ప్రధానాలయాలకు విజయ నెయ్యి సరఫరా చేస్తాం | Vijaya Dairy Proposal to the Government | Sakshi
Sakshi News home page

ప్రధానాలయాలకు విజయ నెయ్యి సరఫరా చేస్తాం

Published Thu, Sep 6 2018 2:47 AM | Last Updated on Thu, Sep 6 2018 2:47 AM

Vijaya Dairy Proposal to the Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు విజయ నెయ్యిని సరఫరా చేయాలని విజయ డెయిరీ నిర్ణయించింది. ఇందుకు అనుమతినివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ముందుగా యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి, భద్రాచలం రామాలయం, వేములవాడ రాజన్న, బాసర సరస్వతి దేవాలయాలకు విజయ నెయ్యిని సరఫరా చేస్తామని పేర్కొంది.

వీటితోపాటు మరికొన్ని ముఖ్యమైన దేవాలయాలకు కూడా సరఫరా చేస్తామని, వీటికి నెలకు 50 టన్నుల నెయ్యి అవసరమవుతుందని తెలిపింది. దేవదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాలకు సరఫరా చేసేలా ఉత్తర్వులిస్తే మరింత లాభం చేకూరుతుందని, దీని కోసం ఆదేశాలివ్వాలని కోరింది. మార్కెట్‌ ధరకు లేదా అంతకంటే తక్కువకే నాణ్యమైన విజయ నెయ్యిని దేవాలయాలకు సరఫరా చేస్తామని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement