christians
-
సాంత్వననిచ్చే గొంతులు
అంతా నిన్ననే జరిగినట్లుంది. జ్ఞాపకం ఏమాత్రం మసకబారలేదు. ఫాదర్ టెర్రీని నేను మొదటిసారి కలిసి దాదాపు 45 ఏళ్ల య్యింది. అది 1982. వేసవి కాలం చివరి రోజులు. నిషా, నేను పెళ్లి చేసుకోబోతున్నాం. మా రెండు జీవితాలు ఒక్కటి కాబో తున్నాయి. తను క్యాథలిక్కు. అన్ని లాంఛ నాలతో చర్చిలో పెళ్లి జరగాలని ఆమె కోరిక. నాకూ అభ్యంతరం లేదు. కాకుంటే చర్చి మతాధికారిని మూడుసార్లు కలిసి పెళ్లి ట్యూషన్ చెప్పించుకోడం ఒక్కటే నాకు నచ్చలేదు. అలా చేస్తేనే నిషాకు నాన్–క్రిష్టియన్ అయిన నాతో పెళ్లి జరుగుతుంది. ఈశాన్య ఇంగ్లాండ్లోని నార్తంబర్లాండ్ ఎవెన్యూలోని సెయింట్ మేరీ మాగ్దలీన్ చర్చి నిబంధన అలా ఉంది. కాబట్టి ఒప్పుకోక తప్పలేదు. సెప్టెంబరు నెలలో ఒక శనివారం నేను, నిషా కలిసి ఫాదర్ టెర్రీ దగ్గరకు వెళ్లాం. అప్పుడు సమయం సరిగ్గా సాయంత్రం 6 గంటలు. ఆయన డెస్క్ వెనుక కూర్చుని ఉన్నారు. గది చివరన ఎదురుగా ఉన్న పాత లెదర్ సోఫా మీద మేం కూర్చున్నాం. ముక్కు మీదకు జారిన కళ్లజోడు పైనుంచి ఆయన మమ్మల్ని నిశితంగా గమనిస్తున్నారు. బయట వేడిగా ఉన్నా ఆ గదిలో వాతావరణం ఎందుకో బాగా చల్లగా ఉంది. ‘‘షెర్రీ తీసుకుంటారా?’’ ఫాదర్ చేసిన ఆఫర్ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘ మీ ఇద్దరి సంగతి నాకు తెలియదు. నాకు మాత్రం షెర్రీ వైన్ చాలా ఇష్టం’’ అన్నాడాయన. ఆయన ఇచ్చిన టియో పెపే నా ఫేవరైట్ బ్రాండ్. ఫాదర్ టెర్రీకి ఎన్నో విషయాల్లో మంచి పరి జ్ఞానం ఉంది. వివేచనశీలి. కాసేపట్లోనే మేం బాగా దగ్గరయ్యాం. యూఎస్ ఓపెన్ టెన్నిస్, నాటింగ్ హిల్ కార్నివాల్, సల్మాన్ రష్దీ ‘మిడ్నైట్స్ చిల్డ్రెన్’ నవల... మా మధ్య చర్చకు వచ్చాయి. విశేష మేమిటంటే... మా పెళ్లి ఎలా జరగాలి, మాకు పుట్టబోయే పిల్లలు ఏ మతం స్వీకరించాల్సి ఉంటుంది వంటి అసలు విషయాలు మినహా అన్నీ చర్చించాం. ఫాదర్ టెర్రీ జారిపోతున్న కళ్ల జోడును వెనక్కు ఎగదోసుకుంటూ సంభాషణను చక్కగా ఎంజాయ్ చేశారు. గంట సేపు ఇట్టే గడచిపోయింది. వచ్చే వారం మళ్లీ కలవాలనుకున్నాం. ఇక మేము సెలవు తీసుకుని అలా తలుపు వద్దకు వెళ్లామో లేదో ఫాదర్ మమ్మల్ని ఆపేశారు. ‘మీరు విడివిడిగా ఎందుకు ఉంటున్నారు?’ అంటూ బాంబు లాంటి ఒక ప్రశ్న కూల్గా అడిగారు. అలా అడుగుతున్నప్పుడు, ఆయన గుండ్రటి ముఖం మీద చిరుదరహాసం మెరిసింది. దాంతో మా ముఖాలు లిప్తపాటు రక్తవిహీనం అయ్యాయి. నోట మాట రాలేదు. వాస్తవం ఏమిటంటే, మేం అప్పటికే సహజీవనం చేస్తున్నాం. కానీ ఆ విషయం దాచిపెట్టి, ఫాదర్ టెర్రీకి మేము వేరు వేరు చోట్ల ఉంటు న్నట్లు అడ్రస్లు ఇచ్చాం. ఆయన ఆ విషయం పసిగట్టారు. అయినా అదేమంత పెద్ద విషయం కాదులే అంటూ మమ్మల్ని ఆ ఇరకాటం నుంచి బయట పడేశారు. అలా ఉండేది ఆయన సరళి. ఫాదర్ టెర్రీ మాకు త్వరలోనే ఆప్తమిత్రుడయ్యారు. మా పెళ్లికి రెండు రోజుల ముందు ఒక రిహార్సల్ జరిగింది. పెళ్లిలో భగవద్గీత నుంచి ఏవైనా రెండు మంచి మాటలు చదవాలని ఆ సందర్భంగా ఆయన సూచించారు. ఆ ఎంపిక బాధ్యత నా మీదే పెట్టారు. తీరా ఆ సమయం వచ్చేసరికి నేను చేతులెత్తేశాను. ‘మరేం ఫర్లేదులే, ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించి వేరొకటి రెడీగా పెట్టుకున్నా’ అంటూ నవ్వి మృదువుగా నా వీపు చరిచారు. ఆయన ఎంపిక చేసుకున్న పేరా ఖలీల్ జిబ్రాన్ ‘ప్రాఫెట్’ లోనిది.పెళ్లి సందర్భంగా ఫాదర్ టెర్రీ చేసిన ఉపదేశం అందరినీ ఆకట్టుకుంది. నరకం, దేవుడు, దేవుడి మంచితనం... వంటి పెద్ద మాటలను పక్కన పెట్టారు. ఐ లవ్ యూ అనే ‘మూడే మూడు చిన్న మాటలు’ చెప్పారు.‘నేను, నువ్వు అనే భేదాన్ని ప్రేమ చెరిపేస్తుంది... అలాగే అది ఆ రెంటినీ విడదీస్తుంది కూడా! కరణ్, నిషా... మీరు ఈ సత్యం గుర్తు పెట్టుకోవాలి. మీరు ఇద్దరు విభిన్న వ్యక్తులు అనే వాస్తవాన్ని మర్చి పోయిన రోజు ఆ బంధం కూడా వేర్పడిపోతుంది.’’ఈ ప్రవచనం ఆర్భాటం లేకుండా ఇష్టాగోష్ఠిలా సాగింది. స్నేహ పూర్వకమైన ఆయన సందేశం మర్చిపోలేనిది. పాతికేళ్లుగా అది నా జ్ఞాపకాల్లో మసకబారకుండా నిలిచిపోయింది.ఆరేళ్ల తర్వాత... నిషా తన ఆఖరు ఘడియల్లో లైఫ్ సపోర్ట్ మీద ఉన్నప్పుడు ఫాదర్ టెర్రీ ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకు మత కర్మలు నిర్వహించారు. అంతే కాకుండా, మా అమ్మను కూడా నిషా చెవిలో హిందూ పుణ్యవచనాలు వినిపించవల్సిందిగా కోరారు. చివరకు నిషా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్న క్షణాల్లో కూడా ఫాదర్ టెర్రీ నా పక్కనే ఉన్నారు. నాకు తెలిసిన ఒకే ఒక క్రైస్తవ మతాచార్యుడు టెర్రీ గిల్ఫెడర్! ఆయన అసాధారణమైన గొప్ప వ్యక్తి. క్రైస్తవుల మీద, ముస్లిముల మీద దాడులు జరిగాయన్న వార్తలు చదివిన ప్రతిసారీ నేను ఆయనను తలచుకుంటాను. గాయపడిన హృదయాలకు సాంత్వన చేకూర్చేందుకు ఫాదర్ టెర్రీ వద్ద ఎప్పుడూ కొన్ని మాటల దివ్యౌ షధాలు ఉండి తీరుతాయి. ఆయన ఆఫర్ చేసే షెర్రీ వారికి ఉపక రిస్తుంది.ఫాదర్ టెర్రీలు ప్రతి మతంలోనూ ఉంటారు. దైవమే పరమావధిగా భావించేవారు సాటి మానవులను ప్రేమపూర్వకంగా అర్థం చేసుకోగలరు. మనకు అలాంటి వారి అవసరం నేడుఎంతగానో ఉంది. అయినా వారెవరూ ఎందుకు నోరు మెదపడం లేదు?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రభుయేసు ఆగమనం
విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాస సమాజం యేసుప్రభువు వారి జన్మదినం జరుపుకొనేందుకు నాలుగువారాలు ముందస్తుగా ‘క్రిస్మస్’ వేడుకలు ప్రారంభిస్తున్నారు. దీనినే ‘అడ్వెంట్’ అంటారు. అనగా ఆగమనం/రాకడ/ఆహ్వానం పలుకుటకు ముందస్తుగా ఏర్పాట్లు ప్రారంభించి, డిసెంబరు 24 సాయంత్రంతో ముగిస్తారు.దేవకుమారుడైన యేసుక్రీస్తు ఆగమనానికి ముందస్తు క్రైస్తవ విశ్వాస సమాజం ప్రార్థనలోను, సంఘ సహవాసంతోను కలిసి దేవుని వాక్యానుసారంగా ప్రార్థించుటకు ‘దేవుని మందిరమైన’ సంఘంలో పాల్గొని ‘క్రిస్మస్’ డిసెంబరు 25న క్రీస్తు జన్మదినం కొరకు సిద్ధపడటమే ‘అడ్వంట్’. చీకటిరాత్రి తొలగి అరుణోదయ కాంతి రావటమే ప్రధానాంశం.క్రీ.పూ. 5వ శతాబ్ద కాలంలో ‘మాలకీ’ అనే దేవుని దూత చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు అనగా ప్రవాసులుగా భూమియంతట చెందినవారిని, నిస్సహాయక స్థితిలో ఉన్న వారిని భయభక్తులు కలిగి వుండాలని సందేశిమిచ్చాడు. కానీ వారిని భయభ్రాంతుల నిమిత్తం కాదన్నది వాక్యభావం, అందులో ప్రాముఖ్యంగా నియామ ఏకదినము, చిగురపుట్టను అన్న వచనాలు బలపరుస్తూ క్రీ.పూ 742–687 సంవత్సకాలంలో సింధూర వృక్షం నరకబడిన దానిమొద్దులోనుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టునన్న వాక్యం దావీదు వంశావళిలో శాంతి, సమాధానాది ప్రదాతయైన యేసుప్రభువువారు జన్మించునని ముందస్తుగానే ప్రవచించారని వాక్యం స్పష్టీకరించుచున్నది. మలాకీ కాలం క్రీ.పూ. 5వ శతాబ్దం (మలాకీ 4 :1 –6; యెషయా 6 : 13).ఈ ముందస్తు క్రీస్తు ప్రభువువారి జన్మదిన సిద్ధపాటులో ప్రజలు లేక పెండ్లి విందుకు ఆహ్వానించినవారిలో కొందరు బుద్ధిమంతులు వుంటారని, మరికొందరు బుద్ధిహీనులుగా వుంటారని పెండ్లి కుమారుడు వచ్చేవరకు వేచి వున్న బుద్ధిమంతుల దీపము అనగా భక్తిపరులుగా వాక్యానుసారంగా ఎదురుచూస్తారని ఏల అనగా వారి దీపములలో అనగా భక్తిలో నూనెతో సిద్ధపడతారని, (‘నూనె’ భక్తికి సాదృశ్యం), బుద్ధిహీనులు దానికి బదులుగా విరుద్ధమైన సిద్ధపాటు పడతారని వారు బుద్ధిహీనులని యేసుప్రభువులవారు ఇశ్రాయేలీయుల ప్రజలతో ఉపమాన రీతిలో బోధించారని ఈ వాక్యం తెలియజేస్తున్న పరమార్థం (మత్తయి 5 :1–13).కనుక ముందస్తు ఆగమనం కొరకు ఎదురుచూసేవారు ఈ నాలుగువారాలు సంఘము నియమింపబడిన సమయంలో భక్తిపూర్వకంగా వాక్యానుసారమైన ప్రార్థన, సంఘ సహవాసంతో కలిసి ప్రార్థనలలో పాల్గొని పరిశుద్ధంగా అనగా ఆ ప్రార్థనల్లో 100 శాతం నిజాలు, ప్రభువు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు వుండేలా సిద్ధపడుదురు గాక.– కోట బిపిన్చంద్రపాల్ -
వెచ్చని హృదయ రాగ సందేశం
ఇది నిన్ననే జరిగినట్లుగా నా జ్ఞాపకంలో స్పష్టంగా ఉంది. నిజానికైతే, నేను తొలిసారి ఫాదర్ టెర్రీ గిల్ఫెడర్ను కలిసింది నలభై ఏళ్ల కిందట! అది 1982 వేసవి చివరిలో... నిషా, నేను మా పెళ్లికి సిద్ధం అవుతున్న సమయం. ఒక క్యాథలిక్గా నిషా తను కోరుకున్న సంప్రదాయబద్ధమైన చర్చి వివాహానికి నేను నా అంగీకారాన్ని తెలిపినప్పుడు, స్థానిక పారిష్ చర్చి ప్రీస్ట్ను కలసి ఆయన చేత మూడు ఉపదేశాలు ఇప్పించుకోవలసి అవసరం ఏర్పడటం నన్ను చీకాకు పెట్టింది. కానీ వేరే దారి లేదు. వెదికితే, అతి దగ్గరగా నార్తంబర్లాండ్ అవెన్యూలో ఉన్న పునీత మేరీ మగ్దలీనా చర్చి ఒక్కటే నిషాకు ఒక క్రైస్తవేతరునితో వివాహం జరిపించేందుకు అంగీకరించింది, నిబంధనలకు లోబడి ఉండే షరతు మీద! సెప్టెంబరులో ఒక శనివారం, సాయంత్రం 6 గంటలప్పుడు నిషా, నేనూ ఫాదర్ టెర్రీ ఇంటి తలుపు తట్టాం. ఆయన తన డెస్క్ ముందు కూర్చొని ఉన్నారు. ఆయన కళ్లజోడు ముక్కు చివరికి దిగి ఉంది. ఆ చిన్న గదికి ఎదురుగా ఉన్న ఒక పాత, వెలసిపోయిన లెదర్ సోఫా మీద మేము కూర్చున్నాం. బయట ఎప్పుడూ లేనంత వేడిగా ఉంటే, లోపల వాతావరణం మంచులో ఉన్నట్లుగా ఉంది. నేను ఊరకే ఉండలేకపోతున్నాను. ‘‘షెర్రీ తీసుకుంటారా?’’ అని ఆయన అనటం నన్ను అమితంగా ఆశ్చర్యపరిచింది. ‘‘మీ ఇద్దరి గురించీ నాకు తెలియదు. కానీ నేను షెర్రీ పట్ల కొంత మొగ్గుగానే ఉన్నాను’’ అన్నారు.అది టియో పెపె. నాకు ఇష్టమైనది. షెర్రీ బ్రాండ్. కానీ ఆ రోజుల్లో లండన్లో అది చాలా అరుదుగా మాత్రమే దొరికేది. ఫాదర్ టెర్రీ వివేచనతో కూడిన అభిరుచి గల వ్యక్తి. నేను ఆయనతో యూఎస్ ఓపెన్ టెన్నిస్, నాటింగ్ హిల్ కార్నివాల్, రష్దీ ‘మిడ్నైట్ చిల్డ్రన్’ వంటివాటిపై చర్చిస్తూ ఉన్నాను– మేము చేసుకోబోయే వివాహం, మాకు పుట్టబోయే పిల్లలు ఏ మతాన్ని అనుసరించవలసి ఉంటుంది– అనేవి తప్ప... అన్నీ. ఫాదర్ టెర్రీ మా గ్లాసులను నింపుతూ సంభాషణను నడిపిస్తున్నారు. ఆయన నా వాదనను గ్రోలుతూనే, తన వాదనను సౌఖ్యంగా నిలిపి ఉంచుకుంటున్నారు. కాలం ఉల్లాసవంతమైన వేగంతో గడిచిపోయింది. వచ్చేవారం కలుద్దాం అనుకున్నాక, బయల్దేరేందుకు మేము లేచి నిలబడ్డాం. ఫాదర్ టెర్రీ మమ్మల్ని ఆపినప్పుడు మేము తలుపు దగ్గర ఉన్నాం. ‘‘మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్న విషయమై ఒక ప్రశ్న నా దగ్గర ఉంది’’ అన్నారు. ఆ ప్రశ్నకు సూచనగా చిరునవ్వొకటి విశాలమైన ఆయన గుండ్రటి ముఖం మీద నాట్యమాడింది. ఆయన కళ్లు సూటిగా మావైపే చూస్తున్నాయి. ‘‘మీరిద్దరూ కలిసి ఎందుకు సహజీవనం చేయకూడదు?’’ అన్నారు ఫాదర్ టెర్రీ. మా ముఖాల్లోంచి రక్తం చివ్వున చిమ్మిందేమో నేను కచ్చితంగా చెప్పలేను కానీ, మేమిద్దరం మాత్రం నోట మాట రాక అలా ఉండిపోయాం. నిజం ఏమిటంటే నిషా, నేను అప్పటికే సహజీవనంలో ఉంటూ ఆ వాస్తవాన్ని దాచటానికి ఉద్దేశపూర్వకంగానే ఫాదర్ టెర్రీకి వేర్వేరు చిరునామాలను ఇచ్చాం. అది ఆయన ఊహించారు. అందుకే తన పద్ధతిలో అదేం పెద్ద విషయం కాదన్నట్లు చెప్పారు. నిషా పూర్తి క్రైస్తవ సంప్రదాయంలో వివాహాన్ని కోరుకుంది. వరుడు క్రైస్తవుడు కాదు అనే విషయాన్ని పట్టించుకోకుండా ఫాదర్ టెర్రీ అందుకు సమ్మతించారు. ఆయన ఉపదేశ వాక్యం అందరి దృష్టిని ఆకర్షించింది. నరకం, అపరాధం, దైవం, çసచ్ఛీలత... వీటి గురించి ఆయన ఉపదేశించలేదు. ‘‘ఐ లవ్ యు’’ అనే మూడు చిన్న పదాల గురించి మాట్లాడారు. ‘‘కరణ్, నిషా...’’, ‘‘గుర్తుంచుకోండి. ‘ఐ’ నీ, ‘యు’నీ ‘లవ్’ జత కలుపుతుంది. కానీ అది వేరు కూడా చేస్తుంది. మీరిద్దరూ వేర్వేరు వ్యక్తులని మీరు మరచిపోయిన రోజున మీ బంధం విడిపోతుంది’’ అన్నారు ఫాదర్ టెర్రీ. అదొక వెచ్చని, తేలికపాటి, హృదయపూర్వక సందేశం. లాంఛనప్రాయమైన తంతు కంటే కూడా నిప్పు చుట్టూ కూర్చొని మాట్లాడుకోవటం వంటిది. కానీ అది పావు శతాబ్దం పాటు నా మదిలో వెలుగుతూనే ఉండిపోయింది. ఆరేళ్ల తర్వాత, ఆసుపత్రిలో నిషా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లైఫ్ సపోర్టును తొలగించటానికి కొన్ని నిమిషాల ముందు ఫాదర్ టెర్రీ ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకు చివరి మతకర్మను నిర్వహించారు. అమ్మను కూడా హైందవ సంప్రదాయం ప్రకారం నిషా చెవిలో ప్రార్థనలు వినిపించమని ప్రోత్సహించారు. ఆ తర్వాత యంత్రాలు మెల్లగా, బాధగా మినుకు మినుకుమని కొడిగడుతున్నప్పుడు నిషా అంతిమ శ్వాసలో ఫాదర్ టెర్రీ నా పక్కన నిలబడ్డారు. నాకు తెలిసిన ఏకైక క్రైస్తవ మత గురువు టెర్రీ గిల్ఫెడర్. ఆయన ఒక వింత మనిషి అయినప్పటికీ ఒక గొప్ప వ్యక్తి. ఒరిస్సా, కర్ణాటకలలో క్రైస్తవులపై జరిగిన దాడి గురించి చదివిన ప్రతిసారీ నేను ఆయన గురించి ఆలోచిస్తాను. గాయపడిన హృదయాలను నయం చేసే పదాలను ఆయన కనుగొని ఉంటారని నేను నమ్ముతాను. అందుకు నిస్సందేహంగా ఆయనకు షెర్రీ సహాయపడి ఉంటుంది. కరణ్ థాపర్ – వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
గుడ్ ఫ్రైడే' 2024: ప్రాముఖ్యత ఏంటి.. ‘హ్యాపీ గుడ్ ఫ్రైడే' విషెస్ చెప్పకండి!
క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే పవిత్ర దినం. బైబిలు ప్రకారం గుడ్ ఫ్రైడ్ అంటే మానవాళి పాపాలకు జీసస్ శిలువపై ప్రాణాలను పణంగా పెట్టిన రోజు. అందుకే ఏసుక్రీస్తు జ్ఞాపకార్థం ఈ రోజును పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. శిలువ వేయబడిన మూడు రోజుల తరువాత యేసు పునరుత్థానాన్ని ఆదివారం రోజు ఈస్టర్ గా పాటిస్తారు. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలచుకుంటారు. జీసస్ ప్రార్థనలో గడుపుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ప్రవచనాలు, ప్రార్థనలు, ధ్యానం వంటివి జరుగుతూనే ఉంటాయి. కొంతమంది నల్లటి వస్త్రాలు ధరించి తమ బాధను వ్యక్తపరుస్తారు. గుడ్ ఫ్రైడే విషెస్ యేసు మరణానికి త్యాగానికి గుర్తుగా సంతాపాన్ని తెలియజేయడానికి దీన్ని నిర్వహించు కుంటారు. అందుకే గుడ్ ఫ్రైడే వస్తే మాత్రం ఏ ఒక్కరూ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని ఒకర్ని ఒకరు విష్ చేసుకోరు. మిగిలిన వారు కూడా ఎవరూ అలాంటి మెసేజ్లు పంపుకోరు. చర్చిలలో ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు జరగవు. ఏసు ప్రభు ప్రజల పాపాలకోసం త్యాగ చేసి మానవాళికి మంచి చేశాడని, అందుకే ఫ్రైడేకి ముందు గుడ్ అనే పదం చేరిందని నమ్ముతారు. గుడ్ ఫ్రైడేను... హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుచుకుంటారు. శిలువ వేయడం అనేది యేసు జీవితంలో చిట్టచివరి ఘట్టమనీ, క్రైస్తవ సోదరుల విశ్వాసం. అందుకే గుడ్ ఫ్రైడే రోజు ఎన్నో చర్చిలలో ఈ నాటికను ప్రదర్శిస్తారు. అలాగే గుడ్ ఫ్రైడేకి ముందు లెంట్ డేస్ మొదలవుతాయి. దాదాపు 46 రోజులు పాటు కొనసాగుతాయి. ఆ రోజుల్లో ఉపవాసాలను పాటిస్తారు. -
Kerala Blast: కేరళలో వరుస పేలుళ్లు
కొచ్చి: కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని కొచ్చి నగర సమీపంలో వరుస పేలుళ్ల ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మతపరమైన వేడుక జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లో చోటుచేసుకున్న ఈ పేలుళ్లలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 51 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మూడు రోజులుగా జరుగుతున్న ఈ వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు కలామాస్సెరీలోని జామ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు ఆదివారం ఉదయం వందలాది మంది ‘జెహోవా’ క్రైస్తవులు తరలివచ్చారు. అందరూ ప్రార్థనల్లో ఉండగా, ఉదయం 9.40 గంటలకు హఠాత్తుగా పేలుడు జరిగింది. కొద్దిసేపటికే మరోరెండు పేలుళ్లు సంభవించాయి. దీంతో జనమంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది మంది రక్తమోడుతూ కనిపించారు. ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. మొదటి రెండు పేలుళ్లు శక్తివంతమైనవిగా, మూడోది తక్కువ తీవ్రత కలిగిన పేలుడుగా పోలీసులు గుర్తించారు. పేలుళ్ల కోసం దుండగులు ఐఈడీ ఉపయోగించినట్లు కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ చెప్పారు. ఇది ఉగ్రవాద చర్యా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. పేలుళ్లకు కారణమైన ముష్కరులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని డీజీపీ స్పష్టంచేశారు. పేలుళ్ల సమాచారం తెలియగానే కేరళ రాష్ట్ర యాంటీ–టెర్రరిజం స్క్వాడ్, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కేరళ గవర్నర్ దిగ్భ్రాంతి క్రైస్తవుల మత ప్రార్థనల్లో పేలుళ్లు జరగడం పట్ల కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పేలుళ్ల ఘటన అత్యంత దురదృష్టకరమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని తేలి్చచెప్పారు. పేలుళ్లకు తానే కారణం అంటూ వ్యక్తి లొంగుబాటు కలామాస్సెరీలో తానే వరుస పేలుళ్లకు పాల్పడ్డానంటూ ఓ వ్యక్తి ఆదివారం కేరళలోని త్రిసూర్ జిల్లా కొడాకర పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. తాను కూడా ‘జెనోవా’ సభ్యుడినేనని చెప్పారు. లొంగిపోయిన వ్యక్తి పేరు డొమినిక్ మార్టిన్ అని పోలీసులు తెలిపారు. పేలుళ్లకు తానే కారణం అంటూ కొన్ని ఆధారాలు చూపించాడని వెల్లడించారు. అతడు చెప్పేది నిజమేనా? అనేది క్షుణ్నంగా విచారిస్తున్నామని అన్నారు. కళ్ల ముందు అగ్నిగోళం కనిపించింది కలామస్సెరీలో మత ప్రార్థనల్లో జరిగిన పేలుళ్లను తల్చుకొని ప్రత్యక్ష సాక్షులు బెంబేలెత్తిపోతున్నారు. తాను కళ్లు మూసుకొని పార్థన చేస్తున్నానని, హఠాత్తుగా భారీ పేలుడు శబ్ధం వినిపించిందని ఓ మహిళ చెప్పారు. వెంటనే ఉలిక్కిపడి కళ్లు తెరిచానని అన్నారు. కళ్ల ముందు భగభగ మండుతున్న ఒక అగి్నగోళం కనిపించిందని పేర్కొన్నారు. -
యూఏఈ దుబాయిలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు
-
క్రైస్తవులు ఏకతాటిపైకి రావాలి
హిమాయత్నగర్ (హైదరాబాద్): కొంతకాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే.. కొన్ని వర్గాల వారు చర్చిలు, మసీదులు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కానీ, రాష్ట్రంలో వారి పప్పులు ఉడకవని, ముఖ్యమంత్రి కేసీఆర్ అటువంటి వారిని ఉపేక్షించరన్నారు. రాష్ట్రంలోని క్రైస్తవులంతా ఒకేతాటిపైకి వచ్చి వారి హక్కులు, సంక్షేమ పథకాలు సాధించుకునేందుకు అవకాశాలను అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. మంగళవారం నారాయణగూడలోని బాప్టిస్టు చర్చిలో ‘తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్’(టీయూసీపీఏ) ఆధ్వర్యంలో 33 జిల్లాల పాస్టర్ల సమావేశం జరిగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలసి మంత్రి తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. క్రైస్తవుల్లో ఐకమత్యం లోపిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాద్ వరకు ప్రతి మండలానికి ఓ కమిటీని రూపొందించి ఈ కమిటీలన్నీ ఒకే గొడుగు కింద ఉండేలా కృషి చేయాలన్నారు. అందరూ ఏకతాటిపైకి వస్తే దక్కాల్సిన హక్కులు తప్పకుండా దక్కుతాయన్నారు. మైనార్టీలు అంటే క్రైస్తవులు కాదనే ఆలోచన నుంచి క్రైస్తవులు బయటకు రావాలని సూచించారు. క్రైస్తవుల కోసం షాదీముబారక్ పేరుమార్పు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. లోపాలను సరిదిద్దుకుని ముందుకువచ్చి హైదరాబాద్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని, అందరూ ఏకతాటిపైకి వచ్చి నిలబడితే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నానని తలసాని ప్రకటించారు. రాష్ట్రంలో కోటిన్నర జనాభా కలిగిన క్రైస్తవులు డెసిషన్ మేకర్స్ అని ఎమ్మెల్యే దానం అన్నారు. కొంతకాలంగా కొన్ని వర్గాలపై ప్రణాళిక ప్రకారం దాడులు జరుగుతున్నాయని.. దానిని అధిగమించేందుకు క్రైస్తవులు ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆ రోజు వద్దు.. మరో రోజు పోలింగ్ పెట్టండి ప్లీజ్
ఇంఫాల్: శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను మార్చాలని ఆల్ మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ (ఏఎంసీఓ) కోరింది. ఫిబ్రవరి 27న జరగబోయే మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలను మరోరోజు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఆదివారం క్రైస్తవులకు ప్రార్థన దినం అయినందున పోలింగ్ తేదీని మార్చాలని పేర్కొంది. ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో ఎప్పుడు పోలింగ్ నిర్వహించినా తమకు అభ్యంతరం లేదని తెలిపింది. తమ మనోభావాలను గౌరవించి మొదటి దశ పోలింగ్ తేదీని మార్చాలని ఈసీకి విజ్ఞప్తి చేసింది. కాగా, ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు పంజాబ్ ఎన్నికలను ఈసీ వాయిదా వేసిన సంగతి విదితమే. గురు రవిదాస్ జయంతి వేడుకల దృష్ట్యా ఫిబ్రవరి 14న జరగాల్సిన పోలింగ్ను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 27, మార్చి 3న మణిపూర్లో పోలింగ్ నిర్వహించనున్నారు. 30 లక్షల మంది జనాభా కలిగిన మణిపూర్లో క్రైస్తవులు 41.29 శాతం ఉన్నారు. ( ఆమె మౌనం.. ఎవరికి లాభం!) -
రామమందిరానికి క్రైస్తవుల భారీ విరాళం
శివాజీనగర: అయోధ్యలో నిర్మించే రామ మందిర నిర్మాణానికి కర్ణాటకలో క్రైస్తవ వర్గానికి చెందిన వ్యాపారులు, విద్యానిపుణులు పెద్దమొత్తంలో విరాళాలను అందజేశారు. బెంగళూరులో ఆదివారం ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీ.ఎన్.అశ్వత్థనారాయణ ఏర్పాటు చేసిన సమావేశంలో క్రైస్తవ వర్గ వ్యాపారవేత్తలు, విద్యానిపుణులు, ఎన్ఆర్ఐలు, సీఇఓలు, సమాజ సేవకులు పాల్గొన్నారు. మందిర నిర్మాణానికి తమవంతు సహాయం చేస్తామని భరోసానిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా అందరితో కలసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లటమే బీజేపీ లక్ష్యమని అశ్వత్ధ నారాయణ తెలిపారు. సుమారు రూ.కోటి వరకూ విరాళాలను అందజేసినట్లు ఆయన చెప్పారు. -
టీడీపీ క్రిస్టియన్ సెల్ నేతల మూకుమ్మడి రాజీనామాలు
సాక్షి, అమరావతి: మత సామరస్యాన్ని దెబ్బ తీస్తూ విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చర్యలను నిరసిస్తూ పలువురు క్రైస్తవ మైనార్టీ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. క్రైస్తవులను అవమానిస్తూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయటానికి నిరసనగా 13 జిల్లాల టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. టీడీపీ క్రిస్టియన్ సెల్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు యలమంచిలి ప్రవీణ్ నేతృత్వంలో మంగళవారం విజయవాడలో సమావేశమైన 13 జిల్లాల నాయకులు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. అనంతరం ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవ మతం గురించి చంద్రబాబు చేసిన తీవ్ర వ్యాఖ్యలు తమను ఎంతో బాధించాయన్నారు. చర్చిలో ప్రార్థనలు చేయలేదా బాబూ?: పాస్టర్లకి రూ.5 వేలు ఎవరు ఇమ్మన్నారని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారని, అదే విషయాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాన్ని మరిచారా? అని ప్రవీణ్ ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లలో క్రిస్మస్ వేడుకలు ఎలా జరుపుతారని ప్రశ్నించిన చంద్రబాబు గతంలో చర్చికి వచ్చి గంటన్నర ఎలా ప్రార్థన చేశారు? బైబిల్ ఎలా చదివారు? అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ క్రిస్టియన్ సెల్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు డి.వి.డి.వి.కుమార్, విజయవాడ అధ్యక్షుడు వెంకన్న, విశాఖ జిల్లా అధ్యక్షుడు బెన్హర్, తూ.గో.జిల్లా అధ్యక్షుడు రత్నరాజు, ప.గో.జిల్లా అధ్యక్షుడు విజయకుమార్, కృష్ణా జిల్లా అధ్యక్షుడు వెస్లీ, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఇమ్మానియేల్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు, కడప జిల్లా అధ్యక్షుడు విజయ్ బాబు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వి.సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. కాగా, చంద్రబాబు తీరును ఖండిస్తూ ఆయన కార్యక్రమాలను అడ్డుకునేందుకు పలు క్రైస్తవ సంఘాలు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నెలాఖరులోపు విజయవాడలో భారీ సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. -
బాబుపై టీడీపీ క్రిస్టియన్ సెల్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: క్రిస్టియన్లపై తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై పలు క్రిస్టియన్ సంఘాలతో పాటు..ఆ పార్టీ క్రిస్టియన్ సెల్ సైతం ఆగ్రహంతో రగిలిపోతోంది. రాజకీయాల కోసం ఉన్నట్టుండి యూటర్న్ తీసుకుని క్రిస్టియన్లను అవమానిస్తూ మాట్లాడడం, వారిపై నిందలు వేయడం ఏమిటని పలువురు టీడీపీ క్రిస్టియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే టీడీపీ క్రిస్టియన్ విభాగం పయనించడానికి సిద్ధపడుతోంది. ఈ అంశంపై చర్చించేందుకు టీడీపీ క్రిస్టియన్ సెల్ మంగళవారం విజయవాడలో సమావేశం అవుతోంది. రాష్ట్ర నాయకత్వంతోపాటు అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. చంద్రబాబు తీరును ఎండగట్టాలని, మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేయాలని వారు భావిస్తున్నట్లు తెలిసింది. చంద్రబాబు క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలి కేవలం తమ రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం చంద్రబాబు తమ మతంపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ కులమతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం, విశాఖ చాప్టర్ అధ్యక్షుడు రెవరెండ్ అద్దేపల్లి రవిబాబు అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖలోని (జీవీఎంసీ) గాంధీ విగ్రహం వద్ద క్రైస్తవులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు వెంటనే క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోరం రాష్ట్ర చైర్మన్ ఆలివర్ రాయ్, రెవ.డా.డీజే విల్సన్బాబు, రెవ.ఎల్.ఆర్. బిల్లి గ్రహమ్, రెవ.సన్నీజామ్స్, ఎం.జి.డబ్ల్యూ డేవిడ్రాజ్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న పెరికె వరప్రసాదరావు, బందెల దయానందం తదితరులు బాబును రాష్ట్రంలోకి రానివ్వం మత సామరస్యం కలిగిన రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న చంద్రబాబును రాష్ట్రంలో కాలుపెట్టనివ్వబోమని క్రిస్టియన్ సంఘాలు మండిపడ్డాయి. విజయవాడలో సోమవారం ఏపీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు పెరికె వరప్రసాదరావు మాట్లాడారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికే చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోసియేషన్ కన్వీనర్ రెవరెండ్ దయానందం, అధ్యక్షుడు రవికిరణ్ తదితరులు మాట్లాడారు. త్వరలోనే చంద్రబాబు ఏకాకి.. భవిష్యత్తులో చంద్రబాబు ఏపీలో ఏకాకిలా మారనున్నారని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు లింగం జాన్బెన్నీ పేర్కొన్నారు. చంద్రబాబు ఓ మతోన్మాదిలా మారిపోయారని గుడ్లవల్లేరు మండలంలోని శేరీదగ్గుమిల్లిలో పాస్టర్లు నిరసన వ్యక్తం చేశారు. ఏఐసీసీ ఏపీ కార్యదర్శి ముత్యాల జయరాజు తదితరులు పాల్గొన్నారు. -
మత విద్వేషాలను రెచ్చగొడితే సహించం
భవానీపురం (విజయవాడ పశ్చిమ): క్రైస్తవులు, హిందువుల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడితే తగిన బుద్ధి చెబుతామని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ (ఆర్కేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రంజిత్ ఓఫిర్ హెచ్చరించారు. క్రైస్తవులపై ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆర్కేపీ, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ (సీఆర్పీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగాగల అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం నిరసన తెలిపారు. రంజిత్ ఓఫిర్ మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం కుల, మతాల మధ్య చిచ్చుపెట్టడం ఒక ఎంపీగా రఘురామకృష్ణరాజుకు తగదన్నారు. కార్యక్రమంలో సీఆరీ్పఎస్ జాతీయ అధ్యక్షుడు అప్పికట్ల జీవరత్నం, రాష్ట్ర అధ్యక్షుడు వై.బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
క్రైస్తవులు రేపు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలి
సాక్షి, అమరావతి: గుడ్ఫ్రైడే సందర్భంగా శుక్రవారం క్రైస్తవులు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏసురత్నం బుధవారం ఒక ప్రకనటలో తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఈనెల 14 వరకు లాక్డౌన్ అమలులో ఉన్నందున సామూహిక ప్రార్థనలు నిషేధించినట్లు తెలిపారు. పాస్టర్లు కూడా ఈ విషయాన్ని గుర్తించి భక్తులకు తెలిపి వారి ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకునే విధంగా చూడాలని కోరారు. -
మనిషి స్వార్థంతో మసకబారిన దేవుని ప్రేమ!!
పస్కా పండుగనాచరించడానికి యూదులంతా యెరూషలేము పట్టణానికి రావాలన్నది ధర్మశాస్త్ర నిబంధన (నిర్గమ 23:7). అందువల్ల యేసుప్రభువు కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనే పస్కాపండుగ కోసం యెరూషలేము పట్టణానికి వచ్చాడు. యెరూషలేము ప్రజలను, పండగనాచరించడానికి అక్కడికి వచ్చిన యూదులనుఉద్దేశించి ‘నేను ఆకలితో ఉన్నపుడు నాకు మీరు భోజనం పెట్టారు, నాకు దాహమైనపుడు నీళ్లిచ్చారు, పరదేశిగా ఉన్నపుడు ఆశ్రయమిచ్చారు, వస్త్రాలు లేనపుడు వస్త్రాలిచ్చారు, రోగినై వుంటే, చెరసాలలో ఖైదీగా ఉంటే నన్ను మీరు పరామర్శించారంటూ యేసు చేసిన బోధ యెరూషలేములో పెద్ద సంచలనమే రేపింది (మత్తయి 25;35,36), ఈ బోధ విన్న వాళ్లంతా, ‘ప్రభువా, మీకోసం మేము ఇవన్నీ ఎప్పుడు చేశాము?’ అంటూ అమాయకంగా ప్రశ్నించారు. ‘‘నాకు ప్రత్యక్షంగా చెయ్యలేదేమో, కానీ మీ చుట్టూ ఉన్న పేదలు, నిరాశ్రయులైన వారికి మీరు చేసిన ప్రతి మేలూ, సహాయమూ నాకు చేసినట్టే’’ అని వివరించి, ఇలా పేదలను ఆదుకున్న ‘మీరంతా నా పరలోకపు తండ్రిచేత ఆశీర్వదించబడినవారు’ అని ప్రకటించాడు. దేవుని దర్శనం కోసం ఎక్కడెక్కడినుండో వచ్చిన నాటి యూదులందరికీ, ‘దేవుని చూసేందుకు ఇంత దూరం రానఖ్ఖర్లేదు, మీరుండే ప్రాంతాల్లోనే మీ చుట్టూ ఆపదల్లో, అవసరతల్లో ఉన్న పేదలు, బలహీనులకు అండగా నిలిస్తే చాలు, దేవుని చూసినట్టే, ఆయన్ను సేవించినట్టే’ అంటూ యేసు చేసిన నాటి బోధతో పండుగ తర్వాత సొంత ఊళ్లకు వెళ్లిన యూదు ప్రజలు, ప్రభావితులై వచ్చే ఏడాది యెరూషలేముకు రాకపోతే, వారి కానుకలు లేక ఆలయ ఖజానా వెల వెలబోతే, యాజకులు, ఆలయ నిర్వాహకులైన లేవీయులు బతికేదెలా? ఆలయ ప్రాంగణంలో అనుబంధంగా సాగుతున్న వ్యాపారాలు మూతపడితే ఎంత నష్టం? వెంటనే యాజకులు, యూదు ప్రముఖులు సమావేశమై ‘ఇక యేసును చంపాల్సిందే. కాకపోతే పండుగలో చంపితే ప్రజలు తిరుగబడతారు గనుక నిదానంగా ఆ పని చేద్దాం’ అని తీర్మానించుకున్నారు (మత్త 26:3,4). దేవుని మానవరూపమూ, తానే దేవుడైన యేసును చంపేందుకు, ఆయనకు ఆరాధనలు నిర్వహించే వారే కుట్ర చెయ్యడం కన్నా మరో విషాదం ఉంటుందా? దేవాలయ యాజక వ్యవస్థ స్వార్ధపూరితమైన ప్రతిసారీ, చరిత్రలో ఇలాంటి అనర్థాలే జరిగాయి. దేవుని ఉదాత్తమైన సంకల్పాలను మరుగు పర్చగల ‘నాశనకరమైన శక్తి’ మనిషి స్వార్థానిదని మరోసారి రుజువైంది. దీనికన్నా విషాదకరమైన పరిణామం మరోటి జరిగింది. పస్కా పండుగ మరునాడే అంటే అర్ధరాత్రి దాటగానే, ప్రజలంతా గాఢనిద్రలో ఉండగానే యేసును తాను అప్పగిస్తానని, ఆయన్ను అర్ధరాత్రే బంధించి, ప్రజలు నిద్ర లేచేలోగా విచారణ చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని యేసు శిష్యుల్లోనే ఒకడైన యూదా ఇస్కరియోతు ఆలయ యాజకులకు సూచించి అందుకు ముప్పై వెండినాణేలకు వారితో ఒప్పందం చేసుకున్నాడు. చివరికి అదే జరిగి మరునాడే యేసును సిలువ వేశారు. యేసు బోధల్ని ఉన్నవి ఉన్నట్టుగా లోకానికి చేరవేయవలసిన చర్చి, పరిచారకుల వ్యవస్థ తమ స్వార్థం కోసం వాటిని కలుషితం చేస్తున్నందువల్లే, దేవుని రాజ్య నిర్మాణం ఆగిపోయింది, ఎంతోశక్తితో సమాజాన్ని ప్రభావితం చేసి లోక కల్యాణానికి కారణం కావలసిన క్రైస్తవం’ పేలవమైంది. – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలి!
న్యూఢిల్లీ: క్రిస్టియన్లుగా మారిన షెడ్యూల్డ్ కులాల వారికి ఇతర ఎస్సీలకు లభించే అన్ని ప్రయోజనాలు లభించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు బుధవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎస్సీలను మతపరంగా తటస్థులుగా పరిగణించాలని ఆ పిటిషన్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్ సంస్థ కోరింది. పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం... కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు, ఎస్సీ జాతీయ కమిషన్కు, మైనారిటీల జాతీయ కమిషన్కు, భారత రిజిస్ట్రార్ జనరల్కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా స్పందించాలని వారిని ఆదేశించింది. ‘ఇస్లాంలో రిజర్వేషన్లు లేవు. ఆ విషయాన్ని విచారణలో భాగం చేయొచ్చు కదా!’ అని కోర్టు అభిప్రాయపడింది. -
శ్రావ్యంగా సాగిన మధురగీతం జాకబ్ సన్!!
తెలుగు క్రైస్తవలోకంలో ఎన్నో ఏళ్లపాటు తనదైన ముద్ర కలిగిన ఎంతో శ్రావ్యమైన క్రైస్తవ భక్తి సంగీత బాణీలతో విశ్వాసులను ఎంతో అలరించి కాంతులీనిన క్రైస్తవ సంగీత దర్శకుడు ఎం.డి.జాకబ్ సన్ అనే ఒక అద్భుతమైన తార కనుమరుగైంది. కొంతకాలంగా అనారోగ్యంగా ఉండి, 67 ఏళ్ళ వయసులో ఇటీవలే ఆయన కన్ను మూశారు. ఆయనకు భార్య రోసెలిన్, ఇద్దరు కూతుళ్లు సునయన, కత్రీనా ఉన్నారు. క్రైస్తవలోకంలో ఈ రోజున గొప్ప గాయకులుగా, సంగీత వాద్యకారులుగా ఉన్న చాలామంది జాకబ్ సన్ చేతిలోనే శిక్షణనొంది, ఆయన బాణీలద్వారానే పేరు పొందారు. ఆయన 1978 నుండి, 1980, 1990 దశకాల్లో ‘విశ్వవాణి’ అనే అద్భుతమైన క్రైస్తవ రేడియో కార్యక్రమాలకు చేసిన సంగీత పరిచర్య చిరస్మరణీయమైనది. అప్పట్లో పల్లెటూళ్లలో ఉన్నవాళ్లకు విశ్వవాణి కార్యక్రమంతోనే తెల్లవారేది, మళ్ళీ విశ్వవాణి కార్యక్రమంతోనే రాత్రయ్యేది. ఆ రోజుల్లో విశ్వవాణి రేడియో కార్యక్రమంలో దైవజనులు ఆరార్కే మూర్తి ప్రసంగం జనహృదయాలకు ఎంతగా హత్తుకునేదో, జాకబ్ సన్ పాటలు కూడా అంతే జనరంజకంగా ఉండేవి. ఆ తరాల తెలుగు క్రైస్తవులకు జాకబ్ సన్ ఒక సెలెబ్రిటీ!! ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెదధన్వాడ గ్రామానికి చెందిన జాకబ్ సన్ మహబూబ్ నగర్లో డిగ్రీ చదువుతున్నపుడు పెట్కార్ గారనే ఇంగ్లీష్ మిషనేరీ గారు. ఆరార్కే మూర్తి అనే దైవజనులు ఆయనలోని సంగీత ప్రతిభను గుర్తించి హైదరాబాద్లో తాము కొల్పిన ‘దేవుడు మాట్లాడాడు’ అనే స్టూడియోకు తీసుకొచ్చి తమ సంస్థ నిర్మించి, ప్రసారం చేస్తున్న తెలుగు క్రైస్తవ కార్యక్రమాలకు సంగీత దర్శకుడుగా నియమించారు. అదే కాలక్రమంలో విశ్వవాణి అనే పేరుతో ప్రాబల్యం పొందింది. అలా ఆరంభమైన జాకబ్ సన్ సంగీతపరిచర్య ద్వారా తెలుగు రాష్ట్రంలోని ఎందరో గాయకులూ, సంగీతకారులకు ఆయన స్టూడియోలో పాడి, వాయించి, అలా తెలుగు క్రైస్తవుల మన్నన పొందే ఆధిక్యత లభించింది. ‘దేవా నా దేవా’, ‘నా హృదయ సీమలో’, ‘దేవా నీవే నా ..’, ‘నే పాపినో ప్రభువా’, ‘దేవుని ఉపకారములలోన’, ‘ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు’ వంటి కబ్ సన్ బాణీ, సంగీతం కూర్చిన పాటలు, ఆ రోజుల్లో క్రెస్తవ చర్చిలు, విశ్వాసుల నాలుకలపై ఆడి, దైవికంగా మధురానుభూతులను పంచాయి. ఆయన సంగీతంలో, బాణీల్లో విశిష్టత ఏమిటంటే, అవి నేరుగా విశ్వాసి హృదయాన్ని తాకి మరో లోకంలోకి తీసుకెళ్తాయి. చాలా సాధారణమైన ఆ బాణీలు, ప్రజల్లోకి సునాయాసంగా వెళ్లి వాళ్లంతా హాయిగా పాడుకునేలా చేస్తాయి. ఆయన బాణీల్లో శ్రావ్యతే ప్రాధాన్యంగా ఉంటుంది. ఇంత గొప్ప ప్రతిభావంతుడైనా, అతిశయం, అహంకారమనేది ఆయనకసలు తెలియదు. ఎంతో నిరాడంబరంగా, వివాదాలకు దూరంగా, మృదుభాషిగా అందరిపట్లా స్నేహభావంతో మెలిగాడాయన. ఎంతోమంది అనామకులైన అతి సాధారణ గాయకులూ కూడా, ఆయన సంగీతం, ఆయన బాణీల్లోని విశిష్టత వల్ల గొప్ప గాయకులుగా పేరు ప్రతిష్టలు పేరొందారు. అందరితో కలిసిమెలిసి, ఆడుతూ, పాడుతూ, హాస్యోక్తులు వేస్తూ, తాను నవ్వుతూ అందరినీ నవ్వించడమే తప్ప ఎప్పుడూ ఎవర్నీ ఆయన నొప్పించిన సందర్భమే లేదు. సంగీతం, పాటలే తన లోకంగా బతికాడాయన. గోరంత ప్రతిభకు, తమ సొంత ‘మార్కెటింగ్ తెలివితేటలు’ జోడించి చూస్తుండగానే ఎంతో ఎత్తుకు ఆయన పరిచయం చేసిన అతి సాధారణ గాయకులు, సంగీతకారులే ఎదిగిపోయినా, ఎన్నడూ ఆయన వ్యసనపడలేదు. ఎంతటి పరిస్థితుల్లోనైనా తాను నొచ్చుకోకుండా, ఎవరినీ నొప్పించకుండా ఉండడానికే ప్రయత్నించేవాడే తప్ప, ధనార్జన పైన, పేరు సంపాదించడం పైన ఎన్నడూ దృష్టిపెట్టినవాడు కాదాయన. ప్రతి పరిస్థితిలోనూ, ఎంతో గుంభనంగా, నిండుగా జీవించాడు జాకబ్ సన్. జీవితమే క్రైస్తవ స్ఫూర్తితో సాగిన ఒక శ్రావ్యమైన సంగీత బాణీ జాకబ్ సన్!! అసూయకు, విమర్శలకు, వివాదాలకు తావివ్వని అసమానమైన విశ్వాసి ఆయన. తెలుగు క్రైస్తవ భక్తి సంగీత ప్రపంచంలో కొన్ని మైలు రాళ్ళ మీద ఆయన పేరు తప్పకుండా ఉంటుంది. శ్రావ్యమైన సంగీతంతో విలసిల్లే పరలోకంలో జాకబ్ సన్ తప్పక మరింత సంతోషంగా, ఆనందంగా ఉంటాడని సువార్తికుల విశ్వాసం. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ prabhukirant@gmail.com -
కలిసి ఉంటే కలదు సుఖం
కలిసి ఉంటే కలదు సుఖం అనే రీతిలో ప్రపంచవ్యాప్తంగా హిందూ కుటుంబాలు ఉమ్మడిగానే ఉంటున్నాయని అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉంటున్న హిందూ కుటుంబాల్లో 55 శాతం కుటుంబాలు కలిసి ఉంటున్నాయని ఆ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. ఆ తర్వాత బౌద్ధులు 44 శాతం, ముస్లింలు 36 శాతం, క్రిస్టియన్లు 29 శాతం ఉమ్మడి కుటుంబాలుగానే ఉంటున్నారని తేలింది. ‘రెలిజియన్ అండ్ లివింగ్ అరేంజ్మెంట్ అరౌండ్ ద వరల్డ్’పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో సంపన్న దేశాల్లో నివసించే కుటుంబాలు చిన్నవిగానే ఉంటున్నాయని, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో మాత్రం పెద్ద కుటుంబాలుగా జీవిస్తున్నారని వెల్లడించింది. – సాక్షి, హైదరాబాద్ అక్కడ చిన్న కుటుంబాలే ప్రపంచంలోని ప్రతి 10 మంది క్రిస్టియన్ కుటుంబాల్లో ఆరు కుటుంబాలు అమెరికా, యూరోప్లోనే ఉన్నాయని, ఆయా దేశాల్లో చిన్న కుటుంబాల వ్యవస్థ వైపే మొగ్గుచూపుతున్నారని ప్యూ తన అధికారిక వెబ్సైట్లో ఇటీవలే ఉంచిన సర్వే నివేదికలో పేర్కొంది. ప్రపంచంలోని ప్రతి 10 హిందూ కుటుంబాల్లో 9 కుటుంబాలుండే భారత్లో తొలి నుంచి వస్తున్న సంప్రదాయాలకు లోబడి కలిసే ఉంటున్నారని తెలిపింది. ప్రపంచంలోని 130 దేశాల డాటా ఆధారంగా జర్మనీలో అతి తక్కువగా సగటున 2.7 మంది ప్రతి కుటుంబంలో ఉంటున్నారని వెల్లడించింది. అదే గాంబియా దేశంలో అతి ఎక్కువగా 13.8 మంది సభ్యులు ఒక్కో కుటుంబంలో ఉన్నారని తెలిపింది. ఒంటరి జీవులు 4 శాతం ఇక, ప్రపంచవ్యాప్తంగా కేవలం 4 శాతం మంది మాత్రమే ఒంటరిగా జీవిస్తున్నారని సర్వే తేల్చింది. అందులో యూదులు (10 శాతం), బౌద్ధులు (7 శాతం), ఏ మతమూ చెప్పనివారు (7 శాతం) ఉన్నారని, హిందూ, ముస్లిం మతస్తుల్లో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఒంటరిగా జీవిస్తున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లోని వివిధ ప్రభుత్వ సంస్థల వివరాలు, జనాభా గణన లెక్కల ఆధారంగా 2010 నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ సర్వే వివరాలను క్రోడీకరించినట్టు ప్యూ సంస్థ వెల్లడించింది. -
అర్హులైన క్రైస్తవులకు గిఫ్ట్లు అందేలా చర్యలు
విజయనగర్ కాలనీ: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని అర్హులైన క్రిస్టియన్ సోదరులకు గిఫ్ట్ ప్యాక్లు అందేలా శాసన సభ్యులు, కార్పొ రేటర్లు తగు చర్యలు తీసుకోవాలని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర పశు సంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని కాన్ఫరెన్స్ హాల్లో హోంమం త్రితో కలసి క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఏడాది మాదిరిగానే 9 వేల మంది క్రైస్తవులకు ఎల్బీ స్టేడియంలో విందు నిర్వహిస్తామన్నారు. ఈ విందుకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతార న్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 200 ప్రాం తాల్లో పేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్లు అందిస్తున్నామన్నారు. ఒక్కో ప్రాంతంలో 500 గిఫ్ట్ ప్యాక్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రిస్మస్ విందు నిర్వహణకు ఎంపిక చేసిన చర్చిలకు రూ.లక్ష చొప్పున చర్చి బ్యాంకు ఖాతాలో వేస్తామన్నారు. కార్యక్రమం లో ప్రభుత్వ సలహాదారులు ఏకే. ఖాన్, ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
కొంచెం శక్తితోనే కొండంత ఫలితం....
‘నీకున్న శక్తి కొంచెమే అయినా నా వాక్యాన్ని అనుసరించావు, పైగా నన్ను ఎరుగనని అనలేదు’ అన్నది ప్రకటన గ్రంథంలోని ఫిలడెల్ఫియా చర్చికి పరిశుద్ధాత్ముడిచ్చిన ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’!! అందుకు బహుమానంగా, ఎవరూ మూయలేని ఒక తెరిచిన ద్వారాన్ని ఆ చర్చికి దేవుడు అనుగ్రహించాడు (ప్రక3:7–13). ప్రకటన గ్రంథంలోని ఏడు చర్చిల్లో ఫిలడెల్ఫియా చాలా చిన్నది. ఇప్పటి టర్కీ దేశంలో, రోమ్ నుండి ఆసియా కు వెళ్లే రహదారులన్నీ కలిసే ఒక ప్రాముఖ్యమైన కూడలి ప్రాంతమైన ఫిలడెల్ఫియా పట్టణంలో ఉన్న చర్చి అది. ఎన్నో ప్రతికూలతలు, లోక సంబంధమైన ప్రలోభాల మధ్య కూడా వెల లేని తన విశ్వాసాన్ని కాపాడుకొని ఆ చర్చి దేవుని ప్రసన్నుని చేసి ఆయన ప్రేమను సంపాదించుకొంది. ప్రతికూలతలను, శత్రువులను ఎలా ఎదుర్కొంటుందన్నదే ఏ చర్చి విశ్వాసానికి, విజయానికైనా గీటురాయి. అయితే ఆసుపత్రిలో రోగులున్నట్టే చర్చిలో పాపులు, ఆత్మీయంగా బలహీనులు, దీనులు తప్పక ఉంటారు. కాకపోతే తాము ఒక రోజున రోగవిముక్తులం కావాలన్న బలమైన ఆశ ఉన్న ఆసుపత్రి రోగుల్లాగే, తాము తప్పక పాపవిముక్తులం కావాలన్న ప్రార్థ్ధన, పట్టుదల, ప్రయాస కలిగిన పాపులున్న చర్చి దేవుణ్ణి ప్రసన్నుని చేస్తుంది. ‘పాపులముగానే చేరాము, పాపులముగానే చనిపోతాము’ అన్న మార్పులేని మొండి వైఖరి కలిగిన సభ్యుల వల్ల చర్చికి, దేవునికి కూడా ప్రయోజనం లేదు. లోకంలో అంతా పాపులే, కాకపోతే క్షమించబడిన పాపులు కొందరు, ఇంకా క్షమించబడని పాపులు మరి కొందరు. పాపక్షమాపణానుభవంతో చర్చిలో చేరడం అత్యంత శ్రేయస్కరం. ఒకవేళ అలా జరుగక పోతే, చేరిన తర్వాతైనా పాపక్షమాపణను పొందితే ఆనందం. కాకపోతే చర్చిలో అంతా పరిశుద్ధులు, నీతిమంతులే ఉండాలన్న నియమం పెట్టుకున్న స్వనీతిపరులైన విశ్వాసులు మాత్రం ఏ చర్చిలోనూ ఇమడలేరు. యూదులు కాకుండానే యూదులమని అబద్ధమాడే సాతాను సమాజపు వాళ్లంతా వచ్చి నీకు నమస్కారం చేస్తారని ఫిలడెల్ఫియా చర్చికి ప్రభువు వెల్లడించాడు. అబ్రాహాము విశ్వాసవారసత్వంతో సంబంధం లేకున్నా శరీర సంబంధంగా ఆయన వంశానికి చెందిన వారమని చెప్పుకొనే పరిసయ్యులను ఆనాడు యేసుప్రభువు ‘మీరు మీ తండ్రి అయిన సాతాను సంబంధులు, అతని క్రియలు చేయగోరేవారు’ అంటూ ఘాటుగా విమర్శించాడు( యోహాను 8:44). నిజమైన క్రైస్తవ విశ్వాస విలువలు లేకున్నా, తమ తాతలు తండ్రులు క్రైస్తవులు కాబట్టి మేము కూడా క్రైస్తవులమేనని చెప్పుకొనే నామకార్ధపు తరతరాల క్రైస్తవులతో ఈరోజుల్లోనూ చర్చికి సమస్యలున్నాయి. అయితే వారిని విమర్శించడం, పరిహసించడం, వెళ్లగొట్టడం, సూటిపోటి మాటలనడం అందుకు పరిష్కారం కానే కాదు. యేసుప్రభువు అనుచరులమని చెప్పుకునే వాళ్లంతా యేసు ప్రేమకు, ఆయన చూపించిన క్షమాపణకు ప్రతినిధులు!! మన ప్రేమ, క్షమా స్వభావమే వారిని మార్చి దేవుని వైపునకు తీసుకెళ్ళాలి. బైబిల్ కన్నా, దేవునికి సంబంధించి మనకున్న అనుభవ జ్ఞానం, దాని మూలంగా ఏర్పడిన విశ్వాసం, క్షమ, ప్రేమాపూర్ణత కలిగిన మన జీవితం ఇతరులను ప్రభావితం చేసి వారిని ఆత్మీయంగా స్వస్థపర్చి ప్రభువు వద్దకు నడిపిస్తుంది. అందుకు ఎంతో జ్ఞానం, మరెంతో శక్తి అవసరం లేదు. సాత్వికత్వంతో తలవంచుకొని దేవుని పక్షాన ధీరత్వంతో నిలబడగల మన ‘కొంచెం శక్తి’ చాలు, ఫిలడెల్ఫియా చర్చిలాగా గొప్ప దేవునికోసం గొప్ప కార్యాలు చేసి గొప్ప విశ్వాసులమనిపించుకోవడానికి. సూపర్ మార్కెట్లో ఉండే వందలాది కొవ్వొత్తులకు చీకటి ఏ మాత్రం భయపడదు. కానీ పూరిగుడిసెలో మూలన వెలిగే ఒక చిన్నకొవ్వొత్తికి కారు చీకటి కూడా వణికి పారిపోతుంది. క్రైస్తవుడు కూడా సూపర్ మార్కెట్లో కొవ్వొత్తి కాదు, అతను వెలిగే కొవ్వొత్తి... అందుకే మరి, క్రైస్తవులెప్పుడూ మైనారిటీలే!!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
చిక్కుల్లో సూపర్ స్టార్ చిత్రం
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ తాజా చిత్రం ‘లూసిఫెర్’ వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రంలో క్రైస్తవుల మనోభావాలను దెబ్బ తీశారని.. చర్చి విలువలను కించపరిచారంటూ క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ ఆఫ్ కేరళ ఆధ్వర్యంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు వారు ఫేస్బుక్ ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం లూసిఫెర్. అయితే ఈ పేరును క్రైస్తవులు సాతానుగా నమ్ముతారని.. కానీ ఈ చిత్రంలో అందుకు విరుద్ధంగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఫేస్బుక్ పోస్ట్లో ‘చర్చి ఔన్నత్యాన్ని, క్రైస్తవ విలువలను, మత కర్మలను దూషిస్తూ.. సాతాను పేరును స్తుతిస్తున్నారు. దీన్ని బట్టి మలయాళ చిత్ర పరిశ్రమలో ఎంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయో అర్థం అవుతుంద’ని పేర్కొన్నారు. ఈ పోస్ట్ను ఇప్పటకే వేల మంది లైక్ చేయడమే కాక ‘‘లూసిఫెర్’ను క్రిస్టియన్లు సాతానుగా భావిస్తారు’ అని కామెంట్ చేస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన లూసిఫెర్ చిత్రం గురువారం విడుదలయ్యిది. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారి దర్శకత్వ వహించిన ఈ చిత్రం ఇప్పటికే పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడమే కాక సమ్మర్ బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. -
తల్లి్ల మరియా... కాచికాపాడుమమ్మా!
శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల సహాయమాత మేరిమాత మహోత్సవం నేడు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం సమీపంలోని యు.వెంకమ్మపేట వద్ద మరియగిరిపై జరుగుతోంది. ఈ కొండపై వెలసిన మరియమ్మకు శ్రీకాకుళం మేత్రాసనం పీఠాధిపతి అడ్డగట్ల ఇన్నయ్య ఆధ్వర్యంలో ఏటా జనవరి 30న ప్రత్యేక దివ్యపూజలు నిర్వహిస్తారు. ‘విశ్వ స్వరూపుడైన దేవదేవుని పుత్రుని నీ వరాల గర్భంబున ధరియించిన మేరిమాతా వందనం అభివందనం..’ అంటూ, ‘దేవునిచే ఎన్నుకొనబడిన ఓ సుధాభాషిణి నీకే వందనం.. దైవప్రజలారా.. దైవ జనమా..’ అంటూ బిషప్ ఇన్నయ్య స్తోత్రం పలికి పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఈ యాత్రకు ఒక రోజు ముందే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలతో పాటు ఒడిశ్సా రాష్ట్రం నుండి తండోపతండాలుగా క్రైస్తవులు, హిందువులు తరలివచ్చి దివ్యపూజలో పాల్గొంటారు. అనంతరం మరియగిరి కొండను అధిరోహించి మేరిమాతను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. కులమతాలకు అతీతం మరియగిరి యాత్ర రోజున ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. మఠకన్యలు, పీఠాధిపతులు, క్రైస్తవ గురువుల ప్రత్యేక ప్రార్థనలతో మేరిమాత స్తోత్రం మారు మ్రోగుతుంది. ఈ సందర్భంగా మేరిమాతను దర్శించుకొనేందుకు కులమతాలకు అతీతంగా భక్తులు కొవ్వొత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి, హిందూ సంప్రదాయంలో ఉన్నట్లు తలనీలాలు అర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ‘ఓ తల్లీ మరియా.. మమ్మల్ని కాచికాపాడుమమ్మా’ అంటూ ప్రార్థనలు చేస్తారు. దివ్య పూజలో క్రైస్తవ గీతాలను ఆలపిస్తూ మరియమ్మను స్తుతిస్తారు. కుటుంబ సమేతంగా మేరీమాతను దర్శించుకున్న తర్వాత భక్తులు వనభోజనాలు చేస్తారు. ఏటా 25 వేల నుండి 30 వేల మంది భక్తులు హాజరై మేరీమాతను దర్శించుకుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నేటి మరియగిరి యాత్రకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి తరలివచ్చే భక్తుల కోసం పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం, సాలూరు, టెక్కలి, విజయనగరం తదితర ఆర్టీసీ డిపోల నుండి స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. ఈ ఏడాది సుమారు 35 వేలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్న అంచనాతో మరియగిరి వద్ద ప్రత్యేక ఆర్టీసీ కంట్రోల్ పాయింట్ను ఏర్పాటు చేశారు. -
వాటికన్ సిటీలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
వాటికన్ సిటీ: ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనానికి దూరంగా గడపాలని క్రిస్మస్ వేడుకల సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ మంగళవారం పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. పోప్ ప్రసంగం వినేందుకు సోమవారం రాత్రి వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా చర్చికి వేల సంఖ్యలో క్రైస్తవులు హాజరయ్యారు. ‘నేటికీ మానవుడి జీవితం నిరాశ నిస్పృహలతో నిండి ఉంది. కొందరు విలాసవంతమైన జీవనాన్ని గడుపుతుంటే మరికొందరు ఓ పూట రొట్టె ముక్క కోసం ఇబ్బంది పడుతున్నారు..’అని పోప్ వ్యాఖ్యానించారు. ఇటు జీసస్ జన్మస్థలంగా భావించే బెత్లెహాంలో కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. -
సీబీఐ దర్యాప్తునకు ఎలా ఆదేశించాలి?
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో క్రైస్తవులపై దుష్ప్రచారం చేస్తున్నవారు ఎవరో తెలియకుండా సీబీఐ దర్యాప్తునకు ఎలా ఆదేశించాలని ఆలిండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్(ఏఐటీసీసీ)ను హైకోర్టు ప్రశ్నించింది. హిందూ జనశక్తి, శివశక్తిలకు చెందిన వారు ఏపీ, తెలంగాణాల్లో క్రైస్తవులపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇందుకు సంబంధించి పలు పోలీసు స్టేషన్లలో ఉన్న కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ విశాఖలోని మాధవధారకు చెందిన కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శి కొలకలూరి సత్యశీలరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఎవరిపై ఆరోపణలు చేస్తున్నారో వారిని వ్యాజ్యంలో పేర్కొనకుండా సీబీఐ దర్యాప్తు చేయాలని కోరడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. శివశక్తి, హిందూ జనశక్తిలను ప్రతివాదులుగా చేసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. -
2019 ఎన్నికల కోసం ప్రార్థనలకు పిలుపు
న్యూఢిల్లీ: భారతదేశ ప్రజాస్వామిక విలువలు, లౌకిక వ్యవస్థకు దేశంలోని ప్రస్తుత ‘అల్లకల్లోల రాజకీయ వాతావరణం’ ముప్పుగా పరిణమించిందని ఢిల్లీ ఆర్చిబిషఫ్ అనిల్ కౌటో చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. కర్ణాటకలో ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఢిల్లీ ఆర్చిడయోసిస్ పరిధిలోని అన్ని చర్చిలు, మత సంస్థలకు ఆయన లేఖ రాస్తూ.. 2019 సాధారణ ఎన్నికల నేపథ్యంలో మే 13 నుంచి ప్రార్థనా ఉద్యమానికి పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రతీ శుక్రవారం క్రైస్తవులు ఉపవాసం ఉండాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యల్ని కేంద్ర ప్రభుత్వం తప్పపడుతూ.. అవి కౌటో వివక్షపూరిత మనస్తత్వాన్ని చాటిచెపుతున్నాయని విమర్శించింది. అయితే తన లేఖ మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాదని కౌటో మంగళవారం వివరణిచ్చారు. ‘దేశం కోసం వారానికి ఒక రోజు వెచ్చించాలని నేను చెప్పాను. ముఖ్యంగా ఎన్నికలు వస్తున్నందున ఈ సూచన చేశాను. అందువల్ల ఇది ఏ విధంగాను నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాసిన లేఖ కాదు. గత నాలుగేళ్లలో వార్తా పత్రికలు, మీడియాలో ఎన్నో వార్తలు చూశాం. ప్రజల ఆహార అలవాట్లు, దాడుల ఘటనలతో పాటు నలుగురు న్యాయమూర్తులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం చూశాం. వీటిపై న్యాయవ్యవస్థ స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. ఒక పౌరుడిగా నేను కూడా ఆందోళన వ్యక్తం చేశాను’ అని లేఖలోని అంశాల్ని ఆయన సమర్థించుకున్నారు. -
చికాగోలో క్రైస్తవుల వివాహా పరిచయ వేదిక
చికాగో : అమెరికాలోని భారతీయ క్రైస్తవ యువతి, యువకుల కోసం వివాహా పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. ఎలిజర్ మినిస్ట్రి ఆఫ్ మాట్రిమోనీ చికాగో(ఈఎంఎం) ఆధ్వర్యంలో యునైటెడ్ తెలుగు క్రిస్టియన్ కమ్యూనిటీ ఆఫ్ చికాగో, క్లెర్జి కౌన్సిల్ ఆఫ్ చికాగో (సీసీసీ) ల సహకారంతో ఈ నెల 7న ఇల్లినాయిస్లో ఏర్పాటు చేసినట్టు నిర్వాహాకులు తెలిపారు. ఈ పరిచయ వేదికకు పెద్ద సంఖ్యలో యువతి, యువకులు వారి తల్లిదండ్రులు హాజరైయ్యారు. పరివార్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సామ్ జార్జ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈఎంఎం సమన్వయకర్తలైన ప్రభు, జాన్సన్ సుక్కు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన యువతీయువకులకు, తల్లిదండ్రులకు, శ్రేయేభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. -
క్రీస్తు కారుణ్యం మనకు ఆదర్శం
ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకొంటున్నారు. మనుష్యుల హదయాల్లో వెలుగును నింపిన పండుగ ఇది. మరణాన్ని జయించి తిరిగిలేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మానవుని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. యేసు పునరుత్థానం మనిషికి నిజమైన పరమార్థాన్ని తెలియచేసింది. దేవునికి అసాధ్యమేదీ ఉండదని నిరూపించింది. యెరూషలేములోని యేసు ఖాళీ సమాధి మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రతీ యేటా కోట్లాదిమంది ఆ ఖాళీ సమాధిని చూసి పరవశంతో నింపబడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జీవితం నుండి కొన్ని అమూల్య పాఠాలను ‘సాక్షి’ పాఠకులకు అందిస్తున్నాం. క్రీస్తు జీవనశైలి ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైది. భువిపై ముప్పై మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకొని వచ్చింది. నిరాశ నిస్పృహల నుండి మనిషికి విడుదల ప్రసాదించింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా, పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా పరమాత్ముని బాటలో నడవాలని క్రీస్తు బోధించాడు. మహత్తర ఆధ్యాత్మిక భావాలు ఇమిడియున్న ఆయన బోధల ద్వారా ప్రయోగాత్మకమైన ఫలవంతమైన జీవితానుభవాలు పొందుకొనే సావకాశం ఏర్పడింది. గర్వం, అహంభావం, దురహంకారం ఏలుబడి చేస్తున్న ప్రస్తుత లోకంలో ఘనతర లక్ష్యాలు నిలువుగా నీరు గారిపోతున్నాయి. మనిషి మస్తిష్కంలో గూడుకట్టుకుపోయిన పాప స్వభావం వల్ల సమాజానికి చాలా కీడు జరుగుతోంది. పాపం మనిషిని ఎటువంటి నీచస్థానానికైనా దిగజారుస్తుంది. ఆఖరుకు పతనానికి నడిపిస్తుంది. సాటి మనిషిని ప్రేమించని రాక్షస సమాజంలో తన దివ్యమైన బోధల ద్వారా నవ్యపథ నిర్దేశం చేసిన ఘనుడు యేసుక్రీస్తు. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించి తన ప్రేమతత్వాన్ని లోకానికి ఆచరణాత్మకంగా చాటిచెప్పాడు. తన పంతమే నెగ్గాలని ఉవ్విళ్లూరే ఉగ్రవాదానికి బలౌతున్న అభాగ్యులు ఎందరో. పైశాచిక మూర్ఖత్వపు దాడులు మానవాళి చరిత్రలో నెత్తుటి పుటలను లిఖిస్తున్నాయి. ఇటువంటి సమాజంలో మార్పును తీసుకురావాలన్న సదాశయంతో వెలువడిన క్రీస్తు సందేశాలు, బోధలు సదా ఆదరణీయం. ‘‘ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది.’’ అని క్రీస్తు కొండమీది ప్రసంగంలో తెలియచేశాడు. ఆత్మలో దీనత్వం అనగా తన నిస్సహాయతను సర్వశక్తుడైన దేవుని దగ్గర నిర్మొహమాటంగా ఒప్పుకోవడం. ఒక చంటిబిడ్డ తన తల్లిపై ప్రతి చిన్న విషయానికి ఏవిధంగా ఆధారపడుతుందో అలా పరమాత్మునిపై ఆధారపడటం. స్వనీతి కార్యములు మోక్షప్రాప్తినివ్వవని మనస్ఫూర్తిగా గ్రహించి పశ్చాత్తాపంతో దేవుని పాదాలను అశ్రువులతో అభిషేకం చేయడం. భౌతిక ప్రపంచంలోనైనా ఆధ్యాత్మిక ప్రపంచంలోనైనా పతనానికి దోహదమయ్యే దుర్లక్షణాలను దేవుని శక్తిద్వారా పరిత్యజించడం. ‘‘తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.’’ అనే తన దివ్య బోధలతో శిలలను కూడా శిల్పంగా మార్చుతున్నాడు యేసు. భయరహిత వాతావరణం సృష్టించుకుంటూ దినదిన ప్రవర్ధమానం చెందడం క్రీస్తు బోధల ద్వారా నేర్చుకోవచ్చు.జీవితం విలువ తెలిసినవానికి ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ అహంకారం ఉండదు. నాశనమునకు ముందు గర్వము నడుస్తుందనేది బైబిల్ ఉపదేశం. అసత్యపు బండలను కొట్టుకొని తునాతునకలౌతున్నమనిషిని సంపూర్ణతలోనికి నడిపించాలన్నదే క్రీస్తు ఆలోచన. జడత్వంతో నిండిన ఇంద్రియాలను చైతన్యపరచి, వర్ణరహిత వర్గరహిత సమసమాజ నిర్మాణం కోసం తన వంతు కృషి సలిపిన మహాఘనుడు యేసుక్రీస్తు. ‘ఒక చెంప మీద కొట్టిన వానికి మరొక చెంప చూపించు’ అని బోధించిన యేసు అక్షరాలా దానిని తన జీవితంలో నెరవేర్చగలిగారు. యేసు దివ్యనామము విశ్వమంతటా మారుమోగడానికి గల అనేక కారణాలలో ‘ఆయన కారుణ్యం’ ప్రధానమైనది.క్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో యెరూషలేములోని మేడగదిలో తన శిష్యుల పాదాలను కడిగాడు. అది ప్రజల గుండెల్లో శాశ్వతకాలం నిలిచిపోయే ఓ అపురూప సంఘటన. అప్పటికే ఆయనకు ఆ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రజాదరణ ఉంది. అన్ని వర్గాల ప్రజలు ఆయనను గొప్పవానిగా, దేవునిగా గుర్తించి ఆయనను వెంబడిస్తున్నారు. యేసు భోజనపంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రాన్ని పక్కన ఉంచి ఒక తువాలు నడుమునకు కట్టుకొని, పళ్లెములో నీళ్లు పోసి తాను ఏర్పరచుకొన్న శిష్యుల పాదాలు కడుగుటకు, వాటిని తువాలుతో తుడుచుటకు మొదలుపెట్టాడు. తాను కాళ్ళు కడిగే శిష్యులు చాలా సామాన్యమైన వారు. వారు ఆనాటి సమాజంలో విశిష్టులు కారు. ఆ సందర్భంలో శిష్యులు ఆయనను వారించినా భావితరాలకు స్ఫూర్తి కలుగుటకు, సేవాతత్పరతను అందరూ అలవాటు చేసుకొనుటకు ఆవిధంగా యేసు చేశాడు. తాను ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తన్ను తాను తగ్గించుకొని చేసిన ఆ సర్వోత్తమ కార్యము సాక్షాత్కరించిన జీవితాల్లో ‘సేవ’ పట్ల యథార్థ దృక్పథాన్ని రగిలించింది. ‘నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు’, ‘మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి’ అన్న క్రీస్తు బోధనలు చేతల్లో నిరూపించబడ్డాయి. ఈ అసాధారణ సంఘటన ఆధారంగా అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యానికి ఓ వినూత్న నిర్వచనాన్ని ఇచ్చాడు. ‘ప్రజల యొక్క, ప్రజల ద్వారా, ప్రజల కొరకు’ అనే నినాదంతో నవ్యపథ నిర్దేశాన్ని చేశాడు. ‘మనుష్యులంతా సమానమే’ అంటూ వర్ణ వివక్షను రూపుమాపడానికి తనవంతు కృషి చేశాడు.క్రీస్తులో ఉన్న శాంత స్వభావాన్ని, కారుణ్యాన్ని, ప్రేమను ఆకళింపు చేసుకొన్న మదర్ థెరిసా భారతదేశ చరిత్రలో ఓ శ్రేష్టమైన స్థానాన్ని పొందింది. కేవలం మన దేశానికే కాదు యావత్ ప్రపంచానికే దీవెనకరంగా మారిన మదర్ క్రీస్తు ప్రేమాగ్ని జ్వాలల్లో నుంచి ఎగసిన ఓ నిప్పురవ్వ. అనాథలకు, అభాగ్యులకు సేవ చేయాలన్న తపనతో ఈ దేశానికి వచ్చిన మదర్ ఎందరినో అక్కున చేర్చుకొంది. కడుపునిండా అన్నం, కంటినిండా నిద్ర, ఒంటి నిండా బట్టలను ఇచ్చి మానవీయ హృదయంతో ప్రజలను ఆదుకొంది. ఎక్కడ నుంచో వచ్చిన ఆమెను ‘మదర్’ అని సంబోధిస్తూ ఆమెను గౌరవించిన వారు ఎందరో ఉన్నారు. ఉన్నత స్థితిగతులను విడిచి లోకహితం కోసం పాటుపడాలన్న ఆకాంక్షతో కలకత్తా వీధుల్లో అనాథ పిల్లల పోషణ కోసం యాచన చేసేది. ఆ ప్రక్రియలో ఒకసారి వికృత చేష్టలకు బందీయైన ఒక వ్యక్తి, మదర్ థెరిసాపై ఉమ్ము వేశాడు. ‘దీనత్వం’ అంటే ఏమిటో నేర్చుకుంది కదా! ఆ ఉమ్మిని తుడుచుకొంటూ ‘‘నా కోసం ఇది ఇచ్చావు... అనాథ పిల్లల కోసం ఏమి ఇస్తావు?’’ అని తిరిగి అడిగింది. ఆ ఒక్క మాటతో గర్వపు పొరలు విడిపోయాయి. ఇంతగా అవమానించినా తిరిగి ఏమీ అనని మదర్ గుండెల్లో ఉన్న తగ్గింపును అర్థం చేసుకొన్నాడు. జీవితాంతం మదర్ థెరిసా ఆశ్రమానికి తనకు తోచినంత సహాయం చెయ్యడం ప్రారంభించాడు. నోబెల్ బహుమతి ప్రదానం రోజున మదర్ మాట్లాడుతూ ‘క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించగలగడమే నిజమైన క్రైస్తవ్యం’ అని తాను ఎవ్వరి నుంచి సేవాస్ఫూర్తిని పొందిందో ఆ విషయాన్ని కచ్చితంగా ప్రపంచానికి తెలిపింది. నేటికీ ఆమె ద్వారా స్థాపించబడిన సంస్థల ద్వారా విశేషమైన సేవలు పేదలకు అభాగ్యులను అందుతున్నాయి. కొంత చేసి ఎంతో చేశామని ప్రగల్భాలు పలికే నేటి సమాజంలో ఎంతో చేసినా ఇంకా ఏదో చెయ్యాలన్న తపనతో నింపబడిన వ్యక్తులను కనుగొనడం కొంచెం కష్టమే. అటువంటి వారిలో విలియం కేరీ ఒకడు. ఇంగ్లండ్ దేశం నుండి భారతదేశానికి వచ్చి ఎన్నో విశిష్ట కార్యాలు చేశాడు. ఒక్కమనిషి తన జీవితకాలంలో ఇన్ని కార్యాలు చేయగలడా? అనిపించే విధంగా సమాజ అభ్యున్నతి కోసం పాటుపడ్డాడు. అంతే కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను 36 భాషల్లోకి అనువదించాడు. అనేక భారతీయ భాషల్లో నిఘంటువులు రాశాడు. పట్టాను బహూకరించే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. స్వదేశ భాషలో మొట్టమొదటి వార్తాపత్రికను ప్రారంభించాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తాను సాధించాలనుకున్న వాటిని సాధించి తీరాడు. దేశచరిత్రలో, ప్రజల గుండెల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాడు. జీవన పరిణామాలన్నింటిని సమదృష్టితో చూడగలిగే స్థితప్రజ్ఞతను ఆకళింపు చేసుకున్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసి ఒకసారి ఇంగ్లండ్ వెళితే తన స్నేహితుడొకడు వచ్చి అపహాస్యంతో, విలియం కేరీని కించపరచాలనే ఉద్దేశంతో ‘నీవు చెప్పులు తయారు చేసుకొనే వ్యక్తివని మర్చిపోవద్దు’ అన్నాడు. క్రీస్తు కారుణ్యంతో, వినమ్రతతో నింపబడిన కేరీ ‘అయ్యా! నేను చెప్పులు తయారు చేసేవాణ్ణి కాదు... వాటిని కేవలం బాగుచేసుకునేవాణ్ణి’’ అని బదులిచ్చాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేసిన కేరీ ఇచ్చిన సమాధానం, అతనిలో ఉన్న తగ్గింపు ఆ వ్యక్తిని ఎంతగానో ఆశ్చర్యపరచింది. అంతేమరి! నిండుకుండ ఎప్పుడూ తొణకదు కదా! ‘కారుచీకటిలో కాంతిరేఖ’ అని కేరీని పిలవడంలో అతిశయోక్తి లేదుకదా! ఇవి కేవలం కొన్ని ఉదాహరణలే. ప్రపంచంలో నేటికీ కోట్ల సంఖ్యలో ప్రజలు క్రీస్తు కారుణ్యమునకు, దీనత్వమునకు ఆరాధకులే. ఆధ్యాత్మిక చింతన కోసం, జీవన సాఫల్యం కోసం తపించే ప్రతి ఒక్కరూ క్రీస్తులో ఉన్న మహోన్నత ప్రేమతత్వానికి మంత్రముగ్ధులే. మానవ హృదయ వైశాల్యాన్ని పెంచుతూ, గుణాత్మక పరివర్తనకు దోహదపడుతున్న క్రీస్తుప్రభువు తగ్గింపు జీవితం సదా అభినందనీయం. యేసుక్రీస్తు పరలోకములో ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి, తన్ను తాను రిక్తునిగా చేసుకొని సిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నాడని పౌలు మహాశయుడు తెలియజేశాడు. నిజమే.. యేసు పుట్టింది పశువులశాలలో. పసికందుగా పవళించింది గరుకైన పశువుల తొట్టెలో! దేవుడు ఈ లోకంలో పుట్టాలనుకుంటే ఆయన మాట ద్వారా సృష్టించబడిన ఈ సృష్టిలో పూల పాన్పులు, అంతఃపురాలు ఆయనకు ఆహ్వానం పలుకలేవా? ఎందుకు ఆయన పశువులశాలలో పుట్టాడు? పశువుల శాల వంటి మానవ çహృదయాన్ని పావనపరచుటకు ఆయన పశువుల తొట్టెలో జన్మించాడు. రెండవ కారణం ‘‘పశువుల శాలలోనికి ఎవ్వరైనా నిరభ్యంతరంగా వెళ్లవచ్చు’’. క్రీస్తును దర్శించుటకు కుల మత ప్రాంత వర్గ భేదాలు లేనేలేవు. వాస్తవానికి క్రీస్తు పుట్టినప్పుడు ఆయనను మొదటగా దర్శించుకున్నది గొర్రెల కాపరులు. రాత్రివేళ తమ మందను కాచుకొనుచున్న గొర్రెల కాపరులకు దూత ద్వారా శుభవార్త అందింది. భక్తి పారవశ్యంతో క్రీస్తును దర్శించుకొని పరమానందభరితులయ్యారు. ఇది నిజంగా విడ్డూరమే! లోకరక్షకుడు అందరికీ చెందినవాడు. ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడని క్రీస్తు తన జన్మ ద్వారా నిరూపించాడు. పువ్వు నుంచి పరిమళాన్ని, తేనె నుంచి మాధుర్యాన్ని, చంద్రుని నుంచి చల్లదనాన్ని, మీగడ నుంచి కమ్మదనాన్ని, అమ్మ నుంచి అనుబంధాన్ని వేరుచేయలేనట్టుగానే క్రీస్తు నుంచి ప్రేమను, కరుణాపూరితమైన మనసును వేరుచేయలేము. క్రీస్తు ప్రేమ అనిర్వచనీయమైనది. అవధులు, షరతులు లేనిది. విలువైన ఆయన ప్రేమలో వంచన లేదు. మధురమైన క్రీస్తు ప్రేమకు మరణం అంటే ఏమిటో తెలియదు. ప్రవచనాల ప్రకారం క్రీస్తు పుట్టింది బెత్లేహేము అనే చిన్న పల్లెటూరులోనైతే ఆయన పెరిగింది నజరేతులోని ఒక వడ్లవాని ఇంటిలో. ఆ కాలంలో గలిలయలోని నజరేతుకు ఏమాత్రం పేరుప్రఖ్యాతులు లేవు. పేరుకు మాత్రం తండ్రి అని పిలువబడిన యోసేపు అనే వ్యక్తికి అన్ని విషయాలలో సహాయం చేశాడు. కష్టమంటే ఏమిటో తెలుసు. చెమటోడ్చడం అంటే తెలుసు యేసుకు. మనిషి సాధక బాధకాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది. యేసు భూమ్మీద జీవించిన కాలంలో స్నేహం చేసింది పామరులతో, గొర్రెల కాపరులతో, చేపలు పట్టే జాలరులతో. ఆ కాలంలో పరమ పాపులుగా పిలువబడే సుంకరులతో అనేకసార్లు భోజనం చేశాడు. వారితో సహవాసం చేసి దైవ మార్గాన్ని వారికి ఉపదేశించాడు. దైవభక్తిలో ఎడతెగని, అలుపెరుగని అలౌకిక అనుభవాలు దాగి ఉంటాయని తెలియచెప్పాడు. మనిషి సమస్యలను, పేదరికాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి యేసుక్రీస్తు. అందుకేనేమో! వారందరి çహృదయాల్లో రారాజుగా కొలువుంటున్నాడు. కాంతికి వేగాన్ని నియమించిన దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఎంత దూరమైనా కాలిబాటతోనే ప్రయాణించాడు. ఇవన్నీ ఆయన కారుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలు. నక్కలకు బొరియలున్నాయి. ఆకాశ పక్షులకు గూళ్లున్నాయి. కానీ తలవాల్చుకొనుటకు మనుష్య కుమారునికి చోటు లేదని చెప్పడం ద్వారా ప్రజల కోసం తానెంత కరుణామయుడిగా మారిపోయాడో తెలియచెప్పాడు. ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు దివ్య మహిమతో నిండిన ఆ మహాఘనుడు శరీరధారిగా తగ్గించుకొని వచ్చిన ప్పుడు కుష్టు వ్యాధిగ్రస్తులను కౌగిలించుకున్నాడు. ఆ కాలంలో కుష్టు వ్యాధిగ్రస్తులను అంటరాని వారుగా పరిగణించేవారు. సమాజంలోనికి రానిచ్చేవారు కాదు. సొంత కుటుంబ సభ్యులు కూడా విపరీతంగా ద్వేషించేవారు. అలాంటివారిని తన దివ్య స్పర్శతో బాగుచేశాడు. వారికి నూతన జీవితాన్ని ప్రసాదించాడు. రోగ పీడితులను పరామర్శించాడు. పాపంలో పట్టుబడి భయంతో సభ్య సమాజంలో తలదించుకొన్న వ్యభిచారిని అమ్మా! అని పిలిచిన పరిశుద్ధుడు క్రీస్తు. వికటముతో మాట్లాడి, చులకనగా వ్యవహరించిన వారిని కూడా ప్రేమపూర్వక పదజాలంతో తన్మయుల్ని చేసిన కరుణామయుడు. మట్టల ఆదివారం రోజున క్రీస్తు గాడిదపై ప్రయాణం చేశాడు. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు అని జెకర్యా ద్వారా పలుకబడిన ప్రవచనం నెరవేరింది. పూర్వదినాల్లో ఏ రాజైనా గుర్రంపై ప్రయాణిçస్తూ మరో పట్టణానికి వెళ్తే యుద్ధానికి వస్తున్నాడని ఇట్టే గ్రహించేవారు. గాడిదపై వస్తుంటే సమాధానం కోసం వస్తున్నాడని గ్రహించేవారు. కలవరంలో నిండిపోయిన యెరూషలేము పట్టణానికి సమాధానాన్ని ప్రకటించడానికి క్రీస్తు గాడిదపై దీనుడుగా ప్రయాణం చేశాడు. ‘‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి నేను విశ్రాంతిని కలుగచేతును’’ అని క్రీస్తు ఏనాడో ప్రకటించాడు. నేటి దినాల్లో మనిషి మనశ్శాంతి కోసం తపిస్తున్నాడన్నది కాదనలేని సత్యం. విశ్యవ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు శాంతి కోసం అన్వేషిస్తున్నారు. కొందరు ధన ధాన్యాలలో శాంతిని వెదకుతుంటే మరికొందరు కీర్తి ప్రతిష్టలలో వెదకుచున్నారు. కొందరు బంధాల్లో శాంతిని పొందుకోవాలని తపిస్తుంటే మరికొందరు ఒంటరి తనంలోనే సంతోషాన్ని వెదకుచున్నారు. ఈ వెతుకులాటలో నిజమైన శాంతి దొరకక అనేకులు ఆత్మహత్యలు చేసుకొనుచున్నారు. వాస్తవాన్ని అంగీకరించే మనస్సుంటే శాంతి అనేది భౌతిక సంబంధమైన విషయాలపై ఆధారపడి లేదు. ప్రపంచంలో రెండు రకాల ప్రజలుంటారు. కొందరు శాంతి సమాధానాల కోసం పరితపిస్తారు, మరికొందరు శాంతితో జీవిస్తారు. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి గలవాడు శాంతి సమాధానాలతో జీవిస్తాడని భారతదేశ రెండవ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక సందర్భంలో తెలియజేశారు. అవును! పరమాత్ముడు సమాధానానికి సృష్టికర్త గనుక ఆయన పాదాల దగ్గర కాకపోతే మరెక్కడ శాంతి దొరుకుతుంది? క్రీస్తు పొంతి పిలాతు ద్వారా అన్యాయపు తీర్పు తీర్చబడి, వస్త్ర హీనునిగా చేయబడి, పరమ పవిత్రుడైనప్పటికీ మనిషి కోసం దోషిలా నిలువబడి, మానవ అపహాస్యాన్ని, హేళనను భరించిన సహనశీలి. తాను చేయని నేరాలను తలదించుకొని భరించాడు. చివరకు తనను యెరూషలేము వీధుల్లో ఈడ్చి, కల్వరి కొండపై మేకులతో సిలువకు కొట్టి, ముళ్ల కిరీటం ధరింపజేసి కిరాతకంగా హింసించిన వారిని కూడా క్షమించిన దయార్ద్ర హృదయుడు యేసు. ఒక్క ఎదురుమాట చెప్పినందుకే మొండెము నుండి తల వేరు చేయించిన చక్రవర్తులు ఎందరో చరిత్రలో ఉన్నారు. తమ మాటకు ఎదురు నిల్చినవారిని ఖండములుగా నరికినవారున్నారు. తమను అవమానపరచారని కత్తి వాతకు గురిచేసిన రాజులెందరో మానవ చరిత్రలో ఉండగా ప్రేమ చూపి సత్క్రియలు చేసి, దయను కురిపించి, ఆకలి తీర్చి, స్వస్థపరచి, మృతులను సైతం సజీవులుగా చేసిన మహోన్నతుడు యేసు. యేసు ఏమి సొంతం చేసుకోవాలని అనుకున్నాడు? ఆయన పుట్టింది ఎవరో పశువులపాకలో. ఒకసారి ఓ పరాయి పడవలో అమరమున తలవాల్చి నిదురించాడు. అనేక రాత్రులు ఒంటరిగా గెత్సేమనే తోటలో ప్రార్థనలో గడిపాడు. ఆఖరికి ఆయన మరణించిన తరువాత కూడా అరిమతయి యోసేపు అనువాని సమాధిలో ఉంచబడ్డాడు. ఇవన్నీ దేనికోసం? కేవలం మనిషిని సొంతం చేసుకోవాలన్న ఆశయంతో, తపనతో ఆయన దేన్నీ సొంతం చేసుకోలేదు. అవును! పరమాత్ముడు మనిషి çహృదయంలో వసించాలని ఆశిస్తున్నాడు. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని క్రీస్తు పలికాడు. అది అక్షరాలా ఆయన జీవితంలో నెరవేరింది. ఒంటరిగా సిలువపై వేలాడుతూ ప్రజల పాపాల కోసం, పాప ప్రాయశ్చిత్తం కోసం యేసు సిలువలో మరణించాడు. మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన ఫ్లావియస్ జోసీఫసు కూడా క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించాడు. ఆ సమయంలో సిలువ చుట్టూ చేరిన అనేకులు సిలువ నుంచి దిగిరా! నీవు దైవకుమారుడని నమ్ముతామని క్రీస్తును సవాలు చేశారు. అంతమంది సవాలు చేస్తున్నా క్రీస్తు ఎందుకు సిలువను దిగలేదు? ఆ స్థానం నుంచి క్రీస్తు తప్పుకుంటే మానవునికి రక్షణ లేదు గనుక. పాప పరిహారం జరగదు గనుక.సమాధిలో ఉంచబడిన క్రీస్తు జీవితం ముగిసిపోయిందనుకున్నారంతా! ఆయన జీవితం సమాప్తమైనదని భావించారు. కానీ వారి అంచనాలను పటాపంచలు చేస్తూ మూడవ రోజున మరణ బంధనాలను తెంచుకొని యేసుక్రీస్తు బయటకు వచ్చారు. సమాధి ముందు పెట్టబడిన పెద్దరాయిగాని, చుట్టూ మోహరించి ఉన్న రోమన్ సైనికులు గాని ఆయన పునరుత్థానాన్ని అడ్డుకోలేకపోయారు. ఎన్నో ఏళ్లు మనిషిని ఏలుబడి చేసిన మరణం ఆరోజు మరణించింది. సత్యాన్ని ఏ ఒక్కరూ శాశ్వత సమాధి చేయలేరని ఋజువుచేయబడింది. అఖండ విజయం ఆయన పాదాక్రాంతమయ్యింది. సిలువ మరణం వరకు తగ్గించుకున్నాడు గనుక ఇప్పుడు హెచ్చింపబడ్డాడు. సమాధి నుంచి బయటకు వచ్చాడు గనుక ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్ శతాధిపతి లాజినస్. ప్రక్రియంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తుండగా పిలాతు భార్య ప్రొక్యులా ఇలా అడిగింది – ‘‘క్రీస్తు పై నీ అభిప్రాయం ఏమిటి?’‘. ‘‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణం కచ్చితంగా ఓడిపోతుంది. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి శ్రీకారం చుడతాడు. విశ్వంలో ఆయన పేరు మారుమ్రోగుతుంది. ఈసారి ఆయన్ను ఏ రోమన్ చక్రవర్తి గాని, శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’’ అని బదులిచ్చాడు. ప్రియ నేస్తమా! ప్రతికూల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నావా? అన్యాయం జరిగిందని బాధపడుతున్నావా? ప్రజలంతా నిన్ను నిందిస్తూ వేధిస్తున్నారా? నీవు ఎందుకూ పనికిరావు, నీ వల్ల ఏదీ కాదు అనినిన్ను హేళన చేస్తున్నారా? మౌనం వహించు! నీవు చేయాలనుకున్న కార్యమును నెరవేర్చడానికి ముందుకు సాగిపో! మరణాన్ని జయించిన దేవుని అనిర్వచనీయమైన కృప మరియు శక్తి నీకు తోడుగా ఉంటాయి. ఆయన్ను గుండెల్లో ప్రతిష్టించి క్లిష్ట పరిస్థితులను చాకచక్యంగా ఎదుర్కో, నిందలూ అవమానాలూ వస్తున్నాయని కృంగిపోకు! ప్రపంచంలోని విజేతలందరూ ఏదోక సందర్భంలో వాటిని ఎదుర్కొన్నవారే. ధైర్యంతో ముందుకు సాగిపో! నీవు తప్పకుండా విజయం సాధిస్తావు. ఈ రోజు నీ తగ్గింపే రేపు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది.ఈస్టర్ శుభాకాంక్షలు. డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
సీఎం గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: గుడ్ ఫ్రైడే పర్వదినం సందర్భంగా క్రిస్టియన్లకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గుడ్ ఫ్రైడే ఆనందంగా జరుపుకోవాలని, ఏసు క్రీస్తు ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నింపాలని కోరుకుంటున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
వారికి ‘ఆధార్’ అంటే భయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి పౌరుడు ఆధార్ కార్డును తీసుకోవాలని భారత ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఒత్తిడి చేస్తున్నా, అన్ని ప్రభుత్వ స్కీమ్లకు తప్పనిసరంటున్నా మిజోరమ్లో కొంత మంది ప్రజలు మాత్రం ఇప్పటికీ ఆధార్ కార్డును తీసుకోవాలంటే భయపడుతున్నారు. అందుకు కారణం వారి మత విశ్వాసమే. మిజోరమ్లో 87 శాతం మంది క్రైస్తవులే ఉన్నారు. బైబిల్ చివరి పుస్తకంగా పరిగణించే ‘బుక్ ఆఫ్ రివిలేషన్’ ప్రకారం 666 నెంబర్ను ‘దెయ్యం’గా క్రైస్తవులు పరిణిస్తారు. ఈ దెయ్యాన్ని ‘ఎక్సాకోసియో ఇయెక్సెకోంటాహెక్సా ఫోబియా’ అనే పదంతో కూడా సూచిస్తారు. ఆధార్ కార్డు నెంబర్లలో 666 నెంబర్ కూడా ఉంటది కనుక, అది దెయ్యం కింద లెక్కేనని, అందుకని తాము ఆధార్ కార్డునే స్వీకరించమని కొందరు ఇప్పటికీ వాదిస్తున్నారు. రాష్ట్రంలో 400 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఏకమై ఆధార్ కార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా తాను మాత్రం ఆధార్ కార్డు నెంబర్ను తీసుకోబోనని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్థుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న ఓ టీచర్ లాల్జియారానా ప్రకటించారు. మత స్వేచ్ఛను కలిగి ఉండే హక్కు రాజ్యాంగపరంగా తమకు ఉంది కనుక మత విశ్వాసం ప్రకారం ఆధార్ కార్డును తిరస్కరించే హక్కు కూడా తమకు ఉందంటూ కొందరు సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. ఆధార్ కార్డుకు దెయ్యానికి సంబంధం లేదని, అయినా దేవుడిని ఆరాధించే ప్రజల వద్దకు దెయ్యం రాదంటూ రాష్ట్రంలోని దాదాపు అన్ని చర్చిలు స్పష్టం చేశాక ఎక్కువ మంది క్రైస్తవులు ఆధార్ కార్డులను నమోదు చేయించుకున్నారు. అయినప్పటికీ మార్చి 15వ తేదీ వరకు ఆధార్ కార్డుల నమోదు రాష్ట్రంలో 81 శాతం వరకు చేరుకుంది. అంటే, ఇంకా 19 శాతం మంది తీసుకోలేదు. -
ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులపై దాడి
కైరో : వందల మంది ఇస్లామిక్ మత ఛాందసవాదులు ఈజిప్టులోని ఓ చర్చిలోకి దూసుకెళ్లి ప్రార్థనలు నిర్వహిస్తున్న క్రైస్తవులపై దాడి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఈజిప్టు రాజధాని కైరో చేరువలో గల గీజాలో గత శుక్రవారం చోటు చేసుకుంది. కాప్టిక్ చర్చిని కూల్చివేయాలంటూ నినాదాలతో అక్కడికి చేరుకున్న ముస్లింలు చర్చిలో ఉన్న పవిత్ర వస్తువులను ధ్వంసం చేశారు. అప్రమత్తమైన చర్చి భద్రతా సిబ్బంది ఛాందసవాదుల గుంపును చెల్లాచెదురు చేశారు. అనంతరం గాయపడిన క్రైస్తవులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈజిప్టులో ఇస్లాం మత ప్రభావం ఎక్కువ. అక్కడి జనాభాలో క్రైస్తవులు కేవలం 10 శాతం మాత్రమే. క్రైస్తవులు చర్చిలు నిర్మించుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి లేదు. 2016లో చర్చిలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది. అయినా కూడా చర్చిల నిర్మాణానికి వచ్చే అర్జీలను అక్కడి అధికారులు తిరస్కరిస్తున్నారు. ఇస్లాం మత ఛాందసవాదులు ఆందోళనలు చేస్తారనే భయమే ఇందుకు కారణం. దీంతో క్రైస్తవులు ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రార్ధనా మందిరాలను నిర్మించుకుంటున్నారు. వీటిపై దాడులు చేస్తున్న ఇస్లాం మత ఛాందసవాదులు వాటిని కూల్చేందుకు కూడా యత్నిస్తున్నారు. 2016 డిసెంబర్ నుంచి ఇలా జరిగిన కల్లోలాల్లో 100 మందికి పైగా క్రైస్తవులు ప్రాణాలు కోల్పోయారు. కాప్టిక్ చర్చిపై దాడులు జరగడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో పలుమార్లు ముస్లింలు ఈ చర్చిని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. -
బీఫ్పై కొత్త కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: నరేంద్రమోదీ ప్రభుత్వంలో టూరిజం శాఖ సహాయమంత్రిగా చేరిన మాజీ బ్యూరోక్రాట్ కేజే ఆల్ఫోన్స్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి, క్రైస్తవులకు మధ్య తాను వారధిగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. మోదీ సర్కారు అన్ని వర్గాలను కలుపుకొని పోతుందని, కేరళ, గోవాలో బీఫ్ను తినడంపై తమ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం, సమస్య లేదని ఆయన స్పష్టం చేశారు. ’మోదీ సర్కారు సమ్మిళిత దృక్పథంతో ముందుకుసాగుతోంది. మీరు ఏ విశ్వాసాన్నైనా కలిగి ఉండండి. మేం మిమ్మల్ని కాపాడుతామన్న విషయాన్ని ప్రధాని స్పష్టం చేశారు. మోదీ హయాంలో ఒక్క చర్చినిగానీ, మసీదుగానీ ఘటన లేదు. మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారు’ అని ఆల్ఫోన్స్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నిజాయితీ గల అధికారిగా పేరుతెచ్చుకున్న కేజే ఆల్ఫోన్స్ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టే తరుణంలోనూ తన దృఢవైఖరిని చాటుకున్నారు. కేంద్ర పర్యాటక శాఖ పూర్వపు మంత్రి మహేశ్ శర్మ నుంచి పగ్గాలు అందుకునేందుకు దాదాపు గంటసేపు వేచిచూసిన ఆయన.. లాంఛనంగా మంత్రిత్వశాఖ బాధ్యతలు చేపట్టేవరకు ఆ చైర్లో కూర్చోవడానికి కూడా నిరాకరించారు. బీఫ్ తినడం, గో రక్షకులపై కేంద్రంలోని బీజేపీ సర్కారు భిన్నంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చాలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశువధపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. గోరక్షకులు కొట్టిచంపేస్తున్నా.. ప్రభుత్వాలు తీవ్రంగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టిన మనోహరి పారికర్ రాష్ట్రంలో బీఫ్ కొరత లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. పారికర్ వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆల్ఫోన్స్.. రాష్ట్రాల్లో ఆహార అలవాట్లపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. -
క్రైస్తవ ఆస్తులను కాపాడుకుందాం
– వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ఖాన్ – 22న కోల్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు క్రైస్తవుల భారీ ర్యాలీ – వివిధ రాజకీయ పార్టీల రౌండ్టేబుల్ సమావేశంలో నిర్ణయం కర్నూలు సీక్యాంప్: కబ్జాదారుల నుంచి కోల్స్ కళాశాల స్థలాన్ని కాపాడుకుందామని కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త హఫీజ్ఖాన్ పిలుపునిచ్చారు. తెలుగు బాప్టిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హఫీజ్ఖాన్ మాట్లాడుతూ కొందరు కోల్స్ స్థలంతో పాటు ఎస్టీబీసీ డిగ్రీ కళాశాల, రాక్వుడ్ చర్చి, ఈసీఎం హైస్కూల్ స్థలాలను సైతం అన్యాయంగా ఆక్రమించుకున్నారని చెప్పారు. ఈ స్థలాల పరిరక్షణకు 22న క్రైస్తవులు నిర్వహించే ర్యాలీకి తమ పార్టీ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం తెలుగు బాప్టిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రభుదాసు మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్న వారు లీజ్ పేరుతో క్రైస్తవ స్థలాలు కొల్లగొట్టి పెద్ద పెద్ద భవనాలు కట్టించి అద్దెలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై తిరగబడలాని పిలుపునిచ్చారు. 22న చేపట్టే ర్యాలీకి కోల్స్ సంఘస్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో వివిధపార్టీల నాయకులు పాల్గొని తమ పూర్తి మద్దతు ప్రకటించారు -
క్రైస్తవులపై దాడులు అరికట్టాలి
క్రైస్తవ సంఘాల డిమాండ్ కలెక్టర్ వద్ద ధర్నా, శాంతి ర్యాలీ కాకినాడ సిటీ : క్రైస్తవులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులపై వివిధ క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. క్రైస్తవులపై దాడుల్ని తక్షణం అరికట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఫ్లకార్డులతో దాడులపై నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ అధికమవుతున్న మతోన్మాద ధోరణుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా దేశానికి చెడ్డ పేరువస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన అనంతరం కలెక్టరేట్ నుంచి ఇంద్రపాలెం వంతెన వరకూ ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి రంజిత్ ఓఫీర్, క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ డైరెక్టర్ మూర్తిరాజు, రక్షణ టీవీ సీఎండీ జక్కుల బెన్హర్, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాయకులు కాశి బాలయ్య, రాజ భూషణం, జార్జి ముల్లర్, కిరణ్పాల్ పాల్గొన్నారు క్రైస్తవుల శాంతి ర్యాలీ క్రైస్తవులపై దాడులను ఖండిస్తూ ఆలిండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నగరంలో సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. భానుగుడి సెంటర్ నుంచి మెయిన్రోడ్డు, బాలాజీ చెరువు సెంటర్, జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ జరిపారు. కౌన్సిల్ నాయకుడు బి.రాజేంద్రబాబు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన వాక్ స్వేచ్ఛను సైతం దిక్కరిస్తూ మతోన్మాదంతో క్రైస్తవులపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. చర్చిలను ధ్వంసం చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత ఛాందస వాదులను చట్టపరంగా శిక్షించాలని, క్రైస్తవులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. -
క్రైస్తవ ఆస్తులను పరిరక్షించాలి
కర్నూలు సిటీ: నగరంలోని క్రైస్తవ ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ శుక్రవారం కోల్స్ కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, దళిత సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోల్స్ కాలేజీ నుంచి కొండారెడ్డి బురుజు మీదుగా అంబేడ్కర్ విగ్రహాం వరకు ర్యాలీ సాగింది. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్, రాజ్కుమార్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి ఆనంద్బాబు, కోల్ప్ పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు జరదొడ్డి జయన్న, ఆ కాలేజీ ప్రిన్సిపాల్ జాన్సీరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్టియన్లుగా చెప్పుకుంటున్న కొంత మంది చీడపురుగులు కర్నూలు నగరంలోని క్రిస్టియన్ విద్యా సంస్థల ఆస్తులను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాయన్నారు. దశబ్దాలుగా చరిత్ర ఉన్న కోల్స్ కాలేజీ ఆస్తులపై ఓ వ్యక్తి కన్నేసి కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. లక్షలాది మంది పేద విద్యార్థులకు అక్షర జ్ఞానాన్ని అందించిన కోల్స్ను కబ్జా చేసే ప్రయత్నాలను విరమించుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఆందోళనలో పాస్టర్ పాస్కల్ ప్రకాష్, సంజీవన్రాజు, అధ్యాపకులు విజయ్కుమార్, ఎస్ఎఫ్ఐ నగర నాయకులు అక్బర్, వెంకటేష్, పూర్వ విద్యార్థులు రాజ్కుమార్, దినేష్, అయ్యరాజు, సందీప్, భార్గవ్, మహిమాకర్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు. -
క్త్రెస్తవుల ఆస్తులను పరిరక్షించండి
కర్నూలు (టౌన్) : నగరంలో క్రైస్తవుల ఆస్తులను పరిరక్షించాలని క్త్రెస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆదివారం స్థానిక కోల్స్ చర్చి నుంచి కోట్ల సర్కిల్ వరకు క్త్రెస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్సీ సుధాకర్బాబు, టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు హవిలన్ బాబు, కోల్స్ చర్చి సంఘం అధ్యక్షులు అనిల్నాథ్, పాస్టర్లు పాస్కల్ ప్రకాష్, డేవిడ్పాల్, కోల్స్ కళశాల ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి మాట్లాడారు. రాజకీయ నేతల అండతో నగరంలో రూ.కోట్లు విలువ చేసే స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. గత వారం కోల్స్ కళశాల క్రీడా మైదానంలో రూ. కోటి విలువ చేసే 30 సెంట్ల స్థలం అమ్మేశారని చెప్పారు. స్థల యాజమానులతో కాకుండా థర్డ్ పార్టీ (మూడవ వ్యక్తి ) ద్వారా రూ. కోట్ల స్థలాన్ని ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. కోల్స్ స్థల రిజిస్ట్రేషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా పక్కనే పరీక్షలు జరుగుతుండడంతో రాస్తారోకో చేయొద్దని రెండవ పట్టణ సీఐ చెప్పడంతో వారు ఆయనతో వాగ్వాదానికి దిగారు. కార్యక్రమంలో అబ్రహాం లింకన్, కోల్స్ చర్చి కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. -
ఆయనలో భాగమే... కొత్త ఏడాది!
మధ్యలో పరుగులో చేరినా చివరికి మెడల్ సాధించాడు అపొస్తలుడైన పౌలుగా మారిన సౌలు. ఆయన గొప్ప మేధావి, మహా వేదాంతి, కరడుగట్టిన యూదుమత ఛాందసుడు (క్రీ.శ. 5–67). క్రైస్తవ్యాన్ని కాలరాసేందుకు భీకరోద్యమాన్ని నడిపి హత్యలు, విధ్వంసాల దౌర్జన్యకాండతో యెరూషలేము ప్రాంతాన్నంతా హడలెత్తించాడు. పిదప సిరియాలో కూడా క్రైస్తవులపై దహనకాండను జరిపేందుకు వెళ్తుండగా రాజధాని దమస్కు పొలిమేరల్లో ఆకాశ దర్శనరూపంలో యేసు ఆయనకు సాక్షాత్కరించాడు. యేసు మరణించి సజీవుడయ్యాడన్న క్రైస్తవుల విశ్వాసం ఉత్త బూటకమని నమ్మే సౌలుకు యేసు సాక్షాత్కారంతో వెంటనే కనువిప్పు కలిగింది. అప్పటి నుండి పౌలుగా మారి క్రైస్తవాన్ని ప్రకటిస్తూ, చర్చిలు నిర్మించాడు. తన 62 ఏళ్ల జీవితంలో 32 ఏళ్లు దైవపరిచారకుడిగా గడిపాడు. దానికి ముందు 30 ఏళ్లు దైవ వ్యతిరేకిగా జీవించాడాయన. జీవితం చివరి సగభాగంలో పౌలు అద్భుతమైన వక్తగా, రచయితగా, మచ్చలేని విశ్వాసిగా, క్రైస్తవోద్యమ నాయకుడిగా బలమైన ముద్ర వేశాడు. తాను స్థాపించిన ఫిలిప్పీ చర్చికి రాసిన లేఖలో పౌలు తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. ‘నా గతాన్నంతా వెనుకే వదిలేసి, దేవుడు నా ముందుంచిన గురివైపు దీక్షతో పరుగెత్తుతున్నా’ అంటాడు పౌలు (ఫిలిప్పీ 3:13, 14). అపరాధాలు, అవమానాలు, వైఫల్యాలకుప్పగా ఉన్న ‘గతం’ చాలామంది దృష్టిలో ఒక గుదిబండ. పౌలుకు కూడా అలాంటి గతం ఉంది. క్రైస్తవుల్ని చంపి, చర్చిల్ని ధ్వంసం చేసిన తన గతాన్ని తలుస్తూ కృంగిపోయి, అపరాధభావనతో నిర్వీర్యంగా పౌలు తన శేషజీవితాన్ని గడపవచ్చు. కానీ దేవుడిచ్చిన వినూత్నపథంలో, గతాన్ని వదిలేసి దేవుడు పెట్టిన గురి వైపు దృష్టంతా పెట్టి జీవితం చివరి సగభాగంలో కూడా పౌలు అద్భుతంగా పరుగెత్తాడు. జీవితానికొక లక్ష్యమంటూ ఎంచుకున్నాక చివరి సగభాగాన్ని ప్రతిక్షణం విలువైనదన్నట్టు అర్థవంతంగా గడిపాడు. ఉదాత్తమైన లక్ష్యమంటూ లేని వారికి జీవితాన్ని వ్యర్థం చేసుకునేందుకు వెయ్యి కారణాలు. కాని కాలం విలువ ఎరిగి ఒక సమున్నత లక్ష్యం కోసం జీవించే వారికి జీవితంలో ప్రతి రోజూ పండుగే! దేవుని తీర్పు సింహాసనం ముందు దోషిగా తలవంచుకు నిలబడినప్పుడు వ్యర్థం చేసుకున్న మన జీవితం విలువ అర్థమవుతుంది. దేవుని చేతికి గడియారం ఉండదు. దేవునిదంతా ఆయనతో నిండిన అనంతమైన కాలమే! అందులోని సూక్ష్మాతిసూక్ష్మమైన ఒక భాగం ఆయన మనకిచ్చిన జీవిత కాలం! దేవుని అనంత కాలంలోని ఒక ఖండమే ‘పాత ఏడాది’గా ముగిసి ‘కొత్త ఏడాది’ అనే మరో ఖండపు ముంగిట్లో నిలబెట్టింది. ఈ ఏడాదిని చివరి దాకా ఆనందంగా అనుభవించే అపురూపమైన విధానాన్ని దేవుడు వివరిస్తున్నాడు. ‘జీవితం’ అనే ఈ గొప్ప బహుమానం విలువ తెలియాలంటే ముందుగా దాన్నిచ్చిన దేవుని విలువ మనకర్థం కావాలి. ఆ దేవునిలో ఎదగడానికి ఈ ఏడాది ప్రయత్నిద్దాం. కొందరు అభాగ్యుల జీవితాల్లోనైనా ఆనందం నింపడానికి ఉన్నదాంట్లోనే కొంతైనా వెచ్చిద్దాం. పగ, కోపం, మోసం, స్వార్థం, అసూయ వంటి అమానవీయ లక్షణాలకు దూరమై ప్రేమ, క్షమాపణ, త్యాగం, నిస్వార్థం, పరోపకారం వంటి దైవిక లక్షణాలకు దగ్గరవుదాం. జీవితమంతా సౌలులా బతికినా, ఈ ఏడాది కొన్నాళ్లైనా పౌలులా బతుకుదాం. ‘నూతన సృష్టి’గా (2 కొరింథీ 5:17) ఈ లోకంపై మనదంటూ ఒక ముద్ర వేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్! – రెవ. డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
క్రైస్తవులకు అండగా ఉంటాం
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి మేళ్లచెరువు: క్రైస్తవుల కు అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు ఎస్సీ కాలనీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు సుఖసంతో షాలతో, శాంతియుత జీవనం గడుపుతూ సమాజాభివృద్ధికి పాటు పడాలన్నారు. క్రిస్టియన్లు ఎప్పుడు సహాయం అడిగినా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి క్రిస్టియన్లకు చేసిన సేవలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్చేసి చిన్నారులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్రెడ్డి, కస్తాల ముత్తయ్య, పిల్లి మరియదాసు, జడ రామకృష్ణ, పెద్ది శివ, ప్రేమానందం, పొనగండ్ల సత్యనారా యణ రెడ్డి, కలగొట్ల వెంకటేశ్వరరెడ్డి, ధనపాటి రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దళిత క్రైస్తవులపై వివక్ష
– వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య కర్నూలు (ఓల్డ్సిటీ): దళిత క్రైస్తవులపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య ఆరోపించారు. సోమవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన దళిత నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పక్క రాష్ట్రంలో ప్రభుత్వం క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తుంటే, ఏపీ ప్రభుత్వం నిమ్మకుండిపోవడం విచారకరమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నో హామీలిచ్చి నెరవేర్చలేదన్నారు. ఉద్యోగాలిస్తానని ఉన్న ఉద్యోగులను తొలగించారని, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి అమలు చేయలేదని విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్లో ఏడాది కాలమైనా దళితులకు రుణాలు లభించడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. అనేక మంది దళిత విద్యార్థులు ఫీజు రీయంబర్స్మెంట్కు నోచుకోవడంలేదని, రోగులు ఆరోగ్యశ్రీ పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులు క్రిస్మస్ పండుగ జరుపుకునేందుకు వీలుగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లను ఈనెల 24వ తేదీలోపు చెల్లించాలన్నారు. వృద్ధులు, వికలాంగులకు బ్యాంకుల వద్ద నిలిచే శక్తి ఉండదని, వారికి ఇళ్లవద్దే పింఛన్ చెల్లించే ఏర్పాటు చేయాలన్నారు. దళిత క్రైస్తవులందరికీ వెంటనే దుస్తులు పంపిణీ చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో పార్టీ మైనారిటీసెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, క్రిస్టియన్ మైనారిటీసెల్ ప్రతినిధి జాన్, దళిత క్రైస్తవ నాయకులు అశోక్బాబు, బుచ్చన్న, జీవరత్నం, జోహరాపురం మాధవస్వామి, భాస్కర్, తాండ్రపాడు ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైస్తవులకు రక్షణ కల్పించాలి
- బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి దాడులు అధికం – ఆలిండియా ట్రూ క్రిష్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు కర్నూలు(న్యూసిటీ): కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రైస్తవులు, చర్చీలపై దాడులు అధికమయ్యాయని ఆలిండియా ట్రూ క్రిష్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరక్టర్ పీడీ సుందరరావు ఆందోళన వ్యక్తం చేశారు. దాడుల నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేసూ్త శుక్రవారం కర్నూలు నగరంలోని ఎ‹స్టీబీసీ కళాశాల నుంచి పెద్దపార్క్, రాజ్విహార్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ సుందరరావు మాట్లాడుతూ క్రైస్తవ దళితులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే క్రైస్తవులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించి వేధించడం మానుకోవాలని, బలవంతంగా మతమార్పిడి చేయరాదని డిమాండ్ చేశారు. మహిళా పోలీసు స్టేషన్ దగ్గర ఏబీఎం స్థలంలో స్టాంటన్దొర విగ్రహం పెట్టాలని, ఆ సర్కిల్ను స్టాంటన్ సర్కిల్గా ప్రకటించాలని కోరారు. ర్యాలీలో ఆలిండియా ట్రూ క్రిష్టియన్ కౌన్సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు దేవపాల్, బాబురావు, జాన్సన్ విక్టర్, రాష్ట్ర అధ్యక్షుడు ఉపేంద్ర, సంతోష్, రాజేంద్రబాబు, సీబీటీ ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటితో సమాధుల పండుగ
కర్నూలు సీక్యాంప్: చనిపోయిన తమ కుటుంబీకుల ఆత్మలకు శాంతి కలగాలని జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు సమస్త పరిశుద్ధ ఆత్మల పండుగ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. సమాధుల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేయడం ద్వారా చనిపోయిన తమ వారికి ఆత్మలకు శాంతి కలుగుతుందని క్రైస్తవుల నమ్మకం. ప్రపంచ వ్యాప్తంగా కాథలిక్లు ఈ సమాధుల పండుగను జరుపుకుంటారు. కర్నూలు, నంద్యాలలో తమ పూర్వీకుల సమాధులపై కొవ్వొత్తులు వెలిగించి సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బిషప్ పూల ఆంథోని, రెవరెండ్ అనిల్ కుమార్, రెవరెండ్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీలు ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి
ఏలూరు సిటీ : జిల్లాలోని ముస్లిం, క్రిస్టియన్, జైన్, బుద్ధిస్టు కేటగిరికి చెందిన విద్యార్థులు పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్స్ కోసం ఈ నెల 30వ తేది వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్–2 ఎంహెచ్.షరీఫ్ మంగళవారం తెలిపారు. అర్హత కలిగిన మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలోని కళాశాల యాజమాన్యం అర్హత కలిగిన మైనార్టీ విద్యార్థులతో గడువులోగా ఉపకార వేతనాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. వివరాలకు 08812– 297059లో సంప్రదించాలని తెలిపారు -
2 లక్షల మంది క్రైస్తవులతో ప్రార్థన
నల్లగొండ టూటౌన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ డిసెంబర్లో 2లక్షల మంది క్రైస్తవులతో ఒకేసారి ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ బి.రాజేశ్వర్రావు అన్నారు. సోమవారం స్థానిక రత్న ఫంక్షన్హాలులో క్రైస్తవ ప్రముఖులు, చర్చి ఫాదర్లతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల పండుగలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి ఒక్క కేసీఆర్నని అన్నారు. క్రైస్తవుల పిల్లల చదువులకు, ఉపకార వేతనాలు మంజూరు చేసి ఉన్నత చదువుల కోసం కృషి చేశారని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందంజలో ఉండేందుకు సీఎం నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. విలేకరుల సమావేశంలో రేఖల భద్రాద్రి, తీగల జాన్శాస్త్రీ, పాల్, ఏసురాజు, జోసఫ్, పోకల అశోక్, వేణుగోపాల్, ప్రభాకర్ తదితరులున్నారు. -
ప్రపంచంలో ఏది అతిపెద్ద మతమో తెలుసా?
వాషింగ్టన్: ప్రపంచంలో జనాభా పరంగా ఏ మతం అమిత వేగంగా పెరుగుతోందో, ఏ మతం వెనకబడి పోతుందో తెలుసుకునేందుకు అమెరికాలోని ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ ఓ అధ్యయనం జరిపింది. ఊహించినట్లుగా అన్ని మతాలకన్నా ముస్లిం మతం సంఖ్యా పరంగా ముందుకు దూసుకెళుతోంది. 2010 లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 31.4 శాతంతో క్రైస్తవులు అతిపెద్ద మతంగా ఆవిర్భవించగా 2050 నాటికి జనాభాలో అంతేశాతంతో అది ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా తన స్థానాన్ని నిలుపుకోనుంది. కానీ 2070 నాటికి క్రైస్తవుల మతాన్ని అతిక్రమించి ముస్లిం మతం ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఆవిర్భవించనుంది. 2010 లెక్కల ప్రకారం ముస్లింలు ప్రపంచంలో 23.2 శాతంతో రెండవ అతిపెద్ద మతంగా ఆవిర్భవించగా, 2050 నాటికి ప్రపంచ జనాభాలో 29.7 శాతంతో సంఖ్యాపరంగా ముందుకు దూసుకుపోనుంది. అయినప్పటికీ దాని రెండో స్థానంలో ఎలాంటి మార్పు ఉండదు. 2070 నాటికి మాత్రం ప్రపంచంలో ముస్లింలదే అతిపెద్ద మతం అవుతుంది. నాస్తికులు, ఏ మతాన్ని విశ్వసించని వారి సంఖ్య కూడా 2010 లెక్కల ప్రకారం ఎక్కువే ఉంది. ప్రపంచ జనాభాలో 16.4 శాతంతో వీరి సంఖ్య మూడో స్థానంలో ఉండగా, 2050 నాటికి 13.2 శాతానికి తగ్గినప్పటికీ అదే మూడో స్థానాన్ని నిలుపుకోనుంది. వీరి సంఖ్య ఫ్రాన్స్, అమెరికా లాంటి సెక్యులర్ దేశాల్లో పెరుగుతుండగా, రిలీజియన్ దేశాల్లో గణనీయంగాతగ్గుతోంది. 2010 లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 15 శాతంతో హిందువులు నాలుగో స్థానంలో ఉండగా, 2050 నాటికి 14.9 శాతానికి తగ్గి అదే నాలుగో స్థానాన్ని నిలుపుకోనుంది.2010 లెక్కల ప్రకారమే బౌద్ధులు 7.1 శాతంతో ఐదో స్థానంలో ఉండగా, 2050 నాటికి సంఖ్యాపరంగా కూడా తగ్గి జనాభాలో 5.2 శాతానికి పడిపోనుంది. అయినప్పటికీ అది ఐదో స్థానంలోనే కొనసాగనుంది. ఆ తర్వాత స్థానాల్లో ఉన్న వివిధ మతాల తెగలు, చిన్న మతాలు వరుసగా ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతూ 2050 నాటికి జనాభాలో శాతం పరంగా తగ్గనున్నాయి. ప్రపంచ జనాభాలో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న యూదులు 2050 నాటికి సంఖ్యాపరంగా కాస్త పెరిగినప్పటికీ ప్రపంచంలో 0.2 శాతంతోనే వారు కొనసాగనున్నారు. సెక్యులర్ దేశాల్లో తరగుతున్న యువ జనాభా, వర్ధమాన దేశాల్లో పెరుగుతున్న సంతానోత్పత్తి, తగ్గుతున్న శిశు మరణాలు, ఆయా దేశాల్లోని భౌగోళిక పరిస్థితులు, ఏ మతంలో సంతానోత్పత్తి శాతం ఎలా ఉందన్న అంశాలనే కాకుండా, ఏ మతం నుంచి ఏ మతానికి మత మార్పిడులు ఎక్కువ జరుగుతున్నాయి, వారి సంఖ్య ఎంత అన్న అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని ప్రధాన మతాల పెరుగుదలను నిపుణులను అంచనా వేశారు. మత మార్పిడి అంశంలో అప్పటి పరిణామాలను అనుసరించి అంచనాలు కాస్త అటు, ఇటయ్యే అవకాశాలు లేకపోలేదని నిపుణులు తెలిపారు. ముస్లింలు, క్రైస్తవుల సంఖ్య సబ్ సహారా ఆఫ్రికాలో పెరుగుతుండగా, ఉత్తర అమెరికా, ఫ్రాన్స్, యూరప్, చైనా, జపాన్ దేశాల్లో నాస్తికులు లేదా మత విశ్వాసంలేని వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చైనా, జపాన్ దేశాల్లో బౌద్ధుల సంఖ్య గణనీయంగా పడిపోతుండడం మరో ఆశ్చర్యకర పరణామం. -
క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
కోదాడఅర్బన్: క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 11న ఆలిండియా దళిత క్రైస్తవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్ తెలిపారు. మంగళవారం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన దీనికి సంబంధించిన పోస్టర్ను , సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలో ఢిల్లీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దళిత క్రైస్తవులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్ల సుందర్బాబు, జిల్లా కార్యదర్శి దేవిరెడ్డి లింగారెడ్డి, కొండా రవి, కొత్తపల్లి ప్రశాంత్, జాన్ వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు గంటా జీవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జెరూసలెం యాత్రకు ఆర్థిక సహాయం
శ్రీకాకుళం: పవిత్ర జెరూసలెం యాత్రకు వెళ్లే జిల్లాలోని క్రైస్తవ మైనారిటీలు ఆర్థిక సహాయం కోసం ఏపీ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కార్యనిర్వాహక సంచాలకులు కె.నారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాత్ర మొత్తానికి రూ.89వేలు ఖర్చు అవుతుందని అంచనా కాగా, ప్రభుత్వం తరఫున రూ.20వేలు అందజేస్తామని చెప్పారు. దరఖాస్తులకు అన్ని పత్రాలు జతచేసి మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి పంపించాలన్నారు. ఇతర వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800–425–1068, 040–23392243, 040–2391068, శ్రీ రాఘవేంద్ర 73962 84529, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 9849901160/08922–230250 లను సంప్రదించాలని సూచించారు. -
క్రైస్తవుల కోసం ముస్లింలు చర్చిని నిర్మిస్తున్నారు!
పరమత సహనానికి చక్కని ఉదాహరణ పాకిస్థాన్ లోని ఈ గ్రామం. ఒక ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ దేశంలో క్రైస్తవుల కోసం ముస్లింలు ఓ చర్చిని నిర్మిస్తున్నారు. పాకిస్థాన్ లోని పంజాడ్ ప్రావిన్సుకు దగ్గరలో ఉన్న గోజ్రాకు దగ్గరలో ఉన్న ముస్లింలు రోజూ వారి వారు పని చేసి సంపాదించిన సొమ్ములో కొంతభాగాన్ని గ్రామంలో నివస్తున్న క్రైస్తవులకు చర్చిని నిర్మించి ఇవ్వడానికి దాస్తున్నారు. అంతేకాదు, వారే ప్రతి ఇంటి నుంచి రోజుకు ఒక్కొక్కరు చర్చిని నిర్మించడానికి ఇటుకలు, ఇసుక, సిమెంటు తదితరాలను మోస్తుంటే, మరొకరు వాటిని సిమెంట్ తో కలిపి గోడలు నిర్మిస్తున్నారు. ఈ విషయంపై వారిని పలకరించగా.. తోటి మతాలను గౌరవించాలని ఖురాన్ లోనే చెప్పారని గ్రామస్తులు అన్నారు. కాగా, పాకిస్థాన్ మతాలకు సంబంధించిన ఘర్షణలు జరగడం సాధారణమన్న విషయం తెలిసిందే. -
రాజధాని ప్రాంత జనాభాలో 90 % మంది హిందువులు
సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధాని ప్రాంతంలోని జనాభాలో 90 శాతం మంది హిందువులు ఉన్నారు. 2001 జనాభా కన్నా 2011 జనాభా లెక్కల్లో హిందువుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. రాజధాని ప్రాంతానికి సంబంధించి సీఆర్డీఏ సమస్త సమాచారంతో ప్రచురించిన పుస్తకంలో ఈ వివరాలను పేర్కొంది. ఈ ప్రాంతంలో 2001లో హిందువుల జనాభా 91.1 శాతంగా ఉండగా.. అది 2011లో 90.9 శాతానికి తగ్గింది. కేపిటల్ రీజియన్లోని కొల్లూరు, ఘంటసాల, మోపిదేవి మండలాల్లో హిందువులు ఎక్కువగా ఉన్నారు. అలాగే కంచికచర్ల, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో తక్కువగా ఉన్నారు. ఇక ఈ ప్రాంతంలో ముస్లింల సంఖ్య పెరిగింది. 2001లో 6.9 శాతంగా ఉన్న ముస్లింలు.. 2011లో 7.3 శాతానికి పెరిగారు. కంచికచర్ల, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉండగా ఘంటసాల, నందివాడ, మోపిదేవి మండలంలో తక్కువగా ఉంది. క్రిస్టియన్లలో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోంది. 2001లో 1.8 శాతం క్రిిస్టియన్లు ఉండగా.. 2011లో 1.4 శాతం మంది ఉన్నారు. నందివాడ, ఫిరంగిపురం, గన్నవరం మండలాల్లో క్రిిస్టియన్ జనాభా ఎక్కువగా ఉండగా వత్సవాయి, చంద్రలపాడు, క్రోసూరు మండలాల్లో తక్కువగా ఉన్నారు. ఇక ఇతర మతస్తులు 0.1 శాతం మంది ఉన్నారు. పెరిగిన ఎస్సీ జనాభా.. కేపిటల్ రీజియనల్లో గత 20 ఏళ్ల నుంచి ఎస్సీల జనాభా పెరుగుతోంది. ఎస్టీల జనాభా విషయంలో అతి స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కాగా 2011 జనాభా లెక్కల ఆధారంగా చూస్తే.. రాజధాని ప్రాంతంలోని మురికివాడల్లో నివాసం ఉంటున్న కుటుంబాల సంఖ్య ఎక్కువగానే ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 28 శాతం ప్రజలు మురికివాడల్లోనే నివసిస్తున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మురికివాడల్లో 61,128 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. -
భారత్లో మత స్వేచ్ఛ క్షీణిస్తోంది
మైనారిటీలపై దాడులు పెరిగాయి: అమెరికా కమిటీ నివేదిక వాషింగ్టన్: భారత్లో మత స్వేచ్ఛ గత ఏడాది(2015లో) తిరోగమనంలో ఉందని.. మత సహనం క్షీణించిందని, మత స్వాతంత్య్ర ఉల్లంఘనలు జరిగాయని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా నివేదిక ఒకటి పేర్కొంది. అమెరికా పార్లమెంటు అయిన కాంగ్రెస్ నియమిత యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ (యూఎస్సీఐఆర్ఎఫ్) సోమవారం విడుదల చేసినవార్షిక నివేదికలో.. మత ప్రజాసమూహాలకు వ్యతిరేకంగా అవమానకరంగా మాట్లాడే అధికారుల, మత నాయకుల వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. మైనారిటీ మతస్తులు, ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు ప్రధానంగా హిందూ జాతీయవాద బృందాల చేతుల్లో పలు అవమానకర, వేధింపులు, హింసకు గురయ్యారని నివేదిక ఆరోపించింది. అధికార బీజేపీ సభ్యులు లోపాయికారీగా ఈ బృందాలకు మద్దతు ఇచ్చారని, ఉద్రిక్తతలను ఇంకా రెచ్చగొట్టేందుకు మతపరంగా విభజనపూరిత భాషను వినియోగించారంది. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో మతప్రేరేపిత దాడులు, మత హింస ఘటనలు అధికమని నివేదిక పేర్కొంది. మత స్వేచ్ఛ విషయంలో భారత్ను నివేదిక టైర్-2 వర్గంలో చేర్చింది. -
ఆరడుగుల జాగా కోసం..
♦ మృతదేహం ఖననాన్ని అడ్డుకున్న స్థానికులు ♦ ఉదారత చాటుకున్న రిటైర్డ్ ఉద్యోగి, లారీడ్రైవర్ కోదాడ: ఆ ఆరడుగుల జాగా కోసం ఓ పేద వలస కుటుంబం నానా పాట్లు పడింది. మృతదేహం ఖననాన్ని కొందరు స్థానికులు అడ్డుకోగా.. అదే సమయంలో మృతదేహాన్ని సొంత రాష్ట్రానికి తరలించేందుకు ఇద్దరు వ్యక్తులు సహకరించి మానవత్వాన్ని చాటారు. ఈ ఘటన సోమవారం నల్లగొండ జిల్లా కోదాడలో చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన డేవిడ్సన్ కుటుంబం కోదాడకు వలస వచ్చింది. రోడ్డు వెంట టెంట్ వేసుకుని నివాసం ఉంటోంది. ఈ కుటుంబం గ్రామాల వెంట తిరుగుతూ ప్లాస్టిక్ ఉయ్యాలలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. డేవిడ్సన్ తండ్రి రాయిసన్ (85) ఎండ వేడికి ఆదివారం రాత్రి మరణించాడు. వారు క్రైస్తవులు కావడంతో ఆచారం ప్రకారం మృతదేహాన్ని ఖననం చేయాలి. అయితే, కోదాడలో వారికి శ్మశానవాటిక లేకపోవంతో డేవిడ్ తన తండ్రి మృతదేహాన్ని పెద్ద చెరువు సమీపంలో ఖననం చేసేందుకు తీసుకెళ్లాడు. గొయ్యి తవ్వుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఏం చేయాలో తోచక డేవిడ్ తన తండ్రి శవంతో రోడ్డు మీదికొచ్చాడు. మార్నింగ్ వాక్కు వెళ్లిన ఒక విశ్రాంత ఉద్యోగి గమనించి అతడిని విచారించాడు. మృతదేహాన్ని సొంత రాష్ట్రం ఒడిశాకు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు చెప్పడంతో రూ.10 వేలు అందించాడు. డేవిడ్సన్ తన తండ్రి శవంతో కోదాడ బైపాస్రోడ్డుకు వెళ్లాడు. కోదాడ నుంచి సిమెంట్ లోడ్తో ఒడిశా వెళుతున్న లారీడ్రైవర్ సైతం మానవతను చాటుకున్నాడు. మృతదేహాన్ని ఉచితంగా తీసుకెళ్లడానికి అంగీకరించాడు. ఎట్టకేలకు మృతదేహం తీసుకుని కుటుంబంతోసహా ఒడిశా వెళ్లాడు. -
క్రీస్తును ఎలా శిలువ వేశారు?
లండన్: నేడు పవిత్ర శుక్రవారం. అంటే ఏసు క్రీస్తును శిలువ వేసిన రోజు. శిలువ వేయడం అంటే శిలువకు క్రీస్తును ఆనించి చేతులకు, కాళ్లకు మేకులు దిగేయడంగా మనకు తెలుసు. ఇప్పుడు మనకు ఏ క్రీస్తు శిలువ విగ్రహాన్ని చూసిన ఇదే అర్థం అవుతుంది. మరి నిజంగా క్రీస్తును శిలువ వేసినప్పుటు ఆయన చేతులకు, కాళ్లకు మేకులు దిగేశారా? అన్నది ఇప్పుడు చర్చ. చిన్న చిన్న నేరాలు చేసిన వారిని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారిని, ప్రజల్లో తిరుగుబాటు లేవదీసిన వారిని శిలువ వేయడం నాటి రోమన్ సంస్కృతి. శిలువ వేయడం అంటే మరణ శిక్ష వేయడమని కూడా కాదు. కొన్ని రోజుల పాటు అన్న పానీయాలు లేకుండా అలా శిలువపై మాడుస్తారు. హింసిస్తారు. కొందరు ఆ శిక్ష ను తట్టుకోలేక చనిపోతారు. బతికున్న వారిని వదిలేస్తారు. మరి ఏసు క్రీస్తును ఎలా శిలువ వేశారు? రోమన్లు శిలువ వేసినప్పుడు చేతులు, కాళ్లకు మేకులు కొట్టేవారనడానికి ఎక్కడా శాస్త్రీయ లేదా చారిత్రక ఆధారాలు లేవు. పురావస్తు తవ్వకాళ్లో శిలువ శిక్ష అనుభవించిన వారి శకలాలు దొరికాయి. వారి చేతులకు, కాళ్లకు మేకులు కొట్టిన ఆనవాళ్లు దొరకలేదు. ఒకే ఒక్క మానవ శకలం అలా దొరికింది. దానికి కూడా కాళ్లకు మాత్రమే మేకులు దిగేసినట్లు ఉంది. చేతులకు లేవు. బ్రిటీష్ మ్యూజియంలో ఇప్పటికీ భద్రంగా ఉన్న నాలుగవ శతాబ్దం నాటి క్రీస్తు శిలువ విగ్రహాల్లో క్రీస్తు చేతులు, కాళ్లకు మేకులు కొట్టిన ఆనవాళ్లు లేవు. భుజం మీద అడ్డంగా ఉన్న కర్రకు మణికట్టు వద్ద చేతులు కట్టేసినట్లు మాత్రమే అవి ఉన్నాయి. రత్నపు రాళ్లపై చెక్కిన ఆ విగ్రహాలను జాగ్రత్తగా చూసినట్లయితే ఈ విషయం మనకు అర్థం అవుతుంది. నాటి కాలం గాస్పెల్స్ (క్రీస్తు జీవితం, ప్రవచనాల ప్రచారకులు) కూడా ఏనాటు క్రీస్తును ఈ విధంగా శిలువ వేశారని చెప్పలేదు. కొత్త టెస్టామెంట్ ప్రకారం మాత్యూ, మార్క్, లూక్, జాన్ అనే గాస్పెల్స్ కొంచెం అటూ ఇటుగా క్రీస్తుకు మేకులు దిగేశారని చెప్పారు. నాటి రోమన్ కాలంలో మనుషులను శిలువ వేసినప్పుడు మేకులు కొట్టేవారు కాదని, చేతులను, కాళ్లను కట్టేసేవారని మనకు ‘మోంటీ పైథాన్స్ లైప్ ఆఫ్ బ్రెయిన్’ హాలివుడ్ పురాతన సినిమా కూడా తెలియజేస్తోంది. -
పేద క్రైస్తవులకు జెరూసలేం యాత్ర
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక స్తోమతలేక ఎంతోమంది పేద క్రైసవులు జెరూసలేం వెళ్లలేకపోతున్నారని, యాత్ర కోసం వారందరికీ ప్రభుత్వపరంగా సాయం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రప్రథమంగా నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన క్రిస్మస్ సంబరాల్లో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. క్రైస్తవులకు సంబంధించిన పలు సమస్యలపై ప్రకటనలేమైనా చేద్దామంటే స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని సీఎం చెప్పారు. ఎన్నికల కోడ్ ఉందంటూనే కొన్ని సమస్యలకు సంబంధించి స్పష్టమైన హామీలిచ్చారు. క్రైస్తవ శ్మశాన వాటికలన్నీ సమాధులతో నిండిపోయినందున స్థలాలు కావాలని మతపెద్దలు కోరినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ స్థలాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ స్థలాలు లేనిచోట కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. పాఠశాలల ఏర్పాటు, వివిధ క్రైస్తవ సామాజిక కార్యక్రమాలకు రాయితీలు తదితర అంశాలపై జనవరిలో మతపెద్దలతో ప్రత్యేక కమిటీ నియమించి, చర్యలు చేపడతామన్నారు. ఆనందంగా జీవిస్తేనే... అన్ని వర్గాలు, అన్నిమతాల ప్రజలు గౌరవంతో ఆనందంగా జీవించేదే మంచి రాజ్యమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కవనే భేదాభిప్రాయాలు లేకుండా అందరితో సమానంగా క్రైస్తవులు గౌరవం పొందేలా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. సర్వమతాల ప్రజలు సమానంగా ఆదరణ పొందాలన్నదే తన లక్ష్యమని, ఈ విషయాన్ని ఎన్నికల ప్రచార సభల్లోనే తాను ప్రకటించానని గుర్తు చేశారు. అందుకే అన్ని మతాలవారు జరుపునే పండుగలకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకం అందిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో క్రైస్తవ సమాజ ం సంపూర్ణ భాగస్వామ్యం వహించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. దళిత క్రిస్టియన్ల సమస్యలను పార్లమెంట్లో తమ పార్టీ తరఫున ప్రస్తావించేందుకు చర్యలు చేపడతానన్నారు. ఈ విషయమై ప్రధానమంత్రికి తాను స్వయంగా లేఖ రాయనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 15 ఏళ్లుగా చాపెల్రోడ్ (హైదరాబాద్)లోని చర్చికి తాను క్రిస్మస్ రోజున వెళ్తున్నానని ఈ దఫా అయుత చండీయాగం కారణంగా వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. తన తరఫున కుటుంబ సభ్యులను పంపనున్నట్లు తెలిపారు. అందరి జీవితాల్లో సుఖశాంతులు నెలకొనాలని, ఏసుక్రీస్తు కృపతో అందరూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నానంటూ క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సంబరాల్లో భాగంగా సుమారు ఐదువేల మందికి పసందైన వంటకాలతో ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల కుటుంబాల్లోని ఆరు లక్షల మందికి క్రిస్గిఫ్ట్లను ప్రభుత్వం తరఫున అందజేసినట్లు అధికారులు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లోనూ క్రిస్మస్ సంబరాలు నిర్వహించామని, గ్రేటర్ పరిధిలో 100 ప్రాంతాల్లో ఉత్సవాలు జరిగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఎంపీలు కేశవరావు, జితేందర్రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, ఏసీబీ డీజీ ఏకేఖాన్, ఉత్సవ కమిటీ చైర్మన్ రేమండ్ పీటర్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్జలీల్, డెరైక్టర్ అక్బర్, డిప్యూటీ డెరైక్టర్ సుభాష్చందర్, దక్షిణ మధ్య రైల్వే మాజీ ఎస్పీఆర్ఓ ఫెడ్రిక్ మైఖేల్, క్రైస్తవ మతపెద్దలు, చర్చి బిషప్లు పాల్గొన్నారు. అనాథ బాలలకు సీఎం బహుమతులు క్రిస్మస్ సంబరాలకు హాజరైన సీఎం కేసీఆర్ ముందుగా అనాథ బాలల వద్దకు వెళ్లి వారితో కాసేపు ముచ్చటించారు. క్రిస్మస్ కేక్ను కట్చేసి వారికి తినిపించారు. చిన్నారులకు బహుమతులు అందజేశారు. అనంతరం వేదికపై కూడా క్రిస్మస్ కేక్ను కట్ చేసి అతిథులకు పంచిపెట్టారు. వివిధ రంగాల్లో విశేషమైన సేవలందించిన క్రైస్తవ ప్రముఖులకు అవార్డులను అందజేశారు. పురస్కారాలు పొందిన వారిలో సిస్టర్ నిర్మల (సామాజిక సేవ), సిస్టర్ సుశీల (మెడికల్), విమల్ సుకుమార్ (ఎడ్యుకేషన్), సైబీ జోసెఫ్ (వైకల్య బాలలకు సేవ), మార్క్స్ (క్రైసవ జానపద సాహిత్యం), కృపయ్య తండ్రి(గాయకుడు), బాబురావు (క్రైస్తవ సాహిత్యం) తదితరులున్నారు. -
క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి
సెమీక్రిస్మస్ వేడుకల్లో వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి బోనకల్: క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చేందుకు తనవంతుగా కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ శాంతినిలయంలో శనివారం రాత్రి జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా మైపన్పాల్ బిషప్తో కలసి ఎంపీ జ్యోతి ప్రజ్వలన చేసి, క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో మూడుసార్లు లేవనెత్తానన్నారు. కేంద్రం సున్నితంగా ఈ అంశాన్ని పక్కనపెట్టిందని, అయినప్పటికీ చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఏసుక్రీస్తు లోకరక్షకుడని, దేశం సుభిక్షంగా ఉండేందుకుగాను ప్రభువు దీవెనలు అందిస్తున్నారన్నారు. -
నేను చూసిన క్రైస్తవత్వం...
ప్రపంచంలోని ప్రతి మతం పవిత్రమైనదే. అవి బోధించే అంశాలు మానవులకి ఉపయోగపడేవే. మతం పేరిట కొందరి ప్రవర్తనా తీరు వలన మతాన్నే ద్వేషించే పరిస్థితి ప్రపంచంలో ఉంది. ఒక్కో ‘మది’ది ఒక్కోతీరు. హిందూమతం దైవ భక్తికి పెద్దపీట వేసింది. దృష్టిని ప్రపంచం మీద కాక, పరమాత్మ మీద నిలిపి ఉంచాలని హిందూమతం బోధించే భక్తి మార్గం. క్రైస్తవ మతమేమో సాటివారికి సాయం చేయాలని బోధిస్తూ, త్యాగానికి, సేవకి పెద్ద ప్రాముఖ్యతని ఇచ్చింది. కొందరు క్రిస్టియన్సలోని త్యాగశీలులకి చెందిన ఉదంతాలు తెలుసుకుంటే నాకు ఒళ్లు పులకరిస్తుంది. క్రీ.శ. 1202లో ఇటలీలోని అస్సీ అనే చిన్న ఊరిలో ఓ ధనవంతుడుండేవాడు. అతని ఇరవై ఏళ్ల కొడుకు ఫ్రాన్సిస్ తన మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అతనికి గంట మోగుతున్న చప్పుడు వినిపించింది. ఆరోజుల్లో కుష్టువ్యాధికి మందులేదు. వాళ్లని ఊళ్లోకి అనుమతించేవారు కాదు. ఊరికి దూరంగా కాలనీలో ఆ వ్యాధిగ్రస్తులు ఉండేవారు. ఒకవేళ వారు ఊళ్లోకి రావాల్సి వస్తే, ఊరి బయట ఉన్న గంట మోగించి వస్తారు. అప్పుడంతా తప్పుకుంటారు. ఆ గంట విని ఆయన పక్కకి తప్పుకునేలోగా ఓ కుష్ఠు వ్యాధిగ్రస్థుడు అతనికి ఎదురు పడ్డాడు. వ్యాధితో శరీరం, మొహం వికారంగా అయిపోయి ఆ రోగిని ఎవరు చూసినా అసహ్యించు కుంటారు. ఐతే ఫ్రాన్సిస్కి ఆ రోగి పరిస్థితి చూడగానే హృదయం ద్రవించింది. అతని దగ్గరకు వెళ్లి అతనిని చూడగానే రెండడుగులు వెనక్కి వేసినందుకు క్షమాపణ చెప్పి, తన జేబులోని డబ్బంతా ఇచ్చి, ఆ రోగిని ఆలింగనం చేసుకున్నాడు. అతని ఔదార్యానికి కళ్లల్లో నీళ్లు తిరిగిన ఆ రోగి... ‘‘మనిషి స్పర్శ ఎలా ఉంటుందో మరిచిపోయాను. నాకది మీరు గుర్తు చేశారు’’ అన్నాడు. ఆ యువకుడే నేటికీ క్రిస్టియన్స్ అంతా కొలిచే మహాత్ముడు ‘సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీ’. మరో సంఘటన. అది జనవరి 1945. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. పోలెండ్లోని జడోర్జూ అనే చిన్ని గ్రామంలోని రైల్వేస్టేషన్లోకి ఓ యువకుడు ప్రవేశించాడు. అక్కడ పొడుగు చారల ఖైదీ దుస్తులు ధరించిన పదమూడేళ్ల అమ్మాయి కూర్చుని ఉంది. సరైన భోజనం లేని అమె మరణానికి దగ్గరగా ఉంది. ‘‘ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు?’’ క్రిస్టియన్ ఫాదర్ అయిన ఆ యువకుడు ఆమెను అడిగాడు. ‘‘నా పేరు ఎడిట్ జైరర్. నాలుగేళ్లుగా నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ నుంచి తప్పించుకున్నాను. నా స్వగ్రామానికి వెళ్లి నా తల్లిదండ్రులను, సోదరినిని కలుసు కోవాలని బయలుదేరాను’’ చెప్పిందామె. అతను వెళ్లి బ్రెడ్, టీకప్పుతో వచ్చి వాటిని ఆమెకు ఇచ్చి ఆకలిని తీర్చాడు. క్రాకోకి వెళ్లే రైలు రాగానే ఆ యువకుడు బల హీనంగా ఉన్న ఆమెని ఎత్తుకుని, పెట్టెలోకి మోసుకెళ్లాడు. జంతువులను రవాణా చేసే ఆ పెట్టెలో ఆమెకి చలి నించి రక్షణగా తన ఒంటి మీది కోటుని కప్పాడు. భగవంతుని ఆశీస్సులు ఆమెకి లభించాలని ప్రార్థన చేస్తానని చెప్పాడు. తన దగ్గర ఉన్న డబ్బులు ఆమెకు ఇచ్చేశాడు. ‘‘మీ పేరు? ఆమె అడిగింది. ‘‘కరోల్ ఓటైలా’’ జవాబు చెప్పాడు. 1994లో ఇజ్రాయెల్లోని ఐఫా అనే ఊరిలో నివసిస్తున్న ఎడిట్ ఓ రోజు దిన పత్రిక చదువుతూంటే ‘కరోల్ ఓటైలా’ అనే పేరు కనిపించింది. ఆమె జీవితంలో మరిచిపోలేని పేరు అది. తనని కాపాడినది వారే అయితే అతన్ని ఓసారి కలుసుకుని కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఉందని ఓ ఉత్తరం రాసి పోస్టు చేసింది. అయితే ఉత్తరానికి కొద్ది జాప్యం తర్వాత జవాబు వచ్చింది. అది అందుకున్నాక ఎడిట్ 1995లో ఇజ్రాయిల్ నించి యూరప్కు వెళ్లినప్పుడు రోమ్లోని వాటికన్ సిటీ వెళ్లి పోప్ జాన్పాల్-2ని కలుసుకుంది. త్యాగానికి ప్రతీక అయిన ఆ యువకుడే అత్యున్నత క్రిస్టియన్ మతాధికారి ‘పోప్’ అయ్యాడు. ఆ ఖైదీకి అతను సహాయం చేయడం నాజీ సైనికులు చూసి ఉంటే, అతన్ని అక్కడికక్కడే కాల్చి చంపేవారు. అలాగే ఇంగ్లండ్లోని మాంచెస్టర్ నుంచి మత ప్రచారానికి ఓ ఫాదర్ని 1932లో పంజాబ్కి పంపించారు. అతని పేరు జాన్ లియోపోర్న్. జాన్ ఉత్తర పంజాబ్లోని ఓ గ్రామంలో తను నమ్మిన సిద్ధాంతాలని ప్రచారం చేయసాగాడు. ఓ రోజు కొందరు గ్రామ పెద్దలు జాన్ని రచ్చబండ దగ్గరకి పిలిపించారు. అతనితో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. రచ్చబండ చుట్టూ మనుషులు అతనికి అడ్డుగా నిలబడి అక్కడినించి కదలనివ్వలేదు. గంట... పది గంటలు... రోజు... మూడు రోజులు అలా గడిచాయి. అతనికి తాగడానికి నీళ్లు ఇచ్చారు తప్ప ఎవరూ భోజనం పెట్టలేదు. ఐదో రోజు అతను నీరసంతో వాలిపోయాడు. ఆరో రోజు గ్రామపెద్ద అతని తలని తన ఒళ్లో ఉంచుకుని, నిమ్మరసం తాగించి తర్వాత భోజనం పెట్టి చెప్పాడు. ‘‘మేమంతా మిమ్మల్ని ఇన్ని రోజులు పరీక్షించాం. ఆహారం ఇవ్వకుండా, కదలనివ్వకుండా చేసినందుకు మీరు మమ్మల్ని తిడతారని, ద్వేషిస్తారని ఎదురుచూశాం. అదే జరిగితే మిమ్మల్ని గ్రామం నించి బహిష్కరించాలనుకున్నాం. మీరు ఇన్ని రోజులు బోధించిన ‘క్షమ’ మీలో నిజంగా ఉందో లేదో ఇలా పరీక్షించినందుకు క్షమించండి. ఇప్పుడు మీ మతం గురించి, జీసస్ గురించి చెప్పండి.’’ ఒకటా? రెండా? ఇలాంటి ఎన్నో ఉదంతాలు చదివిన నాకు క్రిస్టియానిటీకి దగ్గరయ్యే కొన్ని అదృష్టాలు కలిగాయి. నా ప్రమేయం లేకుండానే క్రిస్టియన్స్కి, పవిత్రమైన కొన్ని ప్రదేశాలని నా విదేశీ పర్యటనల్లో సందర్శించడం జరిగింది. టర్కీలోని కుశదాసి ద్వీపానికి ఆగస్ట్ 2010లో వెళ్లాను. క్రీస్తును శిలువ వేశాక, ఆయన ప్రధాన శిష్యులలో ఒకరైన సెయింట్ జాన్ జెరూసలేం నించి ఈ కుశదాసి ద్వీపానికి వచ్చారు. స్థానికుల కథనం ప్రకారం, రోమన్స్ తనని హింసించడం మొదలయ్యాక, జీసస్ తన శిష్యుడు సెయింట్ జాన్ని తన తల్లి మేరీ మాతని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లమని కోరారు. ఈ ద్వీపంలోని ఓ ఇంట్లో మేరీమాత తన ఆఖరి సంవత్సరాలు, తుదిశ్వాస వదిలేదాక గడిపింది. ఈ విషయం కుడా ప్రపంచానికి దైవికంగా తెలియడం విశేషం. 1774-1824 మధ్య జర్మనీలో జీవించిన క్రిస్టియన్ నన్ క్యాథరీనా ఎమెరిష్కి వర్జిన్ మేరీ చివరి దశలో జీవించిన కుశదాసి ద్వీపంలోని ఈ ఇంటి తాలూకు దర్శనాలు కలిగాయి. ఈ ఇల్లు సముద్రానికి ఎంత దూరంలో ఉన్నది, అక్కడ ఉన్న వృక్షజాతి, ఎన్నడూ జర్మనీ దేశాన్ని వదలని క్యాథరీనాకి కలలో కనిపించాయి. ఆమె అవన్నీ ఒక పుస్తకంలో రాసింది. కుశదాసికి 395 కిలోమీటర్ల దూరంలోని స్మిర్ణా (ఇజ్మిత్) అనే ఊరికి చెందిన లాజరస్ ఆ పుస్తకాన్ని చదవడం జరిగింది. 1891లో అతను ఇక్కడికి వచ్చి, ఆ పుస్తకంలోని గుర్తుల ప్రకారం ఆ ఇంటి కోసం అన్వేషించాడు. ఈ ద్వీపంలోని ఓ మోనాస్ట్రీకి చెందిన శిథిలమైన చర్చ్ని కనుగొన్నాడు. ఆ చర్చ్ మేరీ మాత తన చివరి దశలో నివసించిన ఇల్లుగా గుర్తించాడు. దీని పునాదులు క్రీస్తుశకం ఒకటో శతాబ్దానికి చెందినవని శాస్త్రజ్ఞులు నిర్ధారించాక, ఆ పునాదుల మీదే మళ్లీ ఇంటిని నిర్మించారు. వేల మంది పర్యాటకులు ఈ ఇంటిని సందర్శిస్తున్నారు. మా బస్సులో ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా, సెర్బియా, ఇంగ్లండ్, టర్కీ, గ్రీస్ మొదలైన దేశాలకి చెందినవారు కూడా ఉన్నారు. క్యూలో ఈ ఇంట్లోకి వెళ్తే, లోపల మేరీమాత విగ్రహం ఉంది. ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ని ఫీలయ్యే గుణం నాలో నాకు తెలీకుండానే ఏర్పడింది. కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో, మరికొన్ని ప్రధాన ఆలయాల్లో నేను ఫీలైన వైబ్రేషన్స్ని ఇక్కడ స్పష్టంగా ఫీలయ్యాను. అలాంటి చోట్ల నాకు తెలియకుండానే కన్నీళ్లూ, ఆనందంతో కూడిన దుఃఖం కలుగుతాయి. ఈ ఇంట్లో కూడా నాకు ఆ అనుభవం కలిగింది. క్రిస్టియన్స్లోని ఓ తెగవారు జీసస్ని కాక, మేరీమాతని కొలుస్తారు. ఓ ఆస్ట్రేలియన్ ఆలయం బయట నాతో చెప్పాడు. ‘‘మేరీ ఈజ్ ద ల్యాడర్ ఆఫ్ హెవెన్’’ (స్వర్గానికి మేరీ మాత నిచ్చెన). ఫర్ మదర్ మేరీ హాజ్ డిసెండెడ్ ఫ్రమ్ హెవెన్ ఇన్ టు దిస్ వరల్డ్ (ఎందుకంటే మేరీ మాత స్వర్గం నుంచి ఈ ప్రపంచంలోకి దిగి వచ్చింది) దట్స్వై హర్ మెన్ మైట్ ఎసెండ్ ఫ్రమ్ ద ఎర్త్ టు హెవెన్ (మేరీ మాత ద్వారా మనుషులు భూమి నుంచి స్వర్గానికి వెళ్లగలరు). ఆగస్ట్ 2011లో పోలెండ్లోని క్రాకోని సందర్శించాను. మా గైడ్ అక్కడి ఓ చర్చిని చూపింది. పోప్ జాన్ పాల్-2 క్రిస్టియన్ ఫాదర్ అయిన కొత్తల్లో ఆ చర్చ్లోనే పనిచేసేవాడని చెప్పింది. ఆ సమయంలో ఆయన కరీల్ ఓ టైలా (మొదట్లో చెప్పిన ఉదంతంలోని వ్యక్తి) మాత్రమే. పోప్ జాన్పాల్-2 నివసించిన ఇంటిని కూడా (హాస్టల్ లాంటిది) చూశాను. బేలూరులోని రామకృష్ణ పరమహంస నివసించిన గదిని చూసిన సంతోషం లాంటిది ఈ ఇంటిని చూస్తే కలిగింది. అలాగే క్రాకో నగరానికి దక్షిణాన గల ఓటైలా పుట్టిన వడోవైజ్ అనే ఊళ్లోని ఆయన ఇంటిని కూడా మా గైడ్ స్మార్తా చూపించింది. ఆయన ఇంటిని మ్యూజియంగా మార్చారు. ఆయన తిరిగిన నేలని బస్లోంచి చెప్పులు లేకుండా దిగి స్పర్శించాను. ఆది శంకరాచార్య పుట్టిన కాలడిని సందర్శిస్తే కలిగిన ఆనందం కలిగింది. క్రాకోలో ఆయన చదివిన సెమినరీ (క్రిస్టియన్ మతాచార్యుల కాలేజ్)ని కూడా మా గైడ్ బస్సులోంచి చూపించింది. వడోవైజ్తో ఆయన్ని బాప్టైజ్ చేసిన చర్చిలో, ఆయన మరణానికి మునుపు వైద్యులు చిన్న సీసాల్లో తీసుకున్న రక్తాన్ని ఉంచారని గైడ్ చెప్పింది. సెప్టెంబర్ 2014లోని సాలమాంకా నుంచి పోర్చుగల్లోని లిస్బన్కి బస్సులో వెళుతూ ఉన్నప్పుడు ‘అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా (పోర్చుగీస్ భాషలో నోసా సెన్హోరాడి ఫాతిమా) క్షేత్రాన్ని చూశాను. 1916లో 9 ఏళ్ల లూషియ శాంటోస్, ఆ పాప కజిన్స్ జెసింటా మార్డో(6), ఫ్రాన్స్స్పో మార్డో(9)లకి బ్లెస్డ్ వర్జిన్ మేరీ దర్శనం లభించింది. గొర్రెలు కాచుకునే ఈ పిల్లలు ఫాతిమా అనే ఊరుకి సమీపంలోని అల్జేస్ ట్రీవ్ అనే గ్రామానికి చెందినవారు. గొర్రెలతో వెళితే మేరీమాత ఈ ముగ్గురికి దర్శనం ఇచ్చింది. ఆ పిల్లలకి చదువు రాదు. ఇంటికి వచ్చాక ఆ సంగతి పెద్దలకి చెబితే వాళ్లు కొట్టిపారేశారు. ఆ తర్వాత అనేక సార్లు మేరీమాత దర్శనం వారికి లభించింది. ఓసారి నరకంలోని అగ్నిలో పాపపు ఆత్మలు కాలడం కూడా వారు చూశారు. ఇది చూసిన జెసింతా మనసులో గట్టి ముద్ర పడింది. పిల్లల వర్ణన ప్రకారం ఆమె చేతిలో రోజరీ (జపమాల) ఉండటంతో ఆమెకి ‘అవర్ లేడీ ఆఫ్ రోజరీ’ అనే పేరు, అవర్ లేడీ ఆఫ్ ద మోస్ట్ హోలీ రోజరీ అనే పేరు, ఫాతిమా గ్రామం దగ్గర జరగడంతో ‘అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా’ అనే పేర్లు వచ్చాయి. మేరీ పిల్లలకి చెప్పిన భవిష్యత్తులో రెండో ప్రపంచ యుద్ధం, మరికొన్ని దేశాల మధ్య యుద్ధాలు లాంటివి కూడా ఉన్నాయి. ఆమె దైవాన్ని ఎలా ప్రార్థించాలి, ఆరాధించాలి, త్యాగాలు ఎలా చేయాలి మొదలైనవి పిల్లలకి చెప్పింది. 13మే 1917న జెసింటా సూర్యుడుకన్నా కాంతివంతమైన మేరీమాత నుంచి అత్యంత శక్తివంతమైన కాంతికిరణాలు వెలువడుతుండగా చూసింది. ఆ విషయం తల్లికి చెబితే ఇరుగు, పొరుగు దాన్ని జోక్గా కొట్టేశారు. తరువాత 13, జూన్లో, 13 జూలైలో కూడా పిల్లలకి మేరీమాత దర్శనం ఇచ్చి మూడు రహస్యాలని చెప్పింది. వీటిని త్రీ సీక్రెట్స్ ఆఫ్ ఫాతిమాగా పిలుస్తారు. (ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే అంశాలే). 1941కల్లా వీటిలోని రెండు నిజంగా జరగడంతో 1943లో బిషప్ మూడో రహస్యం చెప్పమంటే నిరాకరించింది. అది రాసిన కాగితాన్ని కవర్లో ఉంచి, సీల్ చేసి 1960 దాకా తెరవకూడదని కోరింది. 2000లో పోప్ జాన్ పాల్ ॥దీన్ని చదివి అధికారికంగా ప్రకటించగా దాన్ని కాన్సెక్రీషన్ ఆఫ్ రష్యా అని పిలుస్తారు. తర్వాత పెద్దలు కూడా దీన్ని నమ్మి 13 ఆగస్టు 1917న మదర్ మేరీ దర్శనం అవుతుందని అక్కడికి వెళ్లారు. కానీ కాలేదు. ఫ్రాన్సిస్కో 1919లో జెసింటో మార్చి 1920లో చిన్నతనంలోనే మరణించారు. లుసింటా 13 ఫిబ్రవరి 2005న 97వ ఏట మరణించింది. పిల్లలు ఇద్దరి సమాధుల్ని, అవర్ లేడీ ఫాతిమాకి కట్టిన చర్చిని సందర్శించాను. సమీపంలో ఉన్న ఫౌంటెన్లోని నీరు పవిత్రమైనదని చెప్తారు. ఇది తాగితే వ్యాధులు పోతాయట! ఓ సీసాలో ఈ నీటిని తెచ్చి హెబ్సిబారాణి అనే క్రిస్టియన్ ఫ్రెండ్కి ఇచ్చాను. కాళ్లు పడిపోయిన వాళ్లు చర్చికి ముందే మోకాళ్ల మీద లోపలికి నడిచి వెళ్తే కాళ్లు బాగవుతాయని స్థానికులు చెప్పారు. ఇక్కడ అనేక మంది మానసిక రోగులు కూడా కనిపించారు. వారికి కూడా స్వస్థత చేకూరుతుందట! 13 మే 1946న పోప్ పయాస్-2 ఇక్కడికి అవర్ లేడీ ఫాతిమా విగ్రహానికి కిరీటాన్ని అమర్చారు. ఎందుకో మేరీ మాత మరణించిందని చెప్పిన కుశదాసిలోని వైబ్రేషన్ నాకు ఈ చర్చిలో కలగలేదు. నేను చూసిన మరో క్రిస్టియన్ విశేషం - అక్టోబర్ 2015లో జర్మన్లోని లేడీ ముసా అరబిక్ భాషలో దీని ఆర్థం ‘వ్యాలీ ఆఫ్ మోజెస్ ’. జుడాయిజమ్లో, ఇస్లామ్లో, క్రిస్టియానిటీలో, బహాయిజమ్లో మోజెస్ ముఖ్యమైన ప్రవక్త. జర్మన్ రాజధాని అమ్మన్ నుంచి ప్రాచీన నగరం పెట్రాకి వెళ్లే దారిలో లేడీ మూసా దగ్గర 240 కిలోమీటర్ల దూరంలో బస్ ఆగింది. మోజెస్ ప్రవక్త ఈ ఎడారి నుంచి వెళ్తూ దానిని అనుసరించేవారి దాహాన్ని తీర్చడానికి ఓ రాతిని కొడితే అది పగిలి నీరు వెలువడిందని బైబిల్ కథనం. ఆ రోజుల్లో పెట్రాని పాలించిన నబాటియన్స్ ఈ నీటి బుగ్గకి అనేక చిన్న కాలువలను తవ్వి పెట్రా నగరానికి దీన్ని తరలించారు. దీనికి గార్డియన్ ఆఫ్ పెట్రా, మోజెస్ వెల్, మోజెస్ వాటర్ స్ప్రింగ్, టోంచ్ ఆరన్ అని పేర్లు. మోజెస్ సోదరులైన అహరోను సమాధి ఈ ప్రాంతంలోనే ఉందని నమ్మకం. ఎక్కడుందో ఎవరికీ తెలియదు. మోజెస్ వెంట ఉండే వారు ఈ ఎడారిలో తప్పిపోయామని పరమాత్మ నిజంగా ఉంటే తమకు నీరు ఇవ్వాలని కోరితే మోజెస్ దైవాన్ని ప్రార్థించి ఈ నీటి బుగ్గని సృష్టించాడని గైడ్ చెప్పింది. బైబిల్లో పేర్కొన్న ఈ ప్రదేశాన్ని 1931లో కనుగొన్నారు. పోప్ జాన్ పాల్-2 కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించారు. మోజెస్ సమాధి కూడా ఇక్కడే ఎక్కడో కొండమీద ఉందట. కానీ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఆయన జ్ఞాపకార్థం మౌంట్ నెబూ మీద ఉంచిన ఆ విగ్రహాన్ని కూడా దర్శించాను. సమీపంలోని మదాబా అనే గ్రామంలోని పురాతన చర్చిలో ఓ పురాతన మొజాయిక్ మ్యాప్ ఉంది. ఆ రోజుల్లో జెరూసలేం భూమికి మధ్యలో ఉందని నమ్మేవారు. క్రీ.శ. 542కి చెందిన ఈ మ్యాప్లో మెడిటేరియన్ సీ, ఈస్ట్రన్ డిజర్ట్స, డెడ్సీ జెరికో, బెత్లెహేమ్, జోర్డన్, లెబనాన్ లాంటి క్రిస్టియన్ పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. మోజెస్ స్ప్రింగ్ నుంచి కూడా నీటిని పట్టి తెచ్చి కొందరు క్రిస్టియన్ మిత్రులకి ఇచ్చాను. అవకాశం ఉంటే జెరూసలేం, బెత్లెహేమ్ దర్శించాలని, క్రీస్తు శిలువతో నడిచిన దారిలోని మట్టిని స్పృశించాలని నా ఆశ. అలాగే మెక్సికో సిటీ ప్రాంతం లోని టెపియాక్ కూడా చూడాలని ఉంది. అక్కడకు కూడా మేరీమాత గొర్రెలు కాచుకునే ఓ కుర్రాడికి దర్శనాన్ని ఇచ్చింది! 9 డిసెంబర్ 1531న గొర్రెలు కాచుకునే జువాన్ డియాగో అనే పదిహేనేళ్ల కుర్రాడికి చుట్టూ కాంతితో ఉన్న పదహారేళ్ల యువతి దర్శనమిచ్చి, చర్చిని కట్టమని స్థానిక భాషలో కోరింది. అతను బిషప్కి ఈ విషయం చెపితే రుజువు కోరాడు. సాధారణ ప్రజలు ఉపయోగించే బట్ట (తిల్మా) మీద వర్జిన్ మేరీ ముఖం ప్రత్యక్షమైంది! నేటికీ ఆ బట్ట మీద మేరీ మాత బొమ్మని చూడొచ్చు. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఆ బట్ట ఈ పాటికి నశించిపోవాలి. అయినా అది చెక్కు చెదరకుండా ఉండడం అద్భుతం అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ప్రతి మతంలోనూ నేనున్నానని పరమాత్మ ఇలా గుర్తు చేస్తూనే ఉంటాడు. మనం చేయాల్సింది ఆయన బోధనలను పాటిస్తూ ఆయన్ని మరచిపోకపోవడం. ఓ రోజు లండన్లోని అతి పెద్ద చర్చి సెయింట్ పాల్ క్యాథడ్రిల్లో ఓ పేదరాలు నేలమీద మోకాళ్ల మీద కూర్చొని దైవ ప్రార్థన చేస్తూ, పక్కన ఎవరో కూర్చోవడం గమనించింది. చూస్తే ఆవిడ బ్రిటిష్ రాణి విక్టోరియా! దాంతో వెంటనే ఆ పేదరాలు లేచి మరో చోటికి వెళ్లి కూర్చుని ప్రార్థించ సాగింది. విక్టోరియా మహారాణి కూడా లేచి ఆ పేదరాలి పక్కన, దైవ ప్రార్థనకి మోకాళ్ల మీద కూర్చొని ఆమె చెవిలో చెప్పింది. ‘‘నేను సింహాసనం మీద ఉన్నప్పుడే రాణిని. దేవుని సన్నిధిలో మనమంతా సమానమే. లేచి వెళ్లకు.’’ ప్రతి మతం వారు గుర్తుంచుకోదగ్గ, ఆచరించదగ్గ గొప్ప విషయాన్ని ఆ మహారాణి అంత అందంగా చెప్పింది. - మల్లాది వెంకటకృష్ణమూర్తి -
సాత్వీకులు ధన్యులు
యేసు చెప్పిన మూడవ ధన్యత ‘‘సాత్వీకులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు’’ (మత్తయి 5:5). భూలోకాన్ని స్వతంత్రించుకొనకపోయినా, ఎంతో కొంత స్వతంత్రించుకోవాలని లేక సంపాదించుకోవాలని అనేకులు ప్రయత్నిస్తారు. కాని, సాత్వీకంతో సంపాదించుకోవడం అనేది ఆధునిక మానవుని ప్రవర్తనకు ఎంతో వ్యతిరేకంగా కనిపిస్తుంది. చరిత్రలో ఎంతోమంది సైనికబలం, డబ్బు బలం మరియు రాజకీయ కుయుక్తుల చేత ఎంతో కొంత సంపాదించుకోవడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం కూడ ఎంతోమంది అదే ప్రయత్నాలలో తమ సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎందరో క్రైస్తవులు కూడ ఈ పద్ధతులనే అవలంబిస్తున్నారు. ఇది ఎంతో విషాదకరం. సాత్వీకం అంటే ఏంటి? బైబిల్ ప్రకారం గ్రీకు భాషలో ఇది ఒక చిత్రంతో కూడిన పదం. అంటే, ఎంత జ్ఞానులైనా, ఎంత ధనవంతులైనా, ఎంత అధికారం, సౌందర్యం, ప్రఖ్యాతులు కలిగినవారైనా, దేవుని ముందు తమ అయోగ్యతను గుర్తించి, ఆయన యెదుట సాధువైన వ్యక్తులుగా ఉండటం.ఇట్టివారు మొదటగా, దేవుని అధికారానికి తమకు తాము సంపూర్ణంగా లోబడతారు. దీనులై, దేవుని సన్నిధిలో జీవిస్తారు. తమ ఆశయాలు, కోరికలు, భవిష్యత్తు, వారి సమస్తం ఆయన చేతుల్లో పెట్టి, ఆయన వారి జీవితాల్లో ఏమి చేసినా దానికి విధేయత చూపిస్తారు. వీరి ప్రార్థన ‘‘అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను’’ అని దేవుని అధికారాన్ని వారి జీవితాల్లో అంగీకరిస్తారు (మత్తయి 11:26). వీరు దేవుని వాక్యమును చదివి, దానికి సంపూర్ణంగా లోబడుతారు. ఆయన చెప్పిన మాటకు భయముతోనూ, వణుకుతోనూ లోబడతారు. ‘‘ఎవడు దీనుడై, నలిగిన హృదయము గలవాడై, నా మాట విని వణకుచుండునో వానినే నేను చూచుచున్నాను’’ అని యెహోవా సెలవిస్తున్నాడు (యెషయా 66:2). ఈ సాత్వీకులు తమను తాము దేవునికి లోబరచుకున్నవారు కాబట్టి, మనుష్యుల మెప్పుకొరకు గాని, వారి గుర్తింపు కొరకు గాని ఎదురు చూడరు. వీరు దేవుని నుండి పొందే మెప్పు కొరకే ఎదురు చూస్తారు. దాని చేత తృప్తి కలిగి ఉంటారు. కాబట్టి, ఎవరికీ భయపడరు. ఎవరినీ నొప్పించరు, నొప్పింపబడరు. వీరు తమను తాము హెచ్చుగా ఎంచుకొనరు కాబట్టి, అవమానం చెందరు. వీరు ఎవరినీ కూడ తమ కంటె చిన్నవారిగా పరిగణించరు. కాబట్టి, వీరి కంటే చిన్నవారి దగ్గర నుండి కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వీరు తమ బలహీనతలను ఎరిగినవారు కనుక తమ తప్పులను సులువుగా అంగీకరిస్తారు. తమ దీనత్వాన్ని ఎరిగినవారై దేవుని సన్నిధిలో విరిగి, నలిగిన హృదయం కలిగి జీవిస్తారు. అయితే ఈ విధంగా జీవించడం మానవులకు సాధ్యం కాదు కనక యేసు ప్రభువు ఇలా అంటున్నాడు... ‘‘నా యొద్దకు రండి... నేను సాత్వీకుడను, దీనమనస్సు కలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును.’’ ఇది యేసుక్రీస్తు మార్గం. లోక పద్ధతులకు, దాని జ్ఞానానికి ఎంతో భిన్నమైన మార్గం. సాత్వీకులు దేవుని స్వాధీనంలో ఉన్నవారు కాబట్టి, దేవుడు తన అధికారాన్ని వారి చేతుల్లో పెడతాడు. వారి పెద్దతనం, గొప్పతనం చూపించుకోవడం వలన కాదు గాని, సాత్వీకం వలన లోకాన్ని సంపాదించుకుంటారు.ఇది దేవుని రాజ్యవారసుల మూడవ లక్షణం. - ఇనాక్ ఎర్రా -
కుటుంబ నియంత్రణ పాటించ కుంటే ఓటు హక్కు వద్దు
బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వ్యాఖ్యలు ఉన్నావ్(యూపీ): బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాభా పెరుగుదలను నియంత్రించాలంటే అందరూ కుటుంబ నియంత్రణ పాటించాలని, పాటించని వారికి ఓటుహక్కును రద్దు చేయాలని అన్నారు. హిందువుల్లాగే ముస్లింలూ కుటుంబ నియంత్రణ పాటించాలని, అందరికీ ఒకే చట్టం ఉండాలని డిమాండ్ చేశారు. ఉన్నావ్లో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నేను ముస్లింలు, క్రిస్టియన్లు తప్పకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలనడం లేదు. జనాభా పెరుగుదలను అడ్డుకోవాలంటే కు.ని. పాటించాల్సిందే. హిందువులు నలుగురు పిల్లల్ని కనాలంటే ఎంతో గొడవ చేశారు. అదే కొందరు నలుగురు భార్యల ద్వారా 40 మంది పిల్లల్ని కంటుంటే ఎవరూ ఏమీ అనరు’ అని అన్నారు. జనాభా పెరుగుదల దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో ఒకటని పేర్కొన్నారు. ‘ హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు.. ఎవరైనా కానీ అందరికీ ఒకే చట్టం ఉండాలి. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు.. ఎందరు పిల్లలైనా సమాజంలోని అన్ని వర్గాలకు ఒకే చట్టం ఉండేలా చూడాలి. అందరికీ వర్తించేలా ఉమ్మడి చట్టం తేకుంటే దేశానికే నష్టం. ఇందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం ముందుకు రావాలి. ఈ చట్టాన్ని పాటించనివారి ఓటు హక్కును రద్దు చేయాలి’ అని పేర్కొన్నారు. -
క్రిస్టియన్లపై ఐఎస్ హత్యాకాండ
-
క్రిస్టియన్లపై ఐఎస్ హత్యాకాండ
కైరో: మతోన్మాదం నెత్తికెక్కిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడ్డారు. ఈజిప్ట్కు చెందిన 21 మంది క్రిస్టియన్ కార్మికులను లిబియాలో అత్యంతపాశవికంగా హతమార్చారు. లిబియా రాజధాని ట్రిపోలీ దగ్గర్లోని సముద్రతీరంలో ఆ క్రిస్టియన్లకు ఆరెంజ్ రంగు దుస్తులు వేసి, చేతులను వెనక్కు విరిచికట్టేసి, వరుసగా నిల్చోబెట్టి నలుపురంగు దుస్తులు, ముఖాలకు మాస్క్లు ధరించి ఉన్న ఉగ్రవాదులు అత్యంత హేయం గా తలలు తెగనరికారు. ఆ దృశ్యాలున్న వీడియోను ఆన్లైన్లో ఆదివారం విడుదల చేసి, ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురి చేశారు. ఐదు నిమిషాల వ్యవధి ఉన్న ఆ వీడియో చివరలో ఒక ఉగ్రవాది ‘అల్లాపై ఒట్టేసి చెబుతున్నాం. షేక్ ఒసామా బిన్ లాడెన్ శరీరాన్ని మీరు దాచి న సముద్ర జలాల్లోనే మీ రక్తాన్ని కలుపుతాం’ అంటూ ప్రతినబూనిన దృశ్యం కూడా ఉంది. తమ తదుపరి లక్ష్యం ఇటలీ రాజధాని రోమ్ అనే హెచ్చరిక ఆ వీడియోలో ఉంది. లిబియాలోని సిర్తె పట్టణంలో నెల రోజుల క్రితం ఆ క్రిస్టియన్ కార్మికులను ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఐఎస్ బలంగా ఉన్న సిరియా, ఇరాక్లకు ఆవల మరో దేశంలో ఈ స్థాయి హత్యలకు తెగబడడం ఐఎస్కు ఇదే తొలిసారి. ఉగ్రవాదుల దుశ్చర్యపై ఈజిప్ట్ తీవ్రంగా స్పందించింది. ఆ వీడియో విడుదలైన కాసేపటికే.. పొరుగుదేశం లిబియాలోని ఐఎస్ ఉగ్రవాదసంస్థ స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, ఆయుధాగారాలపై యుద్ధ విమానాలతో పెద్ద ఎత్తున పలు దఫాలుగా వైమానిక దాడులు చేసింది. ఆ దాడుల్లో దాదాపు 64 మంది మిలిటెంట్లు హతమయ్యారని, ఐదుగురు పౌరులు చనిపోయారని లిబియా అధికారులు వెల్లడించారు. బషీర్ అల్ దెర్సి సహా ఐఎస్ కీలక నేతలు ముగ్గురు ఈ దాడుల్లో చనిపోయారన్నారు. ఉగ్రవాదుల ప్రాబల్యం ఉన్న దెర్నా, సిర్తె పట్టణాలపై జరిగిన ఆ దాడులకు లిబియా సైన్యం కూడా సహకరించిందన్నారు. ఈజిప్ట్తో సమన్వయంతో రానున్న రోజుల్లో ఐఎస్పై మరిన్ని దాడులు చేస్తామన్నారు. ఈ దాడులతో ఐఎస్పై పోరులో ఈజిప్ట్ ప్రత్యక్షంగా పాల్గొనడం ప్రారంభమైంది. ఉగ్రవాదుల చర్యను అత్యంత విషపూరిత చర్యగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతే ఎల్ సిసి అభివర్ణించారు. ఇరాక్, సిరియాల్లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఐఎస్పై జరుపుతున్న పోరును లిబియాకు విస్తరించాలని కోరారు. ‘హంతకులపై ఎప్పుడు, ఎలాంటి చర్య తీసుకోవాలనే నిర్ణయం తీసుకునే హక్కు ఈజిప్ట్కు ఉంది. ఉగ్రవాదాన్ని అణచేసే సామర్ధ్యం ఈజిప్ట్కు ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో వ్యాప్తి చెందుతున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్నీ కలసిరావాలి’ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సిసి.. దేశవ్యాప్తంగా వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. లిబియాకు ఎవరూ వెళ్లొద్దని, అక్కడ ఉన్నవారు కూడా తిరిగి వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. న్యూయార్క్లో జరుగుతున్న ‘ఉగ్రవాదంపై పోరు’ సదస్సులో పాల్గొనేందుకు తక్షణమే వెళ్లాలని విదేశాంగ మంత్రిని ఆదేశించారు. కాగా, ఐఎస్ ఉగ్రవాదుల మారణకాండపై పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, ఐరాస భద్రతామండలి, అమెరికా, ఖండించాయి. -
రాజ్నాథ్ నివాసం వద్ద క్రైస్తవుల ఆందోళన
న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసం వద్ద క్రైస్తవులు గురువారం ఉదయం నిరసన చేపట్టారు. ఢిల్లీలో పలు ప్రాంతాల్లో చర్చిలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సుమారు 200 మంది ఆందోళనకు దిగారు. 'వుయ్ వాంట్ జస్టిస్, స్టాప్ ఎటాకింగ్ యుజ్' అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాడులపై ప్రభుత్వం సిట్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు వీరంతా ర్యాలీగా బయల్దేరి రాజ్నాథ్ సింగ్ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దాంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాటో చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో వారిని అరెస్ట్ చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా ఢిల్లీ నగరంలో గత నవంబర్ నుంచి చర్చిలపై అయిదుసార్లు దాడులు జరిగాయి. -
”మత మార్పిడి నిరోధక చట్టాన్ని తేవాలి”
-
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ : నగరంలో అందంగా ముస్తాబైన చర్చిల్లో బుధవారం అర్ధరాత్రి ప్రార్థనలతో మొదలైన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మూడు వారాల కింద దిల్షాద్ గార్డెన్లో అగ్నిప్రమాదం జరిగిన సెయింట్ సెబాస్టియన్ చర్చితో పాటు దాదాపు 224 చర్చిల్లో క్రైస్తవులు గురువారం ప్రార్థనలు చేశారు. ప్రపంచశాంతిని, సౌభ్రాతత్వాన్ని కాంక్షిస్తూ గీతాలు ఆలపించారు. గంటల తరబడి చలిలో.. కనీస ఉష్ణోగ్రత ఆరు డిగ్రీలు ఉన్నప్పటికీ వేలమంది క్రైస్తవులు గంటలతరబడి క్యూలలో నిలబడి అర్థరాత్రి ప్రార్థనలు చేశారు చర్చిలలో సెయింట్ సెబాస్టియన్ చర్చిలో అర్థరాత్రి మాస్ మాత్రం జరుపలేదు. అన్ని కార్యక్రమాలను రాత్రి 11 గంటలకే ముగించారు. కొన్నిచోట్ల ప్రత్యేకంగా వేసిన టెంట్లలో ప్రార్థనలు చేశారు. అన్ని చర్చిల్లోనూ ఉత్సాహంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకొన్నారు. క్రిస్మస్కారోల్స్ పాడేవారు. శాంటాక్లాజ్ ల వేషధారణలు పిల్లలు, పెద్దలను అలరించాయి. పోలీసులు గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. పీసీఆర్ వ్యాన్లతో పాటు భారీ సంఖ్యలో సిబ్బందిని మోహరించారు. వేడుకలు శాంతియుతంగా జరిగేలా చూశారు. గుర్గావ్లోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
ప్రేమమూర్తి.
జిల్లా అంతటా వేడుకలకు సన్నాహాలు వెలుగులు విరజిమ్ముతున్న చర్చిలు బుధవారం రాత్రి నుంచే ప్రార్థనలు మార్మోగుతున్న యేసు కీర్తనలు అంధకారం అలముకున్న లోకానికి ఆయన వేగుచుక్క అయ్యాడు. అమృత వాక్కులతో వెలుగులు ప్రసరింపజేశాడు. దీనులను లాలించి అక్కున చేర్చుకున్నాడు. తన ప్రాణాలకు హాని తలపెట్టిన వారికి సైతం ప్రేమను పంచాడు. దయామయుడైన దైవకుమారుడు కన్ను తెరిచిన క్రిస్మస్ పర్వదినం నేడు. ఆ కరుణామయుడిని పూజించేందుకు జిల్లాలోని అన్ని చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. - కాజీపేట క్రిస్మస్ సంబరాలకు జిల్లా సిద్ధమైంది. కరుణామయుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని పునీతులవ్వాలని క్రీస్తు ఆరాధకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఏ ఇంట చూసినా పండుగ వాతావరణమే. ప్రతీ చర్చినీ అందంగా అలంకరించారు. బుధవారం రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. క్రైస్తవులు ఈ నెలంతా ‘హాలీడే సీజన్’, ‘సీజన్ ఆఫ్ గివింగ్’, ‘సీజన్ ఆఫ్ జాయ్’గా అభివర్ణిస్తూ పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. క్రిస్మస్ పర్వదినాన ఆ మానవతామూర్తి వాక్కులు ఇచ్చే స్ఫూర్తిని హృదయాల్లో నింపుకుంటారు. దీన్ని ‘స్పిరిట్ ఆఫ్ క్రిస్మస్’గా పిలుస్తారు. వెలుగులు నింపే క్రిస్మస్ ట్రీలు.. స్టార్లు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవుల ఇళ్లన్నీ క్రిస్మస్ ట్రీలు, స్టార్లతో మెరిసిపోతున్నాయి. చర్చిల్లో పశువుల పాకలు ఏర్పాటు చేసి యేసు జన్మించిన దృశ్యాన్ని బొమ్మలతో అందంగా అలంకరిస్తున్నారు. జిల్లాలో మూడువేలకు పైగా పెద్ద చర్చిలు, ఆరువేల వరకు చిన్న, చిన్న చర్చిలు ఉంటాయని అంచనా. తొమ్మిదివేల మంది పాస్టర్లు జిల్లాలోని వివిధ చర్చిలను నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా గురువారం జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. కెథడ్రల్, సెయింట్ జోసఫ్, బాప్టిస్టు, ఒమేగా అల్ఫా, బైబిల్ మిషన్, జాన్ మార్కండేయ తదితర శాఖల ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాజీపేటలోని కెథడ్రల్ చర్చి ఆవరణలో వరంగల్ మేత్రాసనం పీఠాధిపతి బిషప్ ఉడుముల బాల ఆధ్వర్యంలో రోమన్ కేథలిక్లు క్రిస్మస్ వేడుకలను భారీస్థాయిలో నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి నుంచే ప్రారంభమైన వేడుకల్లో గురువులు, బ్రదర్లు, సిస్టర్లు, పాస్టర్లు చర్చిల్లో ప్రత్యేక గీతాలు ఆలపిస్తూ ప్రార్థనలు చేశారు. బిషప్ డానియల్ కళ్యాణ్, ఫాదర్ ఏరువా చిన్నపరెడ్డి, జాన్మార్కండేయ, బ్రదర్ పాల్సన్రాజ్, ప్రకాష్రాజ్, కురియన్ల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి క్రిస్మస్ ఫీస్ట్ నిర్వహించారు. చర్చి సభ్యులందరూ కుటుంబ సభ్యులతో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. సేవా కార్యక్రమాలు క్రిస్మస్ పండుగకు గుర్తుగా పేదలు, వికలాంగులు, వృద్ధులకు నూతన వస్త్రాలు పంచిపెట్టారు. ఇక గురువారం చర్చిల్లో స్త్రీలు, చిన్నపిల్లలు, యువతకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శుల సంఘం అధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. గురువారం జిల్లాలోని అన్ని చర్చిల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక ఆరాధన నిర్వహించనున్నారు. -
500 మంది మతమార్పిడి
గుజరాత్లో క్రైస్తవులను హిందువులుగా మార్చిన వీహెచ్పీ కేరళలో 30 మంది దళిత క్రైస్తవులను కూడా... క్రైస్తవులందరినీ మార్చేదాకా మార్పిడి సాగుతుందని వెల్లడి హిందుత్వాన్ని కాపాడే మా ప్రభుత్వం వచ్చింది: సింఘాల్ వాల్సద్ (గుజరాత్)/అలప్పుజ (కేరళ): ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఇటీవల 200 మంది ముస్లింలను హిందూ మతంలోకి ధరమ్ జాగరణ్ సమితితోపాటు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ బజ్రంగ్ దళ్ మార్చడంపై దుమారం చెలరేగుతుండగానే గుజరాత్, కేరళలలోనూ తాజాగా మతమార్పిళ్లు చోటుచేసుకున్నాయి. గుజరాత్లోని వాల్సద్లో ఉన్న అర్నాయ్ గ్రామంలో శనివారం 100 కుటుంబాలకు చెందిన 500 మంది గిరిజన క్రైస్తవులను హిందూ మతంలోకి మార్చిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ఆదివారం కేరళలోని అలప్పుజ జిల్లాలో 8 కుటుం బాలకు చెందిన 30 మంది దళిత క్రైస్తవులను తిరిగి హిందూ మతంలోకి చేర్చింది. వాల్సద్లో గిరిజనులను తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించే ముందు మహా యజ్ఞం నిర్వహించిన వీహెచ్పీ అనంతరం వారందరికీ భగవద్గీతలు, రాముని పటాలు, రుద్రాక్ష మాలలను అందించింది. గతంలో క్రైస్తవంలోకి మారిన వీరంతా తిరిగి హిందూ మతంలోకి వచ్చేందుకు సుముఖత చూపడంతో ఈ కార్యక్రమం (ఘర్ వాపసీ) నిర్వహించినట్లు వీహెచ్పీ స్థానిక నేత అజిత్ సోలంకి తెలిపారు. క్రైస్తవులంతా స్వచ్ఛందంగానే తిరిగి మతం మార్చుకున్నారన్నారు. హిం దూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన గిరిజనులకు ముందుగా ఆశచూపినట్లుగా తిం డి, విద్య లభించలేదన్నారు. క్రైస్తవులంతా తిరిగి హిందూ మతంలోకి వచ్చేంత వరకూ ‘ఘర్ వాపసీ’ ప్రక్రియను కొనసాగిస్తామన్నారు.కాగా, స్వచ్ఛంద కార్యక్రమం కావడం వల్ల ఇందులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని గుజరాత్ ప్రభుత్వ ప్రతినిధి నితిన్ పటేల్ తెలిపారు. ఇక కేరళలోని కాణిచానల్లోర్లో ఉన్న ఓ గుడిలో ఘర్ వాపసీ కార్యక్రమంలో ఎనిమిది దళిత క్రైస్తవ కుటుంబాలకు చెందిన 30 మందిని తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చారు. మరో 150 క్రైస్తవ కుటుంబాలు తిరిగి హిందూమతం పుచ్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేశాయని కేరళ వీహెచ్పీ నేత పాడిక్కల్ తెలిపారు. కాగా, ఆగ్రాలో ముస్లింల మతమార్పిడి మోసపూరితమని యూపీ మైనారిటీ కమిషన్ పేర్కొంది. ‘హిందూ జనాభా 100 శాతానికి చేరుస్తాం’ భోపాల్: దేశంలో హిందూ జనాభాను ప్రస్తుతమున్న 82 శాతం నుంచి 100 శాతానికి చేరుస్తామని వీహెచ్పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఆదివారమిక్కడ అన్నారు. హిందువుల సంఖ్య సగానికి పడిపోయి మైనారిటీల స్థాయికి పడిపోవడాన్ని ఉపేక్షించబోమన్నారు. ఆ చట్టం బాధ్యత విపక్షాలదే: అమిత్ సాక్షి, చెన్నై: సంఘ్ పరివార్కు చెందిన కొన్ని సంస్థలు బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతుండటంపై దుమారం రేగిన నేపథ్యంలో మతమార్పిళ్ల నిరోధక చట్టం తెచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని...అందుకు మద్దతివ్వాల్సిన బాధ్యత విపక్షాలదేనని బీజేపీ చీఫ్ అమిత్ షా పేర్కొన్నారు. లౌకికవాదులమని చెప్పుకొనే ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వం తేవాలనుకుంటున్న మతమార్పిళ్ల నిరోధక చట్టానికి మద్దతిచ్చే దమ్ముందా? అని చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ షా సవాల్ విసిరారు. అభివృద్ధి ఎజెండా నుంచి తమ ప్రభుత్వాన్ని ఎవరూ పక్కకు నెట్టలేరని షా వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోనే కూటమి ఉంటుందని, సీఎం అభ్యర్థి పేరు ప్రకటించాకే ఎన్నికల్లోకి వెళ్తామన్నారు. భాగవత్ వ్యాఖ్యలపై మోదీ మౌనమేల? సంఘ్ పరివార్ సంస్థలు చేపడుతున్న మతమార్పిళ్లను సమర్థించడంతోపాటు దీన్ని వ్యతిరేకించే పార్టీలు దమ్ముంటే మతమార్పిళ్ల నిరోధక చట్టానికి మద్దతివ్వాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, సీపీఎం మండిపడ్డాయి. ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించాయి. -
తెలంగాణ సీఎం కేసీఆర్కు క్రైస్తవుల కృతజ్ఞతలు
నేను తెలంగాణలోని దాదాపు 6 జిల్లాల్లో క్షేత్రస్థాయి లో పని చేశాను. దళిత హక్కుల పరిరక్షణలో భాగం గా తెలంగాణలో చాలా మంది దళిత క్రైస్తవులతో పని చేసే అవకాశం వచ్చింది. క్రైస్తవులలో దాదాపు 90 శాతం మంది దళిత క్రైస్తవులు అ న్ని అవకాశాలకు దూరంగా ఉంటూ అటూ ఎస్సీలుగా కాక ఇటు బీసీలుగా కాక మధ్యస్థంగా ఉన్నారు. అయితే బీసీసీలో ఒక శాతం మాత్రమే రిజర్వే షన్తో ఎలాంటి సహాయం లేకుండా దళిత క్రైస్తవు లు ఉన్నారు. వీరికి స్కాలర్షిప్, ఎస్సీ హాస్టల్లో అడ్మిషన్ దొరకవు. ఒకే తల్లికి పుట్టిన నర్సింహకు రిజర్వేషన్ ఉంటే క్రైస్తవత్వం స్వీకరించిన నతానియే లుకు మతం మారినందుకు ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు ఆగిపోతాయి. గ్రామాల్లో క్రైస్తవ పాస్టర్స్ తక్కువ వేతనానికి పని చేస్తూ కడు పేదరి కాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి వారిపై కొన్ని వర్గాల వారు దాడి చేయ డం గర్హనీయం. స్వాతం త్య్రం వచ్చినప్పటి నుండి క్రైస్తవులు ఒకే పార్టీకి ఓటు బ్యాంకుగా మిగిలిపోయారే తప్ప వారికి సమాజం లో ఎలాంటి రక్షణ, సంరక్షణ ఆ పార్టీ ఇవ్వ లేకపో యింది. జనాభాలో క్రైస్తవులు రెండున్నర శాతమే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. కానీ నిజానికి క్రైస్తవులు 10 శాతం ఉన్నారు. ఎస్సీ సర్టిఫికెట్కి భయపడి, మతతత్వ శక్తులకు భయపడి దళిత క్రైస్తవులు తమ ఉనికిని చెప్పుకోవడం లేదు. దళిత క్రైస్తవులకు భూ పంపిణీ, హైదరాబాద్లో క్రైస్తవ భవన నిర్మాణం, ఉద్యోగాల్లో రిజర్వేషన్ తప్ప మిగ తా అన్ని విషయాల్లో దళిత క్రైస్తవులకు దళితులతో సమానంగా అవకాశం కల్పించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ని, వారి ప్రభుత్వాన్ని క్రైస్తవ సమాజం మొత్తం అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుచు న్నది. దళితులతో సమానంగా దళిత క్రైస్తవులకు అవకాశాలను కల్పించినందుకు కేసీఆర్కు కృతజ్ఞత లు తెలియజేస్తూ నవ తెలంగాణ నిర్మాణానికి ఎప్పటికంటే ఎక్కువగా మా సహకారాన్ని అంద జేస్తూ పని చేస్తామని తెలియజేస్తున్నాము. జ్యోతి నీలయ్య సామాజిక కార్యకర్త, హైదరాబాద్ -
ఏసు బోధనలు ఆచరణీయం
ఆత్మకూరు(మంగళగిరి రూరల్) ఏసుక్రీస్తు ప్రేమ స్వరూపి అని, ఆయన బోధనలు ఆచరణీయమని అంతర్జాతీయ సువార్తీకులు బ్రదర్ ఎం.అనిల్కుమార్ అన్నారు. క్రిస్టియన్ రివైవల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను గురు వారం రాత్రి ఆత్మకూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాక్యోపదేశం చేస్తూ సువార్తను అందించేందుకు ఏసు ఈ లోకానికి వచ్చినట్టు తెలిపారు. ఏసు క్రీస్తు కొందరికే కాదు అందరికీ రక్షకుడన్నారు. సర్వసృష్టికి సువార్తను అందించడమే మన బాధ్యత అని, ఏసు ప్రేమ స్వరూపి అని మనకోసమే మరణించాడన్నారు. మన కోసం మతాలను సష్టించేందుకు రాలేదన్నారు. ఆయనపైవిశ్వాసం వుంచితే నిత్య జీవం ఇస్తాడని చెప్పారు. సాధారణంగా క్రైస్తవులు భయంతో వుంటారని, ప్రేమతో వుండటం లేదన్నారు. దేవుడు గురించి తెలిసిన వారికి భయం వుండదన్నారు. లోకాన్ని రక్షించడానికే ఏసు ప్రభువు భూమి మీదకు వచ్చారన్నారు ప్రతి ఒక్కరూ ఏసు మార్గంలో నడుచుకోవాలన్నారు. అనంతరం సినీనటి దివ్యవాణి వాక్యోపదేశం చేస్తూ తాను ఏసు ప్రభువును నమ్ముకున్నట్టు చెప్పారు. ఎంతటి కోటీశ్వరులైనా క్రీస్తు లేకపోతే బీదవారేనని చెప్పారు. గ్రాండ్ క్రిస్మస్ కన్వీనర్ పాస్టర్ బి.రవిప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎంపీపీ పచ్చల రత్నకుమారి, రెవరెండ్ కె.విజయభాస్కర్, రివైవల్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్ష, కార్యదర్శులు రెవరెండ్ పి.సుందరయ్య, రెవరెండ్ పి. దయారత్నకుమార్, పాస్టర్ ఎం.శేఖర్బాబు, పాస్టర్ ఆర్. అబ్రహామ్, కె.సుధాకర్ బాబు, కె భాస్కర్, బి. రాజు, వి. ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు. -
క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోం
కర్నూలు(న్యూసిటీ): బైబిల్, క్రీస్తు వ్యతిరేక కథనాలతో క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రిన్సిపాళ్లు ఎం.ఎల్.ఆండ్రూస్, దేవపాల్, జయరాజ్లు హెచ్చరించారు. క్రీస్తు వివాహితుడని మూడు దినపత్రికల్లో(సాక్షి కాదు) వచ్చిన కథనాలపై కర్నూలు కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక పాత బస్టాండ్లోని కోల్స్ మెమోరియల్ జూనియర్ కళాశాల నుంచి మొదలైన ర్యాలీ పెద్ద పార్కు, రాజ్విహార్ సర్కిల్, బుధవారపేట మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. ఈ సందర్భంగా చేపట్టిన ధర్నానుద్దేశించి వారు మాట్లాడుతూ లండన్ రచయిత రాసిన చైత పుస్తకం దిలాస్ గాస్పెల్ ఆధారంగా పత్రికలు పనికట్టుకొని ఏసు పెళ్లి చేసుకున్నాడని, పిల్లలు ఉన్నారని ప్రచురించడం క్రైస్తవుల మనోభావాలను దెబ్బ తీయడమేనన్నారు. ఇలాంటి పత్రికలను నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో గంగాధర్గౌడ్కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో వైస్ ప్రిన్సిపాల్ అబ్రహం లింకన్, టీడీపీ క్రిష్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు దాస్ తదితరులు పాల్గొన్నారు. -
వెల్లువెత్తిన నిరసన
కడప కల్చరల్ : క్రైస్తవులు ఆందోళనకు దిగారు. కొన్ని పత్రికలు తమ మనోభావాలను కించపరచడంతో వారు నిరసించారు. కట్టు కథలు అల్లిన పత్రికల తీరును వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ముందస్తు అనుమతి లేదంటూ నిరసన ప్రదర్శనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో క్రైస్తవులు ప్రతిఘటించారు. పోలీసులు, క్రైస్తవుల మధ్య వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా చేస్తున్న ఆందోళలను అడ్డుకోవడం తగదని వారు హితవు పలికారు. దీంతో పోలీసులు ర్యాలీకి అనుమతించారు. చివరకు వారు కలెక్టరేట్ కు చేరుకున్నారు. అక్కడ బైఠాయించి ఆందోళనకు దిగారు. ఏసుక్రీస్తు గురించి ఇటీవల ఓ దినపత్రికలో అవాస్తవాలు ప్రచురించడం తమ మనోభావాలు దెబ్బతీసినట్లైందంటూ కడపకు చెందిన ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, ఆలిండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ విద్యార్థులు, క్రైస్తవులు సోమవారం ఎల్ఐసీ సర్కిల్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభించారు. కథనం ప్రచురించిన పత్రికకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హెచ్బీ కాలనీ, రాజీవ్పార్కు, కోటిరెడ్డి సర్కిల్ మీదుగా కలెక్టరేట్కు చేరుకున్నారు. అక్కడ కలెక్టర్ లేకపోవడంతో డీఆర్ఓ సులోచనకు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ గేటు వద్ద ైబె ఠాయించారు. ఆందోళననుద్దేశించి క్రైస్తవ గురువు జేకోబ్ మాట్లాడారు. మత విశ్వాసాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇలాంటి పొరపాటు మరోసారి జరగకూడదనే ఆవేదనతోనే శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని మరో గురువు షడ్రక్ అన్నారు. పోలీసులతో వాగ్వాదం ర్యాలీ ప్రారంభం కాగానే కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి తమ సిబ్బందితో కలసి ర్యాలీని అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించకూడదని అభ్యంతరం తెలిపారు. ర్యాలీ ముందుకు సాగేందుకు వీల్లేదన్నారు. అనుమతి కోసం తాము పలుమార్లు పోలీసు అధికారులను ఆశ్రయించామని, అయినా అనుమతి ఇవ్వకుండా వేధించారని క్రైస్తవులు ఆరోపించారు. పోలీసులతో వాదనకు దిగారు. చివరకు డీఎస్పీ సూచించిన ప్రకారం ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవ ప్రముఖులు ఏసన్న, చిన్నయ్య, ఆల్ జయశాలి బైబిల్ రీసెర్చి సెంటర్ ప్రతినిధులు, విశ్వాసులు, స్థానిక క్రైస్తవులు పాల్గొన్నారు. -
ఆత్మలు కలుసుకునే రోజు
నేడు.. ఆల్ సోల్స్ డే! ఆత్మలు కలుసుకునే రోజు.. పోయినోళ్లందరూ మంచోళ్లే అని కీర్తించుకునే రోజు! క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే దేశాల్లో ఓ వేడుకగా జరుగుతుంది ఈ పర్వం.. ఈ సంప్రదాయం జంటనగరాలకూ చేరింది! నారాయణగూడ, బోయిగూడ, మెట్టుగూడలోని గ్రేవియార్డ్స్ పూలతేరులై క్యాండిలైట్ కాంతుల్లో ఆత్మలను ఆహ్వానిస్తాయి! మెక్సికోలో మొదలైన ఆల్స్ సోల్స్ డేను ఇప్పుడు ప్రపంచంలోని క్రైస్తవ దేశాలు, క్రైస్తవులు ఎక్కువగా ఉండే రాజ్యాలూ జరుపుకుంటున్నాయి. మన దగ్గర పెద్దల పండుగ, పితృ అమావాస్య లాంటిదన్నమాట. ఈ ఆల్ సోల్స్ డే ఇక్కడా అంతటా జరుపుకున్నా నారాయణగూడ, బోయిగూడ, మెట్టుగూడల్లోని క్రైస్తవ శ్మశానవాటికల్లో ఓ వేడుకలా కనిపిస్తుంది. పూలు.. కొవ్వొత్తికాంతులు ఒకరోజు ముందు నుంచి దీనికి సంబంధించిన ఏర్పాట్లు సాగుతుంటాయి. పాలరాతి సమాధులనైతే కడిగి శుభ్రం చేస్తారు. రాతి సమాధుల రంగులు వెలసిపోతే వాటికి రంగులు వేస్తారు. తెల్లవారి అంటే ఆల్ సోల్స్ డే నాడు ఉదయమే చనిపోయిన తమ ఆప్తుల ఇష్టమైన వంటకాలు వండి వాటిని సమాధి దగ్గరకు తీసుకెళ్తారు. ప్రార్థన చేసి సమాధి ముందు ఆ వంటకాలను పెట్టి ఇళ్లకు వెళ్లిపోతారు. సాయంత్రం ఏడు తర్వాత అసలు పర్వం మొదలవుతుంది. బంతిపూలు, గులాబీలతో సమాధులను చక్కగా అలంకరిస్తారు. ఆయా సమాధుల ముందు వాళ్ల వాళ్ల ఫొటోలను అమరుస్తారు. శ్మశానం గేటు దగ్గర్నుంచి సమాధి వరకు పూలతో దారి చేస్తారు. తమ ఆప్తుల ఆత్మలు ఆ పూల దారిలో నడిచి వస్తాయని ఈ ఆత్మీయుల నమ్మకం. ఆనక కొవ్వొత్తులను వెలిగించి మళ్లీ ప్రార్థిస్తారు. పెద్దల సమాధుల దగ్గర సందడి నెలకొంటే చిన్నవయసులో చనిపోయినవారి సమాధుల దగ్గర విషాదం ఆవహించి ఉంటుంది. శ్మశానం బయట... లోపల ఓ వాతావరణం ఉంటే బయట జాతరను తలపించే వాతావరణం ఉంటుంది. పూలు అమ్మే బళ్లు... బెలూన్లు అమ్మే అబ్బీలు... కొవ్వొత్తులు పెట్టుక్కూర్చున్న వాళ్లు... ఇంకా తినుబండారాలు అమ్మేవాళ్లు ఇలా రకరకాల బళ్లతో శ్మశానం గేటు ఎన్నడూ లేని జీవకళను కంటది. మెక్సికో గ్రేవియార్డ్స్లోనూ ఇలాంటి సందడే ఉన్నా అక్కడ పుర్రె ఆకారంలో పళ్లతో, చక్కెరతో చేసిన స్వీట్స్ను సమాధుల దగ్గర పెడ్తారు. శ్మశాన వాటికను ఓ పూల రథంలా అలంకరిస్తారు. ఇదీ ఆల్ సోల్స్ డే కథ. - భరత్ భూషణ్, ఫొటో జర్నలిస్ట్ -
తెలంగాణ క్రైస్తవులకు 3 శాతం కోటా
-
తెలంగాణ క్రైస్తవులకు 3 శాతం కోటా
రిజర్వేషన్ల శాతం పెంచుకుంటాం: కేసీఆర్ తమిళనాడు తరహా ప్రత్యేక మినహాయింపులు పొందుతాం వచ్చే మార్చిలో క్రైస్తవులకు ఎమ్మెల్సీ.. క్రిస్మస్ సందర్భంగా అధికారికంగా ప్రత్యేక కార్యక్రమం చర్చిలకు నిధులపై పరిశీలన.. ప్రత్యేకంగా స్మశానాలు మత ప్రచారకులపై దాడులు జరగకుండా ఆదేశాలు సాక్షి, హైదరాబాద్:తమిళనాడు తరహాలో ప్రత్యేక మినహాయింపులు తీసుకుని తెలంగాణలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెల్లడించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశాలపై కమిటీ వేసి అధ్యయనం చేయిస్తున్నామని... క్రైస్తవులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో కూడా అధ్యయనం చేసి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ అయ్యే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని క్రైస్తవులకే కేటాయిస్తామని పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో వివిధ క్రైస్తవ సంఘాల పెద్దలు గొల్లపల్లి జాన్, జోనాథన్ కల్వ, ఎసీ.సాల్మన్, ఇ.డి.ఎస్.రత్నం, పాల్ ఆరాధన, నెహ్రూ ధైర్యం తదితరులు సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... చట్టసభల్లో క్రైస్తవులకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. వారికి ఎమ్మెల్సీ పదవినివ్వడం ద్వారా సమస్యలను చట్టసభల్లో వివరించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ పదవిని రాజకీయ కోణంలో చూడకుండా క్రైస్తవ మత పెద్దలంతా కలిసి సూచించే వ్యక్తికి ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. క్రిస్మస్కు ప్రత్యేక కార్యక్రమం రంజాన్ సందర్భంగా ముస్లింలకు అధికారికంగా విందు ఇచ్చినట్లుగానే.. క్రైస్తవులకు కూడా క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తుందని, సీఎం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో చర్చిలు నిర్మించడానికి కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోనవసరం లేకుండా ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. దేవాలయాలు, మసీదులు నిర్మించుకోడానికి ఎలాంటి నిబంధనలున్నాయో చర్చిల నిర్మాణానికీ అలాంటి నిబంధనలే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రైస్తవులకు ప్రత్యేకంగా శ్మశానాలు ప్రతీ గ్రామం, పట్టణంలో క్రైస్తవుల కోసం ప్రత్యేకంగా శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దీనికోసం స్థల సేకరణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. చర్చిల నిర్మాణానికి, ఇతర అవసరాల కోసం నిధులు మంజూరు చేసే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. కొన్నిచోట్ల క్రైస్తవ మత ప్రచారకులు, పాస్టర్లపై దాడులు జరుగుతున్నాయని మత పెద్దలు సీఎం దృష్టికి తీసుకురాగా... భవిష్యత్లో అలా జరగకుండా పోలీస్శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రవేశికలో భారతదేశాన్ని లౌకికరాజ్యంగా ప్రకటించిందని, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన తామంతా అందుకు కట్టుబడి ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖంగా ఉండాలని, కేసీఆర్ పాలన దిగ్విజయంగా కొనసాగాలంటూ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
కరుణామయ
-
గుడ్ఫ్రైడే సందర్భంగా ప్రార్థనలు
న్యూఢిల్లీ: గుడ్ఫ్రైడేను పురస్కరించుకొని నగరంలోని అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలువురు క్రైస్తవులు ఉపవాసాలు ఆచరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. మరికొం దరు గత 40 రోజులుగా ఉపవాసాలు పాటిం చారు. ‘మానవజాతి విముక్తి కోసం క్రీస్తు నేడు శిలువ వేయించుకున్నాడు. దేవుడే అయినా, మానవత్వానికి ఆయన మచ్చుతునక’ అని ఢిల్లీ క్యాథలిక్ చర్చ్ అధికార ప్రతినిధి ఫాదర్ డోమినక్ ఎమ్మాన్యుయేల్ అన్నారు. చర్చిలకు హాజరైన వాళ్లంతా సాయంత్రం ప్రార్థనలు ముగిసిన తరువాతే భోజనాలు చేశారని మార్కెటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్గా పనిచేసే వెండీ రొజారియో అన్నారు. క్రీస్తు పునరుత్థానాన్ని సూచించే ఈస్టర్ పర్వదినాన్ని ఆదివారం జరుపుకుంటారు. -
నవోదయం.. శుభోదయం కరుణోదయం
మానవాళికి శాంతి, దయ, ప్రేమలను పంచిన కరుణామయుడైన జీసస్ రాకకోసం క్రైస్తవులు ఆనందోత్సాహాలతో ఎదురుచూస్తున్నారు. దయామయుడైన ప్రభువు సందేశాన్ని వివరిస్తున్నారు. జిల్లాలో క్రిస్మస్ సందర్భంగా చర్చిలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతుల వెలుగుల్లో చర్చిలు మిలమిల మెరుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచే ఆయా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. గాంధీనగర్, (కాకినాడ) న్యూస్లైన్ :క్రైస్తవుల విశ్వాసం ప్రకారం క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 25న ఏటా పవిత్రమైన క్రిస్మస్ వేడుకను జరుపుకుంటారు. క్రైస్ట్, మాస్ రెండు పదాల కలయికే క్రిస్మస్. క్రైస్ట్ అంటే ప్రభువైన క్రీస్తు, మాస్ అంటే సమూహంగా ఆరాధించడం. జిల్లాలోని ఊరువాడా క్రిస్మస్ వేడుకలకు సిద్ధమయ్యింది. ఆరాధికులు కరుణామయుని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని పునీతులయ్యేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మంగళవారం రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ వేడులకు ప్రతీ చర్చిని ప్రత్యేకంగా అలంకరించారు. క్రైస్తవులకు ఈ నెల అంతా హాలిడేస్ సీజన్. సీజన్ ఆఫ్ గివ్వింగ్, సీజన్ ఆఫ్ జాయ్గా అభివర్ణిస్తూ భక్తితో జరుపుకుంటారు. మానవతా మూర్తి క్రీస్తువాక్కును హృదయాల్లో నింపుకుంటారు. దీనిని స్పిరిట్ ఆఫ్గా క్రిస్మస్గా పిలుస్తారు. క్రిస్మస్ సందర్భంగా పశువులపాకలో పుట్టిన దృశ్యాన్ని బొమ్మలతో అందంగా అలంకరిస్తారు. జిల్లాలో మూడువేల వరకు పెద్ద చర్చిలు, ఆరువేలు చిన్న చర్చిలు ఉన్నాయి. లూథరన్, బాప్టిస్ట్, రోమన్ కేథలిక్, మన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరపడానికి ఏర్పాట్లు చేశారు. కోనసీమలోని గోదావరి డెల్టా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. బైబిల్ క్విజ్, బైబిల్ లిటరరీ పోటీలు, పాటల పోటీలు నిర్వహించి క్రిస్మస్ రోజున బహుమతులు అందజేస్తారు. రోమన్ కేథలిక్ చర్చి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభం అయ్యాయి. లూధరన్స్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి చర్చిలో క్రిస్మస్ ఫీస్ట్ను నిర్వహించారు. కాకినాడ హౌస్ ఆఫ్ ప్రేయర్, క్రేగ్ మోమోరియల్ బాప్టిస్ట్ చర్చి, తుని నాసా చర్చి, రాజమండ్రి సెయింట్పాల్స్ లూధరన్ చర్చి, చర్చి ఆఫ్ షారోన్, గొల్లప్రోలు రోమన్ కేథలిక్ చర్చి, చెందుర్తి బాప్టిస్ట్ చర్చి, రంపచోడవరంలోని చర్చి ఆఫ్ క్రైస్ట్, అమలాపురంలో మన్నా మినిస్ట్రీస్, తుని బాప్టిస్ట్ చర్చిలలో వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. క్రిస్మస్ సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలు బహూకరించి భోజనాలు పెడతారు. చిన్నపిల్లలు, మహిళలు, యవ్వనస్తులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ ప్రతాప్సిన్హా, కార్యదర్శి రెవరెండ్ డానియేల్పాల్, కోశాధికారి దొమ్మేటి శామ్యూల్సాగర్, ఉపాధ్యక్షుడు ఎలీషా, హనీన్, జోసఫ్బెన్నీ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా క్రిస్మస్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ఆరాధన క్రిస్మస్ సందర్భంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జిల్లాలోని వివిధ చర్చిల్లో ప్రత్యేక ఆరాధనను ఏర్పాటు చేశారు. ప్రధాన చర్చిలలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవ మతబోధకులు ప్రత్యేక సందేశాలను అందించనున్నారు. కాకినాడ క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో క్వొయర్ కో-ఆర్డినేటర్ సైలస్పాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రిస్మస్ గీతాలను ఆలపించనున్నారు. కొన్ని చర్చిల్లో క్రీస్తు పుట్టుకకు సూచికంగా కేండిల్ సర్వీస్ను నిర్వహిస్తారు. ప్రత్యేక ఆరాధన అనంతరం అందరూ కలిసి క్రిస్మస్ విందును ఆరగిస్తారు. -
పాక్ చర్చిపై ఉగ్ర పంజా
పెషావర్: పాకిస్థాన్లో ఉగ్రవాదులు మళ్లీ నెత్తుటేర్లు పారించారు. ప్రార్థన కోసం చర్చికి వెళ్లిన అమాయక ప్రజలపై పంజా విసిరారు. ఆదివారం ఖైబర్ పక్తూన్ఖ్వా రాష్ట్ర రాజధాని పెషావర్లోని చారిత్రక చర్చిపై ఇద్దరు తాలిబన్ ఆత్మాహుతి బాంబర్లు జరిపిన దాడుల్లో 78 మంది మృతిచెందగా, 130 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో 30 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. పాక్లో క్రైస్తవ మైనారిటీలపై ఇదే అతి పెద్ద దాడి. కొహాటీ గేట్ ప్రాంతంలోని ఆల్ సెయింట్స్ చర్చిలో ప్రార్థనల తర్వాత, పేదలకు ఆహారం అందించేందుకు బయటకొచ్చిన భక్తులను లక్ష్యంగా చేసుకుని తొలి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. తర్వాత అర నిమిషంలోపే మరో బాంబర్ ఇదే ఘాతుకానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో చర్చి లోపల 700 మంది ఉన్నారు. పేలుళ్ల ధాటికి చర్చి పక్కనున్న భవనాలు దెబ్బతిన్నాయి. చర్చి గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తెగిపడిన అవయవాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనాస్థలి భీతావహంగా కనిపించింది. ఈ చర్చిని 1883లో బ్రిటిష్ హయాంలో నిర్మించారు. మృతుల్లో మూడు నుంచి ఐదేళ్ల మధ్య వయసున్న నలుగురు పిల్లలు, చర్చి గార్డుగా పనిచేస్తున్న ముస్లిం పోలీసు ఉన్నారు. ఘాతుకానికి పాల్పడిన ఒక్కో బాంబర్ వద్ద ఆరు కేజీల పేలుడు పదార్థాలున్న జాకెట్ ఉందని పోలీసులు చెప్పారు. క్షతగాత్రుల్లో చాలా మందిని లేడీ రీడింగ్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ నరమేధంపై పాక్ క్రైస్తవులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. పెషావర్ దాడిలో బలైన వారి మృతదేహాలను తీసుకొచ్చి రోడ్లను దిగ్బంధించారు. దాడిని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులకు మతం లేదని, వారు ఇస్లాంకు విరుద్ధంగా అమాయకుల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. దాడిని భారత ప్రధాని మన్మోహన్ కూడా ఖండించారు. అమెరికా దాడులకు ప్రతీకారం: తాలిబన్లు ఈ దాడికి పాల్పడింది తామేనని ‘తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్’కు చెందిన జుందల్లా వర్గం ప్రతినిధి అహ్మద్ మర్వాత్ ప్రకటించాడు. పాక్లో అమెరికా ద్రోన్ విమాన దాడులకు ప్రతీకారంగా దీనికి తెగబడ్డామన్నాడు. ద్రోన్ దాడులను ఆపేంతవరకు ముస్లిమేతరులపై దాడులు చేస్తూనే ఉంటామని హెచ్చరించాడు. షియా, అహ్మదీ వంటి మైనారిటీలపై తరచూ దాడులు జరిగే పాక్లో క్రైస్తవులపై ఇదే అతి పెద్ద దాడి అని అధికారులు చెప్పారు. -
అలుపెరుగని పోరు
సాక్షి, కాకినాడ : సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో రోజులు గడుస్తున్న కొద్దీ తీవ్రతరమవుతోంది. ఆదివారంతో సమైక్య ఉద్యమం 47వ రోజుకు చేరుకోగా, సర్వజనుల సమ్మె 34వ రోజుకు చేరుకుంది. అయినా పట్టు విడవకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ర్ట విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఎదుర్కొ నేందుకు సిద్ధంగా ఉన్నామని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆదివారం జిల్లాలో పలుచోట్ల క్రైస్తవులు సమైక్యాంధ్ర పరిరక్షణను కాంక్షిస్తూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. అమలాపురంలో కార్ల్డేవిడ్ కొమానపల్లి ఆధ్వర్యంలో వేలాది మంది క్రైస్తవులు సమైక్యాంధ్ర కోసం అమలాపురం బాలయోగి స్టేడియం సమీపంలోని మన్నా జూబ్లీ చర్చిలో ప్రార్థనలు చేశారు. అనంతరం చర్చి నుంచి నల్లవంతెన వరకు ర్యాలీగా తరలి వచ్చి వంతెనపై బైఠాయించారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్రంలోని కాంగ్రెస్ పాలకుల మనసు మార్చాలని ఏసుప్రభువును వేడుకుంటూ గంటన్నరపాటు ప్రార్థనలు చేశారు. క్రైస్తవ చిన్నారులు రోడ్డుపైనే కోలాటాలు, నృత్యాలు చేస్తూ, క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ నిరసన తెలిపారు. కొమానపల్లి మాట్లాడుతూ రాష్ర్టవిభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక పోతే ఇరుప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే అధికారం సోనియాకు ఎక్కడిదని ప్రశ్నించారు. 47 రోజులుగా సీమాంధ్రలో ఉవ్వెత్తున సమైక్య ఉద్యమాలు జరుగుతున్నా సోనియా చెవికెక్కకపోవడం బాధాకరమన్నారు. పిఠాపురం సెంటినరీ చర్చి ఆధ్వర్యంలో 300 మందికి పైగా క్రైస్తవులు 216 జాతీయ రహదారిపై చర్చి సెంటర్లో బైఠాయించిప్రార్థనలు చేశారు. పెద్దాపురం, సామర్లకోట తహశీల్దార్ కార్యాలయాల వద్ద జేఏసీ శిబిరాల ఎదుట క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. పిఠాపురం మున్సిపల్ కల్యాణమండపంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు అధ్యక్షతన జరుగుతున్న జిల్లా కార్యవర్గ సమావేశాన్ని జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. నాయకుల కార్లకు గాలి తీసేసి, బ్యానర్లు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సమైక్యవాదులను శాంతింపచేశారు. బీజేపీ నేతలు చేసేది లేక అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించి వెనుదిరిగారు. మంత్రులకు మంచిబుద్ధినివ్వు వినాయకా! భారత వికాస పరిషత్ ఆధ్వర్యంలో మండపేట కలువపువ్వు సెంటర్లో మానవ హారంగా ఏర్పడి నిరసన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ కిసాన్సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణతో పాటు ఇతర పార్టీల నాయకుల ఆధ్వర్యంలో వివిధ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు మండపేటలో ర్యాలీ నిర్వహించి కేంద్ర మంత్రులకు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటూ వినాయకునికి వినతి పత్రం సమర్పించారు.రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్టర్ కిషోర్కుమార్గౌడ్ గుండు గీయించుకొని విభజన నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు. విజయవంతమైన ‘అపరిచితుడు’ సినిమాలోని పాత్ర బొమ్మతో ఈ నెల 16న ఉదయం 9.30 గంటలకు రాజమండ్రి నాగదేవి థియేటర్కు రానున్నాడని, సమైక్య ఉద్యమకారులంతా తరలి రావాలని నగరంలో వెలసిన పోస్టర్లు ఆసక్తిని రేపాయి. కాకినాడ కలెక్టరేట్ ఎదుట జేఏసీ శిబిరంలో ఆయుష్, లునానీ, ఆయుర్వేద వైద్యులు, సిబ్బంది దీక్షలు చేపట్టారు. దీక్షలో పాల్గొన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగి పాపయ్యను సన్మానించారు. లునానీ వైద్యుడు శ్రీనివాస్ ఆసనాలు వేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ శిబిరం వద్ద విద్యార్థినులు నృత్య ప్రదర్శనలతో నిరసన తెలిపారు. ఈ శిబిరాలను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి, కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. బస్సుల్ని శుభ్రం చేసిన ఆర్టీసీ కార్మికులు కాకినాడలో ఆర్టీసీ కార్మికులు డిపో గ్యారేజ్లోని బస్సులను శుభ్రం చేసి నిరసన తెలిపారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ సెంటర్లో గ్రామస్తులు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ముమ్మిడివరంలో ఫీల్డు అసిస్టెంట్లు చేపట్టిన 72 గంటల నిరవధిక నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. తహశీల్దార్ కార్యాలయం ఎదుట 216 జాతీయ రహదారిపై సమైక్యవాదం అనే నినాదంతో కోనసీమ కవులు నిర్వహించిన కవిసమ్మేళనం ఆకట్టుకుంది. కొత్తపేటలో జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో గొడుగులతో నిరసన ప్రదర్శన చేశారు. రావులపాలెం మండలం గోపాలపురం వద్ద రైతులు వంటావార్పు చేసి నిరసన తెలిపారు. విద్యార్థులు మానవహారం నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం తెలిపారు. మామిడికుదురు మండలం కొమరాడ సెంటర్లో మోకాళ్లపై నిల్చొని ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. రాజోలు యూత్ ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిపై కోడిపందాలు నిర్వహించారు. పెద్దాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద జేఏసీ శిబిరం వద్ద క్రైస్తవులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు రాస్తారోకో చేశారు. జేఏసీ నాయకులు సామర్లకోటలో మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఏలేశ్వరంలో లారీలతో హారం ఏలేశ్వరం బాలాజీచౌక్లో లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో 50కి పైగా లారీలతో ప్రదర్శన నిర్వహించారు. సెంటర్ చుట్టూ లారీలతో హారంగా ఏర్పడి నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో బాలాజీచౌక్ ప్రధాన రహదారిపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు ధర్నా నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పాల్గొన్నారు. జగ్గంపేట సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు మానవ హారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. రామచంద్రపురం మెయిన్రోడ్డులో విద్యార్థులు తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు తదితర వేషధారణలతో ర్యాలీ నిర్వహించారు. ద్రాక్షారామలో రజకుల ఆధ్వర్యంలో వంటావార్పు చేసి నిరసన తెలిపారు. మామిడికుదురులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు 27వ రోజుకు చేరుకున్నాయి. పార్టీ రైతు విభాగం రాష్ర్ట కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ, మండల కన్వీనర్ బొలిశెట్టి భగవాన్, పలువురు కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. కాగా 72 గంటల సమ్మె ముగియడంతో విద్యుత్ అధికారులు, సిబ్బంది విధుల్లో చేరారు. విభజనపై నోట్ ప్రవేశపెట్టే పరిస్థితి ఏర్పడితే తామంతా నిరవధిక సమ్మెలోకి వెళ్తామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది.