలు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేపట్టి ఒక్క ఎకరాకూ నీరందించలేక పోతోందన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు బ్రహ్మరథం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గపు పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సంసిద్ధులై జగన్కు అపూర్వ స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రను ఆదరించిన మాదిరిగానే ప్రజలు ఆయన్ను అక్కున చేర్చుకుంటున్నారని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వేముల శేఖర్రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి కస్తాల ముత్తయ్య, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కర్నె వెంకటేశ్వర్లు, యూత్ రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, కె.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంకల్ప యాత్ర సక్సెస్ కావాలి: గట్టు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి కోరారు. సోమవారం ఇడుపులపాయలో వైఎస్సార్ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం వైఎస్సార్ సీపీ తెలంగాణ నాయకులు సంకల్ప యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరితోపాటుగా సేవాదళ్ రాష్ట్ర నేతలు బి.వెంకట రమణ, డా.ప్రఫుల్లారెడ్డి, వేముల శేఖర్రెడ్డి యాత్రలో పాల్గొన్నారు. -
‘ప్రజాసంకల్పం’లో స్వచ్ఛందంగా పాల్గొనాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటంతోపాటు వైఎస్సార్కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం శ్రీకాంత్రెడ్డి అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జీలు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 6న ప్రారంభించే ప్రజాసంకల్ప యాత్రలో పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంకా పలు కీలక అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 2019 ఎన్నికల్లో తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని, పొత్తుల విషయాన్ని ఎన్నికల సమయంలో ఆలోచిద్దామని, పార్టీ అధినాయకత్వ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ శిరసావహించాలని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయే, కానీ హామీల అమలు మాత్రం అసెంబ్లీ గేటు కూడా దాటడం లేదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ ఎద్దేవా చేశారు. ఈ నెల 30న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీకాంత్ రెడ్డి జరిపే పర్యటనపై నాయకులు చర్చించారు. వర్షాల కారణంగా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో పాడైన పత్తి పంటలను పరిశీలించి, బాధిత రైతులను శ్రీకాంత్రెడ్డి పరామర్శించనున్నారు. వర్షాల వల్ల తడిసి, రంగు మారిన పత్తి పంటకు మద్దతు ధర కల్పించాలని, పత్తికి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కరీంనగర్, చొప్పదండి పత్తి కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.రాంభూపాల్ రెడ్డి, మతీన్ ముజాద్దీన్తోపాటు ముఖ్య నేతలు డాక్టర్ ప్రఫుల్లా రెడ్డి, వెల్లాల రాంమోహన్, ఎన్.రవికుమార్, విశ్వనాథ్చారి, బండారు వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. -
పత్తికి మద్దతు ధర ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. గతేడాది(2016) పత్తి ధర క్వింటాలుకు రూ.5,500 గిట్టుబాటు ధర వచ్చిందని.. ఈసారి కనీసం రూ.5 వేల మద్దతు ధరనైనా ఇవ్వాలని అన్నారు. లేనిపక్షంలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను తెరిచి తడిసిన, రంగు మారిన పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర ప్రకటించే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. -
ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి
అల్గునూర్ (మానకొండూర్): రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ సొరంగ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కాంట్రాక్టర్ను బ్లాక్లిస్ట్లో పెట్టా లని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ చౌరస్తాలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అల్గునూర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. మృతులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీమా కంపెనీలు ఇచ్చే పరిహారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై అత్యున్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితు లకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ వారికి అండగా ఉంటుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులన్నీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చలవేనని గట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ల కోసం ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాస్రావు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి..
కరీంనగర్: కాళేశ్వరం ఎత్తిపోతల సొరంగాలలో జరిగిన ప్రమాదాలపై న్యాయ విచారణ చేపట్టి.. కనీస రక్షణ చర్యలు చేపట్టని కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు మానకొండూర్ నియోజకవర్గంలో పర్యటించారు. సొరంగ ప్రమాదాల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు గన్నేరువరం మండలం గుండ్లపల్లి వద్ద వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్పల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. అలుగునూర్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నగేష్, యూత్ జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. -
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గట్టు పర్యటన
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఈ నెల 22న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. 22న తొలుత మంచిర్యాలలోని శ్రీరాంపూర్లోని సింగరేణి ఓపెన్కాస్ట్ గనులను పరిశీలిస్తారు. అక్కడ కార్మికులతో సమావేశమై సింగరేణి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకొంటారు. ఆ మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అనంతరం మంచిర్యాల జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అటు తర్వాత నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సదర్మాట్ ఆనకట్టను సందర్శిస్తారు. అనంతరం నిర్మల్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, ఆ తర్వాత విలేకరులతో సమావేశంలో పాల్గొంటారు. -
సచివాలయం తరలింపు విరమించాలి
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ► ఆ నిధులు సంక్షేమానికి వినియోగించాలని డిమాండ్ ► వాస్తు పేరుతో రూ.300 కోట్ల దుర్వినియోగం: మతీన్ ► సచివాలయం తరలింపుపై న్యాయ పోరాటం: శివకుమార్ ► బైసన్ పోలో గ్రౌండ్ వద్ద వైఎస్సార్సీపీ ధర్నా విజయవంతం సాక్షి, హైదరాబాద్: సచివాలయం తరలింపును ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం బైసన్పోలో గ్రౌండ్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలకూ ఉపయోగపడేలా హైదరాబాద్లో భవనాలు పంచారన్నారు. ‘ఓటుకు కోట్లు’కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ను వదిలి అమరావతికి పారిపోయారన్నారు. దీంతో ఏపీకి కేటాయించిన భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాల్సిన కేసీఆర్ వందల కోట్లు వెచ్చించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని తప్పుపట్టారు. కొత్త భవనాలకు వెచ్చించే నిధులను ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలని సూచించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం మీకెక్కడిదని కేసీఆర్ను ప్రశ్నించారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆ భవనాల నుంచి పరిపాలన సాగించారని గుర్తుచేశారు. ప్రజా పరిపాలనకు వాస్తు అవసరం లేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి సచివాలయాన్ని బైసన్ పోలో గ్రౌండ్కు తరలించాలన్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందని శ్రీకాంత్రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి.. తరలింపు ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. రైతులకు లాభం చేకూర్చని రైతు సమన్వయ సమితుల ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని, లేకుంటే వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాయని హెచ్చరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు మూడున్నరేళ్లయినా కొలిక్కి రాలేదని, అమరవీరుల సాక్షిగా చెప్పిన లక్ష ఉద్యోగాలు, ఉద్యమం సాక్షిగా రైతాంగానికి చెప్పిన కోటి ఎకరాలకు సాగునీరు, మేనిఫెస్టోలో చెప్పిన హామీల సంగతి తేల్చాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేసి కొత్త కట్టడాల గురించి ఆలోచించాలని హితవు పలికారు. వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో పూర్తయిన 80 శాతం ప్రాజెక్టులను ప్రారంభించుకుంటూ వస్తున్నారన్నారని గట్టు అన్నారు. గరీబోళ్ల పెన్షన్కు కేటాయించాలి పార్టీ ప్రధాన కార్యదర్శి మతీన్ ముజ్దాదీ మాట్లాడుతూ.. సీఎం వాస్తు పేరుతో రూ.300 కోట్లు దుర్వినియోగం చేసే బదులు గరీబోళ్ల పెన్షన్కి కేటాయిస్తే బాగుంటుందని హితవు పలికారు. బైసన్ పోలో గ్రౌండ్లో సచివాలయ నిర్మాణాన్ని తాము అంగీకరించబోమన్నారు. మరో ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ మాట్లాడుతూ.. కోటి ఎకరాలకు నీరు, లక్ష ఉద్యోగాల హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కేసీఆర్కు వాస్తు పిచ్చి పట్టుకుందని, మూఢనమ్మకాలతో కోట్లాది రూపాయలు వృథా చేస్తున్నారని విమర్శించారు. సచివాలయానికే సీఎం కేసీఆర్ వస్తలేదని, ఆయనకు కొత్త సచివాలయందేనికని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో బైసన్ పోలో గ్రౌండ్లో సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. సీఎం డౌన్ డౌన్, బైసన్ పోలోను పేదల ఇళ్ల కోసం కేటాయించాలి, సచివాలయం తరలింపును విర మించుకోవాలి అంటూ ప్లకార్డులు చేత పట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జిన్నారెడ్డి మహేందర్రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్రెడ్డి, యువజన విభా గం రాష్ట్ర అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, మహిళా విభాగం అధ్యక్షురాలు అమృతసాగర్, వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు నశ్రీన్, వనజ, అవినాశ్గౌడ్, నాగదేశి రవికుమార్, ఆర్.చంద్రశేఖర్, సంజీవరావు, కుసుమకుమార్రెడ్డి, కేసరీసాగర్, వెంకటరమణ, బాలకృష్ణారెడ్డి, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీఓ 39 రద్దు చేసే వరకు పోరాటం
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి సాక్షి, వికారాబాద్: టీఆర్ఎస్ కార్యకర్తల పదవుల పందేరం కోసం విడుదల చేసిన జీఓ 39ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. జీవో 39ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం వికారాబాద్లో భారీ బైక్ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ధర్నాలో గట్టు శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ రైతు కమిటీల పేరుతో టీఆర్ఎస్ పార్టీ వారికే పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను పక్కనబెట్టి రాష్ట్ర ప్రభు త్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నదన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్వేషాలు పెంచడానికే : రాఘవరెడ్డి రైతుల మధ్య విద్వేషాలు పెంచడానికే రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి దుయ్యబట్టారు. కోట్లు పెట్టి సీఎం క్యాంపు ఆఫీసు నిర్మించుకొని పేదలకు ఒక్క ఇళ్లయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. అనంతరం ఆర్డీవో కార్యాల యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్ర మంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోళ్ల యాద య్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రజని, రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మానందరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు వెంకటరమణ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి, జీహెచ్ఎంసీ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇమాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. జగన్ సీఎం అయితే పద్మనాభుడికి రూ.10 కోట్ల విరాళం ఆంధ్రప్రదేశ్కు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే అనంత పద్మనాభస్వామి ఆలయ అభివృద్ధికి వైఎస్సార్ సీపీ తెలంగాణ శాఖ తరఫున రూ.10 కోట్లు విరాళంగా అందజేస్తామని గట్టు శ్రీకాంత్రెడ్డి తెలిపారు. అనంతగిరిలోని అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
రైతు సమన్వయ సమితులను రద్దు చేయాలి
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ నల్లగొండ టూటౌన్: రైతు సమన్వయ సమితులను తక్షణమే రద్దు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జీఓ 39 పేరిట గ్రామాల్లో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు జన్మభూమి కమిటీలు వేసినట్లుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితులను వేస్తున్నారని, వీటి వలన ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించే చర్యలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితుల పేరిట ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని విమర్శించారు. రైతు సమన్వయ సమితులు, జీఓ 39ని రద్దు చేయాలని ఈనెల 14న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దేవుడి ఫొటో పక్కన వైఎస్సార్ ఫొటో పెట్టుకున్నారని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తిసాగు వేశారని, సీసీఐ కొనుగోలు కేంద్రాలు పెంచేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఆల్మట్టి నుంచి నీళ్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చే విధానాన్ని తమ పార్టీ తప్పుపడుతుందని చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఇరుగు సునీల్కుమార్, ఎండి.సలీం, జిల్లా ప్రధాన కార్యదర్శులు మేడిశెట్టి యాదయ్య, కట్టెబోయిన నాగరాజు తదితరులు ఉన్నారు. -
నల్లగొండ లోక్సభ ఉపఎన్నికకు సిద్దం: గట్టు
సాక్షి, నల్లగొండ: నల్లగొండ లోక్సభకు ఉప ఎన్నికలు వస్తే పోటీకి సిద్దమని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ..రాజకీయ లబ్ది కోసమే సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశారని విమర్శించారు. రైతు కమిటీల జీవో 39ను వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుందన్నారు. ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామీణ రాజకీయాన్ని కలుషితం చేసేందుకే ఈ కమిటీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. -
ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న సర్కార్
జీవో 39ని ఉపసంహరించుకోవాలి: గట్టు షాద్నగర్: తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు గ్రామీణ ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయ ని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. జీవో 39 ద్వారా ఏర్పాటు చేసిన రైతు కమిటీలలో అధికార పార్టీకి చెందినవారే ఉంటున్నారని, దీంతో కొందరికే లబ్ధి కలుగుతోందన్నారు. ఈ విధానంవల్ల అధికార పార్టీకి చెందిన వారికి, ఇతర రైతులకు మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పారు. జీవో39ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామసభలు నిర్వహించి పార్టీలకు, కులాలకు అతీతంగా రైతు కమిటీలు ఏర్పాటు చేయాల న్నారు. ధరల స్థిరీకరణ కోసం రూ.3 వేల కోట్ల నిధిని కేటాయిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. నేటి వరకు కిమ్మనకుండా ఉండటానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయలు వృథాగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. రైతుల కోసం మూడు వేల కోట్ల నిధిని ఏర్పాటు చేయడానికి వెనుకంజ వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు బండారి వెంకటరమణ, రాష్ట్ర వైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ ఇబ్రహీం, రాష్ట్ర నాయకులు విజేందర్రెడ్డి, రమాదేవి, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు శీలం శ్రీను పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: గట్టు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాలు కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకే అందు తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ..అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. దళితుల మూడెకరాల భూపంపిణీ ఒక బూటకంగా మారిందన్నారు. సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన యాలాల పరశురాం, మహంకాళి శ్రీనివాస్ అనే ఇద్దరు దళిత యువకులు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించిన సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో, సర్కారు పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువకుల ఆత్మహత్యాయత్నం ఘటనపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
అవినీతికి అడ్రస్ చంద్రబాబే!
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి - ‘ఓటుకు కోట్లు’తో బాబు అడ్డంగా దొరికిపోయారు - టీఆర్ఎస్ సర్కారు తెచ్చిన కొత్త పథకాలేమీ లేవు - వైఎస్సార్ పథకాలకే పేరు మార్చి అమలు చేస్తున్నారని వ్యాఖ్య వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అవినీతికి అడ్రస్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. ‘ఓటుకు కోట్లు’తో అడ్డంగా దొరికిపోయాడని.. విచ్చలవిడిగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. అసలు చంద్రబాబు ముఖం చూడకుండా ఉన్నందుకు తెలంగాణ ప్రజలు సంతోష పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలోని గుంటూరులో జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో రెండో రోజు (ఆదివారం)న ఆయన పార్టీ సామాజిక, రాజకీయ ఆర్థిక తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. మాట్లాడారు. ‘‘ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి చంద్రబాబు.. నాకు ఏసీబీ ఉంది, నీకు ఏసీబీ ఉందంటూ బెదిరించారు. మరి చంద్రబాబుకు ఏసీబీ ఎక్కడుం ది. బ్రీఫ్డ్ ఇంగ్లిష్ ముఖ్యమంత్రి చంద్రబాబు. సిగ్గు, శరం విడిచి విచ్చలవిడిగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. మూడేళ్లలో రూ.3 లక్షల 75 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు..’’అని గట్టు శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. తెలంగాణకు అంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా చేయని స్థాయిలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధి చేశారని.. తెలంగాణ రాష్ట్రంలోనూ వైఎస్సార్సీపీ బలమైన శక్తిగా అవతరిస్తుందని చెప్పారు. వైఎస్ తెలంగాణలో 34కు పైగా సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారని.. నీళ్లులేక, పంటలు పండక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఉచిత విద్యుత్ ఇచ్చారని తెలిపారు. వైఎస్సార్ సిద్ధాంతం విశ్వజనీయమైందని.. అన్ని రాష్ట్రాల సీఎంలు వైఎస్సార్ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగడం దానికి నిదర్శనమని అన్నారు. సంక్షేమ పథకాలు అణగారిపోతున్నాయి.. అందరికీ ఉపయోగపడేలా వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. తెలంగాణలో సరిగా అమలు కావటం లేదని గట్టు శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కొత్తగా తెచ్చిన పథకాలేమీ లేవని.. వైఎస్సార్ పథకాలకే పేరు మార్చి కొన్నింటిని అమలు చేస్తున్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతన బకాయిలు భారీగా పేరుకుపోయి ఉన్నాయన్నారు. అణగారిన వర్గాల సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఏపీలో 2.5 లక్షల ఎకరాల భూములను అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు పంపిణీ చేశారని... కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూములను గిరిజనుల నుంచి లాగేసుకుంటోందని ఆరోపించారు. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో సాగుతున్న రాక్షస, అవినీతి పాలనకు చరమగీతం పాడాలన్నారు. కేసీఆర్, బాబు ప్రజావ్యతిరేక విధానాలు: రాఘవరెడ్డి ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని వైఎస్సార్సీపీ తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. ఇరు రాష్ట్రాల్లోనూ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లుతున్నాయని.. ఎస్టీ, మైనార్టీల అదనపు రిజర్వేషన్ హామీలకు అతీగతీ లేదని పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీ లుగా మార్చే అంశాన్ని గాలికొదిలేశారన్నారు. బాబు ‘ఓటుకు కోట్లు’కేసు ముందుకు సాగడం లేదని, ఇద్దరు చంద్రులు లోపాయకారీ ఒప్పందానికి వచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని, ప్రాజెక్టులు కేసీఆర్ కుటుం బానికి ఆదాయ వనరులుగా మారాయన్నారు. తెలంగాణలో రాజ్యమేలుతున్న అవినీతి టీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కె.నగేశ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. నకిలీ విత్తనాలు రైతుల పాలిట శాపంగా మారాయని.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు అందడం లేదని వాపోయారు. పేదలు, ధనికులు, రైతులు, కార్మికులు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిది అని.. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కింద తెలంగాణ లో 14.72 లక్షల మంది పేదలు శస్త్రచికిత్సలు చేయించుకున్నారని చెప్పారు. వాగ్దానాల అమలులో టీఆర్ఎస్ విఫలం: శివకుమార్ టీఆర్ఎస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్లీనరీలో ‘టీఆర్ఎస్ మేనిఫెస్టో – ప్రభుత్వ వైఫల్యాలు’అంశంపై ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం మాట్లాడారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని, కానీ రాష్ట్రాన్ని అధోగతి వైపు తీసుకెళ్తున్నారని శివకుమార్ ఆరోపించారు. కేసీఆర్ మాటల గారడీ తప్ప.. తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణలో 2,256 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని.. మరి ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలకు 2.6 లక్షల ఇళ్లు నిర్మిస్తామంటూ ప్రగల్భాలు పలికారని.. ఇప్పటివరకు 10 శాతం ఇళ్లకు కూడా టెండర్లు ఖరారు కాలేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. రెండు లక్షల ఇళ్లకు వెంటనే టెండర్లు పిలిచి, నిర్మాణం పూర్తి చేయాలన్నారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో ప్రజల కోసం, రెండు రాష్ట్రాల ప్రజల బాగు కోసం వైఎస్ జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. -
చంద్రబాబు.. ‘బ్రీఫ్డ్ ఇంగ్లీష్ ముఖ్యమంత్రి’
♦ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ధ్వజం గుంటూరు జిల్లా: చంద్రబాబు మొహం చూడకుండా ఉన్నందుకు తెలంగాణ ప్రజలు సంతోష పడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. గుంటూరులో జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో చివరి రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక, రాజకీయ ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... ఓటుకు కోట్ల కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు నాకు ఏసీబీ ఉంది.. నీకు ఏసీబీ ఉందని మాట్లాడాడని, నీ ఏసీబీ ఎక్కడుందని గట్టు ప్రశ్నించారు. సిగ్గు, శరం విడిచి చంద్రబాబు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాడని మండిపడ్డారు. బ్రీఫ్డ్ ఇంగ్లీష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడిని బంగాళాఖాతంలో కలిపే శక్తి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తరువాత ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్రెడ్డికే ఉందన్నారు. మూడేళ్లల్లో రూ. 3 లక్షల 75 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మరో స్వాతంత్రం రావాలని, మన రక్తపు బొట్టు ధారపోసైనా వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో వైయస్ఆర్ సీపీ బలమైన శక్తిగా అవతరిస్తుందని, రాష్ట్రం ఉన్నంత వరకు వైయస్ఆర్ సీపీ ఉంటుందన్నారు. తెలంగాణకు అంతక ముందు ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా వైఎస్సార్ అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రంలో 34 పైగాప్రాజెక్టుల పూర్తికి కంకణం కట్టుకున్నారన్నారు. నీరు లేక పంటలు రాక ఇబ్బందులు పడుతు ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతాంగా సంక్షేమం కోసం ఉచిత కరెంట్ ఇచ్చారన్నారు. దీంతో రైతుల జీవితాలు బాగుపడ్డాయని గుర్తు చేశారు. వైఎస్సార్ పథకాలకే కేసీఆర్ పేరు మార్చారు.. భారతదేశం మొత్తంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టు ప్రారంభించారని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్సార్ సిద్ధాంతాలను ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు సాగటం ప్రారంభించాయని గుర్తు చేశారు. అందరికి ఉపయోగపడే వైఎస్సార్ ప్రజా సంక్షేమ పథకాలు పూర్తిగా తెలంగాణలో అమలు కావటంలేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా తెచ్చిన పథకాలు ఏమిలేవని చెప్పారు. వైఎస్సార్ పథకాలకే పేరు మార్చి కొన్నింటి అమలు చేస్తున్నారన్నారు. ఏపీ రాష్ట్రంలోని చంద్రబాబు నాయకత్వంలో సాగుతున్న రాక్షస, నీచ, దుష్ట, అనినీతి నయవంచన పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా ఫీజు రీయింబర్స్మెంట్ ఉపకార వేతనాల బకాయిలు పెరుకపోయి ఉన్నాయని వాపోయారు. అణగారిన వర్గాల సంక్షేమం తెలంగాణలో అణగారి పోయిందని ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో గిరిజన ప్రజల కోసం వైఎస్సార్ 2.5 లక్షల ఎకరాలు అటవీ హక్కుల చట్టం క్రింద గిరిజనులకు భూములు పంపిణీ చేశారని, కానీ ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని గిరిజనుల నుంచి లాగేసుకొంటుందని చెప్పారు. చివరల్లో జోహర్ వైఎస్సార్, జగనన్న నాయకత్వం వర్థిల్లాలి అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. -
చంద్రబాబు సిగ్గు, శరం ఉందా: గట్టు శ్రీకాంత్ రెడ్డి
గుంటూరు : చంద్రబాబు నాయుడు జీవితమంతా వెన్నుపోట్లేనని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి, మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ ఆడియో టేపుల్లో బుక్కయ్యారన్నారు. అయినా చంద్రబాబు ఇంకా సిగ్గు లేకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని గట్టు శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సిగ్గు, లజ్జ విడిచి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడిని బంగాళాఖాతంలో కలిసే శక్తి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తరువాత ఆయన తనయుడు వైఎస్ జగన్కే ఉందన్నారు. మూడేళ్లల్లో రూ. 3 లక్షల 75 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మరో స్వాతంత్రం రావాలని, మన రక్తపు బొట్టు ధారపోసైనా వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ బలమైన శక్తిగా అవతరిస్తుందని, రాష్ట్రం ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుందని గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
మా గుండెల్లో కొలువున్న వైఎస్సార్
- వైఎస్సార్సీపీ ప్లీనరీలో తెలంగాణ మైనార్టీ నేత రెహమాన్ - చంద్రబాబు,ఫిరాయింపుదారులపై విమర్శలు వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినా తమ గుండెల్లో కొలువున్నారని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర మైనార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ చెప్పారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని వైఎస్సార్ ప్రాంగణంలో శనివారం పార్టీ మూడో జాతీయ ప్లీనరీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ తమ గుండెల్లో ఉన్నారని, నంద్యాల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని చెప్పారు. చంద్రబాబు హైదరాబాద్ను అభివృద్ధి చేశారంటున్నారు. చార్మినార్ కట్టారా? మక్కా మసీద్ కట్టారా? అసెంబ్లీని కట్టించారా? డ్రైనేజీ కూడా సరిగా లేని హైటెక్ సిటీ కట్టించి అంతా తాను చేశానని చెప్పుకుంటున్నాడని ధ్వజమెత్తారు. పార్టీ మారిన వారికి సిగ్గు, లజ్జ లేదు, జలీల్ఖాన్, కదిరి చాంద్బాషాలు దొంగలు, వారి తండ్రులు, తాతలు కూడా దొంగలని విమర్శించారు. తాను తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుందో చంద్రబాబు ఇంగ్లిష్లో మాట్లాడితే అలా ఉంటుందని నవ్వులు పూయించారు. తొలుత మధ్యాహ్నం 12.05కు పార్టీ జెండాను ఆవిష్కరించి వేదికపైకి వచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. వేదికపై ముందు వరుసలో కూర్చున్న జగన్ తనకు కుడివైపు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డిని, ఎడమవైపు శ్రీకాంత్ రెడ్డిని కూర్చోపెట్టుకున్నారు. సభ ప్రారంభంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి హైదరాబాద్లోని పెద్దమ్మ గుడి నుంచి తెచ్చిన అమ్మవారి కంకణాన్ని జగన్ చేతికి కట్టి, అమ్మవారి శాలువా బహూకరించారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, డాక్టర్ల విభాగం అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్లారెడ్డిలు మహానేత వైఎస్సార్, పార్టీ అధ్యక్షుడు కలసి ఉన్న భారీ పెయింటింగ్ను బహూకరించారు. పార్టీ కార్యదర్శి పుత్తా ప్రతాపరెడ్డి గజమాలతో జగన్ను సత్కరించారు. వేదికపైన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, సీఈసీ మెంబర్స్, అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. నేడు తెలంగాణ తీర్మానాలు ... ప్లీనరీ రెండోరోజు ఆదివారం తెలంగాణ నుంచి రెండు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. సామాజిక, రాజకీయ ఆర్థిక తీర్మానాన్ని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, టీఆర్ఎస్ మేనిఫెస్టో–ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్లు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ప్లీనరీకి తెలంగాణ రాష్ట్రం నుంచి వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె. శివకుమార్, కొండా రాఘవరెడ్డి, జి. మహేందర్ రెడ్డి, బోయినపల్లి శ్రీనివాసరావు, మతిన్, సీఈసీ మెంబర్ జి. రాంభూపాల్ రెడ్డి, జిల్లాల అధ్యక్షుడు భగవంత్ రెడ్డి (నాగర్ కర్నూల్), బొడ్డు సాయినాథ్ రెడ్డి (గ్రేటర్ హైదరాబాద్), బెంబడి శ్రీనివాస రెడ్డి (మేడ్చల్), అనిల్ కుమార్ (ఆదిలాబాద్), డాక్టర్ నగేష్ (కరీంనగర్), శాంతికుమార్ (వరంగల్), సుధీర్ బాబు(ఖమ్మం), భాస్కర్ రావు (సూర్యాపేట), పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ (యువజన విభాగం), డాక్టర్ ప్రఫుల్లా రెడ్డి (వైద్యవిభాగం), బి. వెంకట రమణ (సేవాదళ్), రవికుమార్ (ఎస్సీ సెల్) తో పాటు పార్టీ నాయకులు పాలెం రఘునాథ్ రెడ్డి, అవినాష్ గౌడ్, వేముల శేఖర్ రెడ్డి, బీష్వ రవీందర్, పటాన్ చెరువు చంద్రశేఖర్, విద్యార్థి నాయకులు ఎనుగుల సందీప్ రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సంతాప తీర్మానం జగన్ ఉపన్యాసం అనంతరం పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ మరణించిన వారికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం వాసి బీటీ వెంకటేశ్, ఎల్బీ నగర్ నియోజకవర్గం భరత్నగర్ డివిజన్కి చెందిన సీతమ్మ, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్కాలనీకి చెందిన బుచ్చిరెడ్డి, వరంగల్ అర్బన్కి చెందిన సెల్ అధ్యక్షుడు రాధాకృష్ణ, వరంగల్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సుధీర్ రెడ్డిల ఆకస్మిక మృతికి సంతాపంగా సభికులందరూ మౌనం పాటించారు. -
ప్లీనరీలో రెండు అంశాలపై తీర్మానం
వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఈ నెల 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరిగే ప్లీనరీలో తెలంగాణ తరుఫున రెండు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3వ జాతీయ ప్లీనరీ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రెండు తీర్మానాల్లో ఒకటి.. సామాజిక, రాజకీయ ఆర్థిక తీర్మానమని, ఇందులో తొమ్మిది ఉప అంశాలు ఉంటాయన్నారు. రెండోది.. టీఆర్ఎస్ మేనిఫెస్టో – ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానం అని, ఇందులోనూ తొమ్మిది ఉప అంశాలు ఉంటాయన్నారు. ప్లీనరీకి రాష్ట్రంలోని పార్టీ శ్రేణులంతా నిర్ణీత సమయానికంటే ముందే చేరుకోవాలని సూచించారు. -
ప్లీనరీకి సకాలంలో చేరుకోవాలి: గట్టు
సిటీబ్యూరో: ఈ నెల 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనున్న వైఎస్సార్ సీపీ 3 వ జాతీయ ప్లీనరీ సమావేశాలకు తెలంగాణలోని పార్టీ శ్రేణులంతా హాజరుకావాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఎనమిదవ తేదీ ఉదయానికి నిర్ణీత సమయానికన్నా ముందే పార్టీ ప్రతినిధులు ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు. 8 వ తేదీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు అని కూడా ఆయన గుర్తు చేశారు. ప్లీనరీ తెలంగాణ తరపు నుంచి రెండు ముఖ్య తీర్మానాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఒకటి సామాజిక , రాజకీయ ఆర్థిక తీర్మానం కాగా ఇందులో తొమ్మిది ఉప అంశాలు ఉంటాయన్నారు. రెండోది తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టో - ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానం. ఇందులో కూడా తొమ్మిది ఉప అంశాలు ఉంటాయన్నారు. ఉప అంశాలను వేదికపైనే నేరుగా తెలియజేస్తామన్నారు. -
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
► రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన జిల్లా నాయకులు ► పలువురిని పార్టీలోకి ఆహ్వానించిన నేతలు కాజీపేట రూరల్: హైదరాబాద్ లోటస్పాండ్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్రెడ్డిని వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సంగాల ఈర్మియా కలిశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు ఈర్మియా తెలిపారు. ఈ నెల 8, 9 వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే పార్టీ ప్లీనరీ సమావేశాలకు వరంగల్ జిల్లా నుంచి వచ్చే నాయకుల వివరాలు వెల్లడించినట్లు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధానకార్యదర్శులు జన్ను విల్సన్ రాబర్ట్, నెమలిపురి రఘు, కార్యదర్శి బొమ్మగాని కార్తిక్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు దుప్పటి ప్రకాష్ ఉన్నారు. వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక జిల్లా అధ్యక్షుడు సంగాల ఈర్మియా ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ఎంబీసీ సంఘం నాయకుడు మడేలు వీరన్న, జిల్లా వాకర్స్ సంఘం నాయకుడు రామనంద సాగర్, స్వచ్ఛంద సంస్థ నాయకుడు తిమోతి వైఎస్సార్ సీపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు ఈర్మియా తెలిపారు. -
జిల్లా అధ్యక్షుడి బాధ్యతల నుంచి ఇరువురి తొలగింపు
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం రమేశ్ను జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఆ మేరకు వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 22న హైదరాబాద్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు సంబంధించి ముందస్తు సమాచారం ఇచ్చినా వారు హాజరుకాక పోవడంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్ రెడ్డి, నీలం రమేశ్లు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులుగా మాత్రమే కొనసాగనున్నారు. అలాగే ప్లీనరీకి హాజరుకాని మరో ఇద్దరు జిల్లా పార్టీ అధ్యక్షులను శ్రీకాంత్రెడ్డి వివరణ కోరారు. అసెంబ్లీ స్థానాలకు కోఆర్డినేటర్ల నియామకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి రాష్ట్రంలోని మూడు అసెంబ్లీ నియోజక వర్గాలకు కో–ఆర్డీనేటర్లను నియమించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గానికి బండారు వెంకటరమణ, అచ్చంపేట్ నియోజక వర్గానికి బీష్వ రవీందర్ని నియమించినట్లు ఆయన తెలిపారు. -
2019 ఎన్నికల్లో క్రియశీలక పాత్ర: గట్టు శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్ : 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో క్రియశీలక పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వ స్ఫూర్తితో ముందుకు వెళదామని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ చంపాపేటలోని స్థానిక సామ నరసింహారెడ్డి గార్డెన్లో గురువారం జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశం ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన ప్రతి అడుగులో కూడా పేదవాడి గుండె చప్పుడు విన్నారన్నారు. ఆ మహానేతను మరవడం ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు. అలాగే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయగలిగేది వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. వచ్చే ప్లీనరీకి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో హాజరు అవుతారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి తెలంగాణలో కేసీఆర్ పాలన కొనసాగుతోందని గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. కాగా ప్లీనరీలో మొత్తం 12 తీర్మానాలను ఆమోదించిన పార్టీ, అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సమావేశానికి తెలంగాణలోని 31 జిల్లాల పార్టీ అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకు ముందు పార్టీ జెండా ఎగురవేసి ప్లీనరీని ప్రారంభించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి,మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. -
నేడు వైఎస్సార్సీపీ ప్లీనరీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ తెలంగాణ ప్లీనరీ సమావేశం గురువారం(నేడు) హైదరాబాద్లో జరగనుందని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రం నలుమూలల నుంచి వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎల్బీనగర్ ప్రాంతంలోని చంపాపేట్ రోడ్డులోని ఎస్ఎన్ రెడ్డి గార్డెన్స్(సామ నరసింహా రెడ్డి గార్డెన్)లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పారు. ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరవుతారని తెలిపారు. ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా మొత్తం 10 తీర్మానాలను ప్లీనరీ సమావేశంలో ప్రవేశపెట్టి చర్చించను న్నామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టో అమలులో అధికార టీఆర్ఎస్ వైఫల్యాలు, సంక్షోభంలో వ్యవసాయ రంగం, నకిలీ విత్తనాల బెడద, రైతు ఆత్మహత్యలు, పంటలకు దక్కని గిట్టుబాటు ధరలు, నత్తనడకన ప్రాజెక్టుల నిర్మాణం, రీడిజైనింగ్, భూ సేకరణ అంశాలపై తీర్మానాలు, చర్చ ఉంటుందని పేర్కొన్నారు. వీటితోపాటు అందని ద్రాక్షలా కార్పొరేట్ వైద్యం, ప్రైవేటు ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులో జాప్యం, కలగానే మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, సంక్షో భంలో సంక్షేమం, కొరవడిన సామాజిక న్యాయం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు, ఇస్తామన్నది లక్షా ఉద్యోగాలు ఇచ్చింది 25 వేలే, ఉన్నత విద్యకు దూరంగా విశ్వ విద్యాలయాలు, ఫీజుల చెల్లింపులో జాప్యం, మహిళల భద్రత–సాధికారత, విశ్వ నగరమా, వింత నగరమా అనే అంశాలను తీర్మానాలుగా పెట్టి ఒక్కో అంశంపై గంట పాటు చర్చించి, రాబోయే రెండున్నర ఏళ్లకు ఆందోళన కార్యక్రమాలు రూపొందించ నున్నట్లు చెప్పారు. -
వైఎస్సార్సీపీ తెలంగాణ ప్లీనరీకి ఏర్పాట్లు
22న జరిగే ప్లీనరీకి 10 మందితో కమిటీ సాక్షి, హైదరాబాద్: రాజధానిలో ఈ నెల 22న జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్లీనరీ సమావేశానికి భారీ ఏర్పాట్లు చేసున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ ప్లీనరీకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు వేలాదిగా తరలిరానున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలపై ఇందులో చర్చించి, తీర్మానం చేస్తారు. ఈ సమావేశాల నిర్వహణకు పది మంది సభ్యులతో ప్లీనరీ కమిటీ వేశారు. ఈ కమిటీలో పార్టీ తెలంగాణ నాయకులు గట్టు శ్రీకాంత్రెడ్డి, కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, జి.మహేందర్ రెడ్డి, భవంత్రెడ్డి, ఎస్.భాస్కర్రెడ్డి, బొడ్డు సాయినాథ్రెడ్డి, ఎన్.రవికుమార్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి తదితరులున్నారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు కృషిచేస్తున్నాయి. కాగా, నగరంలో ప్లీనరీ వేదికను మంగళవారం ప్రకటిస్తామని పార్టీ ముఖ్యులు ఒకరు తెలిపారు. -
భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ 22న తెలంగాణ పార్టీ ప్లీనరీ.. సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రారంభించిన ఎనీవేర్ రిజిస్ట్రే షన్ కాస్త ఎనీవేర్ కరప్షన్గా మారిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల వల్లే ఎమ్మెల్సీ దీపక్రెడ్డి భూ కుంభకోణా లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నెల 22న ప్లీనరీ.. ఈ నెల 22న హైదరాబాద్లోని నాగోలు ఫంక్షన్ హాలులో వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ప్లీనరీ నిర్వహించనున్నట్లు శ్రీకాంత్రెడ్డి తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతారని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 8 వేల మందితో ప్లీనరీ నిర్వహిస్తా మన్నారు. పార్టీ బలోపేతం, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు.. నీళ్లు, నిధులు, నియామకాలు, రాబోయే రెండేళ్లలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ ఉంటుందన్నారు. కోటి ఎకరాలకు నీళ్లిస్తామన్న వాగ్దానం అమలు ఏ దశలో ఉంది, నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారో సమీక్షి స్తామని చెప్పారు. పాలమూరు–రంగా రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల అంశం కోర్టుకు వెళ్లిందని.. ఈ విషయమై ప్రభుత్వ న్యాయ నిపుణులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఈసీ సభ్యుడిగా సింగిరెడ్డి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సింగిరెడ్డి భాస్కరరెడ్డిని పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యు డిగా నియమించినట్లు శ్రీకాంత్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
22 నుంచి తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ
హైదరాబాద్ : ఈ నెల 22న హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు టీ.వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ 8వేల మందితో ప్లీనరీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ బలోపేతం, కేసీఆర్ పాలనా వైఫల్యాలపై చర్చిస్తామని గట్టు శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. మియాపూర్ భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఎనీవేర్ కరప్షన్గా మారిందన్నారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యం వల్లే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
బంగారు తెలంగాణ కోసం మరో పోరాటం: గట్టు
సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల టీఆర్ఎస్ పాలనలో స్కీములను మించిన భూస్కాములు తప్ప మరేమీ కనబడటంలేదని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. తెలంగాణ సాధన పోరాటం నీళ్లు, నిధులు, నియామకాలపై జరిగితే.. వాటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. గట్టు జాతీయ పతాకాన్ని ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టిన మూడేళ్ల టీఆర్ఎస్ పాలనను గుర్తు చేసుకుని బంగారు తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తే చుక్క నీరు లేదన్నారు. కమీషన్ల కోసం నీటి ప్రాజెక్టులను భారీగా తలపెట్టిందని, దాన్ని మించి భూస్కాములు బయటకు వస్తున్నాయని ధ్వజమెత్తారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమృతసాగర్, గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు సాయినా థ్రెడ్డి, సేవాదల్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎన్ రవికుమార్, ఐటీ అధ్యక్షుడు శ్రీవర్ధన్రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథాచారి పాల్గొన్నారు. -
సొంతగూటికి చేరుతున్న నాయకులు: గట్టు
వైఎస్సార్సీపీలో పలువురి చేరిక సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరిన నాయకులు ఒక్కొక్కరుగా తిరిగి వైఎస్సార్సీపీలోకి స్వచ్ఛందంగా వస్తున్నారని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ యూత్ విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్రెడ్డి శుక్రవారం ఇక్కడ లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీలో చేరారు. శ్రీకాంత్రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో ఉన్న ప్రజాస్వామ్యం ఏ పార్టీలో ఉండదని అన్నారు. ప్రజాసమస్యలే ఎజెండాగా పని చేసే ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని పేర్కొన్నారు. మహానేత వైఎస్సార్ ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా నడుస్తున్న పార్టీ వైఎస్సార్సీపీ అని చెప్పారు. 2019 నాటికి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్లకు తమ పార్టీ గట్టి పోటీని ఇస్తుందని శ్రీకాంత్ తెలిపారు. ధర్నా చౌక్ ఆందోళనకు మద్దతు వివిధ రాజకీయ పక్షాలు ధర్నా చౌక్ ఎత్తివేతను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఈ విషయంలో అన్ని రాజకీయపార్టీలు, ప్రజాతంత్ర ప్రజాసంఘాలు నిరంతరాయంగా చేస్తున్న ఆందోళనలో తమ పార్టీ నగర శ్రేణులు కూడా భాగస్వాములవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్.భాస్కర్రెడ్డి, బి.రవీందర్ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని అన్నారు. -
ప్లీనరీపై 10న సన్నాహక సమావేశం
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి రోజైన జూలై 8న విజయవాడ వేదికగా వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సన్నాహక సమావేశాన్ని 10వ తేదీన లోటస్పాండ్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సన్నాహక సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శులు, జిల్లా ఇన్చార్జ్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు మాత్రమే హాజరుకావాలన్నారు. ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలోని సమస్యలు, ప్రజల అభిప్రాయాలు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని సూచించారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది కంటితుడుపు చర్యే
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రైతులను ఆదుకునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం కంటి తుడుపు చర్యలు చేపడుతు న్నాయని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది రైతులపై కపట ప్రేమన్నారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన రూ.5 వేలు ఏమాత్రం సరిపోదన్నారు. రాష్ట్రంలో 7లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పండిస్తే, 33,700 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తే మిగతా రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ ధరతో ఎఫ్ఏక్యూ నాణ్యమైన మిర్చిని మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధన విధించడం సరికాదన్నారు. ఎఫ్ఏక్యూ మిర్చి కాకుండా క్వాలిటీ లేని లేదా రంగు వెలిసిన మిర్చిని ఎవరు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. కేవలం 33,700 మెట్రిక్ టన్నులకే సరిపె ట్టకుండా మిర్చి చివరి స్టాక్ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
మద్దతుధర ఇవ్వడంలో సర్కార్ విఫలం
- మిర్చి, ధాన్యం, కందులు, పసుపు రైతుల కష్టాలు పట్టవా..? - వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి సాక్షి, ఖమ్మం: ‘‘మిర్చి, ధాన్యం, కందులు, పసుపునకు మద్దతుధర ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రైతులు నానా కష్టాలు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు’’వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చికి రూ.12 వేల నుంచి రూ.14 వేలు మద్దతు ధర ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.2.500 నుంచి రూ.3 వేలు వరకే ఇస్తున్నారని, దీంతో కడుపు మండిన రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారన్నారు. మిర్చి రైతులు సాగు ఖర్చులు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కంది, ధాన్యం, పసుపు రైతులది కూడా ఇదే పరిస్థితి అన్నారు. రాష్ట్రంలో రూ.17వేల కోట్ల రుణమాఫీ చేయడానికి మూడేళ్లు పట్టిందని, దీంతో బ్యాంకుల్లో తీసుకున్న అప్పుకు రైతులే వడ్డీ చెల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో మూడేళ్లలోనే రాష్ట్రంలో 2,256 మంది రైతులు చనిపోయారన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ తెలం గాణ రాష్ట్ర శాఖ ప్లీనరీ జూలైలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్లీనరీకి ముందు లేదా ఆ తర్వాత నిజాం కళాశాల గ్రౌండ్స్లో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. మండుటెండలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ వైఎస్సార్సీపీ ఖమ్మం జిల్లా పార్టీ సమావేశం సందర్భంగా ఖమ్మం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ పార్టీ నూతన జిల్లా కార్యాలయానికి తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనం తరం ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నాయకులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఐదు ఎమ్మెల్యే స్థానాలతోపాటు ఎంపీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని, జగనన్న లక్ష్యం ఇదేనని అన్నారు. -
రెపరెపలాడిన వైఎస్సార్సీపీ జెండా
ఖమ్మం : ‘ఖమ్మం జిల్లాలో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది.. మిట్ట మద్యాహ్నం 44 డిగ్రీల ఉష్ణోగ్రత్తలను సైతం లెక్క చేయక వైఎస్సార్సీపీ సైన్యం కవాత్తులా కదలింది.. పార్టీ జెండాలతో కార్యకర్తలు నాయకులు కోదాడ క్రాస్ రోడ్ నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్ వరకు కదం తొక్కారు..’ వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్రెడ్డి రావడంతో పార్టీ శ్రేణులు జిల్లా అధ్యక్షులు లక్కినేని సుదీర్బాబు నేతృత్వంలో స్థానిక కోదాడ్ క్రాస్ రోడ్ నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత కార్యకర్తలు స్థానిక మామిళ్లగూడెంలోని లక్కినేని సుదీర్బాబు క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్రెడ్డికి స్వాగతం పలికేందుకు కోదాడ క్రాస్ రోడ్వరకు ర్యాలీగా తరలివెళ్లారు. కొమ్ముడప్పు నృత్యాలతో, టపాసుల పేల్చుకుంటూ తరలివెళ్లారు. అక్కడకు చేరుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్రెడ్డికి ఘనస్వాగతం పలికారు. జిల్లా అధ్యక్షులు లక్కినేని సుదీర్బాబు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం పెద్దతండా వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడ్నుంచి కాల్వొడ్డు, మయూరిసెంటర్, బస్టాండ్ సెంటర్ల మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్ వరకు సాగింది. కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకావడంతో ఈ ర్యాలీ సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. కార్యకర్తలు నూతనోత్సహాంతో బైక్లు, ట్రాక్టర్లపై ర్యాలీ నిర్వహించారు. ఓపెన్టాప్పై ఎక్కిన నాయకులు ప్రజలకు అభివాదం చేసుకుంటూ సాగారు. భారీగా కార్యకర్తలు తరలిరావడంతో ఖమ్మం ప్రధాన రహదారి వైఎస్సార్సీపీ జెండాలతో నిండింది. జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభం.. స్థానిక ఇల్లందు క్రాస్ రోడ్సమీపంలో ఏర్పాటు చేసిన పార్టీ నూతన జిల్లా కార్యాలయంను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు లక్కినేని సుదీర్బాబుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ్నుంచి ప్రారంభమైన ర్యాలీ బైపాస్ రోడ్లోని రాజ్పథ్ పంక్షన్ హాల్ వరకు సాగింది. పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంబోత్సవానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు నేతలను జిల్లా నాయకులు సన్మానించారు. రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్రెడ్డికి ఘన సన్మానం చేయడంతో ఆయనకు కరవాలం బహుకరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు కేరింతలు చేశారు. నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ సందర్భంగా బాణా సంచా పేల్చుతూ నూతనోత్సాహాన్ని చూపించారు. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. గత కొద్ది కాలంగా స్తబ్దుగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. పార్టీ జిల్లా కార్యాలయం సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్రెడ్డి రావడం, నగరంలో భారీ ర్యాలీ నిర్వహించడంతో పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే జిల్లాలోని మండల కమిటీలను పూర్తి చేయడంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పార్టీ జిల్లా అధ్యక్షులు లక్కినేని సుదీర్బాబు కీలకంగా వ్యవహరించారు. దీంతోపాటు జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంబోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని మండలాల నుంచి భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చారు. కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొల్పేలా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్రెడ్డి తన సందేశాన్ని ఇవ్వడంతో తిరిగి జిల్లాలో వైఎస్సార్సీపీ కీలకంగా మారేలా కార్యకర్తలు తమ ఉత్సాహాన్ని చూపించారు. ఏది ఏమైనా జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంబోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కార్యక్రమాలు ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. -
మిర్చి రైతులను ఆదుకోవాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి భూపాలపల్లి అర్బన్: మద్దతుధర లేక అల్లాడిపోతున్న మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే రం గంలోకి దిగి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. మిర్చి రైతులను ఆదుకోవాలంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చేపట్టిన రైతు దీక్ష రెండోరోజు కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు అప్పం కిషన్కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసిన అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. పత్తి సాగు వద్దని ప్రభుత్వం ప్రచారం చేయడంతో మిర్చి, కంది సాగు చేశారని, తీరా పంట చేతికి వచ్చాక ధర లేకుండా పోయిందన్నారు. దీంతో పంట లను చేలలోనే వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
టీఆర్ఎస్ వైఫల్యాలపై పోరాటాలు: గట్టు
♦ 2019 ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ ♦ ఏప్రిల్ 30 లోపు పార్టీ కమిటీలు పూర్తి ♦ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో భారీ ధర్నా సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి సోమవారం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీనీ సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఇన్చార్జ్లు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ సమన్వయకర్తలు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. సీఎం చెప్పే డబుల్ బెడ్రూం ఇళ్లు తమకెక్కడా కన్పించడం లేదని పేదలు అంటున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇళ్లిచ్చారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఒక్క రైతుకు కూడా రుణం పూర్తిగా మాఫీ కాలేదు. నాడు వైఎస్సార్ ఒక్క సంతకంతో వారి రుణాలను పూర్తిగా మాఫీ చేశారని ప్రజలే అంటున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించి ఎందరో పేదలకు ఉన్నత చదువులు చదివే అవకాశం వైఎస్ కల్పించారు. తెలంగాణలో ఏకంగా 36 ప్రాజెక్టులు ప్రారంభించి ఆదర్శంగా నిలిచారు. కానీ ప్రజా సంక్షేమం కోసం ఆ మహానేత ప్రారంభించిన సంక్షేమ పథకాలను ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు’’ అని గట్టు విమర్శించారు. వద్దన్న పత్తికి ధర పెరిగింది.. వేసుకొమ్మన్న మిర్చి,కందుల ధరలు తగ్గాయి రైతులు పత్తి పంట వేసుకుంటుంటే ప్రభుత్వం వద్దని చెప్పిందని, ఇప్పుడేమో పత్తి రేటు బాగా పెరిగిపోయిందని గట్టు అన్నారు. మిర్చి, కంది వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తే వాటి ధరలేమో ఇప్పుడు అమాంతం తగ్గాయని ఆవేదన వెలిబుచ్చారు. ఏప్రిల్ 2 నుంచి 30 వ తేదీలోగా జిల్లాలు, మండలాలు, గ్రామాల పార్టీ కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. 2019 లక్ష్యంగా పార్టీ నాయకులు, శ్రేణులు కలిసి పనిచేయాలని కోరారు. సీఎం కేసీఆర్ వైఫల్యాలపై ఎక్కడిక్కడ జిల్లా పార్టీ శ్రేణులు ఉద్యమాలు చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో భారీ ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. గీత దాటితే ఉపేక్షించేది లేదు వైఎస్సార్ ఆశయాల సాధన కోసం, వైఎస్ జగన్ బాటలో కార్యకర్తల నుంచి నాయకుల దాకా అందరూ నడవాల్సి ఉందని గట్టు సూచించారు. ‘‘ఎంతటి వారైనా పార్టీ నియమావళి ప్రకారమే నడుచుకోవాలి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎవరినీ చూస్తూ ఊరుకునేది లేదు’’ అని హెచ్చరించారు. ఎవరికి కేటాయించిన నియోజకవర్గాల్లో వారు 2019 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, జి.రాంభూపాల్ రెడ్డి మాట్లాడారు. ప్రధాన కార్యదర్శులు మతీన్ ముజాద్దాదీ, బోయినపల్లి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు మాదిరెడ్డి భగవంత్రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
‘మిర్చి’ కే్రందాలు ఏర్పాటు చేయాలి
వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి మిర్యాలగూడ: రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాం డ్ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చి కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్న మిర్చికి పూర్తి స్థాయి లో గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులను పత్తి సాగుకు బదులుగా కంది పంట సాగు చేయాలని చెప్పిన వ్యవసాయాధికారులు కనీసం మద్దతు ధర చెల్లించడం లేదని విమర్శించారు. -
టీఆర్ఎస్ మ్యానిఫెస్టో అమలుకు పోరు: గట్టు
-
టీఆర్ఎస్ మ్యానిఫెస్టో అమలుకు పోరు: గట్టు
త్వరలో భారీ ధర్నా.. 27న రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ప్రత్యక్ష పోరాటాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతుందని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం లోటస్పాండ్లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు ప్రజల బతుకులు ఎలా ఉన్నాయో.. ఇప్పుడూ అలాగే ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ పాల నలో తెలంగాణ ప్రజల ఆశలు నిరాశల య్యాయని వాపోయారు. రాష్ట్రంలో 90 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బాగుపడకుండా సమగ్రాభివృద్ధి ఎలా సాధ్యమని చెప్పారు. బీసీ, మైనార్టీలపై ప్రేమ ఉంటే వారికోసం ఉపప్రణాళిక చట్టం తీసుకురావాలని కోరారు. విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే భారీ ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో 22 లక్షల మందికి ఇళ్లు లేవని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు 2 లక్షల ఇళ్లు కట్టిస్తామంటున్నారని మిగిలిన ఇళ్లు సకాలంలో పేదలకు కట్టించకపోతే నిద్రపోనీ యమన్నారు. ప్రాజెక్టుల పేరిట రైతుల భూముల్ని అన్యాయంగా లాక్కొంటే చూస్తూ ఊరుకోమన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, ఆత్మహత్యలు, శ్రమదోపిడీ ఇప్పటికీ కొన సాగుతున్నాయన్నారు. తాను కమ్యూనిస్టునే అంటున్న కేసీఆర్.. తాను తీసుకొనే నిర్ణయా లను కూడా కమ్యూనిస్టు పార్టీల సమావేశాల్లో చర్చించినట్లుగా చర్చించి, ప్రజలకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుం దని హితవు పలికారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రజల ముందు పెట్టి, ఎన్నింటిని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఆయనకు ప్రజల రియాక్షన్ ఏంటో తెలుస్తుం దన్నారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశా లను అమలు చేయాలని కోరుతూ త్వరలో భారీ ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె. శివకుమార్, జి. రాంభూపాల్ రెడ్డి, జె. మహేందర్ రెడ్డి, మతీన్ ముజాద్దాదీ, బోయినపల్లి శ్రీనివాస్ రావు, జీహెచ్ఎంసీ శాఖ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి, వరంగల్ జిల్లా ఇన్చార్జ్ వేముల శేఖర్ రెడ్డి, డాక్టర్స్ విభాగం అధ్య క్షుడు డాక్టర్ ప్రఫుల్లా రెడ్డి పాల్గొన్నారు. 27న వైఎస్పార్ సీపీ నాయకుల భేటీ ఈ నెల 27న సోమవారం హైదరాబాద్లోని లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయం లో ముఖ్య నేతల భేటీ నిర్వహిస్తున్నట్లు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లాల ఇన్చార్జ్లు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు తరలి రావాలని కోరారు. -
మేడిపండు చందంగా బడ్జెట్
మేడిపండు చందంగా రాష్ట్ర బడ్జెట్ ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.3,391 కోట్లు ఉండగా, ఈ బడ్జెట్లో కేవలం రూ.1,939 కోట్లు కేటాయించారు. దీనివల్ల పేదవిద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. 2.6 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు కడతామని చెప్పి ఇప్పటికి 1,400 మాత్రం నిర్మించారు. ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కలగా మిగిలిపోవాల్సిందేనా ? సాగునీటి ప్రాజెక్టులకు 2016–17లో రూ.25 వేల కోట్లు కేటాయించి, రూ.11,500 కోట్లే ఖర్చుచేశారు. మళ్లీ 2017–18లో రూ.25 వేల కోట్లు కేటాయించడం హాస్యాస్పదం. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ.1.50 లక్షల కోట్లు కావాలి. ఇప్పటికి రూ.25–30 వేల కోట్లే వ్యయంచేశారు. వచ్చే రెండేళ్లలో ఎన్ని కోట్లు కేటాయించి ఎప్పటిలోగా ప్రాజెక్టులను పూర్తిచేస్తారో చెప్పాలి. ఎస్సీ ఉపప్రణాళిక కింద 2016–17లో రూ.10,483 కోట్లు కేటాయించి, కేవలం రూ.4,250 కోట్లు ఖర్చుచేశారు. ఎస్టీ ఉపప్రణాళిక కింద రూ.6,171 కోట్లు కేటాయించి, అందులో 40 శాతం కూడా ఖర్చు చేయలేదు. 2017–18లోనైనా ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన రూ.22,540 కోట్లు పూర్తిస్థాయిలో ఖర్చుచేయాలి. వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తామని చెప్పిన ప్రభుత్వం నామమాత్రంగా రూ.4,120 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. – డాక్టర్ గట్టు శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు -
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ యూత్ విభాగం నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువజన విభాగంలో వివిధ నియామకాలు చేశారు. ప్రధాన కార్యదర్శులుగా బూర సుమన్ గౌడ్, ఇ.సురేందర్రెడ్డి, కార్యదర్శులుగా సి.రాజేందర్, ఇ.హరీశ్, మంచిర్యాల జిల్లా యువజన అధ్యక్షుడిగా వి.కిరణ్ ప్రకాశ్ నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్రెడ్డి అనుమతితో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ ఈ నియామకాలు చేశారు. ఆదివారం ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. -
జేసీ బ్రదర్స్ జాగ్రత్త
-
‘దివాకర్ ట్రావెల్స్ పై కేసులు పెట్టాలి’
నల్లగొండ: టీడీపీ నాయకులు జేసీ సోదరులు పిచ్చి కుక్కల్లా మాట్లాడుతున్నారని, వారిని అడ్డం పెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తీరు మార్చుకోకుంటే జేసీ సోదరులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వుంటుందని హెచ్చరించారు. నందిగామ బస్సు ప్రమాద బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. -
అశ్రునయనాలతో సోదరుల అంత్యక్రియలు
-
అశ్రునయనాలతో సోదరుల అంత్యక్రియలు
► సైనిక లాంచనాలతో కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి దహన సంస్కారాలు ► హాజరైన వేలాది మంది ప్రజలు ► నివాళులర్పించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి కోదండరాంపురం (గరిడేపల్లి) : కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు మండలం ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం మరణించిన సోదరులు నలబోలు కృష్ణారెడ్డి, నలబోలు శేఖర్రెడ్డి అంత్యక్రియలు బుధవారం మండలంలోని కోదండరాంపురంలో అశ్రునయనాల మధ్య నిర్వహించారు. దహన సంస్కారాలకు పలు గ్రామాల ప్రజలతో పాటు నాయకులు అధికారులు బంధువులు స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కృష్ణారెడ్డి, ఆర్మీ డాక్టర్గా శేఖర్రెడ్డి పనిచేస్తూ పెళ్లి చూపులకు వస్తూ మార్గమధ్యలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. తండోపతండాలుగా.. సోదరుల దహనసంస్కారాలకు తండోపతండాలుగా తరలివచ్చిన జనం శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుల తల్లిదండ్రులు నలబోలు శేషిరెడ్డి–కమలమ్మలు విలపిస్తున్నతీరును చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు. వీరి మృతదేహాలను వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జెడ్పీటీసీ పెండెం శ్రీనివాస్గౌడ్, తహసీల్దార్ వజ్రాల జయశ్రీ, సాముల శివారెడ్డి, బొబ్బాభాగ్యరెడ్డి, పొలిశెట్టి అంజ య్య, ఎస్ఐ దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి, ఏఎస్ఐ జగన్మోహన్రెడ్డి, పయిడిమర్రి రంగనాథ్, మండవ నర్సయ్య, షేక్. యాకుబ్, కొత్త రామకృష్ణారెడ్డి, చిత్తలూరి సోమయ్య, బొమ్మ వెంకటేశ్వర్లు, అలుగుబెల్లి రవీందర్రెడ్డి, త్రిపురం అంజన్రెడ్డితో పాటు పలువురు సందర్శించి నివాళులర్పించారు. సైనిక లాంచనాలతో .. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నలబోలు శేఖర్రెడ్డి భువనేశ్వర్ ఆర్మీ విభాగంలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఆయన మృతికి ఆర్మీ అధికారులు సైనిక లాంచనాలతో గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి, మృతదేహాలపై జాతీయ జెండాలను కప్పి నివాళులర్పించారు. తల్లిదండ్రులకు కృష్ణారెడ్డి,–కమలమ్మలకు జాతీయ జెండాను గుర్తుగా అందించారు. కార్యక్రమంలో కాంపోజిట్ ఆసుపత్రి హైదరాబాద్ డిప్యూటీ కమాండెంట్ డాక్టర్ సురేంద్ర సంగోడి, ఎన్ఆర్డీఎఫ్ అసిస్టెంట్ కమాండెట్ జె. సెంతిల్కుమార్, జీఏడీ హెడ్కానిస్టేబుల్ కేజె రావు, గరిడేపల్లి ఎస్ఐ దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి, ఏ ఎస్ఐ జగన్మోహన్రెడ్డితో పాటు 9మంది సైనిక సిబ్బంది పాల్గొన్నారు. -
తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ను నిషేధించాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి గరిడేపల్లి(హుజూర్నగర్): తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ను పూర్తిస్థాయిలో నిషేధించి ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన సోదరులు డాక్టర్ శేఖర్రెడ్డి, కృష్ణారెడ్డిల మృతదేహాలను సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కోదండరాం పురంలో బుధవారం ఆయన సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మృతుల తల్లిదండ్రులు శేషిరెడ్డి, కమలమ్మలను పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేవలం యజమాని నిర్లక్ష్యం, డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగి 11 ప్రాణాలు పోయాయన్నారు. దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం.. మృతులకు ఒక్కొ క్కరికి రూ. 25 లక్షల నష్ట పరిహారం అందించాలని, ఘటనకు దివాకర్ ట్రావెల్స్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రమాదస్థలానికి చేరుకొని మృత దేహాలను పరామర్శించేందుకు వెళ్లిన తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీడీపీ ప్రభుత్వం అడ్డుకోవటం సిగ్గుచేట న్నారు. జగన్ పట్ల అధికారులు వ్యవహరిం చిన తీరు బాధాకరమన్నారు. చంద్రన్న బీమా పథకం ఉంటే ఎక్స్గ్రేషియా ఇస్తామ నడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి మృతుల కుటుం బాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల చొప్పున నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్రెడ్డి, దొంతిరెడ్డి సైదిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త రామకృష్ణారెడ్డి, చిత్తలూరి సోమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నోటికొచ్చిన హామీలివ్వడం సరికాదు: గట్టు
హుజూర్నగర్: ఎన్నికల సందర్భంలో అధికారమే పరమావధిగా నోటికొచ్చిన హామీలివ్వడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గట్టు మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయలేదని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్లు, గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు తదితర హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగుల ఓట్లు దండుకున్నారే తప్ప నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగడం లేదన్నారు. సామాజిక న్యాయం ప్రధాన ఎజెండాగా సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర రాష్ట్ర ప్రజలకు దిశ నిర్ధేశించేదిగా ఉందని తెలిపారు. -
డీపీఆర్ లేకుండా ‘కాళేశ్వరం’ చేపట్టడమేంటి?
-
2013 చట్టాన్ని అమలు చేయాలి
• డీపీఆర్ లేకుండా ‘కాళేశ్వరం’ చేపట్టడమేంటి? • నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపాకే పనులు చేపట్టాలి • వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి సాక్షి, భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ సందర్భంగా 2013 చట్టాన్ని అమలుచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశా రు. భూసేకరణ సందర్భంగా జీవనోపాధి కోల్పోతున్న కుటుంబాలకు తమ పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సోమవారం ఒకరోజు రైతు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రీడిజైనింగ్ పేరుతో ఇష్టారీతిగా అంచనాలు పెంచి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపడుతోందన్నారు. ఇంత వరకు డీపీఆర్ సిద్ధం చేయకుండా రైతుల నుంచి భూములు సేకరించడం ఎంతవరకు సబబని ప్రశించారు. 2013 చట్టం ప్రకారమే భూ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల వల్ల భూమి, భుక్తి కోల్పో యే రైతులు, రైతు కూలీలు, చేతివృత్తుల వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో మల్లన్నసాగర్ తరహా ఉద్యమం వస్తుందని శ్రీకాంత్రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. వైఎస్సార్ పేరు చెప్పకపోవడం సరికాదు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారీ ఎత్తున ప్రాజెక్టులు కట్టి, రైతుల పొలాల్లోకి నీరు పంపింది.. ఉచిత విద్యుత్ ఇచ్చింది కేవ లం దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మాత్రమేనని శ్రీకాంత్రెడ్డి గుర్తు చేశారు. ప్రాజెక్టులు మేమే కట్టామని చెబు తున్న కాంగ్రెస్ నేతలు, అందుకు కారణమైన జలయజ్ఞ ప్రదాత వైఎస్.రాజశేఖరరెడ్డి పేరు చెప్పకపోవడం సిగ్గు చేటన్నారు. పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చా రు. పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోలేదన్నారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సెగ్గెం రాజేశ్ ఆధ్వర్యంలో ఈ దీక్ష నిర్వహించారు. -
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ వైఫల్యం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి సూర్యాపేట : ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతిరెడ్డి సైదిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లకు 10 సీట్లు కాంగ్రెస్ పార్టీకే వస్తాయని, కేవలం రెండు సీట్లు మాత్రం సమస్య ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినా 3 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం అతికష్టమన్నారు. 2014 సంవత్సరంలో అధికారంలోకి రావాలనే కుయుక్తులతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల గురించి మాట్లాడడం తప్పా.. రైతులు, విద్యార్థుల ఫీజురీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీపై ఎన్నడైనా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తరుపున మాట్లాడారా..అని ప్రశ్నించారు. సర్వేలు చేయించుకొని రాష్ట్రంలో 70 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 సీట్లు కూడా కాంగ్రెస్పార్టీకి రావని జోస్యం చెప్పారు. కాంగ్రెస్పార్టీ అధికారంలో వచ్చేంత వరకూ గడ్డం తీయనని ఉత్తమ్కుమార్రెడ్డి ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లశక్తిని గడ్డంతో పోల్చడం నీతిమాలిన పని అని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వైఎస్సార్సీపీకి ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్లు రావడంతో పాటు నాలుగు చోట్ల డిపాజిట్లు దక్కాయని గుర్తు చేశారు. కాంగ్రెస్పార్టీ ప్రస్తుతం రెండు ఎంపీ సీట్లు వస్తే ఆ ఎంపీలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి రావాలనే తపన తప్ప కాంగ్రెస్పార్టీకి, ప్రజాసమస్యలపై పోరాడుదామనే ఆలోచన లేదన్నారు. ఇతర పార్టీలను కించపరిచే విధంగా ఉత్తమ్ మాట్లాడడం సరికాదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు దొంతిరెడ్డి సైదిరెడ్డి, శేఖర్రెడ్డి, నాయకులు మద్ది ఉపేందర్రెడ్డి, గోరెంట్ల సంజీవ, ఎజాజ్, తాడోజు జనార్దన్చారీ, ఎండీ ఇఫ్రాన్, విష్ణు, రాజిరెడ్డి, మహేందర్రెడ్డి, నాగేశ్వరరెడ్డి, చంటి, పవన్, వీరస్వామి, హరీష్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఆ విషయంలో బాబును మించినవారు లేరు
వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి ధ్వజం హైదరాబాద్: దేశంలో హింసను ప్రేరేపించటంలో ఏపీ సీఎం చంద్రబాబును మించిన రాజకీయ నేత మరొకరు లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అధికార దాహంతో చంద్రబాబు కేంద్రంతో కుమ్మక్కై ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి పదవులు పొందారని మండిపడ్డారు. శాంతియుత ఆందోళనలను రక్తపాతం చేయటం బాబుకు వెన్నతో పెట్టిన విద్యన్నారు. విద్యార్థుల ఆందోళనకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతు తెలిపి.. శాంతియుత ఆందోళనకు వేదికైన విశాఖ బీచ్కు వెళ్తూంటే విమానాశ్రయంలో అడ్డుకోవటం అప్రజా స్వామికమని దుయ్యబట్టారు. ప్రజలకోసం పోరాటాలు చేసే హక్కు ప్రతిపక్ష నేతకుందన్నారు. -
'హింసలో బాబును మించినోళ్లు లేరు'
హైదరాబాద్: దేశంలో హింసను ప్రేరేపించటంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని మించిన నేత మరొకరు లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన సమయంలోనే పార్లమెంట్ సాక్షిగా కేంద్రంలో ఇప్పటి అధికార, ప్రతిపక్ష నేతలు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడి ఆ హామీ అమలు చేయించాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని పేర్కొన్నారు. అధికార దాహంతో చంద్రబాబు కేంద్రంతో కుమ్మక్కై ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి పదవులు పొందారని త్రీవస్థాయిలో మండిపడ్డారు. శాంతియుత ఆందోళనలను సైతం రక్తపాతంగా మార్చటం బాబుకు వెన్నతో పెట్టిన విద్యేనని, అందుకు హైదరాబాద్ బషీర్ బాగ్ చౌరస్తాలో జరిగిన కాల్పులే నిదర్శనమన్నారు. శాంతియుతంగా జరిగే ఆందోళనలను హింసాత్మకంగా మార్చి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయటంలో బాబు దిట్ట అని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలు చంద్రబాబును తరిమికొట్టే రోజులు ఎంతో దూరంలో లేవని గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
ఫీజుపై పోరుబాట
బకాయిలు తక్షణమే విడుదల చేయాలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ డిమాండ్ ► లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ► మిషన్ భగీరథ, కాకతీయ పనులకు కోట్లు పెడుతున్నారు ► బడుగుల పిల్లల చదువులకు పైసలిచ్చేందుకు చేతులు రావా? ► లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమైందని నిలదీత ► ‘ఫీజు పోరు’కు కదలివచ్చిన నేతలు, పార్టీ శ్రేణులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతామని ప్రకటించింది. సంక్షేమ పథకాలు ,ఇతరత్రా అంశాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి పార్టీ నడుం బిగిస్తుందని హెచ్చరించింది. మంగళవారమిక్కడ ఇందిరాపార్కు వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫీజు పోరు’ ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి మాట్లాడారు. ‘‘మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితరాల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు అంచనాలు వేశారు. కానీ బడుగుల పిల్లల చదువుల కోసం ఫీజుల బకాయిలు రూ.3,600 కోట్లు చెల్లించేందుకు కేసీఆర్కు చేతులు రావడం లేదు. పదేళ్ల చంద్రబాబు దుష్ట పరిపాలనకు వైఎస్ చరమగీతం పాడి.. రైతన్నలు ఆత్మహత్యల బారిన పడకుండా ఉచిత విద్యుత్ సరఫరా చేశారు. బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదని ఫీజు రీయింబర్స్మెంట్ పథ«కం తెచ్చారు. ఈ పథకాన్ని కొనసాగించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉంది. ఫీజు బకాయిల చెల్లింపును నిర్లక్ష్యం చేస్తే.. దాంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో పార్టీ యంత్రాంగాన్ని కదిలించి పోరాటానికి సన్నద్ధమవుతాం’’ అని ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి దాదాపు మూడేళ్ల సమయం ఇచ్చామని, ఇక ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తామన్నారు. లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమైందని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ తరఫున గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్యేలను చేర్చుకుని టీఆర్ఎస్లో విలీనం చేసినట్లు స్పీకర్ ప్రకటించారని, ఇప్పుడు ఈ ధర్నాను చూసైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్కు కనువిప్పు కావాలన్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్రను నిర్వహించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. టీఆర్ఎస్ ఖబడ్దార్.. ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినంత మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పనైపోయిందని టీఆర్ఎస్ భావిస్తే ఖబడ్దార్ అంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం ఏప్రిల్ 30వ తేదీలోగా పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరేలా వైఎస్సార్ కాంగ్రెస్ పోరాడుతుందని పార్టీ ›ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ చెప్పారు. టీఆర్ఎస్వి ఆకర్షణీయమైన ప్రకటనలు తప్ప వాటి ఆచరణ మాత్రం లేదని పార్టీ సీఈసీ సభ్యుడు రాంభూపాల్రెడ్డి విమర్శించారు. మైనారిటీలు ఉన్నత చదవులు అభ్యసించరాదనే కుట్రతో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి మతీన్ విమర్శించారు. తక్షణమే ఫీజులు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని పార్టీ ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్రెడ్డి హెచ్చరించారు. పార్టీ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బోయనపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్, వెల్లాల రామ్మోహన్, విశ్వనాథాచారి, అమృత సాగర్, ప్రఫుల్లారెడ్డి, బండారు వెంకట రమణ, ఎన్.భిక్షపతి, శ్రీవర్ధన్రెడ్డి, పాలెం రఘునాథరెడ్డి, జిల్లాల అధ్యక్షులు బొబ్బిలి సుధాకర్రెడ్డి(రంగారెడ్డి), బెంబడి శ్రీనివాస్రెడ్డి(మేడ్చల్), అనిల్ కుమార్ (ఆదిలాబాద్), లక్కినేని సుధీర్బాబు (ఖమ్మం), మాదిరెడ్డి భగవంత్రెడ్డి(నాగర్ కర్నూలు), అచ్చిరెడ్డి(మహబూబాబాద్), సంగల ఇర్మియా (వరంగల్–అర్బన్), జగదీశ్ గుప్తా (సిద్దిపేట), విష్ణువర్ధన్రెడ్డి(వనపర్తి), గౌరెడ్డి శ్రీధర్రెడ్డి(సంగారెడ్డి), బీస మరియమ్మ (మహబూబ్నగర్), వడ్నాల సతీశ్ (మంచిర్యాల), జమ్లాపూర్ సుధాకర్ (ఆసిఫాబాద్), నీలం రమేశ్(నిజామాబాద్), నగేశ్ (కరీంనగర్), ఏనుగు రాజీవ్రెడ్డి (జగిత్యాల), సెగ్గం రాజేశ్(పెద్దపల్లి), సీహెచ్ రాము(సిరిసిల్ల) పాల్గొన్నారు. ఫీజు పోరుకు కృష్ణయ్య సంఘీభావం సాక్షి, హైదరాబాద్: బీసీ విద్యార్థులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఎనలేని సాయం చేశారని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. మంగళవారం ఇందిరా పార్కు వద్ద వైఎస్సార్ సీపీ చేపట్టిన ఫీజు పోరు మహాధర్నా శిబిరాన్ని సందర్శించి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. తాను వైఎస్సార్ను కలసి బీసీ విద్యార్థులకు కూడా న్యాయం చేయాలని కోరిన మరుక్షణమే 2008–09 విద్యా సంవత్సరంలో బీసీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేశారని, ఆయన రుణం తీర్చుకోలేనిదని అన్నారు. అనంతరం వేదికపై నుంచి ఒక్కసారిగా జోహార్ వైఎస్సార్...జోహార్ వైఎస్సార్ అంటూ ఆర్.కృష్ణయ్య నినదించారు. -
నేడు ‘ఫీజు’ పోరు
• వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో • 4వేల మందితో మహాధర్నా సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంటు పథకానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ ఆరోపించింది. అసెంబ్లీ సాక్షిగా రూ.3,068 కోట్ల ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలను గతేడాది ఏప్రిల్ 1లోగా చెల్లిస్తానన్న సీఎం కేసీఆర్ నేటికీ దాన్ని అమలు చేయలేదంది. ఇచ్చిన మాట సీఎం నిలబెట్టుకోవాలని కోరుతూ మంగళవారం ఇందిరాపార్కు వద్ద నాలుగు వేల మందితో మహాధర్నా నిర్వహిస్తు న్నామని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థు లకు కూడా ఉన్నత విద్యనందిం చాలనే ఉద్దేశంతో నాడు వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టారన్నారు. గతంలో 16 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంటు కోసం దరఖాస్తు చేసుకుంటే.. 2016–17లో ఆ సంఖ్య 12.97 లక్షలకు ఎందుకు తగ్గిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదంటూ వందలాది మంది విద్యార్థులు తమ పార్టీ కార్యాలయానికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తీరని అన్యాయం: రాఘవరెడ్డి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు ఎన్నో కల లు కన్నారని, వారం దరికీ ఫీజు రీయింబర్స్మెంటు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ తెలం గాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యా లయంలో మీడియాతో మాట్లాడారు. ఫీజులు, మెస్చార్జీలు, ఉపకార వేతనాలు సకాలంలో అందని కారణంగా ఈ ఏడాది విద్యాసంస్థల్లో 60% అడ్మిషన్లు తగ్గాయ న్నారు. యాజమాన్యాలు చేస్తున్న అవమానా లకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవా ల్సిన పరిస్థితి దాపురిస్తోందని ఆయన ఆవే దన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడలు వంచి, లక్షలాది మంది విద్యార్థుల భవి ష్యత్తు అంధకారం కాకుండా చూసేందుకు వైఎస్సార్సీపీ మంగళవారం ఉదయం 10.30కి ఇందిరాపార్కు వద్ద ఫీజుపోరు మహాధర్నా చేపట్టిందన్నారు. ఈ ధర్నాకు గట్టు శ్రీకాంత్రెడ్డి నేతృత్వం వహిస్తార న్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు డిమాండ్ నల్లగొండ టూటౌన్: ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను వెంటనే క్రమబద్ధీకరిం చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ లో శనివారం రెండవ రోజు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. క్రమబద్ధీకరణ ప్రక్రియకు కోర్టు కేసు చూపి కాలయాపన చేయడం సరికాదన్నారు. తక్కువ వేతనాలకు పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని చెప్పారు. రెగ్యులర్ లెక్చరర్లకు ఇస్తున్న వేతనాలను కాంట్రాక్టు లెక్చరర్లకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.నర్సిరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకులు చేపడుతున్న సమ్మెకు తమ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. సమ్మెకు వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి యాదయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ ఫయాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి, కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్రెడ్డి మద్దతు తెలిపారు. -
క్రైస్తవులకు అండగా ఉంటాం
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి మేళ్లచెరువు: క్రైస్తవుల కు అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు ఎస్సీ కాలనీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు సుఖసంతో షాలతో, శాంతియుత జీవనం గడుపుతూ సమాజాభివృద్ధికి పాటు పడాలన్నారు. క్రిస్టియన్లు ఎప్పుడు సహాయం అడిగినా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి క్రిస్టియన్లకు చేసిన సేవలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్చేసి చిన్నారులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్రెడ్డి, కస్తాల ముత్తయ్య, పిల్లి మరియదాసు, జడ రామకృష్ణ, పెద్ది శివ, ప్రేమానందం, పొనగండ్ల సత్యనారా యణ రెడ్డి, కలగొట్ల వెంకటేశ్వరరెడ్డి, ధనపాటి రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త జిల్లాలతో పార్టీ బలపడుతోంది
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలతో పార్టీ బలపడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీకి మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్రెడ్డి, పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్కుమార్ సమక్షంలో కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి లోకా లక్ష్మారెడ్డి తదితరులు పార్టీలో చేరారు. వారికి శ్రీకాంత్రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ లీగల్ సెల్ అధ్యక్షుడి నియామకం వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా మందాడి సరోజ్రెడ్డి నియమితులయ్యారు. అలాగే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మునిగాల కల్యాణ్రాజ్ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గట్టు శ్రీకాంత్రెడ్డి ఆయా నియామకాలు చేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. -
ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి
• వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి పిలుపు • డీసీసీబీల్లో నోట్ల మార్పిడిపై ఆంక్షలా! సాక్షి, హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ)ల్లో పెద్ద నోట్ల మార్పిడిని నిలిపివేస్తూ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) విధించిన ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నా యని, ఇది దారుణమని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం లోటస్పాండ్లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయలో పార్టీ జిల్లాల అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదట్లో దాదాపు వారం పాటు పెద్ద నోట్లను మార్పుచు కోవడానికి రైతులను అంగీకరించి ఆ తర్వాత నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మార్పిడితో పాటు తమ సొమ్మును బ్యాంకుల్లో జమ చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోవడంతో గగ్గోలు పెడుతున్నారన్నారు. ప్రస్తుతం ఆ బ్యాంకులు రబీ రుణాలను ఇచ్చే పరిస్థితి లేకుండా పోరుుందన్నారు. రాష్ట్రంలో 35 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటుండగా... అందులో 12 లక్షల మందికి డీసీసీబీకి చెందిన 272 బ్యాంకు బ్రాంచీల్లో ఖాతాలు ఉన్నాయన్నారు. రైతుల కోసమే పుట్టిన డీసీసీబీలకు రిజర్వు బ్యాంక్ పూర్తి స్వేచ్ఛను ఇచ్చి రైతుల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన, నూత నంగా ఎన్నికై న జిల్లాల నాయకత్వం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్ పథకాలే లక్ష్యంగా... దివంగత సీఎం వైఎస్సార్ తొమ్మిదేళ్ల పాలన లో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేస్తూ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పార్టీ నూతన జిల్లాల అధ్యక్షులు పనిచే యాలని గట్టు సూచించారు. పార్టీ పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని హెచ్చరిం చారు. 20 మందితో ఏర్పాటయ్యే మండల కమిటీలో అన్ని గ్రామాల నుంచి అన్ని కులాల వారికి చోటు కల్పించాలన్నారు. ఇప్పటికి 23 జిల్లాల అధ్యక్షుల నియామకం పూర్తరుుం దన్నారు. జిల్లా కమిటీల్లో 15 మందికి చోటు ఇవ్వాలని చెప్పారు. పార్టీ అభివృద్ధే తన ధ్యేయం అని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జె.మహేందర్రెడ్డి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు అమృత సాగర్, న్యాయవాదుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలెం రఘునాథరెడ్డి, టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు పర్వతరెడ్డి, బాలకృష్ణారెడ్డి, జి.రాంభూపాల్రెడ్డి, జిల్లాల అధ్యక్షులు బొడ్డు సారుునాథ్ రెడ్డి (జీహెచ్ఎంసీ), ఎం.భగవంత్రెడ్డి (నాగర్ కర్నూల్), బీస మరియమ్మ (మహబూబ్ నగర్), మద్దిరాల విష్ణువర్థన్రెడ్డి(వనపర్తి), లక్కినేని శ్రీధర్(ఖమ్మం), బి.అనిల్ కుమార్(ఆదిలాబాద్), వొడ్నాల సతీష్ (మంచిర్యాల), సుధాకర్ (కుమ్రంభీం ఆసిఫాబాద్), శాంతికుమార్ (వరంగల్ రూరల్),సంగాల ఇర్మాయ (వరంగల్ అర్బ న్), అప్పం కిషన్(జయశంకర్ భూపాలపల్లి), కాందాడి అచ్చిరెడ్డి(మహబుబాబాద్), నీలం రమేష్ (కామారెడ్డి) పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీని బలోపేతం చేయండి
► రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ►పార్టీలో సీనియర్ నాయకుడు జిలానీ చేరిక ఆదిలాబాద్ రిమ్స్/నేరడిగొండ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదిలాబాద్ జిల్లాలో బలోపేతం చేయూలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మైనార్టీ సీనియర్ నాయకుడు షేక్ జిలానీ సోమవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో గట్టు శ్రీకాంత్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేయూలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్కుమార్, జిల్లా అధికార ప్రతినిధి తడపత్రి తిలక్రావు, బోథ్ నియోజకవర్గ నాయకులు జాదవ్ ప్రవీణ్నాయక్, నేరడిగొండ, ఇచ్చోడ మండలాల కన్వీనర్లు రాజశేఖరరెడ్డి, షేక్ సాదుల్లా, యువజన నాయకుడు లింగం, తదితరులు పాల్గొన్నారు. -
నోట్ల కరువుతో రైతుల విలవిల
• 30 శాతం తగ్గిన వ్యవసాయ కొనుగోళ్లు • ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలి • వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితుల నుంచి రైతులు తేరుకోకముందే, ఇప్పుడు పెద్ద ‘నోట్ల కరువు’రైతులను విలవిలలాడేలా చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతనంగా ఎన్నికై న జిల్లాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరూ ఊహించని విధంగా పెద్ద నోట్ల రద్దు దెబ్బ రైతుల గుండెల్ని తాకిందని, రాష్ట్రంలో పెసలు, పత్తి, వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై పెద్దనోట్ల రద్దు ప్రభావం 30 శాతం పడిందని అన్నారు. నల్లధనం వెలికితీత ఆహ్వానించదగ్గ పరిణామమేనని, అరుుతే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బం దులను దృష్టిలో పెట్టుకోకపోవడం గురించే తాము మాట్లాడుతున్నామన్నారు. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని, నోట్ల దెబ్బ పేదలను, మధ్యతరగతి వారిని బాగా ఇబ్బందులకు గురి చేసిందని, ఇప్పటికీ ఆ సమస్య నుంచి ప్రజలు బయటపడలేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35.96 లక్షల మంది ‘ఆసరా’లబ్ధిదారులకు ఫించన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.395.60 కోట్లు విడుదల చేసిందని, కానీ సర్కారు నిధులిచ్చి వారం రోజులవుతున్నా.. లబ్ధిదారుల చేతికి ఫించను సొమ్ము చేరలేదని చెప్పారు. రూ.500 నోట్లు ఇంకా అందుబాటులోకి రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బ్యాంకు ల్లో ఇస్తున్న రూ.2 వేల కొత్త నోట్లు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయన్నారు. నేటికీ బ్యాం కులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద జనం బారులు తీరుతున్నారని, చిల్లర సమస్యతో చిన్న వ్యాపారాలు కుదేలయ్యాయన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలి.. కొత్తగా ఎన్నికై న పార్టీ జిల్లా అధ్యక్షులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని, క్రమశిక్షణతో నడుచుకోవాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ప్రజల్లోకి చొరవగా వెళ్లి పనిచేసే సామర్థ్యం ఉన్న వారినే నియోజకవర్గ కన్వీనర్లుగా నియమించాలన్నారు. పార్టీ జిల్లా కమిటీల ఎంపికను పూర్తి చేయాలని, మండల కమిటీలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదే సమయంలో మండల కమిటీల్లో ప్రతి గ్రామం నుంచి ఐదుగురికి చోటు కల్పించాలని తెలిపారు. జిల్లాల భౌగోళిక పరిస్థితుల్ని బట్టి ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యపై జిల్లా స్థారుు కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఎవ్వరు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా పార్టీ విధివిధానాల ప్రకారమే చేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఇన్చార్జ్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ముందుకు సాగాలన్నారు. పార్టీ జిల్లా అనుబంధ సంఘాలకు బాధ్యులను నియమించాలని సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జె.మహేందర్రెడ్డి, బోరుున్పల్లి శ్రీనివాస్రావుతో పాటు జిల్లాల అధ్యక్షులు బొడ్డు సారుునాథ్రెడ్డి(జీహెచ్ఎంసీ), బి.సుధాకర్రెడ్డి(రంగారెడ్డి), బి.శ్రీనివాస్రెడ్డి(మేడ్చల్ మల్కాజ్గిరి), జి. శ్రీధర్రెడ్డి(సంగారెడ్డి), టి.జగదీశ్వర్ గుప్తా(సిద్దిపేట్), డాక్టర్ కె.నగేష్(కరీంనగర్), సెగ్గం రాజేష్(పెద్దపల్లి), ఎ.రాజీవ్రెడ్డి(జగిత్యాల), చొక్కాల రాము(రాజన్న సిరిసిల్ల), వొడ్నాల సతీష్(మంచిర్యాల) పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో పలువురి చేరిక మంచిర్యాల జిల్లాకు చెందిన డాక్టర్ నిమ్మతోట వెంకటేశ్వర్లు, న్యాయవాది ప్రజ్యోత్ సహా 30 మంది నాయకులు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని గ్రామస్థారుు నుంచి బలోపేతం చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు వొడ్నాల సతీష్, సెగ్గం రాజేశ్, మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి రాంబాబు, జావీద్, సలీం, వంశీ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐకేపీ కేంద్రాల్లో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయాలి
• వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ • రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి మిర్యాలగూడ/ నేరేడుచర్ల: ఖరీఫ్లో రైతులు పండించిన ధాన్యం మొత్తం ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా వేముల పల్లి మండల కేంద్రంలో ఐకేపీ ధాన్యం కొను గోలు కేంద్రాన్ని పరిశీలించి, మద్దతు ధర విష యంపై రైతులతో మాట్లాడారు. అనంతరం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో విలేకరులతో మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మిల్లర్లు తక్కువ ధర చెల్లించి దోచుకుంటున్నారని ఆరోపించారు. తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో తక్కు వ ధర చెల్లిస్తున్నారన్నారు. మిల్లర్లు కూడా సిం డికేట్గా తక్కువ ధరలు చెల్లిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఐకేపీ కేంద్రాలను ఎక్కువగా ప్రారం భించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తి స్థారుు లో మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు. ఏ రోజు ధాన్యం అదేరోజు కాంటా లు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాల న్నారు. ధాన్యం విక్రరుుంచిన రైతులకు సాధ్య మైనంత త్వరగా డబ్బులు చెల్లించాలని కోరా రు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలో రబీ పంటకు నీటి విడుదల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించాలన్నా రు. గత రెండు సంవత్సరాలుగా తీవ్ర వర్షాభా వంతో సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బం దులు పడ్డారని గుర్తుచేశారు. శ్రీశైలం డ్యాంలో నీరు నిల్వ ఉన్నందున విద్యుత్ ఉత్పాదన ద్వారా సాగర్కు విడుదల చేసి ఎడమ కాల్వ పరిధిలో రబీ పంటకు సాగునీరివ్వాలని డిమాండ్ చేశారు. నవంబర్ 15 నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పి ఇంతవరకు దానిపై ఎలాంటి ప్రకటన చేయలే దన్నారు. ప్రభుత్వం వెంటనే నీటి విడుదల తేదీలను ప్రకటించాలని తెలిపారు. రాష్ట్రంలో వివిధ పార్టీల ఎమ్మెల్యే లు, నాయకులను చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలను పరిష్కరించడంలో టీఆర్ ఎస్కి లేదని విమర్శించారు. రెండున్నర సంవ త్సరాలు కావస్తున్నా పార్టీ మారిన ఎమ్మె ల్యేలపై ఇంతవరకు ఎలాంటి స్పందనలేద న్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అధికా రాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి ఎలక్షన్ కమిషన్కు ఇవ్వాలని తెలి పారు. రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతి స్తోందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్ రెడ్డి, సలీం తదితరులు పాల్గొన్నారు. -
కొత్త జిల్లాలకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుల నియామకం
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఈ క్రింద పేర్కొన్న వారిని ఆయా జిల్లాల అధ్యక్షులను నియమించడం అయింది. కొత్త జిల్లాలకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులుగా నియమకమైంది వీరే... 1.బొడ్డు సాయినాథ్ రెడ్డి ......గ్రేటర్ హైదరాబాద్ 2.బెంబడి శ్రీనివాస్ రెడ్డి..... మేడ్చల్ - మల్కాజిగిరి 3.తుమ్మలపల్లి భాస్కర్ రావు ...సూర్యాపేట 4.లక్కినేని సుధీర్.......ఖమ్మం 5.సంగాల ఇర్మియా.... వరంగల్ అర్బన్ 6.బొబ్బిలి సుధాకర్ రెడ్డి...రంగారెడ్డి 7.మాదిరెడ్డి భగవంతు రెడ్డి.... నాగర్ కర్నూల్ 8.నీలం రమేష్...........కామారెడ్డి 9.గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి.... సంగారెడ్డి 10.ఏనుగు రాజీవ్ రెడ్డి...జగిత్యాల 11.వొడ్నాల సతీష్.... మంచిర్యాల 12.బెజ్జంకి అనిల్ కుమార్.... ఆదిలాబాద్ 13.నాయుడు ప్రకాష్.... నిజామాబాద్ 14.మద్దిరాల విష్ణువర్ధన్ రెడ్డి......వనపర్తి 15.జమల్పుర్ సుధాకర్.... క్రుమంభీం-అసిఫాబాద్ 16.తడక జగదీశ్వర్ గుప్త....సిద్ధిపేట 17.అప్పం కిషన్.....జయశంకర్ భూపాలపల్లి 18.సెగ్గెం రాజేష్.......పెద్దపల్లి 19.కిందాడి అచ్చిరెడ్డి....మహబూబాబాద్ 20.నాడం శాంతికుమార్........వరంగల్ రూరల్ 21.డా.కె.నగేష్.........కరీంనగర్ 22. చొక్కాల రాము... రాజన్న-సిరిసిల్ల 23. బీస మరియమ్మ....మహబూబ్ నగర్ -
నష్టపోయిన రైతులను ఆదుకోండి
- నకిలీ విత్తన కంపెనీలపై కఠిన చర్యలు చేపట్టాలి - గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంట నష్టంపై పూర్తి వివరాలను సేకరించి రైతులకు యుద్ధ ప్రాతిపదికన సహాయం అందించాలని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాల వ్యవహారంలో వ్యవసాయ అధికారులు, విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని... రుణమాఫీలో మిగిలిపోయిన మూడు, నాలుగో విడతల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. మంగళవారం లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలకు 8 సీట్లే వస్తాయని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలిచింది, ఎంత మందిని చేర్చుకుం దో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. టీఆర్ఎస్లో చేర్చుకున్న విపక్ష ఎమ్మెల్యేలు ఎక్కడైనా, ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తే వాస్తవ పరిస్థితులు బయటపడతాయన్నారు. సంక్షేమంపై ఇంత నిర్లక్ష్యమా? పేదల ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తా రు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పేదలకు ఉచిత వైద్యం కోసం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని.. ఆయన హయాం లో ఆస్పత్రులకు నిధులు విడుదల కాకుండా సేవలు నిలిచిపోయిన సందర్భాలు ఉత్పన్నం కాలేదని గుర్తుచేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులకు లక్షల కోట్లు కేటాయిస్తూ... ఆరోగ్యశ్రీకి రూ.500 కోట్ల బకాయిలను, 14 లక్షల మంది బడుగు విద్యార్థులకు రూ.3వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎందుకు చెల్లించడం లేదన్నారు. వైఎస్సార్ 36లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చారని, గ్రామసభల్లో ఇళ్లు లేని వారు చేతులు ఎత్తితే వారికి ఇల్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం రెండు పడకల ఇళ్లు నిర్మిస్తామని చెప్పి, వాటి ఊసే మరిచిందన్నారు. సీపీఎం చేపడుతున్న పాదయాత్రను అడ్డుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ పాదయాత్రకు వైఎస్సార్సీపీ మద్దతు ఉంటుందని తెలిపారు. ఇక తమ పార్టీ కొత్త జిల్లా అధ్యక్షులు, కార్యవర్గాలను దీపావళి కల్లా ప్రకటిస్తామని చెప్పారు. -
రాష్ట్ర ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు: గట్టు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ మేరకు పత్రికా ప్రకటనలో తన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. -
మిడ్మానేరుకు గండిపై దర్యాప్తు జరపాలి
వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి మంకమ్మతోట/బోయినపల్లి: కరీంనగర్లోని మిడ్మానేర్కు గండిపడి.. వరద ప్రవాహం తో ఇసుక మేటలు పడిన పంట భూములకు ఎకరానికి రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మిడ్మానేర్ ప్రాజెక్టును సంద ర్శించి పంటలు కోల్పోయిన బాధితులను పరామర్శించి వివరాలడిగి తెలుసుకున్నారు. అలాగే, బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద గండిపడ్డ మిడ్మానేరు రిజర్వాయర్ కట్టను పరిశీలించారు. మాన్వాడ వద్ద పంట నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గట్టు మాట్లాడుతూ.. నష్టపరిహారం అందేవరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మిడ్మానేర్ ప్రాజెక్టు ముంపుకు గురై పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. అలాగే 12 ముంపు గ్రామాల నిర్వాసితులకు పూర్తి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కట్ట తెగడం వెనుక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అసమర్థత, ప్రభుత్వ వైఫల్యం కనబడుతున్నా యన్నారు. స్పిల్వే కన్నా ఎత్తులో మట్టి కట్ట నిర్మించాల్సి ఉండగా, తక్కువ ఎత్తులో నిర్మిం చడం తోనే నీటి ఉధృతికి కట్ట తెగిందన్నారు. మిడ్మానేర్ను సందర్శించిన వారిలో పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, మతీన్ ముజారుద్దీన్, బోయినపల్లి శ్రీనివాసరావు, జెన్నారెడ్డి మహేందర్రెడ్డి, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ జిల్లాల అధ్యక్షులు అక్కెనపెల్లి కుమార్, బమ్మిడి శ్రీనివాసరెడ్డి, బొడ్డు సాయినాథ్రెడ్డి, నాడెం శాంతకుమార్, అమృతసాగర్, వెల్లాల రామ్మోహన్ తదితరులు ఉన్నారు. -
‘వైఎస్ఆర్ వల్లే ప్రాజెక్టులకు జలకళ’
కరీంనగర్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం ఫలితంగానే ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లి మిడ్ మానేరు గండిని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ నేతలు గురువారం సందర్శించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మిడ్ మానేరు గండికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతులు కోరినట్లు పరిహారం చెల్లించకుంటే మిడ్ మానేరు వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఆయన హెచ్చరించారు. మన్వాడను ముంపు గ్రామంగా ప్రకటించి, 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. -
వైఎస్ఆర్ చేపట్టిన జలయజ్ఞం ఫలితంగానే..
మిడ్మానేరు ప్రాజెక్టును వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి సందర్శించారు. మిడ్మానేరుకు పడిన గండిని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మిడ్మానేరు ప్రాజెక్టుకు పడిన గండికి టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. వైఎస్ఆర్ చేపట్టిన జలయజ్ఞం ఫలితంగానే ప్రాజెక్టులకు జలకళ వచ్చిందన్నారు. వరదలతో నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాన్వాడను ముంపు గ్రామంగా ప్రకటించి.. నిర్వాసితులు కోరినట్టు పరిహారం చెల్లించాలని కోరారు. లేకుంటే రైతుల పక్షాన మిడ్మానేరు వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడుతాం హెచ్చరించారు. ఆయనతో పాటు పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శులు శివకుమార్, బోయినిపల్లి శ్రీనివాసరావు, మహేందర్రెడ్డి, మతిన్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. -
ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి: గట్టు
హైదరాబాద్:రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహానగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగి చాలా మంది ఇంకా వరదల్లోనే చిక్కుకున్నారని అన్నారు. మరోవైపు వాతావరణ శాఖ మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం సత్వరమే సహాయక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ తెలంగాణ శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది నల్లగొండ లోని దామరచర్ల, నిడమనూరు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు అక్కడి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అద్దంకి, నార్కట్ పల్లి జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని కోరారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిలంచాలని ప్రభుత్వాన్ని కోరారు. -
'పంటరుణాలను పూర్తిగా మాఫీ చేయాలి'
హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి, ఆదుకోవాల్సి బాధ్యత రాష్ట్ర సర్కారుపై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు లబోదిబోమంటున్నారని పేర్కొన్నారు. బుధవారం లోటస్ పాండ్లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాయలంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, జిల్లాల పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచార ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు చేసే సీఎం కేసీఆర్ రైతుల విషయంలో మాత్రం మానవతా దృక్పథంతో వ్యవహరించటం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి తిరిగి రుణాలు వచ్చేలా రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలు సకాలంలో పడనందున రైతులు విత్తిన విత్తనాలు మెలకెత్తలేదని, కొన్ని చోట్ల అరకొర మొలకెత్తిన ఆకాల వర్షాలకి నీట ముగిపోయాయని తెలిపారు. ఆకారణంగా నష్టపోయిన రైతాంగానికి ఇన్ఫుట్ సబ్సిడీ కింద ఎకరాకు రూ.10 వేలు చెల్లించాలని తెలిపారు. వేలాది ఎకరాలు నీట మునిగి రైతుల కన్నీరు పెడుతున్నారని చెప్పారు. 2004 తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం దిగిరాకపోతే అతిత్వరలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రాజెక్టుల యాత్ర చేయనున్నట్లు చెప్పారు. జిల్లాల వారిగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి నెలా జిల్లాల, మండలాల కార్యవర్గ సమావేశాలు తప్పక నిర్వహించాలని చెప్పారు. పార్టీ నిర్మాణ విషయాలపై దృష్టి సారించాలి... రాష్ట్రంలోని జిల్లాల అధ్యక్షులు, పార్టీ జిల్లా పరిశీలకులు, ప్రధాన కార్యదర్శులు ఇక నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా కృషి చేయాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇకపై అందరూ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. అక్టోబర్ 15 లోగా గ్రామ స్థాయి కమిటీలు, పార్టీ అన్ని అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు పూర్తి చేయాలని కోరారు. వీర జవానులకు సలాం... సభ ప్రారంభంలో ఉరీలో సైనిక శిబిరంపై ఆదివారం జరిగిన తీవ్రవాద దాడి ఘటనలో అమరులైన జవాన్లకు సమావేశం ఘన నివాళులర్పించింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. దేశం యావత్తు ఇలాంటి సమయంలో ఒకటై ముందుకు సాగాల్సి ఉందని సమావేశం అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, కె. శివకుమార్, జి. మహేందర్ రెడ్డి, మతిన్, కె. రాంభూపాల్ రెడ్డి, జిల్లాల అధ్యక్షులు మాదిరెడ్డి భగవంత్రెడ్డి (మహబూబ్ నగర్), గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి (మెదక్), బెంబడి శ్రీనివాసరెడ్డి( రంగారెడ్డి), బొడ్డు సాయినాథ్ రెడ్డి( గ్రేటర్ హైదరాబాద్), ఎం. శాంతకుమార్( వరంగల్), అక్కెనపల్లి కుమార్ ( కరీంనగర్), నాయుడు ప్రకాశ్ (నిజామాబాద్), తుమ్మలపల్లి భాస్కర్ (నల్లగొండ), మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమృత సాగర్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్ష నర్రా బిక్షపతి, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సమావేశమైంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, గ్రామస్థాయి నుంచి కమిటీల నియామకంపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఇంచార్జ్లు హాజరయ్యారు. -
వైఎస్సార్సీపీలో పదవుల నియామకం
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీలో పలు పదవుల నియామకం చేపట్టింది. రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ పదవితో పాటు ఐటీ విభాగంలో పలువురు నాయకులను నియమించింది. ఈ మేరకు శనివారం వైఎస్సార్ సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. లీగల్ సెల్ కన్వీనర్గా పాలెం రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. చాలా ఏళ్లుగా పాలెం రఘునాథ్ రెడ్డి దివంగత సీఎం వైఎస్ఆర్ కుటుంబీకులను విధేయుడిగా ఉంటూ వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లి, పార్టీ అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తానని చెప్పారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కటుకూరి సురేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా బాదం నరేష్ గుప్త, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా పేరం నవీన్ కుమార్, మునగాల జగన్మోహన్ రెడ్డి, వరంగల్ జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడుగా సి. హరికృష్ణారెడ్డిలను నియమిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం అధ్యక్షుడు శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు. -
వైఎస్సార్సీపీ కమిటీల్లో నియామకాలు
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వివిధ కమిటీల్లో పలువురి నాయకులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు జరిపినట్లు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డా.గట్టు శ్రీకాంత్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మేడేపల్లి శంకర్, కార్యదర్శులుగా చొక్కాల రాము, జాల మహేశ్ యాదవ్ నియమితులయ్యారు. రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఎం.వి.రమణ, నల్లగొండ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా పి. మేసయ్యనాయక్లను నియమించారు. పార్టీ రాష్ట్ర ప్రైవేట్ లెక్చరర్లు, టీచర్ల ఫోరం కమిటీ ప్రధాన కార్యదర్శిగా కొర్ర కిషన్నాయక్, సంయుక్త కార్యదర్శిగా రావూరి వినోద్కుమార్, సలహాదారుగా సంగం గోపాలస్వామి, ప్రచార కార్యదర్శులుగా ఎ. శ్రీనివాస్, రాపాక ప్రమోద్, కోశాధికారిగా ఉట్టలూర్ గోపాలచారి, ఆర్గనైజేషన్ కార్యదర్శిగా నూకల వెంకట్రెడ్డిలను నియమించారు. కొత్తగా నియమితులైన నాయకులకు గట్టు శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. -
ఎస్ఐ ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలి
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి మఠంపల్లి: మెదక్ జిల్లా కుకునూరుపల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై ఐపీఎస్ అధికారిచే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలంలోని బక్కమంతులగూడెంలో రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులను శ్రీకాంత్రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ విధానం అమలు చేస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆ శాఖలోని పోలీసులే అధికారుల వేధింపులతో ఆత్మహత్యలకు పాల్పడుతుండటం శోచనీయమన్నారు. రామకృష్ణారెడ్డి మృతికి కారకులైన వారికి మెమోలిస్తూ, ఎటాచ్లు చేస్తూ కాలం గడపకుండా వారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబా న్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడించి రామకృష్ణారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేందుకు పార్టీ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్రెడ్డి, కోడి మల్లయ్యయాదవ్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కర్నె వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కస్తాల ముత్త య్య, యూత్విభాగం రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఐ ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలి
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి మఠంపల్లి: మెదక్ జిల్లా కుకునూరుపల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై ఐపీఎస్ అధికారిచే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలంలోని బక్కమంతులగూడెంలో రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులను శ్రీకాంత్రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ విధానం అమలు చేస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆ శాఖలోని పోలీసులే అధికారుల వేధింపులతో ఆత్మహత్యలకు పాల్పడుతుండటం శోచనీయమన్నారు. రామకృష్ణారెడ్డి మృతికి కారకులైన వారికి మెమోలిస్తూ, ఎటాచ్లు చేస్తూ కాలం గడపకుండా వారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబా న్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడించి రామకృష్ణారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేందుకు పార్టీ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్రెడ్డి, కోడి మల్లయ్యయాదవ్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కర్నె వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కస్తాల ముత్త య్య, యూత్విభాగం రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో పదవుల నియామకం
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీలో పలు పదవుల నియామకం చేపట్టింది. రాష్ట్ర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా మందడపు వెంకటరామిరెడ్డి, అలస్యం సుధాకర్, వేమారెడ్డి శ్రీనివాస్రెడ్డి, మందాడపు వెంకటేశ్వర్లు, జిల్లపల్లి సైదులు, కొల్ల వెంకట్రెడ్డి లను నియమించింది. సంయుక్త కార్యదర్శులుగా బండ్ల సోమిరెడ్డి, తుమ్మటి నర్సిరెడ్డి, వనమారెడ్డి నాగిరెడ్డి, పులి సైదులు, కుర్సమ్ సత్యనారాయణలు నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఈ నియామకాలు జరిపినట్లు తెలిపారు. పదవులకు ఎంపికైన వారిని గట్టు శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. -
గట్టు శ్రీకాంత్రెడ్డికి అస్వస్థత
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి శనివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదర్గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా అఖిలపక్ష సమావేశానికి వైఎస్ఆర్ సీపీని ఆహ్వానించకపోవడంపై ళ టీఎస్-వైఎస్ఆర్ సీపీ ఇవా ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో గట్టు శ్రీకాంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటీన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా తెలంగాణ జిల్లాల పునర్విభజనపై ఈ రోజు సీఎం కేసీఆర్ నేతృత్వంలో అఖిలపక్షం సమావేశం జరుగనుంది. -
'కేసీఆర్ పాలన బూటకం'
హైదరాబాద్ : కేసీఆర్ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు నిప్పులు చెరిగారు. జిల్లాల పునర్ విభజనపై శనివారం హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అఖిల పక్షం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆహ్వానించలేదు. దీంతో ఆగ్రహించిన వైఎస్ఆర్ సీపీ నేతలు గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండ రాఘవరెడ్డి, శివకుమార్ తదితరులు ట్యాంక్బండ సమీపంలోని బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేసీఆర్ పాలన బూటకమని ఆరోపించారు. రాజకీయ దురద్దేశంతోనే కేసీఆర్ జిల్లాలను పునర్ విభజన చేస్తున్నారని విమర్శించారు. జిల్లాల పునర్ విభజన అంశం కోర్టుల్లో నిలబడదన్నారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుని సిగ్గుమాలిన చర్యలకు పాల్పడ్డారంటూ కేసీఆర్పై పార్ట నేతలు మండిపడ్డారు. మీకు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ నేతలకు గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండ రాఘవరెడ్డి, శివకుమార్ సవాల్ విసిరారు. -
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటం
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సమావేశంలో గట్టు శ్రీకాంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వీటి పరిష్కారానికి పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. విద్యార్థి వ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తం గా విద్యార్థులు సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కె.విశ్వనాథాచారికి శ్రీకాంత్రెడ్డి నియామకపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పేద విద్యార్థులు ఉన్నత చదవులు అభ్యసించాలని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశించారని, ఎన్నో కష్టనష్టాలకోర్చి ఫీజు రీయింబర్స్మెంట్ను విజయవంతంగా అమలు చేశారని గుర్తుచేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన పాలకులు రీయిం బర్స్మెంట్కి తూట్లు పొడిచారన్నారు. వివిధ పరీక్షలను నిర్వహించటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అందుబాటులో ఉన్న ఉన్నత, సాంకేతిక విద్యను నేటి పాలకులు అందని ద్రాక్ష చేశారన్నారు. విశ్వనాథాచారి మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాల సాధనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో కృషి చేస్తానన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాడతామన్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ర్యాలీగా వచ్చిన విద్యార్థులు కార్యాలయం వద్ద పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు నల్లా సూర్యప్రకాశ్, రెహమాన్, బొడ్డు సాయినాథ్రెడ్డి, కె.శివకుమార్, కొండా రాఘవరెడ్డి, విద్యార్థి నాయకులు నవీన్కుమార్, ఉదయ్రెడ్డి, కిరణ్బాబు, హనుమంతరెడ్డి, రంజిత్, జగదీశ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ పదవుల నియామకం
హైదరాబాద్: తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు విభాగాల్లో నేతలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా బోయినపల్లి శ్రీనివాసరావు, గుండెరెడ్డి రాంభూపాల్ రెడ్డిని నియమించింది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన పారిపెల్లి వేణుగోపాల్ రెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా అదే జిల్లాకు చెందిన నందమల్ల నరేష్ ను నియమించబడ్డారు. రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులుగా రంగారెడ్డి జిల్లాకు కె.విశ్వనాథ్ చారిని నియమించింది. కొత్తగా నియమించబడిన నేతలకు పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. -
ముస్లింలకు వైఎస్ చేసిన మేలు మరువలేనిది
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ముస్లిం మైనార్టీలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేసిన మేలు మరువలేనిదని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ మైనార్టీ విభాగం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్దేనని గట్టు కొనియాడారు. రంజాన్ మాసం ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నప్పుడు ముస్లిం లకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని, కానీ ఆ హామీ ఒక్క అంగుళం కూడా ముందుకు కదల దని విమర్శించారు. వైఎస్సార్ ఏదైనా చేతల్లో చూపించేవారన్నారు.కానీ.. ఆయన తరువాత వచ్చిన సీఎంలు మాటలు తప్ప చేతలు లేవన్నారు. మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ మాట్లాడుతూ... వైఎస్సార్ సీఎంగా ఉన్న ఉమ్మడి ఏపీలో తప్ప కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాల్లోనూ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అందించలేదన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ... ముస్లింలు అభివృద్ధి చెందాలంటే తెలంగాణలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మైనార్టీ విభాగం కమిటీలు 60 శాతం పూర్తయ్యాయని, మిగిలినవి త్వరలో పూర్తి చేస్తామని వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు మతీన్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ రిజ్వాన్ హుస్సేన్ తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ మైనార్టీ విభాగం నాయకులు నౌఫిల్, న శ్రీన్, నజీర్, ఇబ్రహీం, జమీర్, జిల్లాల మైనార్టీ విభాగం అధ్యక్షులు అజీజ్ (హైదారాబాద్), సలీమ్ (కరీంనగర్), హైదర్ అలీ (మహబూబ్ నగర్), ఫయాజ్ (నల్గొండ), కరీం(రంగారెడ్డి జిల్లా) తదితరులు పాల్గొన్నారు. -
26 నెలల పాలనలో 16 సార్లు మొట్టికాయలు
* టీఆర్ఎస్పై వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఫైర్ * జీవో 123ని కొట్టివేసినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శ * అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ 26 నెలల పాలనలో హైకోర్టు 16 సార్లు మొట్టికాయలు వేసిందని.. ఆయా జీవోలు, నిర్ణయాలను తప్పుబట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది టీఆర్ఎస్ సర్కారుకు సిగ్గుచేటని పేర్కొన్నారు. జీవో 123ను కొట్టివేయడంపై అప్పీలుకు వెళతామనడం ఎందుకని ప్రశ్నించారు. ప్రాజెక్టుల కోసం రైతులు, ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం హైదరాబాద్లోని లోటస్పాండ్లో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గట్టు శ్రీకాంత్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బంగారు తెలంగాణ అంటే రైతుల కడుపు నింపేలా ఉండాలే తప్ప కడుపు కొట్టేలా ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు తమ తీర్పుల ద్వారా ఒకరకంగా ప్రభుత్వాన్ని అభిశంసించే తీరులో వ్యాఖ్యానాలు చేసినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేదని విమర్శించారు. భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా ఇతర మార్గాల్లో భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే తమ పార్టీ అడ్డుకుంటుందన్నారు. అవసరమైతే ఎంత స్థాయి వరకైనా పోరాడుతామని చెప్పారు. రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తామని ప్రభుత్వం ఘనంగా ప్రకటించిందని.. కానీ ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వస్తోందని విమర్శించారు. ప్రభుత్వం నిబద్ధతతో పనిచేయకుండా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పోవడం సరికాదని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు లాఠీలు, తూటాలతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అదేదారిలో సాగుతోందని విమర్శించారు. 26 నెలల్లో ఒక్క ప్రాజెక్టు చేపట్టారా? గత 26 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక్క ప్రాజెక్టునైనా పూర్తిచేసి, అదనంగా ఒక్క టీఎంసీ నీటినైనా పొలాలకు పారించారా అని గట్టు శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టుల ద్వారానే ఇప్పుడు నీళ్లు వస్తున్న విషయం గ్రహించాలని సూచించారు. ప్రాజెక్టుల విషయంలో వైఎస్సార్సీపీ పూర్తి మద్దతునిస్తుందని చెప్పారు. ‘ప్రతి చెయ్యికి పని, ప్రతి చేనుకు నీరు’ అనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి జరిపిన కృషి మరవలేనిదని పేర్కొన్నారు. -
'హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు'
హైదరాబాద్: 'తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ జీవోలు 123, 124 లను హైకోర్టు కొట్టివేయడం ప్రభుత్వానికి చెంపపెట్టు' అని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ప్రజావ్యతిరేక విధానాలపై న్యాయస్థానం వెలువరించిన తీర్పు హర్షనీయమన్నారు. ఇది రైతుల విజయంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ పీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జీవో 123, 124 లను హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇది రైతులు, రైతు కూలీల విజయమన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని ఉత్తమ్ సూచించారు. కాగా, ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం, చెల్లింపులపై గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోలను తెచ్చింది. అయితే ఈ జీవోలను సవాల్ చేస్తూ కరీంనగర్ జిల్లా రుద్రంగి రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రైతుల నుంచి నేరుగా భూమిని సేకరించేందుకు ఏర్పాటు చేసిన జీవోలలో అనేక లోపాలున్నట్లు రైతులు హైకోర్టుకు విన్నవించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. 123, 124 జీవోలను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
రాజకీయాల్లో మహిళలు కీలకంగా మారాలి
వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో మహిళలు ప్రధాన భూమిక పోషించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా గాం ధీ, మనతా బెనర్జీ, జయలలితలు నిరంతరం ప్రజా సమస్యలపై పోరు సల్పి తిరుగులేని నేతలుగా ఎదిగిన విషయం, 1,600 కి.మీ. పాదయాత్ర చేసిన షర్మిల పట్టుదలను మహి ళా కార్యకర్తలు గుర్తు చేసుకోవాలన్నారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లోని మహిళా విభాగం బాధ్యతలు నిర్వర్తించేవారు ఇల్లిల్లూ తిరిగి కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలు పడుతున్న బాధలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు. మహానేత వైఎస్సార్ మహిళల సాధికారత కోసం పడ్డ కష్టం ఏ ముఖ్యమంత్రీ పడలేదన్నారు. మహిళల అభ్యున్నతి కోసం పావలా వడ్డీ రుణాలు తీసుకువచ్చారని తెలిపారు. ఇప్పుడు బలహీన వర్గాల కోసం సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన కల్యాణ లక్ష్మి పథకం బ్రోకర్ల పాలైందన్నారు. రాష్ట్రంలో మహిళలను జాగృతం చేసేందుకు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం తీవ్రంగా కృషి చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కె. అమృత సాగర్ మాట్లాడుతూ మహిళలు కనిపిస్తే ‘ఈ గ్రామ పంచాయతీ’ల్లో 10 వేల మంది మహిళలకు ఉద్యోగాలు అని మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నారన్నారు. ఇప్పటి వరకు ఈ గ్రామ పంచాయతీల్లో ఎంతమంది మహిళలకు ఉద్యోగాలిచ్చారో మంత్రి కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చైన్ స్నాచర్లు విజృంభిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల కు రక్షణ కరువైందని వాపోయారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వర్గంలో ఒక్క మహిళకూ స్థానం లేదన్నారు. మహిళలకు మేలు చేసే పథకాలు కేసీఆర్ ఒక్కటి కూడా తీసుకురాలేక పోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రేటర్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎం శ్యామల, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల మహిళా విభాగాల అధ్యక్షురాళ్లు ఇందిర, బి. పద్మ, పలువురు రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
మల్లన్నసాగర్పై అఖిలపక్షం ఏర్పాటు చేయండి
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు డిమాండ్ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మల్లన్నసాగర్ ప్రాజెక్టు రీ డిజైన్పై సీఎం ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్షంతో చర్చిం చకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా రాత్రికిరాత్రి డిజైన్లు మార్చ డం, జీవోలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిం చారు. నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జీని, రైతులకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ సహా ఇతర పార్టీల నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. సోమవారం లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లాఠీలు, తూటాలతో పొలాల్లోకి నీళ్లు రావన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని హితవు పలికారు. రైతులు కోరుకున్న విధంగా భూసేకరణ చట్టం-2013 లేదా జీవో 123 ప్రకారం పరిహారమిస్తామన్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ప్రాజెక్టులకు మా పార్టీ పూర్తి మద్దతునిస్తుంది. అయితే నిర్వాసితులకు అన్ని ప్రయోజనాలు చేకూర్చాలి. రైతుల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చి, ఉపాధి కోల్పోయిన వారికి పనులు క ల్పించాలి. ఇళ్లు, ఆర్ఓఆర్ ప్యాకేజీని నిర్ణీత కాల వ్యవధితో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలా..? గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను పెట్టి రైతుల భూములను రిజిస్టర్ చేయించడాన్ని శ్రీకాంత్రెడ్డి తప్పుపట్టారు. రైతుకు జీవనాధారమైన పొలాన్ని లాక్కుంటూ పరిహారం అందించకపోవడం ఏం న్యాయమని ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయన్నారు. నాడు వైఎస్ తీసుకున్న చర్యల వల్లే ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల నుంచి నీళ్లు వస్తున్నాయని గుర్తుచేశారు. రైతన్నల కడుపు కొట్టిన ప్రభుత్వాలు ఏవీ మనలేవని, వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు సర్కారు బషీర్బాగ్లో కాల్పులకు పాల్పడితే ఏమైందో గుర్తుంచుకోవాలన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి ఆరునెలల ఆలస్యంగా ప్రాజెక్టును ప్రారంభించినా ఏమీ కాదని పేర్కొన్నారు. సీఎం సొంత జిల్లా మెదక్లోనే 600 మంది రైతులు ఆత్మహత్యల బారిన పడ్డారని, అయితే వారిలో కనీసం 60 మందికి కూడా పరిహారం అందించలేదన్నారు. -
సర్కార్కు చిత్తశుద్ధిఉందా..!
రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మల్లన్నసాగర్ ప్రాజెక్టు రీ డిజైన్పై సీఎం కే సీఆర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసి ఆయా అంశాలపై చర్చించాలని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు డా. గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్చేశారు. ఈ ప్రాజెక్టుపై అఖిలపక్షంతో చర్చించకుండా, గ్రామసభలు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా రాత్రికి రాత్రి డి జైన్లు మార్చడం, జీవోలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. నిర్వాసితులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జీ చేయడాన్ని, రైతులకు మద్దతునిస్తున్న వైఎస్సార్సీపీతో సహా ఇతరపార్టీల నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. మళ్లీ ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. లాఠీలు, తూటాలతో పొలాల్లోకి నీళ్లు రావన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని హితవుపలికారు. రైతులు కోరుకున్న విధంగా కేంద్ర భూసేకరణ చట్టం, 2013 లేదా జీవో 123 ప్రకారం పరిహారమిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్రావు ప్రకటించి అందుకు భిన్నంగా వ్యవహరించడ ఏమిటని నిలదీశారు. తమ పార్టీ ప్రాజెక్టులకు పూర్తి మద్దతునిస్తుందని, అయితే నిర్వాసితులకు అన్ని ప్రయోజనాలు చేకూర్చి, రైతుల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చి, ఉపాధి కోల్పోయిన వారికి పనులు కల్పించి, ఇళ్లు, ఆర్ఓఆర్ ప్యాకేజీని నిర్ణీత కాలవ్యవధితో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. సోమవారం లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను పెట్టి రైతుల భూములను రిజిష్టర్ చేయించడాన్ని తప్పుబట్టారు. రైతుకు ఉపాధినిచ్చేది అతని పొలమేనని, దానిని లాక్కుంటూ తగిన పరిహారం అందించకపోవడం ఏమి న్యాయమని ప్రశ్నించారు. భూమిని తీసుకునే విషయంలో రైతులను సంతృప్తిపరిచే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని, గ్రామస్థాయికి ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. జలయజ్ఞానికి సంబంధించి మహానేత డా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తీసుకున్న చర్యల ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయన్నారు. వైఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగానే ఇప్పుడు మహబూబ్నగర్జిల్లాలోని ప్రాజెక్టుల నుంచి నీళ్లు వస్తున్నాయన్నారు. రైతన్నల కడుపుకొట్టిన ప్రభుత్వాలు ఏవి మనలేదన్న విషయాన్ని గ్రహించాలని, వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం బషీర్బాగ్లో కాల్పులకు పాల్పడితే ఏమైందో గుర్తుంచుకోవాలని, లాఠీచార్జీలకు పాల్పడి తూటాలు పేల్చితే ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుందనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. నిర్వాసితులను బలవంతంగా వెళ్లగొట్టే చర్యలను మానుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించి ఆరునెలల ఆలస్యంగా ప్రాజెక్టును ప్రారంభించినా ఏమీ కాదని హితవుపలికారు. సీఎం సొంతజిల్లా మెదక్లోనే 600 మంది రైతులు ఆత్మహత్యల బారిన పడితే వారిలో కనీసం 60 మందికి కూడా పరిహారం అందించకపోవడం సిగ్గుచేటని గట్టు శ్రీకాంత్రెడ్డి వ్యాఖ్యానించారు. -
హక్కుల కోసం ధర్నా చేస్తే లాఠీఛార్జ్
-
ఫిల్మ్ నగర్ క్లబ్ ఫర్నీచర్ ధ్వంసం
-
ఫిల్మ్ నగర్ క్లబ్ ఫర్నీచర్ ధ్వంసం
హైదరాబాద్: అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపడుతూ ఇద్దరు కార్మికులు మృతి చెందడానికి కారణమైన ఫిల్మ్ నగర్ క్లబ్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చాంబర్లోకి దూసుకెళ్లిన కార్యకర్తలు ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో మాజీ ఎమ్మెల్యే కే లక్ష్మారెడ్డి వాగ్వాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుతో పాటు యూత్ కాంగ్రెస్ నేత అనిల్, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని.. లేదంటే నిరాహారదీక్ష చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఫిల్మ్ నగర్ ఘటనలో మృతులకు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ సంతాపం తెలిపింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని టీవైఎస్ఆర్ సీపీ అధ్యక్షడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.