ఈ ఆంజనేయుడు... రావణుడు | Victim Woman Video on Vijaya Dairy Chairman Atrocities | Sakshi
Sakshi News home page

ఈ ఆంజనేయుడు... రావణుడు

Published Tue, Apr 8 2025 5:45 AM | Last Updated on Tue, Apr 8 2025 5:45 AM

Victim Woman Video on Vijaya Dairy Chairman Atrocities

విజయ డెయిరీ చైర్మన్‌ దారుణాలపై బాధిత మహిళ వీడియో

డబ్బు ఎరవేసి అమాయక అమ్మాయిలను వంచిస్తున్నాడు

ఒంటరి ఆడవాళ్లను స్పా సెంటర్లు, పబ్‌లకు తరలిస్తున్నాడు

రాజకీయ నేతలు, అధికారుల వద్దకు మహిళలను పంపుతున్నాడు

ఒంటరి మహిళనైన నన్ను ఆర్థికంగా ఆదుకుంటానని వాడుకున్నాడు

ఎవరైనా ఎదురు తిరిగితే చిత్రహింసలకు గురిచేస్తున్నాడు

సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, మంత్రి లోకేష్ న్యాయం చేయాలి

సాక్షి, అమరావతి: విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు లైంగిక నేరాలకు పాల్పడుతు­న్నాడంటూ ఓ మహిళ సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు. స్పా సెంటర్లు, పబ్‌ల పేరుతో ఆయన సాగిస్తున్న దారుణాలను కళ్లకు కట్టినట్టు చెప్పారు. తనకు న్యాయం చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, మంత్రి లోకేశ్‌ను వేడుకున్నారు. ‘పదవి కోసం నాతోపాటు అనేకమంది మహిళల జీవితాలను చలసాని ఆంజనేయులు నాశనం చేస్తున్నాడు.

డబ్బు ఆశ చూపి ఒంటరి మహిళలను నరక కూపాల్లోకి నెడుతున్నాడు. నేనూ ఓ బాధితురాలినే’ అని కన్నీరు పెడుతూ మీడియాకు విడుదల చేసిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. బాధితురాలు ఏమన్నారంటే.. ‘‘నా పేరు కొడాలి ప్రమీల. మాది బాపుల­పాడు గ్రామం. ఇద్దరు ఆడపిల్లలున్నారు. 2019­లో నా భర్త చనిపోయాడు. తెలిసిన రిపోర్టర్‌ ద్వారా ఉద్యోగం కోసం ఆంజనేయులు వద్దకు  వెళ్లాను. విజయవాడలో పాల ఫ్యాక్టరీలో పెట్టా­రు. 

కొన్ని రోజులకు  స్వీట్ల తయారీకి మార్చా­రు. దేవుడు అనుకున్న ఆంజనేయులు నిజ స్వరూపం అప్పుడు బయటపడింది. ఆడవాళ్లను చూస్తే అతడు పిచ్చెక్కిపోయి సైకోలా ప్రవర్తి­స్తుంటాడు. భర్త లేడు కదా, అప్పులున్నాయి కదా, ఆర్థికంగా ఆదుకుంటానని నమ్మించి నన్ను లొంగదీసు­కున్నాడు. కొన్నాళ్లు మేం సహజీవనం చేశాం. 

2022 ఫిబ్రవరి 7న నన్ను క్యాబిన్‌కు పిలిచాడు. హైదరాబాద్, విశాఖలో పబ్‌లు పెడుతున్నా­మని, అక్కడికి డబ్బున్న మగవాళ్లు వస్తారని, వారికి అమ్మాయిలతో అవసరాలు ఉంటాయని అప్పుల పాలైన వాళ్లు, ఒంటరి మహిళలు ఉంటే చూడమని కోరాడు. ఆంజనేయులు ఆడపిల్లలను అడ్డుపెట్టుకుని చాలా దారుణమైన పనులు చేస్తున్నాడు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఆఫీసర్ల వద్దకు తీసుకెళ్తున్నాడు. మాట విననివారిపై దొంగతనం నెపం నెట్టి ఉద్యోగం నుంచి తీసేస్తాడు. నన్నూ అలానే పంపించేశాడు. మూడు రోజులు గదిలో బంధించి, చిత్రహింసలు పెట్టాడు. మూడు నెలల క్రితమే నేను వచ్చేసినా వదలడం లేదు. మేనేజర్‌ యశ్వంత్‌తో ఫోన్‌ చేయిస్తు­న్నాడు అమ్మాయిల­ను పంపమని వేధిస్తున్నాడు.

హైదరాబాద్, విశాఖల్లో ఆంజనేయులుకు మసాజ్‌ సెంటర్లు, పబ్‌లు ఉన్నాయి. డబ్బు ఎరవేసి అమ్మాయిలను అందులో పెడుతున్నాడు. వేమూరి సాయి, చలసాని చక్రపాణి, యాసిన్, పాలగుల నాని వంటి చాలామందికి ఈ విషయం తెలుసు. వీరందరినీ కఠినంగా శిక్షించాలి. నాలాంటి బాధిత మహిళలు చాలామంది ఉన్నారు. చెప్పుకోలేక కుంగిపోతున్నారు. నేను వాటిని భరించలేక ఏమైపోయినా పర్లేదని బయటకు వచ్చాను.  న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement