బంగారు తెలంగాణ కోసం మరో పోరాటం: గట్టు | Gattu srikanth reddy comments on TRS | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణ కోసం మరో పోరాటం: గట్టు

Published Sat, Jun 3 2017 3:50 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

మూడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో స్కీములను మించిన భూస్కాములు తప్ప మరేమీ కనబడటంలేదని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.

సాక్షి, హైదరాబాద్‌: మూడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో స్కీములను మించిన భూస్కాములు తప్ప మరేమీ కనబడటంలేదని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ సాధన పోరాటం నీళ్లు, నిధులు, నియామకాలపై జరిగితే.. వాటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. గట్టు జాతీయ పతాకాన్ని ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టిన మూడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనను గుర్తు చేసుకుని బంగారు తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలన్నారు.

రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తే చుక్క నీరు లేదన్నారు. కమీషన్ల కోసం నీటి ప్రాజెక్టులను భారీగా తలపెట్టిందని, దాన్ని మించి భూస్కాములు బయటకు వస్తున్నాయని ధ్వజమెత్తారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమృతసాగర్, గ్రేటర్‌ పార్టీ అధ్యక్షుడు బొడ్డు సాయినా థ్‌రెడ్డి, సేవాదల్‌ అధ్యక్షుడు బండారు వెంకటరమణ, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎన్‌ రవికుమార్, ఐటీ అధ్యక్షుడు శ్రీవర్ధన్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథాచారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement