
సాక్షి, మల్యాల: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని మల్యాల మండలం నూకపల్లిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామ శివారులోని వరద కాలువ వంతెనపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
జగిత్యాల నుంచి కరీంనగర్కు ఆపిల్ లోడ్తో వెళ్తున్న లారీ రోడ్డు పై ఉన్న భారీ గుంతను తప్పించే క్రమంలో.. ఎదురుగా గ్రానైట్ లోడుతో వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు నుజ్జు నుజ్జు కాగా.. గ్రానైట్ లారీ డ్రైవర్తో పాటు అతని పక్కనే ఉన్న అతని తమ్ముడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గుజరాత్ పోరుబందర్కు చెందిన జెముదా బాయి, కారా బాయిలుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment