anjaneyulu
-
అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నేత పల్లె అనుచరుల దుశ్చర్య
పుట్టపర్తి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండలం నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త , ఎస్టీ కులానికి చెందిన సుహాసినిపై టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరుడు ఆంజనేయులు బలాత్కారానికి యత్నించాడు. వివరాల్లోకి వెళితే సుహాసిని కుమార్తె కదిరిలో చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి కుమార్తెను ఇంటికి తీసుకొస్తుండగా.. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో నాయనాకోట తండాలో కాపుకాసిన పల్లె అనుచరుడు ఆంజనేయులు, అతని కుటుంబ సభ్యులు సుహాసిని చీర లాగి బలాత్కారం చేయబోయారు. ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్ లాక్కున్నారు. అడ్డొచ్చిన ఆమె తల్లిపై దాడిచేసి చేయి విరగ్గొట్టారు. కులం పేరుతో దూషించారు. తోటి కార్యకర్తను కాపాడిందని.. ఓడీచెరువు మండలం వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త పోస్టును తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకోవాలని ఆంజనేయులు ప్రయతి్నస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానిక అంగన్వాడీ కార్యకర్త నాగమణిని వేధింపులకు గురి చేశారు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఈ నెల 27న ఆత్మహత్యకు ప్రయతి్నంచింది. అంగన్వాడీ కేంద్రంలోనే సెల్ఫీ వీడియో తీసి ఆంజనేయులు ఆగడాలను వివరిస్తూ పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.పక్క గ్రామమైన నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త సుహాసినికి విషయం తెలియడంతో వెంటనే సదరు కేంద్రానికి వెళ్లి తోటివారితో కలిసి నాగమణిని 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాగమణి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాగా.. నాగమణిని రక్షించిందనే కోపంతో సుహాసినిపై పల్లె అనుచరుడు ఆంజనేయులు దాషీ్టకానికి ఒడిగట్టాడు. బాధితురాలు జాయింట్ కలెక్టర్ అభిõÙక్కుమార్, ఎస్పీ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా అంగన్వాడీ కార్యకర్తపై దాడి చేసిన ఆంజనేయులు, అతని కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, గౌరవాధ్యక్షుడు వెంకటే‹Ù, అధ్యక్షుడు మహబున్నీషా, కోశాధికారి శ్రీదేవి,కార్యదర్శి దిల్షాద్ పాల్గొన్నారు. -
అవినీతి జీవి
సాక్షి, నరసరావుపేట/వినుకొండ/నూజెండ్ల: 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘జీవీ’ నీరు–చెట్టు, ఇసుక, మట్టిని అడ్డంగా దోచేశారు. బంధువులు, బినామీల ద్వారా పోరంబోకు, అగ్రహారం భూములను కబ్జా చేశారు. పేదలకు ప్రభుత్వం అందించిన భూములను స్వాహా చేసి చేపల చెరువుల తవ్వకాలు చేపట్టారు. ♦ బొల్లాపల్లి మండలం అయ్యన్నపాలెంలో 4,450 ఎకరాల కొత్త చెరువులో సర్వే నం.438లో 180 ఎకరాలు జీవీ బావమరిది కె.నరసింహారావు బినామీల ద్వారా ఆక్రమించుకున్నారు. ♦ గుమ్మనంపాడులో ఈనాం భూములను జీవీ, ఆయన బినామీలు వదలలేదు. పాలడుగు వెంకటరాయుడు, చిరుమామిళ్ల రామకృష్ణయ్య అగ్రహారికులుగా వ్యవహరిస్తున్న సమయంలో వారి పరిధిలో సర్వే నంబర్ 1 నుంచి 54 వరకు 5,968 ఎకరాల భూమి ఉంది. ఇందులో దేవుని మాన్యం భూమి సర్వే నం.43లో చెన్నకేశవస్వామి భూమి 200 ఎకరాలు, బంగారమ్మ తల్లి భూమి 16 ఎకరాలు, ఆంజనేయ స్వామి మాన్యం 13 ఎకరాలు, మరో కబ్జాలో భాగంగా ఊరచెరువు కింద 17 ఎకరాలను ఆక్రమించుకున్నారు. ♦ రేమిడిచర్ల గాలెయ్యకుంట సమీపంలోని ఎస్సీ భూములను గుంటూరుకు చెందిన జీవీ అనుచ రుడు కృష్ణ 110 ఎకరాలు చౌకగా చేజిక్కించుకున్నారు. బొల్లాపల్లి మండలంలోనే జీవీ బంధువులు, బినామీలు ఆక్రమించుకున్న భూము ల విలువ రూ.వందల కోట్లకు పైగా ఉంటుంది. కొప్పుకొండలో కబ్జా పర్వం వినుకొండ రూరల్ మండలం నడిగడ్డ పరిధి కొప్పుకొండలోని వాగు పోరంబోకు భూములను 1940లో బ్రిటీష్ ప్రభుత్వం మత్స్య సహకార సంఘానికి పంపిణీ చేసింది. 1980లో అదే గ్రామానికి చెందిన రైతుల నుంచి 17.80 ఎకరాల భూమిని జేవీఎస్ ఆక్వా కల్చర్ రాజ్యలక్ష్మి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసింది. జీవీ మేనమామ, ఒంగోలు వెంకటేశ్వర్లు, మరో బినామీ రామకోటేశ్వరరావును అడ్డుపెట్టుకొని చుక్కల భూమిగా ప్రకటించి ఈ భూమిని కొనుగోలు చేశారు. ఆ భూముల చుట్టూ మూడు కిలోమీటర్ల మేర దాదాపు 25 చేపల చెరువులను అక్రమంగా సాగు చేస్తున్నారు. ఖాతా నం.585లో 136 ఎకరాలు, ఖాతా నంబరు 571లో 30 ఎకరాలతోపాటు సర్వే నంబరు 281లో మరికొంత భూమిని కలిపి సుమారు 300 ఎకరాల పోరంబోకు భూములను కబ్జా చేశారు. వీటి విలువ రూ.50 కోట్లు. శివశక్తి పేరుతో ప్రభుత్వ సొమ్ము స్వాహా శివశక్తి బయో కంపెనీ పేరుతో ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారు. రైతులకు అందించే సూక్ష్మ పోషకాలైన మెగ్నీషియం సల్ఫేట్, జింకు, బోరాన్, ఫెర్రస్ సల్ఫేట్ కొనుగోలుకు అప్పట్లో ప్రభుత్వం టెండర్లు వేయగా వరుసగా నాలుగేళ్లు కిలో రూ.35 లు, జీఎస్టీ లేకుండా రూ.28తో మార్క్ఫెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. మల్టినేషనల్ కంపెనీలైన కోరమండల్, నాగార్జున, టాటా వంటి కంపెనీలు ఎరువులు తయారు చేస్తున్నప్పటికీ ప్రాచుర్యం లేని శివశక్తి కంపెనీకి టెండర్లను మార్క్ఫెడ్ ఖరారు చేసింది. ఏటా రూ.33.97 కోట్లు అదనంగా రాయితీ పొందింది. ఇలా నాలుగేళ్లు దాదాపు రూ.100 కోట్లకు పైగా సబ్సిడీ రూపంలో బొక్కేశారు. శివశక్తి బయో టెక్నాలజీ లిమిటెడ్, విజయ గ్రోమిన్, నవభారత్ పలు కంపెనీల పేర్లతో నెల్లూరు జిల్లా వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, తిరుపతి, కర్నూలు జిల్లాతోపాటు ఇతర రాష్ట్రాల్లో నకిలీ బయో ఎరువులు విక్రయించి రైతులను మోసగించారు. ఉద్యాన సబ్సిడీ స్వాహా ఉద్యాన శాఖ ద్వారా పండ్లు, కూరగాయలు సాగు చేసే రైతులకు అమలవుతున్న సబ్సిడీని రూ.10 కోట్లకు పైగా జీవీ స్వాహా చేశారు. వెల్లటూరు, మేళ్లవాగు, వడ్డెంగుంట, చీకటీగలపాలెం ప్రాంతాల్లో టమాటా, బొప్పాయి, పుచ్చ, నిమ్మ పంటలకు షేడ్నెట్, పాలి హౌస్, కూరగాయల పందిళ్ల పేరుతో వచ్చే సబ్సిడీని ఆయనే కైంకర్యం చేశారు. నూజెండ్ల, ఈపూరు మండలాల్లో మిర్చి రైతులు నష్టపోవడంతో రైతులకు ఇచ్చిన పరిహారాన్ని కాజేశారు. జీవీ అనుచరులు, బినామీలు బొల్లాపల్లి, వినుకొండ, రూరల్ మండలాల్లో ఉన్న అప్పటి అధికార పార్టీ నాయకులు రేషన్ మాఫియాగా ఏర్పడి రూ.200 కోట్లు దోపిడీ చేశారు. గుండ్లకమ్మలో ఇసుక దందా, ఉపాధి హామీ పనులు, నీరు చెట్టు పనులు, చెక్డ్యామ్లు, సీసీ రోడ్లు, ఇంకుడు గుంతల పేరుతో కోట్లల్లో స్వాహా చేశారు. ఈ అక్రమాలపై అప్పటి ఎంపీడీవో రవికుమార్తో పాటు 9 మంది ఉపాధి హామీ సిబ్బంది సస్పెండ్ అయ్యారు. 2014లో నూజెండ్ల మండలం మూర్తింజాపురంలో 10 గ్రామాలకు తాగునీరు అందించే సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నిర్మాణంలో అవినీతి జరిగింది. పనులు నాసిరకంగా చేయడంతో చెరువు నీరు నింపే క్రమంలోనే చెరువుకట్ట కొట్టుకుపోయింది. ఎన్ఎస్పీ కెనాల్ ఆధునికీకరణలో భాగంగా నాగార్జున సాగర్ మేజర్, మైనర్ కెనాల్స్ పనులు నాసిరకంగా చేపట్టి రూ.90 కోట్లు వెనకేసుకున్నారు. వినుకొండలో తాగునీటి సమస్య నెలకొనడంతో మంచినీటి సరఫరా కోసం రూ.2 కోట్లు మంజూరైంది. మంచినీటి ట్యాంకర్ల పేరుతో రోజూ లక్షల రూపాయల మున్సిపాలిటీ నిధులను దోచుకున్నారు. ఈపూరు మండలంలోని ఊడిజర్ల గ్రామ మరుగుదొడ్ల లబి్ధదారులకు తెలియకుండా రూ.35 లక్షల మేర దోచుకున్నారు. 15 ఎఫ్ఐఆర్లు తన వ్యాపార భాగస్వామిని హత్యచేయించడంలో జీవీపై కేసు నమోదైంది. తర్వాత హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులను బెదిరించి కేసులను రాజీ చేసుకొని 2009 ఎన్నికల్లో వినుకొండ నుంచి పోటీ చేశారు. జీవీపై ఇప్పటివరకు దౌర్జన్యం, ప్రభుత్వ విధుల నిర్వహణకు ఆటంకం తదితర నేరాలపై 15 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వినుకొండ పోలీస్స్టేషన్లో తొమ్మిది, శావల్యాపురం 3, ఈపూరు, బండ్లమూడి, సత్తెనపల్లి ఒక్కో కేసు నమోదైంది. ఈ కేసులన్నీ విచారణలో ఉన్నాయి. ♦ వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి చెందిన వల్లభ డెయిరీలోకి జీవీ అనుచరులతో చొరబడి వస్తువులను ద్వంసం చేశారు. దీనిపై వినుకొండ పోలీస్స్టేషన్లో జీవీపై 25–7–2023న క్రైం నంబర్ : 163/23తో 143, 447, 379, 506 రెడ్విత్ ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. ♦ వినుకొండలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా నిబంధనలు అతిక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలిగించినందుకు జీవీపై వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్లో 17–5–2023న క్రైం నంబర్ 130/23తో 143, 341, 188, రెడ్విత్ 34 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. ♦ ఈపూరు మండలం అంగలూరు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేసి పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు ఈపూరు పోలీస్ స్టేషన్లో జీవీపై 12–12–2021న క్రైం నంబర్ 169/2021తో 341, 353 రెడ్ విత్ 34 ప్రకారం కేసు నమోదైంది. -
బిర్యానీ కోసం వెళ్లి.. ముగ్గురు మృతి
గద్వాల క్రైం: ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడి కుమార్తె జన్మదిన వేడుకలను సిబ్బంది సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. అనంతరం సిబ్బంది బిర్యానీ తినేందుకు వైద్యుడి కారులో హోటల్కు వెళ్లారు. అయితే డ్రైవర్ అత్యు త్సాహంతో అతి వేగంగా కారును నడపడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడి కక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన జోగుళాంబ గద్వాల మండలం జమ్మిచేడ్ వద్ద శనివారం తెల్లవారుజమున చోటు చేసు కుంది. ప్రత్యక్ష సాక్షులు, గద్వాల సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం వివరాలు.. గద్వాలలోని అనంత ఆస్పత్రిలో స్థానిక చింతల్పేటకు చెందిన ఆంజనేయులు (50) సెక్యూరిటీగా పనిచేస్తుండగా, వనపర్తిజిల్లా పెబ్బేరుకు చెందిన పవన్ (28), మల్దకల్ మండలానికి చెందిన నరేశ్ (23), పాల్వా యి గ్రామానికి చెందిన నవీన్, కేటీదొడ్డి మండలం మైల గడ్డకు చెందిన గోవర్ధన్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నా రు. వైద్యుడు వెంకటేశ్ కూతురు పుట్టినరోజు ఉండటంతో శుక్ర వారం అర్ధరాత్రి సిబ్బంది సమక్షంలో వేడుకలు నిర్వ హించారు. ఆ తర్వాత ఆరుగురు సిబ్బంది బిర్యానీ తింటా మని చెప్పడంతో వెంకటేశ్ వారికి రూ.5వేలు ఇచ్చారు. డ్రైవర్ మ హబూబ్తో కలిసి ఆరుగురు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎర్రవల్లి వైపు బయలుదేరారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి జమ్మిచేడ్ శివారులో కల్వర్టు వద్ద డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో కారు గాల్లోఎగిరి 100 మీ టర్ల వరకు పల్టీలు కొట్టింది. ఈ క్రమంలోనే కారు పైభాగం (సన్రూఫ్) తెరుచుకోవడంతో ఆంజనేయులు, పవన్, నరేశ్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ మహబూబ్, నవీ న్, గోవర్ధన్లను అనంత ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న నవీన్ను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మృతుడు ఆంజనేయులు కుమారుడు నవీన్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
తహసీల్దార్, బీఎల్వోలపై టీడీపీ నేతల దాష్టీకం
సాక్షి, నరసరావుపేట/శావల్యాపురం: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డబుల్ ఎంట్రీ ఓట్లను తొలగించేందుకు నోటీసులు ఇచ్చిన శావల్యాపురం తహసీల్దార్పై పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మంగళవారం దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ సానుభూతిపరులు డబుల్ ఎంట్రీ ఓట్లను తొలగిస్తే న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొంటారంటూ తహసీల్దార్, బీఎల్వోలను బెదిరించారు. పదుల సంఖ్యలో కార్యకర్తలను వెంటబెట్టుకుని తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించి తహసీల్దార్ షేక్ జాన్ సైదులుపై అసభ్య పదాలతో దూషణలకు దిగారు. వైఎస్సార్సీపీ అభిమానుల ఓట్లు తీసివేయాలని భారీగా ఫారం–7లను దరఖాస్తు చేసి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ దరఖాస్తు చేసిన ఫారం–7 దరఖాస్తులు దురుద్దేశంతో చేసినవని అధికారులు నిర్ధారణకు వచ్చిన తర్వాత తగిన అధారాలతో తిరస్కరించినట్టు సమాచారం ఇచ్చారు. అయితే.. వాటిని తొలగించాల్సిందేనని జీవీ ఆంజనేయులు పట్టుబట్టారు. గట్టిగా కేకలు వేస్తూ తహసీల్దార్పై జులుం ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రం మార్చడంపైనా రాజకీయం మండలంలోని గుంటుపాలెంలో 141 పోలింగ్ కేంద్రం గతంలో ప్రాథమిక పాఠశాలలో ఉండేది. పాఠశాల గదులు పాడవడం, శ్లాబు పెచ్చులు ఊడిపోతుండటం, కనీస వసతులు లేకపోవడంతో పోలింగ్ కేంద్రాన్ని మార్చాలని జిల్లా ఎన్నికల అధికారి ఆ దేశాలు జారీ చేశారు. దీంతో అదే గ్రామంలో అన్ని సౌకర్యాలున్న సచివాలయంలోకి మార్చారు. దీనిపైనా జీవీ ఆంజనేయులు రాద్ధాంతం చేశారు. మరోవైపు టీడీపీ నేతలు పలువురికి వినుకొండ నియోజకవర్గంతో పాటు గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాద్ వంటి చోట్ల ఓట్లు ఉంటున్నాయి. దీనిపై ఎన్నికల సంఘం నుంచి వచ్చిన సమాచారం మేరకు సదరు ఓటర్లకు స్థానిక అధికారులు నోటీసులు అందజేస్తున్నారు. నోటీసులు ఇవ్వడంపై జీవీ ఆంజనేయులు తహసీల్దార్పై విరుచుకుపడ్డారు. డబుల్ ఎంట్రీలు తొలగిస్తే చూస్తు ఊరుకోనంటూ ఊగిపోయారు. కాగా.. విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ అధికారులపై దుర్భాషలాడటం, బెదిరించడం సరికాదని జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు పేర్కొన్నారు. ఇలాంటి దాడులను అరికట్టాలని జిల్లా కలెక్టర్ను కోరినట్టు తెలిపారు. మాజీ ఎమ్మెల్మే జీవీ ఆంజనేయులు అసభ్య పదజాలంతో దూషించటంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తహసీల్దారు షేక్ జాన్సైదులు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఓట్లు తొలగింపు, మార్పులు చేర్పులన్నీ సమగ్ర ఆధారాలతో అన్లైన్ విధానంలో జరుగుతున్నాయన్నారు. -
వారం రోజులు దాటింది.. మా బిడ్డ జాడ చెప్పండి!
రంగారెడ్డి: కళాశాల హాస్టల్ నుంచి తమ కుమారుడు అదృశ్యమై వారం రోజులు గడుస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని బాధిత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి మిస్సింగ్కు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ శనివారం స్టూడెంట్ యూనియన్లతో కలిసి ఆందోళన చేపట్టారు. అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ విద్యాసంస్థల్లో డిప్లొమా సెకండియర్ చదువుతున్న ఆంజనేయులు.. ఈనెల 20న కళాశాలకు చెందిన హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. వారం రోజులుగా కుమారుడి జాడ లేకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, యాజమాన్యం స్పందించి ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
హౌసింగ్ డీఈఈ ఇళ్లలో ఏసీబీ సోదాలు
ఒంగోలు టౌన్/చీరాల/మేదరమెట్ల/నగరంపాలెం/ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు గుంటూరులో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈగా పని చేస్తున్న చెంచు ఆంజనేయులు ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో గుంటూరు, ఒంగోలు, బాపట్ల జిల్లా మేదరమెట్ల, వేటపాలెం మండలం కొత్తపేట, కొరిశపాడు మండలం దైవాలరావూరు గ్రామాల్లోని ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఒంగోలులో ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు ఈ సోదాల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఒంగోలులో జీ ప్లస్ త్రీ హౌసింగ్ కాంప్లెక్స్, ఒక ప్లాటు, కొప్పోలులో 8 ఇళ్ల స్థలాలు, చీరాలలో ఒక జీ ప్లస్ వన్ భవనం, రెండు స్థలాలు, కడవకుదురు వద్ద 1.9 ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించి రూ.53 లక్షల సేల్డీడ్ పత్రాలు లభించినట్లు తెలిపారు. కిలో బంగారం, 6 కిలోల వెండి ఆభరణాలు, రెండు కార్లు, రెండు బైక్లు ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ ధరల మేరకు ఆస్తుల విలువ రూ.2.81 కోట్లు ఉన్నట్లు తేలిందన్నారు. ఆంజనేయులును అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఎస్ఈబీ సీఐ ఇళ్లల్లో రూ.కోటి విలువైన అక్రమాస్తుల గుర్తింపు శ్రీకాకుళం జిల్లా పొందూరులో లంచం తీసుకుంటూ దొరికిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆయన బంధువుల ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి రూ.కోటి విలువైన అక్రమాస్తులను గుర్తించారు. విశాఖలోని విశాలాక్షినగర్లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు ఇంటితోపాటు విశాఖ, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలిలోని ఆయన బంధువుల ఇంట్లోనూ సోదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఎస్ఈబీ సీఐగా పనిచేసిన శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ ఈ నెల 7న ఏసీబీకి దొరి కారని తెలిపారు. అప్పటి నుంచి ఆయన విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నారని చెప్పారు. గతంలో పాడేరు ఎస్ఐగా పనిచేస్తున్న కాలంలోనూ ఆయన గంజాయి కేసులో ఏ8 నిందితుడిగా పట్టు బడి ఏడాది జైలు శిక్ష అనుభవించారని తెలిపారు. -
Srirama Navami 2023: పరిపూర్ణ పురుషోత్తముడు..
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అంతటా వ్యాపించి ఉన్న భగవానుడు మనకోసం ఒక రూపంలో ఒదిగిపోయి దివి నుంచి భువికి దిగి వస్తే, దాన్ని అవతారం అంటారు. అలా శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో మానవ జీవితానికి అతి దగ్గరగా ఉండే అవతారం రామావతారం. చైత్ర శుద్ధ నవమి రోజు, లోకాలన్నిటి చేత నమస్కరింపబడే రాముడు ఈ భూమి మీద జన్మించాడు. పుట్టింది మొదలు ధర్మాన్నే అనుసరించాడు. పితృధర్మం, మాతృధర్మం, భ్రాతృధర్మం, స్నేహ ధర్మం, పత్నీ ధర్మం, ఋషుల ధర్మం... ఇలా అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఆచరించినవాడు. అందుకే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అంటూ శత్రువులు కూడా ఆయనను స్తుతించారు. నేడు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా... ఆ పరిపూర్ణ పురుషోత్తముడి గురించి తెలుసుకుందాం. అప్పటికి కౌసల్యాసుతునికి పదిహేను పదహారేళ్ల వయసుండొచ్చు. ఒకానొక రోజు దశరథమహారాజు రాముణ్ణి పిలిచి విశ్వామిత్ర మహర్షివైపు చూపిస్తూ ‘‘ఈ మహర్షితోపాటు నువ్వు అడవులకు వెళ్లాలి నాయనా...’’ అని అంటాడు. మరో పిల్లాడయితే ఏమనేవాడో ఏమో కానీ, రాముడు మాత్రం తండ్రి చెప్పాడు కాబట్టి కిమ్మనకుండా బయలుదేరాడు. అనుగు సోదరుడు లక్ష్మణుడు తోడు రాగా అడవుల్లోకి దారితీశాడు. తాటక సంహారం చేశాడు. అహల్యకు విమోచన ప్రసాదించాడు. రాముడు ఎంతటి క్రమశిక్షణ కలవాడంటే అంతఃపురంలో ఉన్నంత కాలమూ కన్నవారి మాట జవదాటలేదు. అరణ్యాల్లో ప్రవేశించాక విశ్వామిత్రుని ఆజ్ఞ మీరలేదు. సీతాస్వయంవరానికి తీసుకువెళతానని ఆ గురువర్యుడంటే∙మారు మాట్లాడకుండా అనుసరించాడు. పెద్దల మాటకే ప్రాధాన్యం జనకమహారాజు నెలకొల్పిన స్వయంవరమంటపంలో శ్రీరాముడు అడుగుమోపినా శివధనుస్సు ఉండే చోటికి హడావుడిగా వెళ్లిపోలేదు. దాన్ని భళ్లున ఎత్తేసి, ఫెళ్లున విరిచేసి, చేతులు దులిపేసుకోలేదు. ఎలాంటి తొందరపాటూ పడకుండా సభాభవనంలో నిమ్మళంగా కూర్చున్నాడు. శివధనువును ఎత్తాలంటూ విశ్వామిత్రుడు అనుజ్ఞ ఇచ్చాకనే రాముడు ఆ పనికి పూనుకున్నాడు. ధనస్సును సున్నితంగా ఎత్తిపట్టుకుని, నారి సారించి, విరిచాడు. ఇదంతా ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాకుండా చేశాడు. అంత పెద్దపనీ పూర్తిచేశాక ధీర గంభీరంగా అడుగులు వేస్తూ తన ఉచితాసనానికి చేరుకున్నాడు. చిన్నపాటి విజయాన్ని సాధిస్తేనే మురిసి మెరిసిపోయే మనం, ఆ సందర్భాన రాముడి వర్తన నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చో. చిన్న కష్టానికే కన్నీరొలికించడం. అల్పమైన సుఖాలకే అతిగా స్పందించడం.. లాంటి లక్షణాలను మరెంత సునాయాసంగా తొలగించుకోవచ్చో! వినయ విధేయతలు తొందరపాటు...తొట్రుపాటు అనేవి రాముడి నిఘంటువులోనే లేదు. శివధనువును విరవగానే సీతను రాముడికిచ్చి పెళ్లి చేస్తానని జనకుడు చెప్పిన మాట విని ఎగిరి గంతేయలేదు. వెంటనే సీత మెడలో మూడు ముళ్లూ వేసేయలేదు. జనకుని ప్రతిపాదనను తన కన్నవారికి తెలియజేయాలని, అందుకు వారి అనుమతి అవసరమనీ వినమ్రంగా చెప్పాడు. ఎవరి పట్ల ఏవేళ ఎలా ఆదరం చూపాలో రామునికి బాగా తెలుసుననడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదు. అలా ఆ పెద్దలందరి సమక్షంలోనూ మైథిలి చేయి అందుకున్నాడు. సీతారాముల కళ్యాణం జరిగి ఎంతోసేపు అవనే అవదు. పరశురాముడు వేంచేశాడు. పెళ్లివేదిక వద్దకు వస్తూనే ఆ మహాశయుడు వీరావేశాన్ని ప్రదర్శించాడు. ప్రపంచంలో రాముడంటే పరశురాముడేనని, మరో రాముడికి లోకాన చోటు లేనేలేదని వీరవిహారం చేశాడు. అటు జనకుడు, ఇటు దశరథుడు పరశురాముని క్రౌర్యాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. అయితే రాముడు ఏమాత్రం తొందరపడలేదు. పరశురాముడు ఎంతగా పేట్రేగిపోతుంటే రాముడు అంత ప్రశాంతంగా ఉన్నాడు. పరశురాముడు అందించిన విష్ణుధనువును సునాయాసంగా పైకెత్తాడు. తను శ్రీహరి ప్రతిరూపమని చెప్పకనే చెప్పాడు. దీంతో పరశురాముడికి కమ్మిన పొరలు తొలగిపోయాయి. తారుమారైనా... మర్నాడు పొద్దున్నే పట్టాభిషేకం జరగాల్సి ఉంది. రాత్రికి రాత్రే కథ మారిపోయింది. కైకమ్మ స్వయంగా పిలిచి, తన మాటల్ని దశరథుని ఆదేశాలుగా వినిపించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పద్నాలుగేళ్లపాటు అరణ్యవాసం చేయాలని ఆజ్ఞాపించింది. మారు తల్లి మాటలను మన్నించాడు. అడవుల్లోకి పోయేందుకు సిద్ధమేనంటూ అందుకు రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. మంగళస్నానాలు చేసి రాజదండాన్ని చేపట్టాల్సిన వేళ పత్నినీ, సోదరునీ వెంటబెట్టుకుని గుహుని పడవమీద నది దాటుకుంటూ పోయాడు. అడవుల్లోనూ ఆ రామునికి ప్రశాంతత లేనే లేదు. కష్టాలూ కన్నీళ్లే! సీతమ్మను రావణుడు అపహరించుకుపోయాక మానసికంగా నలిగిపోయాడు. చివరికి లంకలో అమ్మవారు ఉన్నారన్న సంగతి తెలిసి కొంత స్థిమితపడ్డాడు. తన ప్రియపత్నిని తన వద్దకు తెచ్చుకునేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. వానరసైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. విభీషణునితో చెలిమిచేశాడు. ఓరిమితో వ్యవహరించాడు. తగిన సమయం కోసం ఓపికగా ఎదురు చూశాడు. సముద్రం మీద సేతువును నిర్మించాడు. అందుబాటులో ఉన్న వానర సేన సహకారంతోనే అమిత బలవంతుడైన శత్రువుతో యుద్ధం చేశాడు. విజేత తానే అయ్యాడు. స్థితప్రజ్ఞావంతుడు దక్కుతుందనుకున్న రాజ్యం క్షణాల్లో చేజారిపోయింది. వనవాస క్లేశాలు ముదిరిపోయాయి. సరసరాజాన్నభోజనాల స్థానంలో ఆకులు అలములు తినాల్సి వచ్చింది. ఒకవైపు భార్యావియోగం. మరోవైపు రాక్షసబాధ. వయసేమంత పెద్దది కాదు. అయినా చలించలేదు. స్థిరంగా ఉన్నాడు. దృఢంగా ఉన్నాడు. స్థితప్రజ్ఞతతో వ్యవహరించాడు. మరి ఇప్పటికాలాన మనం ఎలా ఉన్నాం..? బస్సు దొరక్కపోతే ఆందోళన. సినిమా టికెట్టు అందకపోతే అశాంతి. పరీక్షలో మార్కులు తక్కువయితే ఆవేదన. అన్నింటికీ తొందరే. ప్రేమ తొందర. పెళ్లి తొందర. ఇలా అయితే ఎలా. రాముని వంటి వారినే కష్టాలు కాల్చుకు తిన్నాయి. అన్నింటినీ ఆయన ఓపిగ్గా ఎదుర్కొన్నాడు. ఆయనతో పోల్చుకుంటే మనం ఎంతటి వారం? ఆయన పడ్డ కష్టాలతో పోల్చి చూసుకుంటే మన కష్టాలు ఏపాటివి?ఎప్పటి త్రేతాయుగం? రాముడు పుట్టి రెండు యుగాలయింది. మనమిప్పుడు కలికాలంలో ఉన్నాం. అయినా ఆ ఆదర్శనీయుణ్ణి నేటికీ మరువలేకపోతున్నాం. అదే ఆయన వ్యక్తిత్వం. అందుకే మానవుడిగా పుట్టినా, రాముడు మనకు దేవుడయ్యాడు. ఆయన నడిచిన బాట అయిన రామాయణం పఠనీయ కావ్యం అయింది. అందుకే రామాయణాన్ని పారాయణం చేయాలి. అందులోని మంచిని ఒంటబట్టించుకోవాలి. కృతజ్ఞత ఆయన రక్తంలోనే ఉంది చేసిన సహాయాన్ని ఎన్నటికీ మరువని సద్గుణ సంపన్నత రామునిది. అందుకే సీతమ్మ జాడతెలుసుకున్న ఆంజనేయస్వామిని బిడ్డలా చూసుకున్నాడు. ఎవరికీ ఇవ్వనంతటి చనువును ఇచ్చాడు. తన ప్రేమను పంచాడు. సుగ్రీవుడికి పట్టం కట్టాడు. విభీషణునికి లంకేశునిగా మకుటం తొడిగాడు. ..జననీ జన్మభూమిశ్చ.. రావణ సంహారం జరిగాక ఆ రాక్షస రాజు మనసుపడి కట్టించుకున్న కోటను స్వాధీనం చేసుకోవాలని లక్ష్మణుడు భావించాడు. విషయాన్ని అన్నతో చెప్పాడు. యావత్ లంకానగరమే మణిమయ నిర్మితమైనది. అందులోని రాజ సౌధం సామాన్యమైంది కాదు. ఎటు చూసినా బంగారమే. కాని, రాముని తీరు వేరు. ఆయనకు దురాశ ఉండదు. ఆయన ధర్మం తప్పడు. లక్ష్మణుని సలహాను సున్నితంగా తిరస్కరిస్తాడు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అంటూ అయోధ్యవైపు చూడాలని సూచన చేస్తాడు. లంక విభీషణునికే చెందుతుందని స్పష్టం చేస్తాడు. అంటే పరాయి ప్రదేశం ఎంతటి గొప్పదైనా, సుందరమైనదైనా దానిని చూసి మనసు పారేసుకోలేదు. మాతృభూమిని మరువలేదు. పుట్టిన గడ్డపై ప్రేమను పోగొట్టుకోలేదు. రామ నైవేద్యం పానకం కావలసినవి: బెల్లం పొడి– పావు కేజీ; నీళ్లు– లీటరు; యాలకుల పొడి– టీ స్పూన్; మిరియాల పొడి– టీ స్పూన్; శొంఠిపొడి– చిటికెడు తయారీ: బెల్లం పొడిలో నీటిని కలిపి కరిగిన తర్వాత వడపోయాలి. ఈ బెల్లం నీటిలో యాలకుల పొడి, మిరియాల పొడి, శొంఠిపొడి కలిపితే పానకం రెడీ. వడపప్పు కావలసినవి: పెసరపప్పు – పావు కేజీ; పచ్చిమిర్చి ముక్కలు – టీ స్పూన్; పచ్చి కొబ్బరి తురుము– టేబుల్ స్పూన్; మామిడి కాయ తురుము– టేబుల్ స్పూన్ తయారీ: పెసరపప్పు శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి. గింజ మెత్తబడిన తర్వాత నీటిని వంపేసి అందులో పైన తీసుకున్న దినుసులన్నీ కలిపితే వడపప్పు రెడీ. వడపప్పు, పానకం ఆరోగ్యకరమైనవి. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి. వేసవి మొదలైన ఈ సమయంలో ఆరోగ్యం ఒడిదొడుకులను పానకం నివారిస్తుంది. యాలకుల పొడి అతిదాహాన్ని తగ్గిస్తుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
కన్న బిడ్డలే కడతేర్చారు!
రాజంపేట: ఆస్తికోసం కన్న తండ్రినే కడతేర్చిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాజంపేటకు చెందిన కొప్పుల ఆంజనేయులు (80)కు ఇద్దరు భార్యలు ఉండగా, మొదటి భార్య లక్ష్మికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు 25 సంవత్సరాల క్రితమే మరణించాడు. మొదటి భార్య తనని సక్రమంగా చూడకపోవడంతో ఆంజనేయులు 20 సంవత్సరాల క్రితం బాలమణిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆంజనేయులుకు నాలుగు ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉండగా గ్రామంలో నివసిస్తున్న రెండో కూతురు లీలావతి పేరిట ఇదివరకే రెండెకరాలు పట్టా చేయించాడు. కూతురు లీలావతి, మొదటి భార్య లక్ష్మి తరచూ ఆంజనేయులుతో ఆస్తికోసం గొడవపడేవారు. మిగిలిన రెండెకరాల భూమి తనకే చెందాలని లీలావతి, ఆమె కొడుకు భానుప్రసాద్ కలసి ఆంజనేయులును వేధింపులకు గురిచేసేవారు. ఆదివారం ఉదయం లీలావతి, తన పెద్ద సోదరి లక్ష్మీ నర్సవ్వ, కొడుకు భానుప్రసాద్తో కలసి పథకం ప్రకారం ఆంజనేయులును ఇంట్లోనే చంపేసింది. అనంతరం తమ చెల్లెలు గంగమణి కూతురు విందు కార్యక్రమానికి హాజరై రాత్రి 12.30 గంటల ప్రాంతంలో తిరిగివచ్చారు. తర్వాత ఆంజనేయులు ఉంటున్న ఇంటిని తగులబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పొలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేశారు. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని, నిందితులను శిక్షించే వరకూ ఊరుకునేది లేదని రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో సీఐ తిరుపయ్య, డీఎస్పీ సురేశ్ పరిస్థితిని నియంత్రించి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మృతుని అన్న కొడుకు కొప్పుల పెద్ద స్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
2 వారాల్లో పెళ్లి కావాల్సిన యువతిపై లైంగిక దాడి.. ఫొటోలు తీసి పెళ్లికొడుకు వాట్సాప్కు
మహబూబ్నగర్ క్రైం: రెండు వారాల్లో పెళ్లి కాబోతున్న యువతిపై ఇద్దరు లైంగిక దాడి చేయడమేగాక.. ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి సదరు పెళ్లికొడుకుకి పంపారు. ఈ నెల 5న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం కోత్లాబాద్కి చెందిన ఓ అమ్మాయి(20) ప్రతిరోజూ మహబూబ్నగర్కు వచ్చి దినసరి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే మల్కాపూర్కి చెందిన రాజేందర్రెడ్డి అలియాస్ రాజు కొత్లాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చదవండి: (దిగొచ్చిన చికెన్ ధర.. లొట్టలేస్తున్న మాంసం ప్రియులు) ప్రస్తుతం ఆమె తల్లిగారి ఇంటి వద్ద ఉండటంతో రాజు కూడా ప్రతిరోజూ కొత్లాబాద్ నుంచి బైక్పై మహబూబ్నగర్కు వచ్చి పెయింటింగ్ పని చేసేవాడు. ఈ క్రమంలో దినసరి కూలీగా పని చేసే అమ్మాయిని రాజు చాలాసార్లు బైక్పై ఎక్కించుకుని రావడంతో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈనెల 5న ఆ అమ్మాయి పని కోసం జిల్లాకేంద్రంలోని టీడీగుట్ట గేటు దగ్గరకు వచ్చింది. ఆరోజు పని దొరకకపోవడంతో రాజు అతని స్నేహితుడు, ఆంజనేయులు కలిసి ఆమె వద్దకు వెళ్లారు. చదవండి: (ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..) వేరే చోట పని ఇప్పిస్తామని చెప్పి బైక్పై ఎక్కించుకుని ఫతేపూర్ అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ ఆమెకు బలవంతంగా మద్యం తాగించి, లైంగిక దాడికి పాల్పడ్డారు. రాజు అత్యాచారం చేసేటప్పుడు ఆంజనేయులు ఫొటోలు, వీడియోలు తీశాడు. విషయం బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారు. కాగా, ఈ నెల 18న ఆ అమ్మాయికి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లైంగిక దాడి ఫొటోలు, వీడియోలను సదరు పెళ్లికొడుకు వాట్సాప్కు పంపారు. చదవండి: (సెంట్రల్ జైలులో ఉంచినా.. నమ్మిన జెండా వీడలేదు.. సమర్థతను గుర్తించి) ఆ ఫొటోలను పెళ్లికొడుకు అమ్మాయి తల్లిదండ్రులకు చూపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై 2 రోజుల క్రితం అమ్మాయి, తల్లిదండ్రులు వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసి శుక్రవారం రాజు, ఆంజనేయులును అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు వన్టౌన్ సీఐ రాజేశ్వర్గౌడ్ తెలిపారు. -
190 అసిస్టెంటు ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఇంజనీరింగ్ సర్వీస్ విభాగాల్లోని 190 అసిస్టెంటు ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత ఫీజును చెల్లించి ఈనెల 21 నుంచి నవంబర్ 11 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇతర వివరాలకు https://psc.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని కమిషన్ కార్యదర్శి ఆంజనేయులు సూచించారు. -
2018 గ్రూప్–1 మెయిన్స్కు మాన్యువల్ మూల్యాంకనం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ (2018 నోటిఫికేషన్) సమాధాన పత్రాలను మాన్యువల్గా మూల్యాంకనం చేయిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. మూడు నెలల్లో ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు గ్రూప్–1 మెయిన్స్ డిజిటల్ మూల్యాంకనంపై హైకోర్టు తీర్పును గౌరవిస్తూ తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. 190 అసిస్టెంట్ ఇంజనీర్, 670 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల సంఖ్య పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. ఇది పూర్తి కాగానే వెంటనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. గ్రూప్–1లో ఇంటర్వ్యూల రద్దుకు జీవో వచ్చిందని.. దాని అమలుపై ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని తెలిపారు. డిజిటల్ మూల్యాంకనంతోనే పారదర్శకత, నిష్పాక్షికత ముందుగా నోటిఫికేషన్లో పేర్కొనకుండా డిజిటల్ మూల్యాంకనం ఎలా చేయిస్తారని మాత్రమే కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. ఈ విధానాన్ని తప్పుపట్టలేదని చెప్పారు. ఇకపై ముందుగానే ప్రకటించి డిజిటల్ మూల్యాంకనం చేపట్టవచ్చని సూచించిందన్నారు. రానున్న నోటిఫికేషన్లన్నిటికీ డిజిటల్ మూల్యాంకనాన్నే అమలు చేస్తామని స్పష్టం చేశారు. దీనికి అధిక వ్యయమైనా పారదర్శకత, నిష్పాక్షికతతోపాటు అర్హులైన అభ్యర్థులకు పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. గ్రూప్–1 మెయిన్స్కు డిజిటల్ మూల్యాంకనం చేపడుతున్న విషయాన్ని నోటిఫికేషన్లో పేర్కొనకపోయినా.. పరీక్షలకు ముందు నుంచే అభ్యర్థులకు తెలియజేస్తూ వచ్చామని గుర్తు చేశారు. దీన్ని అభ్యర్థులెవరూ వ్యతిరేకించకపోగా స్వాగతించారన్నారు. అయితే.. గ్రూప్–1 మెయిన్స్లో ఎంపిక కాని కొందరు డిజిటల్ మూల్యాంకనాన్ని తప్పుపడుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని పేర్కొన్నారు. శాస్త్రీయ విధానంలో డిజిటల్ మూల్యాంకనం సివిల్స్లో విజయం సాధించిన కొందరు గ్రూప్–1లో ఎంపిక కాలేదని.. డిజిటల్ మూల్యాంకనంలో లోపాలున్నందు వల్లే ఇలా జరిగిందనే వాదన తప్పన్నారు. సివిల్స్లో ఐపీఎస్లుగా ఎంపికైనవారు తర్వాత ఐఏఎస్ కోసం మళ్లీ సివిల్స్ రాస్తే ప్రిలిమ్స్ కూడా ఉత్తీర్ణులు కాని సందర్భాలు అనేకమున్నాయన్నారు. అభ్యర్థి ఆరోజు పరీక్షలో చూపించిన ప్రతిభ ఆధారంగానే ఎంపికవ్వడం ఆధారపడి ఉంటుందని తెలిపారు. డిజిటల్ మూల్యాంకనం ఎంతో శాస్త్రీయ విధానంలో జరిగిందన్నారు. ఏపీపీఎస్సీ ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. గత 18 నెలల్లో కరోనా సమయంలోనూ 32 నోటిఫికేషన్లలోని 4 వేల పోస్టుల్లో 3 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని పోస్టులు భర్తీ చేయలేదన్నారు. మిగిలిన పోస్టుల్లోనూ 450 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేక ఖాళీగా మిగిలిపోయాయన్నారు. మరో 550 పోస్టులు కోర్టు కేసులతో భర్తీ కాలేదని తెలిపారు. వరుసగా కొత్త నోటిఫికేషన్లు విడుదల కొత్తగా పలు పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నామని పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. ఇప్పటికే పలు పోస్టుల నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అన్ని పోస్టులతో ఒకేసారి క్యాలెండర్ను ప్రకటించడం సాధ్యం కాదని వివరించారు. ఆన్లైన్లో పరీక్షలు జరగనున్నందున పరీక్ష కేంద్రాల అందుబాటు, ఇతర విభాగాల పరీక్షల తేదీలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. -
అనుభవం లేదు.. సమర్థతా లేదు
సాక్షి, అమరావతి: ఏ రంగంలో అయినా, ఏ సంస్థలో అయినా ఉన్నత స్థానానికి వెళ్లాలంటే దానికి సంబంధించి ఎంతోకొంత అనుభవం ఉండాలి. దాన్ని నిర్వహించే సమర్థత ఉండాలి. అలాంటివేమీ లేకుండా.. అప్పటివరకు దాంతో సంబంధంలేని చలసాని ఆంజనేయులు ఒక్కసారిగా విజయ డెయిరీ చైర్మన్గా అందలం ఎక్కేశారు. దీనికి టీడీపీకి చెందిన మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ వ్యూహమే కారణమని చెబుతున్నారు. దాసరి బాలవర్థనరావు చైర్మన్ కాకుండా అడ్డుకునేందుకు ఆంజనేయుల్ని రంగంలోకి దించారు. అప్పటివరకు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలతో ఎలాంటి సంబంధంలేని ఆయన్ని 2017లో ఆయన సొంత గ్రామం బాపులపాడు మండలం కాకులపాడు పాల సొసైటీకి చైర్మన్గా చేశారు. వెంటనే విజయ డెయిరీ డైరెక్టర్గా రంగంలోకి దింపి పాలకవర్గంలోకి వెళ్లేలా చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు బాలవర్థనరావును పక్కకునెట్టి మండవ జానకిరామయ్య స్థానంలో ఆంజనేయుల్ని చైర్మన్గా ఎన్నుకునేలా చేశారు. దీంతో వేలాది మంది పాడి రైతుల భవితవ్యంపై ఏమాత్రం అవగాహనలేని వ్యక్తికి పగ్గాలిచ్చారు. ఇప్పుడు ఆయన తప్పుడు నిర్ణయాలు సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చివేశాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తనకు రాజకీయంగా లబ్ధి కలుగుతుందనే కారణంతో దేవినేని ఉమా ప్రతిష్టాత్మకమైన సంస్థకి చలసాని ఆంజనేయుల్ని చైర్మన్గా చేసేలా చక్రం తిప్పి రైతుల ప్రయోజనాలను దెబ్బతీశారని పలు సొసైటీల చైర్మన్లు ఆరోపిస్తున్నారు. ఎన్నో అవకతవకలు.. ఏ సంస్థలో అయినా ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్లకు ఒక విధానం ఉంటుంది. కానీ, విజయ డెయిరీలో మాత్రం చైర్మన్ తనకు కావాల్సిన వాళ్లకి ఒకలా, మిగిలిన ఉద్యోగులకు మరోలా ఇవ్వడంపై సంస్థలో దుమారం రేగుతోంది. తాను చెప్పినట్లు నడుచుకునే వారికి 15–20 శాతం ఇంక్రిమెంట్ ఇస్తూ మిగిలిన వారికి తూతూమంత్రంగా ఇస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. అంతేకాక.. ► 25 ఏళ్లుగా డైరెక్టర్గా ఉన్న వ్యక్తికి సంస్థలో జరిగే వివిధ పనుల కాంట్రాక్టుల్ని ఎలాంటి టెండర్లు లేకుండా చైర్మన్ కట్టబెడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ► ఇలాగే, కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు చిల్లింగ్ సెంటర్, కళ్యాణ మండపం మరమ్మతుల పనుల్ని అతనికి అప్పగించారు. ► తాను చైర్మన్ అయ్యాక తనకు అనుకూలమైన అధికారుల్ని నియమించుకునే విషయంలో నిబంధనలకు పాతరేశారు. ► ఉదా.. హెరిటేజ్ సంస్థ తొలగించిన ఇద్దరిని డీజీఎం స్థాయిలో లక్షల జీతాలకు నియమించడంపై పలు సొసైటీల చైర్మన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ► ఇలా స్వలాభం కోసం నిర్ణయాలు తీసుకుంటూ సంస్థను భ్రష్టుపట్టిస్తున్నారని అన్ని వైపుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా చైర్మన్ మాత్రం తాను డెయిరీని అభివృద్ధి పథంలో నడుపుతున్నట్లు ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థలో జరుగుతున్న కార్యకలాపాలపై పూర్తిస్థాయి విచారణ జరిగితే అక్రమాలు బట్టబయలవుతాయని పాడి రైతులు చెబుతున్నారు. ‘సాక్షి’ కథనంతో ఉలికిపాటు.. సంస్థలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై ‘సాక్షి’ మంగళవారం సంచికలో ప్రచురితమైన ‘‘పా‘పాల’ పుట్ట’’ కథనంతో చైర్మన్.. ఆయనకు మద్దతుదారులు ఉలిక్కిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని చైర్మన్ ఒక పత్రికా ప్రకటన తయారుచేసి జిల్లాలోని వివిధ పాల సొసైటీలకు పంపి మీడియా సమావేశాలు పెట్టించారు. ఇవేమీ తమకు తెలీదని కొందరు తప్పించుకున్నారు. సంస్థలోని పలువురు డైరెక్టర్లతో విజయవాడలో మీడియా సమావేశం పెట్టి తనకు అనుకూలంగా మాట్లాడించారు. ‘సాక్షి’ కథనంలో పేర్కొన్న అంశాలకు వారు సమాధానం చెప్పకుండా చైర్మన్ను పొగడడానికి తాపత్రయపడ్డారు. భూముల కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై వివరణ ఇవ్వకుండా గత పాలకవర్గం నుంచి భూములు కొంటున్నారంటూ కొత్త వాదన లేవనెత్తారు. అలాగే, విజయ పార్లర్లలో బయట ఉత్పత్తుల అమ్మకాలు సంస్థ వ్యాపార సూత్రమని సమర్ధించుకున్నారు. రైతులకివ్వాల్సిన బోనస్ చెల్లించకపోవడం, కమీషన్ల కోసం జరిపిన కొనుగోళ్లు వంటి అంశాలపై డొంకతిరుగుడు వివరణలు ఇచ్చారు. మొత్తం మీద అవాస్తవాలు చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీపీఎస్సీ సమాచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు కేటగిరీ నోటిఫికేషన్ల పరీక్షల్లో అర్హత సాధించిన, పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో విడుదల చేశారు. ► ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రయిబల్ వెల్ఫేర్ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులకు ప్రొవిజనల్ సెలెక్టెడ్ జాబితాను కమిషన్ ప్రకటించింది. దీన్ని కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు పేర్కొంది. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ సబ్జెక్టుల పోస్టులకు ఎంపికైన వారి ప్రొవిజనల్ సెలెక్టెడ్ జాబితాను కమిషన్ బుధవారం విడుదల చేసి.. కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. మైన్స్ అండ్ జియాలజీ మైన్స్ అండ్ జియాలజీ విభాగంలోని టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను ఈ నెల 27న పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ఈ పరిశీలన జరగనుంది. అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ నుంచి మెమో, చెక్లిస్ట్, అటెస్టేషన్ ఫారాలు, నాన్ క్రిమీలేయర్ ప్రొఫార్మా(బీసీ అభ్యర్థులు) డౌన్లోడ్ చేసుకోవాలి. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో వాటిని కమిషన్కు అందించాలి. ఆగస్టు 6 నుంచి డిపార్టుమెంటల్ టెస్ట్ డిపార్టుమెంటల్ టెస్ట్ను ఆగస్టు 6వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. ఆగస్ట్ 28న రిమ్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీలో 8వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్షను ఆగస్ట్ 28న నిర్వహిస్తున్నట్టు కమిషన్ వివరించింది. మేథమెటిక్స్, జనరల్ నాలెడ్జి, ఇంగ్లీషు సబ్జెక్టులకు సంబంధించి సెషన్లలో పరీక్ష జరగనుంది. -
మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులుపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆగ్రహం
-
సీనియర్ దర్శకుడు కన్నుమూత
సీనియర్ దర్శకుడు, నటుడు ఓఎస్ఆర్ ఆంజనేయులు కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. నాటకరంగం నుంచి సినీరంగానికి వచ్చిన ఆయన దర్శకత్వ శాఖలో కృష్ణ, విజయనిర్మల, వీ.రామచంద్రరావు, కే.హేమాంబదరరావు, కే.ఎస్,ఆర్.దాస్ తదితరుల దగ్గర పలు చిత్రాలకు పనిచేశారు. అనంతరం కన్నెవయసు, లవ్ ఇన్ సింగపూర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. లవ్ ఇన్ సింగపూర్ చిరంజీవి నటించిన సంగతి తెలిసిందే. ఇక పలువురు ప్రముఖ హీరోల చిత్రాలలో కూడా నటుడిగా కనిపించి తన అభిరుచిని చాటుకున్నారు. దాదాపు 70కి పైగా చిత్రాలలో ఆయన నటించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
చాలా.. లోపాలున్నాయ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్కమిషన్(ఏపీపీఎస్సీ)ను సమూలంగా ప్రక్షాళన చేయాలని పలువురు మేధావులు, ప్రజాప్రతినిధులు, నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్ పి.ఉదయభాస్కర్ నియంతృత్వ పోకడల వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, ఆయన్ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ చరిత్రలోనే తొలిసారి కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు సోమవారం మేధావులు, ప్రజాప్రతినిధులు, నిరుద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించారు. కమిషన్లోని లోపాలు సరిదిద్దేందుకు సలహాలు, సూచనలు స్వీకరించారు. విజయవాడలోని ఆర్టీసీ కాన్ఫరెన్సు హాలులో జరిగిన ఈ సమావేశంలో చైర్మన్ ఉదయభాస్కర్పై పలువురు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన్ను తక్షణమే తొలగించకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగదని స్పష్టంచేశారు. నాలుగేళ్లుగా ఏపీపీఎస్సీ పనితీరు బాలేదు గత నాలుగేళ్లుగా ఏపీపీఎస్సీ పనితీరు సరిగా లేదని, చైర్మన్ నియంతృత్వం పోకడలు అవలంభించారని ఎమ్మెల్సీ కె.లక్ష్మణరావు ఆరోపించారు. ‘సిలబస్ కనీసం ఆరేళ్లపాటు కొనసాగేలా చూడాలి. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలి. అన్ని పరీక్షల్లో నెగిటివ్ మార్కులు తీసేయాలి. గ్రూప్–1కు మాత్రమే ప్రిలిమినరీ ఉండేది. చైర్మన్ అన్నిటికీ ప్రిలిమినరీ తప్పనిసరి చేశారు. బోర్డులోని సబ్జెక్టు నిపుణులపై చైర్మన్ ఒత్తిడి తెచ్చి తనవారికి ఎక్కువ మార్కులు వేయించారని ఆరోపణలున్నాయి. అందువల్ల రెండు మూడు ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటుచేయాలి’ అని సూచించారు. ఎమ్మెల్సీ కత్తి నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. పరీక్షలు సకాలంలో నిర్వహించి నియామకాలు వేగంగా పూర్తిచేయాలని కోరారు. ‘ప్రశ్నపత్రాల తయారీకి ప్యానెల్ ప్రొఫెసర్ల ఎంపిక పగడ్బందీగా ఉండాలి. సీల్డుకవర్లలో ఇచ్చే ప్రశ్నలను ఏపీపీఎస్సీలోని వారంతా చూస్తున్నారన్న అపవాదుంది. ప్రశ్నల రూపకల్పనలో సమతూకం ఉండాలి. ప్రశ్నల్లో తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూల్లో అనేక అక్రమాలు పోస్టుల భర్తీలో అవినీతికి తావులేకుండా అడ్డుకట్ట వేసేలా సీఎం జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టడం మంచి పరిణామమని మద్య నియంత్రణ ప్రచార కమిటీ చైర్మన్ వి.లక్ష్మణ్రెడ్డి అన్నారు. ‘గత కొన్నేళ్లుగా ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూల్లో అనేక అక్రమాలు జరిగాయి. ఎవరికెన్ని మార్కులు వేయాలో చైర్మన్ ఉదయభాస్కర్ ఒత్తిడి తెచ్చేవారని బోర్డులోని సబ్జెక్టు నిపుణులు చెప్పారు. రాజకీయ జోక్యంతో వారు చెప్పిన వారికి పోస్టులు దక్కేలా చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించారు. ఉదయభాస్కర్ను తొలగిస్తేనే కమిషన్ ప్రక్షాళన సాధ్యం’ అని పేర్కొన్నారు. నిరుద్యోగులపై చైర్మన్ కేసులు పెట్టించి వేధించారని నిరుద్యోగ జేఏసీ నేతలు రామచంద్ర, సుకుమార్, రాజ్కుమార్లు నిరసన వ్యక్తంచేశారు. అక్రమ కేసులు ఎత్తివేసి, చైర్మన్ను తక్షణం తొలగించాలని డిమాండ్చేశారు. వినతులు అందించేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఏఐఎస్ఎఫ్ నాయకుడు సుబ్బారావు పేర్కొనగా.. కమిషన్ కార్యాలయం మెట్లు ఎక్కనివ్వనంటూ బడుగు, బలహీనవర్గాలను చాలా చిన్నచూపు చూశారని మరో విద్యార్థి సంఘం నేత షానవాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు ప్రతినిధులు ఏపీపీఎస్సీలో సంస్కరణల కోసం సూచనలు చేశారు. 1. ఏపీపీఎస్సీ పోస్టుల భర్తీ విధానం కోసం కర్ణాటకలో మాదిరిగా చట్టం చేయాలి. 2. రాష్ట్ర సిలబస్కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. 3. ప్రిలిమ్స్లో రిజర్వేషన్ వాడుకున్నా.. మెయిన్స్లో మెరిట్లో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఓపెన్ కేటగిరీ పోస్టులు ఇవ్వాలి. 4. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షల్లో 75కు పైగా ప్రశ్నల్లో తప్పులు ఇతర లోపాలున్నందున దాన్ని రద్దుచేసి తిరిగి నిర్వహించాలి. 5. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆన్లైన్కు అలవాటు పడేవరకు ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించాలి. 6. నోటిఫికేషన్కు ప్రిలిమ్స్కు మధ్య 5 నెలలు.. అనంతరం మెయిన్స్కు 4 నెలల సమయమివ్వాలి. 7. వివిధ పరీక్షల మోడల్ పేపర్లను ముందుగానే విడుదల చేయాలి. 8. హైదరాబాద్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయాలి. 9. అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయకపోవడం వల్ల నష్టపోతున్నారు. దాన్ని వెంటనే అమలు చేయాలి. 10. ఆంగ్లం, తెలుగు ప్రశ్నల్లో ఏది తప్పైతే దాన్నే రద్దుచేయాలి. స్కేలింగ్ను కూడా రద్దుచేయాలి. 11. గ్రూప్–2లో ఎగ్జిక్యుటివ్ పోస్టులు యధాతథంగా భర్తీచేయాలి. 12. నిబంధన– 7ను పునరుద్ధరించి పోస్టుల్ని తదుపరి నోటిఫికేషన్లకు మళ్లించకుండా నిరుద్యోగులకు న్యాయం చేయాలి. 13. అభ్యంతరాలు నేరుగా లేదా పోస్టు ఇవ్వమనడంతో నష్టపోతున్నాం. ఆన్లైన్లో పొందుపరిచేందుకు అవకాశం కల్పించాలి. 14. మెయిన్స్ పరీక్షల్లో మార్కులను ఇంటర్వ్యూలకు ముందుగా ప్రకటిస్తూ కమిషన్లోని సభ్యులు బేరసారాలు సాగిస్తున్నారు. సెలెక్షన్ పూర్తయ్యాకే మార్కులు ప్రకటించాలి. 15. యూనివర్సిటీ అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులు ఏపీపీఎస్సీతో సంబంధం లేకుండా పాతవిధానంలో భర్తీచేయాలి. అన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ ద్వారా అందరికీ మేలుజరిగేలా సలహాలు సూచనలకోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సలహాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అందరికీ పూర్తి న్యాయం చేసేందుకు మూడు వారాల్లో చర్యలు తీసుకుంటాం. నెగిటివ్ మార్కులు తీసేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనిపై కమిషన్లోనూ నిర్ణయం తీసుకుంటాం. సీతారామాంజనేయులు, ఏపీపీఎస్సీ కమిషన్ కార్యదర్శి -
ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల పథకం ‘వైఎస్సార్ వాహన మిత్ర’
సాక్షి, అమరావతి: ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయానికి ‘వైఎస్సార్ వాహన మిత్ర’గా నామకరణం చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ పథకం డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. అక్టోబర్ 5న లబ్ధిదారులకు నేరుగా చెల్లింపుల రశీదులు అందిస్తామని చెప్పారు. సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునే డ్రైవర్లకు అందించే రూ.10 వేలు వాహన బీమా, ఫిట్నెస్, మరమ్మతులకు ఉపయోగపడతాయన్నారు. బుధవారం అర్ధరాత్రితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిం దని.. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా మొత్తం 1.83 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ దరఖాస్తుల్ని గ్రామ/వార్డు వలంటీర్లకు పంపించామని ఇప్పటి వరకు 74 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని చెప్పారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులపై పరిశీలన జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో అందిన దరఖాస్తుల్ని ఎంపీడీవోలు, పట్టణాలు, నగరాల్లో మున్సిపల్ కమిషనర్లు 45,223 దరఖాస్తుల్ని ఆమోదించారన్నారు. 17,230 దరఖా స్తులకు కలెక్టర్లు మంజూరు అనుమతులిచ్చారని వివరించారు. అధికంగా విశాఖపట్నం, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల నుంచి దరఖాస్తులు అందాయన్నారు. అక్టోబర్ 5న అర్హులైన డ్రైవర్లకు నగదు చెల్లింపుల రశీదులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశంతో కూడిన పత్రాన్ని గ్రామ/వార్డు వలంటీర్లు అందిస్తారని చెప్పారు. -
మూఢనమ్మకం మసి చేసింది
మేడ్చల్/శామీర్పేట్: చేతబడి అనుమానమే ఓ అమాయకుడిని బలిగొంది.. ఆ మూఢనమ్మకమే ఆ యువకుడిని సజీవ దహనం చేసింది.. బతికుండగానే చితిలో పడేసి కాల్చేసేలా పురిగొల్పింది.. మానవత్వాన్ని మంటల్లో కాల్చేసిన ఈ ఘటన.. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం అద్రాస్పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. అటుగా వెళ్లడమే పాపమైంది.. అద్రాస్పల్లికి చెందిన గ్యారలక్ష్మి (45)అనే మహిళ గత ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. గ్రామంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. చేతబడి చేయడంతోనే లక్ష్మి చని పోయిందని బంధువులు అనుమానించారు. అదే నిజమైతే చేతబడి చేసిన వారు.. చితి కాలిపోయే లోపు అక్కడికి వస్తారనే నమ్మకంతో.. రాత్రి లక్ష్మి బంధువులు బలరాం, కిష్టయ్య లు చితికి సమీపంలోనే కాపు కాస్తూ ఉన్నారు. అదే సమయంలో శ్మశాన వాటిక సమీపంలో ఉన్న కెనాల్ కాలువ వద్దకు అదే గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు (29) రోజూ మాదిరిగానే రాత్రి 8.30 గంటలకు బహిరంగ మలవిసర్జన కోసం రావడంతో అతడిని అనుమానించారు. ఆంజనేయులు తండ్రి కిష్టయ్య మంత్రాలు చేస్తాడనే ప్రచారం ఉండటంతో వారి అనుమానం బలపడింది. నగ్నంగా.. చితిలోకి నెట్టేసి.. ఆంజనేయులును గమనించిన బలరాం, కిష్టయ్యలు వెంటనే అతడిపై రాళ్లు, గొడ్డళ్లు, కర్రలతో దాడి చేశారు. ఆ తర్వాత ఆంజనేయులు శరీరంపై ఉన్న దుస్తులు తీసేసి.. కాలుతున్న లక్ష్మి చితిలో అతడిని పడేశారు. దీంతో అతడు అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. ఈ విషయం ఊరంతా పాకడంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో శామీర్ పేట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితులు గ్యార బలరాం, గ్యార కిష్టయ్య, గ్యార నర్సింహతోపాటు మరో వ్యక్తి బండల శ్రీరాములును గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మి, అంజనేయులు అస్థికలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఆ కుటుంబం ఏకాకి.. పదో తరగతి వరకు చదువుకున్న ఆంజనేయులు కొంతకాలంగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కిష్టయ్య క్షుద్రపూజలు చేస్తాడని ఆరోపణలు ఉండటంతో గ్రామస్తులంతా ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. గతేడాది కిష్టయ్య చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియలకు గ్రామస్తులు ఎవరూ వెళ్లలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు: పద్మజారెడ్డి ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. గ్రామంలోని రెండువర్గాల వారు వేర్వేరు వాదనలు వినిపించారు. క్షుద్రపూజల నెపంతోనే అంజనేయులును చితిలో పడేశారా లేదా అనేది తెలుసుకుంటున్నాం. చితిలో నుంచి అస్తికలు సేకరించి ల్యాబ్కు పంపాం. నివేదిక వచ్చిన తర్వాత కొంత స్పష్టత వస్తుంది. ఘటనాస్థలి వద్ద రక్తపు మరకలు, చేతి రుమాలు లభ్యమయ్యాయి. -
యువకుడి అనుమానాస్పద మృతి
పరిగి మండలం పి.నరసాపురంలోని బిసప్ప గారి ఆంజనేయులు (24) మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ సమీపాన వేపచెట్టు వద్ద విగత జీవిగా పడి ఉండటాన్ని తండ్రి బోయ సుబ్బరాయప్ప గమనించి కన్నీరుమున్నీరయ్యాడు. తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో కుమారుడు చనిపోయాడన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోయింది. అనంతపురం , పరిగి: పి.నరసాపురంలో మోటారు పంపులు మరమ్మతులు, దినసరి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న బిసప్పగారి ఆంజనేయులు అవివాహితుడు. ఇతని తండ్రి సుబ్బరాయుడు కూడా కూలి పనులు చేస్తుండేవాడు. కొంత కాలంగా ఆంజనేయులు తల్లి సుబ్బమ్మ మతిస్థిమితం కోల్పోయింది. కూలి పనులు చేసుకుంటున్న ఆంజనేయులు మంగళవారం మధ్యాహ్నం నుంచి గ్రామంలో కనిపించకుండా పోయాడు. బుధవారం ఉదయం ఊరిబయటకు వెళ్లిన కొందరికి వేపచెట్టు వద్ద ఆంజనేయులు మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న హిందూపురం రూరల్ సీఐ సుబ్రమణ్యం, పరిగి ఇన్చార్జ్ ఎస్ఐ శేఖర్ పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుమారుడి మృతదేహం చూసి తండ్రి బోరున విలపించాడు. తల్లి అక్కడకు వచ్చినా కుమారుడిని గుర్తించలేని పరిస్థితి. మృతిపై అనుమానాలు ఆంజనేయులు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూలి పనులతో బతుకుతున్న ఆంజనేయులు గతంలో గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఈ క్రమంలో ఆమె బంధువులే హత్య చేసి పడేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సంఘటనా స్థలంలో మృతదేహం వద్ద ఓ టవల్ పడి ఉంది. ఆంజనేయులు చేతిపై ఉన్న పచ్చబొట్టు వద్ద, శరీరంలోను పలు చోట్ల గాయాలు కనిపిస్తున్నాయి. హత్య కోణంలో దర్యాప్తు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఆంజనేయులు హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురయ్యాడా.. ఆత్మహత్య చేసుకున్నాడా అనేది పోస్టుమార్టం నివేదికలో బయటపడనుంది. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఆంజనేయులు చరిత్ర అందరికీ తెలుసు
-
టీడీపీ ఎమ్మెల్యే.. స్మగ్లర్లకు డాన్
సాక్షి, గుంటూరు: వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించారని, ఆయన స్మగ్లర్లకే డాన్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. హత్యా రాజకీయాలు, శవరాజకీయాలు చేసే చరిత్ర ఆంజనేయులుదేనని మండిపడ్డారు. వ్యాపారంలో సొంత భాగస్వామిని హత్య చేయించిన వ్యక్తి ఆంజనేయులు అని అన్నారు. భాగస్వామి భార్యను బెదిరించి.. వారి ఆస్తులన్నీ బలవంతంగా ఆంనేయులు లాక్కున్నారని అన్నారు. ఆంజనేయులు వేలకోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై హత్య కేసు బనాయించడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని, ఈ మేరకు పోలీసులపై ఆయన తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. పోలీసులు పక్షపాతం లేకుండా ఈ కేసును విచారిస్తే వాస్తవం ఏమిటో తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యే ఆంజనేయులు ముగ్గురిని చంపినట్టు వినుకొండలో ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వినుకొండలో వైఎస్సార్సీపీ గెలుస్తుందని అన్నారు. -
ఆంజనేయులు కుటుంబాన్ని ఆదుకుంటాం
అల్గునూర్(మానకొండూర్): ఫిబ్రవరి 16న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ‘సాక్షి’ జగిత్యాల డెస్క్ ఇన్చార్జి శ్రీమూర్తి ఆంజనేయులు కుటుంబానికి ‘సాక్షి’ఫ్యామిలీ అండగా నిలిచింది. ఆంజనేయులు కుటుంబానికి సిబ్బంది తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించారు. శుక్రవారం కరీంనగర్ యూనిట్ కార్యాలయంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఎడిటర్ వి.మురళి, మఫిసిల్ ఎడిటర్ చలపతిరావు, నెట్వర్క్ ఇన్చార్జి శ్రీకాం త్ చెక్కురూపంలో ఆంజనేయులు భార్య శ్రావ్యకు అందించారు. మంత్రి మాట్లాడుతూ ఆంజనేయులు కుటుంబాన్ని ఆదుకుంటామని, ఆయన భార్యకు ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సహచర జర్నలిస్టు కుటుంబానికి చేయూతనిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ‘సాక్షి’సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, సాక్షి బ్రాంచి ఇన్చార్జి శ్రీనివాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో ఇన్చార్జి గడ్డం రాజిరెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఎడిషన్ ఇన్చార్జీలు బొల్లబత్తిని శ్రీనివాస్, సురేష్, ఆయా జిల్లాల డెస్క్ ఇన్చార్జీలు, స్టాఫ్ రిపోర్టర్లు పాల్గొన్నారు. -
ప్రమాదంలో సాక్షి ఉద్యోగి మృతి
-
ఆర్టిస్ట్ ఆంజనేయులుకు సోనియా అభినందనలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓక్లా ఎన్ఎస్ఐసీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ‘హియర్ నౌ అండ్ దెన్’పేరుతో గత మూడురోజులుగా అంతర్జాతీయ ఆర్ట్ఫెయిర్ జరుగుతోంది. ఇందులో హైపర్ రియలిజం ఆర్ట్లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన గుండు ఆంజనేయులు చిత్రాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఎక్కువ సమయం తీసుకొనే ఈ ఆర్ట్లో ఆంజనేయులు ఏడాది కాలంలో ఐదు చిత్రాలను రూపొందించారు. ఈ చిత్రాల ప్రత్యేకతను గుర్తించిన ‘ఆర్ట్ ఎలైవ్ గ్యాలరీ’వారు ఆంజనేయులు చిత్రాలకోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక వ్యక్తి ఆంజనేయులు కావడం గమనార్హం. గ్యాలరీలో ప్రదర్శించిన ఐదు చిత్రాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అతను గీసిన నులక మంచం, సోడా బండి, సైకిల్, తుమ్మకంప అందరి మన్ననలు పొందాయి. ఈ ఆర్ట్ఫెయిర్ను పరిశీలించేందుకు వచ్చిన యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆంజనేయులును ప్రత్యేకంగా అభినందించారు. -
టీడీపీ కౌన్సిలర్ దౌర్జన్యం
భీమవరం టౌన్: ప్రజా సమస్యలపై మునిసిపల్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ధర్నా చేస్తున్న వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్పై పోలీసుల సమక్షంలోనే టీడీపీకి చెందిన కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో ప్రధాన సమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందుతున్న మునిసిపాలిటీ పండుగ రోజుల్లో వివిధ వర్గాల ప్రజలు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను, బ్యానర్లను తొలగించడంపై వైఎస్సార్ సీపీ నాయకులు శనివారం మునిసిపాలిటీలో శాంతియుతంగా ధర్నా చేపట్టారు. వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం నుంచి నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా మునిసిపాలిటీకి చేరుకున్నారు. కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వన్టౌన్ సీఐ డి.వెంకటేశ్వరరావుఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరకుని విషయం తెలుసుకున్నారు. చైర్మన్ కొటికలపూడి గోవిందరావు చాంబర్లో ఉన్న కమిషనర్ బయటకు వచ్చి పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పోలీసులు ట్రాఫిక్సమస్యకు అవరోథంగా ఉన్న ఫ్లెక్సీలను, బ్యానర్లు తొలగించాలని మునిసిపాలిటీని కోరారని, అనుమతి లేకుండా పెట్టిన బ్యానర్లను తొలగించేందుకు జీఓ కూడా ఉందన్నారు. దీనిపై పార్టీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గాదిరాజు తాతరాజు అభ్యంతరం తెలిపారు. సంక్రాంతి ముగిసే వరకూ ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి అనుమతి కోరతామని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి వైఎస్సార్ సీపీ శ్రేణులు సానుకూలంగా స్పందిస్తుండగా టీడీపీ కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులు దూకుడుగా ముందుకు వచ్చి కోడే యుగంధర్ మెడ పట్టుకుని వెనక్కి నెట్టి వేయడంతో అక్కడే ఉన్న సీఐ డి.వెంకటేశ్వరరావు, ఎస్సై పి.అప్పారావు వెంటనే తేరుకుని అడ్డుకున్నారు. పార్టీ శ్రేణులు స్పందిస్తుండగానే కౌన్సిలర్ ఆంజనేయులను కొందరు అక్కడి నుంచి కమిషనర్ చాంబర్లోకి తీసుకువెళ్లి తలుపులు గడియ పెట్టారు. విషయం తెలుసుకున్న చైర్మన్ గోవిందరావు, వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు అక్కడికి వచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలపై అడిగేందుకు వస్తే కౌన్సిలర్ రౌడీయుజంతో దాడి చేస్తే వెనకేసుకువస్తారా అంటూ చైర్మన్ను వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరిద్దామని చైర్మన్ సూచించగా కౌన్సిలర్ ఆంజనేయులతో క్షమాపణ చెప్పించాలని నాయకులు కామన నాగేశ్వరరావు, పేరిచర్ల సత్యనారాయణరాజు, కొల్లి ప్రసాద్, సుంకర బాబూరావు, గూడూరి ఓంకారం, భూసారపు సాయి సత్యనారాయణ, కొప్పర్తి జనార్థన్, చికిలే మంగతాయారు, నెల్సన్, కందికట్ల డేవిడ్ డిమాండ్ చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్లు వైఎస్సార్ సీపీ నాయకులను చర్చలకు ఆహ్వానించారు. కమిషనర్ చాంబర్లో ఇరువర్గాలు చర్చలు జరిపారు. బహిరంగంగా దాడి చేసిన కౌన్సిలర్ ఆంజనేయులు అందరి సమక్షంలో క్షమాపణ చెప్పాలని సుంకర బాబూరావు కోరడంతో చైర్మన్ దానికి అంగీకరించకుండా లేచి వెళ్లిపోయారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు మళ్లీ ధర్నా చేపట్టారు. కౌన్సిల్ హాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సీఐలు డి.వెంకటేశ్వరరావు, ఎ.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష నాయకులపై దాడి చేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని పోలీసులను కోడే యుగంధర్ ప్రశ్నించడంతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సీఐ డి.వెంకటేశ్వరరావు చెప్పారు. సమస్యలపై స్పందించమంటే దాడులు చేస్తారా? ప్రజా సమస్యలపై స్పందిస్తే పీక నొక్కి టీడీపీ నాయకులు రౌడీయిజం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్ కార్యాలయం ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పండుగ రోజుల్లో ప్రజల మనోభిప్రాయాన్ని గౌరవించి సంక్రాంతి వరకూ ఫ్లెక్సీలు తొలగించవద్దని ప్రజా స్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మునిసిపల్ కార్యాలయంలో అధికార పక్ష కౌన్సిలర్ దాడి చేయడం దారుణమన్నారు. కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గాదిరాజు తాతరాజు, సీనియర్ నాయకుడు కామన నాగేశ్వరరావు, పేరిచర్ల సత్యనారాయణరాజు, నెల్సన్లు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షంపై రాష్ట్రంలో తెలుగు దేశం దాడులు చేసే విష సంస్కృతి భీమవరం మునిసిపాలిటీకి కూడా చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్లు పాలవెల్లి మంగ, కానుబోయిన వెంకటరమణ, వేండ్ర విజయదుర్గ, విజ్జురోతి రాఘవకుమారి, సుంకర విజయలక్ష్మి, చెన్ను శాం తి, నాయకులు గంటా సుందర్కుమార్, రేవూరి గోగురాజు, పెనుమాల నర్సింహస్వామి, బి.గోపి తదితరులు పాల్గొన్నారు. -
అప్పు చెల్లించలేదని మహిళల నిర్బంధం
సిరిసిల్ల టౌన్: అప్పు చెల్లించలేదని ఆగ్రహిస్తూ ఓ వడ్డీ వ్యాపారి దారు ణానికి ఒడిగట్టాడు. భర్త చేసిన అప్పు తీర్చాలంటూ.. అతని భార్య తోపాటు తల్లినీ ఇంట్లో ఉంచి రెండ్రోజులుగా తాళం వేసి వెళ్లిన సంఘటన గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. జిల్లాకేంద్రంలోని సుభాష్ నగర్కు చెందిన కుడిక్యాల కృష్ణ పదేళ్లుగా పెట్టీకోట్స్ వ్యాపారం చేస్తున్నాడు. స్నేహితులను నమ్మి ఆర్థికంగా నష్టపోయాడు. ఈ క్రమంలో రూ.20 లక్షలు అప్పు చేశాడు. 2 నెలల క్రితం కోర్టు ద్వారా రుణదాతలకు ఐపీ (ఇన్సాల్వెన్స్ పొజిషన్) నోటీసులు పంపించాడు. అప్పట్నుంచి అప్పుల వారికి భయపడి.. ఇంట్లో కూడా చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. ఆయన భార్య తార, కూతురు అమూల్యతో అత్తగారింట్లో ఉంటోంది. పట్టణంలోని శాంతినగర్కు చెందిన వడ్డీ వ్యాపారి బండారి ఆంజనే యులు తనకు కృష్ణ రూ.2 లక్షలు బాకీ ఉన్నాడంటూ.. అవి చెల్లించాలని కొద్దిరోజులుగా తార, కృష్ణ తల్లి లక్ష్మిని వే«ధిస్తున్నాడు. తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రాధేయపడినా.. వినకుండా బుధవారం వారిని ఇంట్లో ఉంచి బయట తాళం వేశాడు. గమనించిన స్థానికులు తాళం పగులగొట్టారు. విషయం తెలుసుకున్న ఆంజనేయులు గురువారం కూడా వచ్చి స్థానికులను దూషిస్తూ.. తార, లక్ష్మిని ఇంట్లో ఉంచి మళ్లీ తాళం వేశాడు. దీంతో బాధితులు 100, మీడియాకు సమాచారం ఇచ్చి వారి బాధను వివరించారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు. -
కరెంట్షాక్తో కౌలు రైతు
కణేకల్లు: కణేకల్లుకు చెందిన కౌలురైతు ఆంజనేయులు (50) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... ఆంజనేయులు ఆలూరు వద్ద 5ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పొలంలో వరిసాగు చేసేందుకు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. శుక్రవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టి మాగాణికి దమ్ము చేయించాలనుకున్నాడు. స్టార్టర్ ఆన్ చేయగానే విద్యుత్షాక్కు గురై సృహ కోల్పోయాడు. పక్కనే ఉన్న రైతులు గమనించి వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆంజనేయులు మృతి చెందాడు. భార్య అనంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యువరాజు తెలిపారు. -
వీడిన బేల్దార్ హత్యకేసు మిస్టరీ
వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య హత్యాస్థలిలో వదిలేసిన పిడిబాకు కోసం వచ్చి దొరికిన నిందితుడు తనకల్లు : చీకటిమానిపల్లి వద్ద జరిగిన బేల్దార్ ఆంజనేయులు (30) హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తేలింది. నిందితుడు హత్యాస్థలిలో వదిలేసిన పిడిబాకును తీసుకునేందుకు వచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలను కదిరి రూరల్ సీఐ శ్రీధర్ శనివారం మీడియాకు వెల్లడించారు. చిత్తూరు జిల్లా మొలకలచెరువు మండలం చెన్నమగారిపల్లికి చెందిన ఆంజినేయులు అలియాస్ అంజి (30) తన సోదరి మంజులను తనకల్లు మండలం చీకటిమానుపల్లికి చెందిన సోమశేఖర్కు ఇచ్చి వివాహం చేశారు. ఆంజనేయులు తన సోదరిని చూడడానికి తరచూ గ్రామానికి వచ్చేవాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన రామలక్ష్మణ్ కుటుంబంతో పరిచయం అయ్యింది. రామలక్ష్మణ్ను మామా అని, అతని భార్య అంజలిని అక్క అంటూ చనువుతో మెలిగేవాడు. ఈ చనువు రానురాను అంజలితో వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు గ్రామస్తులు రామ్లక్ష్మణ్ దృష్టికి తీసుకెళ్లగా భార్యపై ఉన్న నమ్మకంతో పెద్దగా పట్టించుకోలేదు. ఓరోజు ఆంజనేయులు దగ్గర రామ్లక్ష్మణ్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా తనకు ఇది వరకే పెళ్లి అయిన మహిళతో సంబంధం ఉందని, తననే వివాహం చేసుకుంటానని చెప్పాడు. అడ్డు వస్తే ఆమె భర్తను హతమార్చి అయినా పెళ్లి చేసుకుంటానని అనడంతో రామ్లక్ష్మణ్కు అనుమానం వచ్చింది. ఈ నెల 18న తెల్లవారుజామున బహిర్భుమికి వెళ్లివస్తానని భర్తతో చెప్పి అంజలి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. అనుమానంతో ఉన్న భర్త ఆమెకు తెలియకుండా అనుసరించాడు. అప్పటికే అంగన్వాడీ కేంద్రం దగ్గర ఆంజనేయులు వేచి ఉన్నాడు. ఆమె రాగానే ఇద్దరు సన్నిహితంగా మెలగడం కళ్లారా చూసిన రామలక్ష్మణ్ అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు. భార్య ఇంటికి రాగానే నిలదీయగా ఆమె తప్పు చేశానని, ఇంకెప్పుడూ అలాంటి పని చేయనని భర్త కాళ్లు పట్టుకుంది. దీంతో ఆమెను క్షమించి బుద్ధిగా ఉండాలని హెచ్చరించాడు. పద్ధతి మార్చుకోమంటే నిర్లక్ష్య సమాధానం ఆంజనేయులు కుటుంబ సభ్యులను రామ్లక్ష్మణ్ కలిసి అతన్ని తమ గ్రామానికి రాకుండా చూడాలని కోరాడు. ఈ నెల 19న రామ్లక్ష్మణ్ స్నేహితుడైన మాధవతో కలిసి మద్యం తాగడానికి గ్రామంలోని పాత శివాలయం వద్దకు వెళ్లారు. అక్కడికి ఆంజనేయులు కూడా వచ్చాడు. ముగ్గురూ కలిసి పూటుగా మద్యం తాగారు. అక్కడి నుండి ఆంజినేయులు ద్విచక్ర వాహనంలో శశ్మానం వైపు బయల్దేరారు. అక్కడ మాధవ్ బహిర్భుమికి వెళ్లాడు. పక్కన ఎవ్వరూ లేకపోవడంతో తన భార్యతో వివాహేతర సంబంధం మానుకోవాలని ఆంజనేయులును కోరగా.. అతను చాలా నిర్లక్ష్యంగా మాట్లాడడంతో ఓర్చుకోలేకపోయిన రామలక్ష్మణ్ తన వెంట తెచ్చుకున్న పిడిబాకుతో మెడ భాగంలో బలంగా పొడిచాడు. కింద పడిపోయిన ఆంజనేయులుపై మరో ఐదు చోట్ల విచక్షణారహితంగా పొడవడంతో అతను అక్కడిక్కడే చనిపోయాడు. పిడిబాకును దగ్గర్లోని చెట్ల పొదల్లో పారేసి రామ్లక్ష్మణ్ పరారయ్యాడు. పిడిబాకు కోసం వచ్చి పట్టుబడ్డ నిందితుడు పిడిబాకును హత్యాస్థలి వద్ద పడేయడం వల్ల దానిపై తన వేలిముద్రలు ఉంటాయని, వాటి ద్వారా తనను పోలీసులు పట్టుకుంటారని భయపడిన రామ్లక్ష్మణ్ పిడిబాకు కోసం శుక్రవారం శివాలయం వద్దకు వచ్చాడు. అప్పటికే అక్కడ కాపు కాచి ఉన్న పోలీసులు అతడిని పట్టుకొని అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ శ్రీనివాసులు, ఏఎస్ఐ బాలరాజు, కానిస్టేబుళ్లు రాము, సురేష్, అంజినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు రైతుల బలవన్మరణం
సంతమాగులూరు/పుల్లలచెరువు: ప్రకాశం జిల్లాలోని సంతమాగులూరు, పుల్లలచెరువు మండలాల్లో అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన ఆంజనేయులు(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు బాగా పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారి కానరాక మంగళవారం తెల్లవారుజామున పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే పుల్లలచెరువు మండలం ఐటీవరంలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వరరెడ్డి అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు -
భార్యలేని జీవితం దేనికని..
చేవెళ్ల: భార్య ఆత్మహత్యపై మనస్థాపం చెందిన ఓ వ్యక్తి.. ఆమె లేని జీవితం తనకూ వద్దని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చేవెళ్లలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు(23)కు ఏడాది క్రితం వివాహమైంది. కుటుంబంలో వచ్చిన మనస్పర్థలతో పెళ్లైన కొన్ని రోజులకే భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో అంజనేయులు తన తల్లి చంద్రమ్మతోపాటు కొన్ని రోజుల కిత్రం చేవెళ్లకు వచ్చి హౌసింగ్బోర్డు కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. తాపీమేస్త్రీ వద్ద కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా మంగళవారం ఎప్పటిలాగే పనికి వెళ్లిన అతడు మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. అంతకుముందు రోజు గ్రామానికి వెళ్లిన అతని తల్లి మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి చూడగా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. దీంతో ఇరుగుపొరుగువారికి చెప్పటంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాని సూసైడ్నోట్ మృతుడి జేబులో లభించిందని, మనస్థాపంతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
మున్సిపల్ కార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్ల: ఆర్థిక ఇబ్బందులు తాళలేక మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబికానగర్కు చెందిన ఆంజనేయులు మున్సిపాలటీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో.. ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
మేడ్చెల్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్పల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఆంజనేయులు(32) రోడ్డు దాటుతున్న సమయంలో లారీ ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్ధలికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హంద్రీనీవా కాలువ పనుల్లో అపశృతి
చిత్తూరు: జిల్లాలో జరుగుతున్న హంద్రీనీవా కాలువ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. వీకోటలో జరుగుతున్న కాలువ పనుల్లో కాంక్రీట్ మిక్చర్ బోల్తాపడింది. ఈ సంఘటనలో డ్రైవర్ ఆంజనేయులు అక్కడికక్కడే మృతిచెందింది. అంజనేయులు మహబూబ్నగర్జిల్లా వాసి. కాలువ పనులు పర్యవేక్షించే ఇంజనీర్లు, ఇతర అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని అతని స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. -
రౌడీ కామెడీ
పవన్కల్యాణ్గారు మా అందర్నీ ఇంటికి పిలిచి భోజనాలు పెట్టిన రోజుని జీవితంలో మేం మరచిపోలేం. సాధారణంగా ఒంటిగంటకు భోజనం చేసే ఆయన.. రెండింటి వరకూ తినకుండా వెయిట్ చేశారు. ‘ఈ రోజు మీరు నా అతిథులు’ అని చెప్పి స్వయంగా ఆయనే ప్లేట్స్ ఇచ్చి వడ్డించారు. భోజనాలు పూర్తయిన తర్వాత రెండు గంటల పాటు మాతో మాట్లాడారు. బస్ ఎక్కితే చేసేది ఇదే.. పిక్నిక్లో చేసేది ఇదే.. ఏం తోచకపోతే చేసేదీ ఇదే.. భరించలేని ధ్వని.. కానీ, తెలిసిన రాగం.. మేనత్త కావొచ్చు.. కోడలు కావొచ్చు.. కూతురు కావొచ్చు.. బావగారు కావొచ్చు.. ఎవరు పాడినా చప్పట్లు కొడతారు. కానీ, రౌడీలు పాడారండీ... ఆ అంత్యాక్షరికి చిందులు వేశాం. ఈ రౌడీల వెనకాల ఎన్ని ‘ఢీ’లు... ‘సాక్షి’కి ఎక్స్క్లూజివ్. రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా... - ఆంజనేయులు మాది తణుకు. చిన్నప్పుడు చదువుకోవడం మానేసి సినిమాలు చూసేవాణ్ణి. స్టేజీల మీద డ్యాన్స్ చేస్తూ మిమిక్రీ చేసేవాణ్ణి. కామెడీ ఆర్టిస్టుగా చేయాలని ఉండేది. అవకాశాలు వెతుక్కుందామని నా భార్యను తీసుకుని హైదరాబాద్ వచ్చేశాను. ఫిల్మ్నగర్ ఆఫీసుల చుట్టూ తిరిగేవాణ్ణి. బస్సుల్లో తిరగాలంటే టికెట్లకే బోల్డంత డబ్బు అయిపోతుంది. నా జేబులు ఎప్పుడూ ఖాళీయే. అందుకే స్టూడియోలు ఎంత దూరమైనా నడ్చుకుంటూ వెళ్లేవాణ్ణి. కృష్ణానగర్లో ఓ రేకుల గదిలో ఉండేవాణ్ణి. అద్దె 75 రూపాయలు. తినడానికి, అద్దె కట్టడానికి డబ్బులుండేవి కాదు. వేషాల కోసం ఎదురు చూస్తే కష్టం అని, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో చేరాను. రోజుకి వంద రూపాయలు ఇచ్చేవారు. నెలకి ఓ పది రోజులు పని ఉండేది. ఒక్కోసారి ఆ పని కూడా దొరికేది కాదు. ఈ గ్యాప్లో నటుడిగా అవకాశాల కోసం తిరిగేవాణ్ణి. కాస్ట్యూమ్ వర్క్ చేస్తూనే చాలా సినిమాల్లో వెనక అటూ ఇటూ తిరిగే క్యారెక్టర్లు చేశాను. బాబు పుట్టడంతో ఫ్యామిలీ గడవడం కష్టమైంది. ఆ తర్వాత రెండో బాబు కూడా పుట్టాడు. షూటింగ్ ఉంటే నేనక్కడ తినేవాణ్ణి. ఇంట్లో మా ఆవిడ, పిల్లల పరిస్థితి దారుణంగా ఉండేది. పిల్లలకు పాలు కొనలేని పరిస్థితి. ఊరెళ్లిపోయి పొలం పనులు చేసుకుందామనుకున్నా. ‘ఇక్కడే ఉందాం... నేనూ పని చేస్తా’ అని మా ఆవిడ ఇళ్ల పనులు చేయడం మొదలుపెట్టింది. నాలుగేళ్ల క్రితం వరకూ తను పనులు చేసింది. డ్యాన్స్ అంటే ఇష్టం ఉండటంతో సినిమాల్లో నటిస్తూ, డ్యాన్సర్గానూ చేస్తుండేవాణ్ణి. ఇప్పటివరకూ పలు సినిమాల్లో నటించా. మా పెదబాబు కంప్యూటర్ ఇంజినీరింగ్ చేశాడు. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. చినబాబు డిగ్రీ ఫైనలియర్లో ఉండగా యాక్సిడెంట్లో మరణించాడు. జీవితాంతం వెంటాడే బాధ ఏదైనా ఉందంటే అది మా అబ్బాయి మరణమే. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఆర్థిక కష్టాలు తప్పాయి. అవకాశాలు పెరిగాయి. ఆదాయం పెరిగింది. ఇప్పుడు ఏ సినిమా చేసినా రోజుకి పదివేలు ఇస్తున్నారు. నేను రాజశేఖర్గారి దగ్గర పనిచేశా. ‘గబ్బర్ సింగ్’లో ఆయన్ని ఇమిటేట్ చేస్తూ, చేసిన ‘రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా..’ చూసి.. ‘నాకన్నా నువ్వే బాగా చేశావ్’ అన్నారు. ఇప్పుడో ఇల్లు కొనుకున్నాను. పెద్దబ్బాయి పెళ్లి కూడా కుదిరింది. వచ్చే ఏడాది చేయాలనుకుంటున్నాం. మల్లె తీగెకు పందిరి వోలె... - రమేశ్ మాది హైదరాబాద్ పాతబస్తీ. పదో తరగతి వరకూ చదువుకున్నా. నా ముఖం చూసి ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. అప్పుడు సినిమాలపై ఆసక్తి లేదు. రామ్గోపాల్ వర్మగారి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసే మహేశ్ అన్న మా ఇంటి దగ్గర ఉండేవారు. ఆయనే నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ‘షాక్’ సినిమా అప్పుడు హీరోయిన్కి బాడీగార్డుగా చేశా. మోహన్బాబుగారితో పాటు పలువురి దగ్గర బాడీగార్డుగా పనిచేశా. ‘ఢీ’ నుంచి యాక్టింగ్ మొదలైంది. పదేళ్ల పాటు మెయిన్ విలన్ వెనక రౌడీ క్యారెక్టర్లు చేశాను. నెలలో పది రోజులు షూటింగ్ ఉండేది. ‘గబ్బర్ సింగ్’తో లైమ్లైట్లోకి వచ్చా. ఆ సినిమాలో చేసిన ‘మల్లె తీగెకు పందిరి వోలె..’ పాట చూసి, నారాయణమూర్తిగారు మెచ్చుకున్నారు. బాడీగార్డుగా పనిచేసినప్పుడు ‘ఇప్పటిదాక కుర్సీలో కూసున్నాం. ఏ రోజైనా క్యార్వ్యాన్ ఎక్కాలి మనం. కష్టపడి ఆ స్టేజికి రావాలి’ అనుకున్నా. ‘గబ్బర్ సింగ్’ తర్వాత కొన్ని చిన్న సినిమాలకు, టీవీ షోలకు క్యార్వ్యాన్ ఇచ్చారు. నా ఆశ నెరవేరింది. నాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. మేనమామ కూతుర్ని చేసుకున్నా. మామ ఇంట్లో వాళ్లందరూ ‘షూటింగులకు పోతే ఏమొస్తది’ అన్నారు. బంధువులు కూడా చాలా మాటలన్నారు. దాంతో పిల్లనివ్వడానికి మామవాళ్లు భయపడ్డారు. నా మరదలే ఒప్పించింది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ‘వాడు మావాడే’ అని గర్వంగా చెబుతున్నారు. ప్రేక్షకులు కూడా ‘గబ్బర్ సింగ్’ విడుదలకు ముందు మా బ్యాచ్ దగ్గరకి రావడానికి భయపడేవారు. ఇప్పుడు ‘అన్నా.. ఓ సెల్ఫీ’ అంటున్నారు. చిన్నపిల్లల్లో మాకు ఫ్యాన్స్ ఎక్కువ. ఇండస్ట్రీకి రాకముందు టూ వీలర్ ఫైనాన్స్ కలెక్షన్, సెటిల్మెంట్లు చేసేవాణ్ణి. నాతో తిరగొద్దని మా ఫ్రెండ్స్ వాళ్లింట్లో గొడవ చేసేవారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ‘మా అబ్బాయిని కూడా తీసుకు వెళ్లొచ్చు కదా’ అంటున్నారు. హరీశ్ శంకర్ సర్ ‘గబ్బర్ సింగ్’లోనే కాదు.. ‘రామయ్యా వస్తావయ్యా’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాల్లో పెద్ద క్యారెక్టర్లు ఇచ్చారు. ఆయన ప్రతి సినిమాలోనూ నేనుంటా. ఇప్పుడు చాన్సులు బాగానే ఉన్నాయి. జలక్ దిక్లాజా... - రెమ్సన్ రాజు మాది చార్మినార్ దగ్గర యాకుత్పుర. పదో తరగతి ఫెయిలయ్యా. జిమ్కు వెళ్లడం.. ఫ్రెండ్స్తో తిరగడం.. ఇవే పనులు. మా చిన్నమ్మ కొడుక్కి ఇండస్ట్రీతో టచ్ ఉంది. ‘గొడవలు, గట్రా ఎందుకురా.. నాతో రా, నిన్ను సినిమాల్లో తీసుకుంటారు’ అన్నాడు. ‘ఊకో అన్నా.. నన్నెవరు తీసుకుంటారు’ అన్నాను. రాధాకృష్ణ అనే సార్తో కలిసి ‘చక్రం’ షూటింగ్ చూడ్డానికి వెళ్లా. కృష్ణవంశీగారు చూసి, రౌడీ బ్యాచ్లో ఒకడిగా తీసుకున్నారు. నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చిన ప్రసాద్ అన్న వాళ్లింటి పక్కన ఓ అమ్మాయి ఉండేది. నేను అమ్మాయిలతో అస్సలు మాట్లాడేవాణ్ణి కాదు. దాంతో సతాయిద్దామని ఫోన్ చేసి, మా అన్నయ్యవాళ్లు ఆ అమ్మాయికి ఇచ్చారు. ‘మీరు సినిమాల్లో చేస్తారు కదా. నేను మీకు పెద్ద ఫ్యాన్. నెట్లో మీ నంబర్ తీసుకున్నా’ అని చెప్పింది. ‘చిన్న చిన్న రౌడీ క్యారెక్టర్లు చేస్తా. నా నంబర్ నెట్లో పెట్టేంత సీన్ లేదు. ఫోన్ పెట్టు’ అన్నాను. మళ్లీ తెల్లారి ఫోన్ చేసి అవే మాటలు. ‘ఓవర్ యాక్షన్ చేయకు’ అని తిట్టా. ఆ తర్వాత మెల్లగా ఫ్రెండ్ అయ్యింది. ఆ టైమ్లోనే ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. ‘అతను పైసల్.. అని వేధిస్తున్నాడు. ఇంట్లోవాళ్లు బాధపడతారని ఒప్పుకున్నా. నాకతను నచ్చలేదు’ అంది. ఆ అమ్మాయికో లవర్ ఉందని ఆ అబ్బాయికి చెప్పించా. నిశ్చితార్థం జరిగిపోయింది కాబట్టి, వెనక్కి తగ్గేది లేదని పెద్దలన్నారు. దాంతో ‘నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమైతే పెళ్లి చేసుకుందాం’ అంది. ‘ఎప్పుడో ఇష్టం’ అన్నాను. మేం పెళ్లి చేసుకున్నాం. ‘గబ్బర్ సింగ్’ బ్యాచ్ అందరూ వాళ్ల వాళ్ల ఇళ్లలో ‘నాలుగు రోజులు అవుట్ డోర్ షూటింగ్ ఉంది’ అని చెప్పి మాతో వచ్చేశారు. గొడవలు జరిగాయి. మన సంతోషం కోసం ఆలోచించి.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందర్నీ కష్టపెట్టడం తప్పని అర్థమైంది. ఇప్పుడంతా కాంప్రమైజ్ అయింది. ఇప్పుడెవరైనా లవ్ మ్యారేజ్ అంటే నేను వద్దని చెప్తా. మా పెళ్లయి ఆరేళ్లయింది. మాకు ఇద్దరు అబ్బాయిలు. ‘గబ్బర్ సింగ్’ 50వ రోజున బాబు పుట్టాడు. వాడికి ‘గబ్బర్ సింగ్’ అనే నిక్నేమ్ పెట్టాను. ఆ సినిమాలో చేసిన ‘జలక్ దిక్లాజా..’ పాట నన్ను చాలా పాపులర్ చేసింది. ప్రస్తుతం నా పొజిషన్ ఫర్వాలేదు. సినిమాలు చేస్తున్నాను. పెద్ద సినిమాలకు పదివేలు ఇస్తున్నారు. చిన్న సినిమావాళ్ల రిక్వెస్ట్ను బట్టి తీసుకుంటున్నా. నన్ను కొట్టకురో bతిట్టకురో.... - సాయిబాబా మాది సికింద్రాబాద్. ఒకటి, మూడు తరగతులు నాలుగుసార్లు, రెండో తరగతి రెండుసార్లు ఫెయిలయ్యా. స్కూల్లో ఇంటర్వెల్కి గోడ దూకి 47 బస్ ఎక్కి అపోలో దగ్గరకు వచ్చేవాణ్ణి. నడుచుకుంటూ నానక్రామ్గూడా వెళ్లి కృష్ణగారి ‘మాయలోడు’ షూటింగ్ చూసేవాణ్ణి. ఓసారి గోడ దూకుతుంటే మేడమ్ పట్టుకున్నారు. ‘నీ కొడుకు చదువుకు పనికిరాడు. బస్తాలు మోయడానికి పనికొస్తాడు’ అని నాన్నకు చెప్పారు. ఓ రోజు కోపం వచ్చి పేపర్లు రౌండ్గా ఉండ చుట్టి మేడమ్ను కొట్టా. పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చి, సస్పెండ్ చేశారు. ఆల్ఫా హోటల్ పక్కన పెట్రోల్ పంపులో జాడూ కొడుతూ, టైర్లలో గాలి పడుతూ ఓ ఏడాది చేశా. తర్వాత అక్కడే హెల్పర్గా, క్యాషియర్గా చేశా. ఓనర్కి నాపై నమ్మకం పెరగడంతో మేనేజర్ని చేశారు. మోహన్బాబుగారి దగ్గర పనిచేసే రాజుతో పరిచయమైంది. నాకు షూటింగులంటే ఇష్టం. పెట్రోల్ పంపులో పనిచేస్తూనే.. మోహన్బాబుగారి ఆడియో ఫంక్షన్స్, ఇంకేవి జరిగినా రాజు వెనకుండి ఆయన పనులు చేసేవాణ్ణి. హైట్, బాడీ బాగుందని ‘శివశంకర్’లో చిన్న వేషం ఇచ్చారు. ఓ నెల రోజులు సెలవు పెట్టేశా. ఓనర్ నన్ను పెట్రోల్ పంపు నుండి వెళ్లగొట్టారు. చేసేదేం లేక సినిమాల్లో కంటిన్యూ అయిపోయా. చిన్నప్పుడు అమ్మాయిలంటే చాలా సిగ్గు. బోనాలు, గణేశ్ చతుర్థి, అయ్యప్ప పూజలు చేయడంతో ఓ అమ్మాయి నన్ను ఇష్టపడింది. ఓ పేపర్పై లవ్ సింబల్ వేసి నా పేరు, తన పేరూ రాిసి పంపింది. నాకు చదవడం రాదు. ఇంకో పిల్లగాడితో చదివించుకున్నా. తర్వాత ‘ప్రేమదేశం’ పాటల క్యాసెట్ అడిగి మళ్లీ సేమ్ లవ్ సింబల్, పేర్లు రాసి పంపింది. కాస్ట్ ఫీలింగ్తో మా ఇంట్లోవాళ్లు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ‘ఆ అమ్మాయిని చేసుకుంటే, ఇద్దరు సిస్టర్స్కి సంబంధాలు రావు’ అని భయపెట్టారు. వేరే అమ్మాయితో పెళ్లి చేశారు. నేనంటే ఆ అమ్మాయికీ, తనంటే నాకూ ఇష్టం లేదు. పెళ్లైన నెలకు ఆ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి గ్రీటింగులు పంపించడం స్టార్ట్ చేశాడు. గొడవలు మొదలయ్యాయి. ఏడాది తిరక్కుండానే విడాకులు ఇచ్చేశా. ఆ తర్వాత మా అమ్మే, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమ్మంది. అలాగే చేసుకున్నా. మాకు ముగ్గురు పాపలు. ‘గబ్బర్ సింగ్’లో చేసిన ‘నన్ను కొట్టకురో.. తిట్టకురో..’ పాట నాకు మంచి పేరు తెచ్చింది. మా నాన్న సినిమాలు బాగా చూసేవారు. ‘నువ్ మంచి హైట్ ఉన్నావ్గా, సినిమాల్లో ట్రై చేయ్’ అని నాన్న చెప్పేవారు. నేను పెట్రోల్ పంపులో జాబ్ చేస్తున్నప్పుడే నాన్న చనిపోయారు. ఆయన ముగ్గురు అక్కలకు పెళ్లి చేస్తే, నేను ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేశా. నా డెవలప్మెంట్ చూడకుండా నాన్న చనిపోయారని నా బాధ. అమ్మా చూడాలి నిన్నూ నాన్నను చూడాలి - ప్రవీణ్ మాది హైదరాబాద్ ఉప్పుగూడా రైల్వే స్టేషన్ దగ్గర. రామ్కోఠిలోని ఓ షాపులో టూ వీలర్ ఫైనాన్స్ కలెక్షన్ చేసేవాణ్ణి. హీరో రవితేజగారి బాడీగార్డ్ కుమార్ అన్న నాకు తెలుసు. ‘పోకిరి’ షూటింగ్కి వస్తావా? అన్నారు. సరే.. అన్నా. షూటింగ్ అంటే 9 గంటలకు జాబ్కు వెళ్లడమే అనుకుని పడుకున్నా. తెల్లారక ముందు వచ్చి నిద్రలేపారు. ‘ఇప్పుడేం షూటింగ్ అన్నా. నేను రాను పో’ అని చెప్పా. ‘ఆరింటికే షూటింగ్ స్పాట్’లో ఉండాలని చెప్పి తీసుకువెళ్ళారు. విలన్స్ బ్యాచ్లో గన్ పట్టుకుని నిలబడమన్నారు. నేను నవ్వుతున్నా. ‘సీరియస్గా ఉండాలమ్మా’ అని చెప్పారు. ఆ తర్వాత ‘ఆట’ చేశా. అప్పట్నుంచి సినిమాల్లో కంటిన్యూ అవుతున్నా. విలన్స్ బ్యాచ్లో ఉండేవాణ్ణి. షూటింగ్ లేదంటే కలెక్షన్ చేసేవాణ్ణి. ఓ టైమ్లో జాబ్ మానేశాను. కానీ, నెలలో పది రోజులు షూటింగ్ ఉంటే 20 రోజులు ఖాళీగా ఉండేవాణ్ణి. ఇబ్బంది అవుతోందని మళ్లీ కలెక్షన్ జాబ్ షురూ చేశా. మొదట్లో ఇంట్లోవాళ్లు సినిమాలు వద్దన్నారు. ‘ఏం చేస్తున్నావ్ రా’ అని తిట్టేవాళ్లు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హ్యాపీగా ఫీలయ్యారు. థియేటర్లో సినిమా చూసిన తర్వాత వాళ్లు ఫుల్ ఖుషీ. ‘గబ్బర్ సింగ్’లో అంత్యాక్షరి ఎపిసోడ్కి, ‘అమ్మా చూడాలి.. నిన్నూ నాన్నను చూడాలి..’ పాటలో నా యాక్టింగ్కు అంత మంచి పేరొస్తుందని ఊహించలేదు. సినిమా విడుదలైన రోజున ఫైనాన్స్ కలెక్షన్ చేస్తుంటే... ‘అరే, ‘గబ్బర్ సింగ్’లో మంచిగా చేశావ్’ అని చాలామంది ఫోన్లు చేశారు. నాకింకా పెళ్లి కాలేదు. మా అన్నకు పెళ్లైన తర్వాత నాదే. మొదట్లో మనల్ని చూసి ఎవరు లవ్ చేయలే. అందరూ భయపడుతుండే. ‘గబ్బర్ సింగ్’ తర్వాత చాలామంది ఫోన్లు చేసి ‘మీరంటే ఇష్టం’ అని టార్చర్ చేశారు. నాకు భయమైంది. ‘నాకు ఇసువంటివి నచ్చవ్. వద్దు’ అని చెప్పా. అవన్నీ పట్టించుకోలేదు. అంతకు ముందు మా మామవాళ్లు పిల్లను ఇవ్వడానికి వెనకాడారు. ఇప్పుడు ‘మా బిడ్డను చేసుకో..’ అని అడుగుతున్నారు. ఇంట్లో అమ్మానాన్నలు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే.. తనని చేసుకుంటా. ఒకప్పుడు ఎవడైనా ఏమైనా అంటే.. గొడవపడుతుండే. ఇప్పుడు ‘ఓయ్.. గిట్లరా. ఓ ఫొటో దిగుదాం’ అనడిగినా గమ్మునుంటున్నా. - ‘సాక్షి’ సినిమా డెస్క్ -
బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ
కళ్యాణదుర్గం రూరల్ : స్థానిక పట్టణంలోని పార్వతీ నగర్లో భూపసముద్రం ఏపీజీబీ మేనేజర్ ఆంజనేయులు ఇంట్లో శనివారం చోరీ జరిగింది. ఆంజనేయులు ఐదు రోజుల క్రితం సమీప బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి వచ్చి చూసే సరికి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలు, దుస్తులు చెల్లాచెదురుగా కనిపించాయి. బీరువాలో ఉన్న 4 తులాల బంగారు ఆభరణాలు, రూ.40 వేలు విలువ చేసే ఎల్ఈడీ టీవీ చోరీకి గురైనట్లు గుర్తించారు. అదేవిధంగా అక్కడే ఉన్న అనీష్ ఇంట్లోనూ టీవీని దొంగలు ఎత్తుకెళ్లారు. రూరల్ ఎస్ఐ నబీరసూల్ మాట్లాడుతూ చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
యాదగిరిగుట్ట మండలం వరంగల్-హైదరాబాద్ రహదారిపై చిన్న కందుకూరు స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు బైక్పై వస్తోన్న ఆంజనేయులు అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ జారిపడ్డాడు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆంజనేయులు స్వగ్రామం వరంగల్ జిల్లా మద్దూరు. -
కారంపూడిలో దంపతుల ఆత్మహత్య
కుటుంబ సమస్యలకు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో యువ దంపతులు ఉరిపోసుకుని బలవన్మరణం పొందారు. వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లా కారంపూడిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక ఆంధ్రా బ్యాంకు వీధిలో కట్టమూరి ప్రసన్నాంజనేయులు (38), సావిత్రి (30) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున భార్యాభర్తలు గొడవపడ్డారు. తర్వాత ప్రసన్నాంజనేయులు బయటికి వెళ్లాడు.. భార్య పిల్లలను నిద్రలేపి బ్రష్ చేసుకోవడానికి పంపి.. తర్వాత ఒక లేఖ రాసి ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగి వచ్చిన ఆంజనేయులు భార్య ఉరిపోసుకుని మృతి చెందడాన్ని గమనించి మేనమామకు ఫోన్ చేసి చెప్పాడు. తర్వాత అతడు కూడా ఫ్యానుకు చీరతో ఉరివేసుకున్నాడు. కిందనుంచి మేడ మీదకు వచ్చిన పిల్లలు తల్లిదండ్రులు వేలాడడాన్ని చూసి.. గట్టిగా ఏడవటం మొదలు పెట్టారు. మంచి నీటి క్యాన్ ఇచ్చేందుకు వచ్చిన వ్యక్తి .. వీరిని గమనించి.. ఇరుగు పొరుగు వారికి తెలిపాడు. ప్రసన్నాంజనేయులు గ్రామంలో టీడీపీ రాజకీయాలలో చురుకుగా పాల్గొనే వాడు. బియ్యం, ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తుంటాడని ఎస్.ఐ. పెదనారాయణస్వామి తెలిపారు. అప్పుల బాధతో అల్లుడు, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారని సావిత్రి తండ్రి బచ్చు కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురజాలకు తరలించారు. అనాథలైన చిన్నారులు ప్రసన్నాంజనేయులు అక్కయ్య శేషమ్మ కుమార్తె సావిత్రిని పదేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వారికి శేషు (7), లోకేష్ (5) ఇద్దరు కుమారులు. తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. కుటుంబమంతా షిరిడీ వెళ్లి బుధవారమే ఇంటికి తిరిగివచ్చారు. మరుసటి రోజే ఈ సంఘటన జరిగింది. -
చెల్లెమ్మా అంటూనే..
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం... ఎన్టీఆర్నగర్కు చెందిన బాలిక (12) సమీపంలో ఉండే పెద్దమ్మ ఇంటికి వెళ్తుండేది. అదే కాలనీలో నివసించే ఆంజనేయులు అనే యువకుడు ఆమెను చెల్లి అని పిలుస్తూ మాట్లాడుతుండేవాడు. ఆ చనువుతోనే బుధవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె అరవడంతో ఆంజనేయులు అక్కడి నుంచి పారిపోయాడు. జరిగిన విషయాన్ని తెలపడంతో శుక్రవారం కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆంజనేయులుపై నిర్భయ కేసుతో పాటు బాలలపై లైంగిక నేరాల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీని ఢీకొట్టిన బొలెరో: ఒకరు మృతి
ముందు వెళ్తున్న లారీని ప్రమాదవశాత్తు బొలెరో ఢీకొట్టిన ఘటనలో ఒకరు చనిపోయారు. అనంతపురం జిల్లా కనగానిపల్లె మండలం దాదలూరుకు చెందిన ఆంజనేయులు(50) తోటి రైతులతో కలిసి బెంగళూరు వెళ్లాడు. అంతా కలసి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం పెనుగొండ మండలం గుట్టూరు వద్ద శుక్రవారం వేకువజామున ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఆంజనేయులు అక్కడికక్కడే చనిపోయాడు. మిగతా వారు సురక్షితంగా బయటపడ్డారు. -
జీవో నెం.4ను రద్దు చేయాలి
వ్యాపారస్తులను ఇబ్బందులకు గురిచేసే జీవో నం. 4/2016ను రద్దు చేయాలని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు డిమాండ్ చేశారు. అదివారం గుంటూరులోని ఫ్యాన్సీ కల్యాణ మండపంలో రాష్ట్రస్థాయి వ్యాపార వర్గాల కీలక సమావేశం నిర్వహించారు. ఆతుకూరి మాట్లాడుతూ జీవో నం.4 వల్ల వ్యాపారస్తులు ఏ2 రిటన్స్ దాఖలు చేయడం ఒక రోజు ఆలస్యమైనా రోజుకు రూ.350 పెనాల్టీ విధించే అవకాశం ఉందని, దీంతో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అటువంటి జీవోని వెంటనే రద్దుచేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, బంద్ చేయడానికి కూడా వెనుకడబోమని ఆయన స్పష్టంచేశారు. సమావేశంలో వాణిజ్యపన్నుల శాఖ విశ్రాంత జాయింట్ కమిషనర్ పీవీ సుబ్బారావు జీవో నం.4 గురించి వివరిస్తూ అందులోని లోపాలు, ఇబ్బందులపై వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. పన్నుల విధానం మన జీవితంలో ఒక భాగస్వామిగా అయిందని, మనం ఎంత పన్ను చెల్లించాలి, ఎంత కడుతున్నామనే దానిపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. -
సీపీఎం నేతలపై దుండగుల దాడి
గుంటూరు: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. సుందరయ్యనగర్కు చెందిన సీపీఎం నేతలు ఆంజనేయులు, సతీష్పై మంగళవారం దుండగులు గొడ్డళ్లతో దాడి చేశారు. గమనించిన స్థానికులు ఇద్దరినీ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచ్చారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. స్థల వివాదమే హత్యకు కారణమై ఉంటుందని తెలుస్తుంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ జిల్లా సీపీఎం నాయకులు ఆస్పత్రి ఎదుట ధర్నాకి దిగారు. -
ట్రాక్టర్ బోల్తా : యజమాని మృతి
పొలంలో దుక్కి దున్నుతున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు తిరగబడిన ఘటనలో యజమాని మృతి చెందాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా రాయచోటి రూరల్ మండలం ఎండపల్లె పంచాయతీ బోయపల్లెలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సానికులు తెలిపిన వివరాలివీ.. బోయపల్లె సమీపంలోని పొలంలో చిన్నరామిరెడ్డిగారి పల్లె గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ట్రాక్టర్ తో దుక్కి దున్నుతున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది. డ్రైవర్ ఈశ్వరయ్య ట్రాక్టర్ ను బయటకు తీసేందుకు యత్నించినా ఫలితం కనిపించలేదు. విషయం తెలుసుకున్న ట్రాక్టర్ యజమాని బి.ఆంజనేయులు(29) అక్కడికి చేరుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చుని, ట్రాక్టర్ బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ ఒక్కసారిగా ముందు వైపు పైకి లేచింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న ఆంజినేయులు వెనక్కి బురదలో పడిపోయాడు. తలకు తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నారు. -
ఉత్కంఠభరితంగా సాగిన కోడిపోరు
గుంటూరు జిల్లా కారంపూడిలో జరుగుతున్న పల్నాటి వీరారాధనోత్సవాలలో నాలుగో రోజు ఆదివారం కోడి పోరు ఉత్సవం ఉత్కంఠభరితంగా సాగింది. అలనాటి కోడి పందేలను తలపించేలా కోడి పోరును వీరులగుడి ఆవరణలో నిర్వహించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కోడిపోరులో పాల్గొన్నారు. బ్రహ్మనాయుడు కోడిపుంజును ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, నాయకురాలు నాగమ్మ కోడిపుంజును ఎమ్మెల్యే ఆంజనేయులు బరిలోకి వదిలారు. సంప్రదాయం కోసం మూడు విడతలుగా నిర్వహించిన పోరులో రెండుసార్లు బ్రహ్మనాయుడు పుంజు గెలిచింది. రాజ్యాన్ని వీడి అరణ్యవాసం చేయాలనే షరతుతో జరిగిన మూడో పందెంలో నాయకురాలు పుంజు గెలిచినట్లుగా పోరును ముగించారు. -
బాలుడిగా వెళ్లి..యువకుడిగా
12 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులను కలిసిన యువకుడు బహదూర్పురా: తండ్రి మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడు 12 ఏళ్ల తరువాత యువకుడిగా తల్లిదండ్రుల చెంతకు చేరిన సంఘటన గురువారం చార్మినార్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చార్మినార్ ఇన్స్పెక్టర్ యాదగిరి వివరాల ప్రకారం... అంబర్పేట్ ప్రాంతానికి చెందిన శివ, అంజమ్మ దంపతుల కుమారుడు అంజనేయులు (21)ను 12 ఏళ్ల క్రితం మాట వినడం లేదని తండ్రి శివ తీవ్రంగా మందలించాడు. దీంతో అతను ఇంట్లో నుంచి పారిపోయి కాచిగూడలో రన్నింగ్ రైలు ఎక్కి చైన్నై చేరుకున్నాడు. ఆ తరువాత కుండుటూర్లో నేరస్తులతో సహవాసం చేశాడు. ఆటో డ్రైవర్గా, హోటల్ వెయిటర్గా పని చేస్తూ స్నేహితులతో కలిసి నేరాలకు పాల్పడేవాడు. అంతేగాకుండా వారితో కలిసి హత్యలో పాల్గొనడంతో అంజనేయులుకు నాలుగేళ్లు శిక్ష విధించినకోర్టు అతను మైనర్ కావడంతో జూవైనల్ హోమ్కు తరలించారు. శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న అంజనేయులుకు స్కోప్ ఇండియా ఆర్గనైజేషన్ డెరైక్టర్ సత్తయ్యబాబు తమ సంస్థలో మూడు నెలల పాటు నేరవృత్తిని వదిలేసేందుకు శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా తాము హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతానికి చెందిన వారిగా చెప్పడంతో ఈ నెల 8వ తేదీన సత్తయ్య బాబు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు అంజనేయులను తల్లిదండ్రులు శివ, అంజమ్మలకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. 12 ఏళ్ల తరువాత వచ్చిన కొడుకును చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
అవును..మా అబ్బాయే
ఏడేళ్ల క్రితం తప్పిపోయిన కుమారుడిని గుర్తించిన తల్లిదండ్రులు బహదూర్పురా: ఏడేళ్ల క్రితం కన్పించకుండా పోయిన ఆంజనేయులు తమ కుమారుడేనంటూ అంబర్పేటకు చెందిన శివ, అంజమ్మ దంపతులు మంగళవారం చార్మినార్ పోలీసులను సంప్రదించారు. పోలీసుల కథనం ప్రకారం... 2003లో చార్మినార్ వద్ద తప్పిపోయిన ఆంజనేయులు అనే బాలుడు రెలైక్కి చెన్నై చేరుకొన్నాడు. అక్కడ అనుకోని విధంగా ఓ కేసులో ఇరుక్కొని జువైనల్ హోంలో మూడేళ్లు శిక్ష అనుభవించాడు. ఆత ర్వాత బయటకు వచ్చాక..ఎటు వెళ్లాలో తెలియక తనకు ఎవరూ లేరని చెప్పడంతో అధికారులు జువైనల్ హోంలోనే మరో నాలుగేళ్లు ఉంచారు. శిక్ష పూర్తయినా నాలుగేళ్లవరకు తల్లిదండ్రులు ఎవరూ రాకపోవడంతో స్పందించిన జడ్జి స్థానికంగా ఉన్న స్కోప్ ఇండియా స్వచ్ఛంద సంస్థ డిప్యూటీ డెరైక్టర్ సత్తిబాబుకు ఆ బాలుడి కుటుంబ వివరాలు తెలుసుకొని అప్పగించాలని పురమాయించారు. ఈ నేపథ్యంలో సదరు సంస్థ డిప్యూటీ డెరైక్టర్ స్పందించారు. బాలుడు ఆంజనేయులు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతానికి చేరుకొని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆతర్వాత ఆయన చుట్టుపక్క ప్రాంతాల్లో ఆరా తీసినా ఏమీ తెలియకపోవడంతో ఆంజనేయులుని తీసుకొని చెన్నైకి వెళ్లి పోయాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల కోసం తపిస్తున్న బాలుడి ఫొటో పత్రికల్లో ప్రచురితం కావడంతో దాన్ని చూసిన శివ, అంజమ్మ దంపతులు మంగళవారం చార్మినార్ పోలీసులను సంప్రదించారు. 2003లో తమ కుమారుడు ఆంజనేయులు తప్పిపోయినట్లు అప్పట్లో చార్మినార్ పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు (ఎఫ్ఐఆర్) కాపీని చూపడంతో పాటు బాలుడి చేతిపై ‘శ్రీ’ పచ్చబొట్టు గుర్తు ఉన్నట్లు చెప్పారు. ఆనవాళ్లన్నీ సరిగ్గా సరిపోవడంతో నిర్థారించుకొన్న పోలీసులు విషయాన్ని చెన్నైలోని స్కోప్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించారు. దీంతో ఆ సంస్థ డిప్యూటీ డెరైక్టర్ సత్తిబాబు ఈ నెల 11న ఆంజేయులును తీసుకొని హైదరాబాద్ వస్తున్నటు తెలిపారని చార్మినార్ ఇన్స్పెక్టర్ యాదగిరి వెల్లడించారు. -
భార్యను హతమార్చిన హోంగార్డు
కుటుంబ కలహాలే కారణం నాచారం (హైదరాబాద్): కుటుంబ కలహాలతో ఓ హోంగార్డు భార్యను హతమార్చాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలు.. హైదరాబాద్ నగరంలోని కార్ఖానా పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న ఆంజనేయులు నాచారం ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆంజనేయులు అతడి భార్య మధ్య శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఆవేశంలో ఆంజనేయులు భార్యను హత్య చేశాడు. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కుట్ర రాజకీయాలు ఎంతో కాలం సాగవు
డీసీసీ బ్యాంకు చైర్మన్ ఆంజనేయులు వేముల/సాక్షి, కడప : టీడీపీ చేస్తున్న కుట్ర రాజకీయాలను తిప్పి కొడతామని, కుటిల రాజకీయాలు ఎంతో కాలం సాగవనే విషయం తెలిసి వచ్చేలా చేస్తామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ నారుబోయిన ఆంజనేయులు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు వేములలో విలేకరులతో మాట్లాడారు. దువ్వూరు సొసైటీలో టీడీపీ నీచ రాజకీయాలకు తెర తీసిందని దుయ్యబట్టారు. పదవీ వ్యామోహంతోనే ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డిని పదవి నుంచి తప్పించేందుకు అక్కడి డెరైక్టర్లను టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేశారని విమర్శించారు. జిల్లాలోని రైతులందరికీ దీర్ఘకాలిక రుణాలు, వ్యవసాయ రుణాలు మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. సహకార సొసైటీలను అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తామని చెప్పారు. అందరినీ కలుపుకు వెళుతూ కేంద్ర సహకార బ్యాంకు అభివృద్ధికి పాటుపడతానన్నారు. వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటా.. తన ఎదుగుదలకు కారణమైన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని నారుబోయిన అంజనేయులు కృతజ్ఞతలుతెలిపారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు, వేముల మండల కన్వీనర్ నాగెళ్ల సత్య ప్రభావతమ్మ, పార్టీ నేత వైఎస్ భాస్కర్రెడ్డి, ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు ఈసీ గంగిరెడ్డి, నాగెల సాంబశివారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న నారుబోయిన ఆంజనేయులును.. డీసీసీ బ్యాంకు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాలని శుక్రవారం డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు వేములకు చేరుకొని ఆర్డర్ కాపీ అందజేశారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ వాహనంలో కడపకు చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. కాగా డీసీసీ బ్యాంకు చైర్మన్గా ఉన్న ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డి దువ్వూరు సొసైటీలో ఏడుగురు డెరైక్టర్లు గురువారం రాజీనామ చేయడంతో పదవిని కోల్పోయారు. దీంతో వేల్పుల సొసైటీ పరిధిలోని వేముల డెరైక్టర్గా గెలుపొంది డీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్న ఆంజనేయులుకు ఈ పదవి దక్కింది. వేముల వాసి డీసీసీ బ్యాంకు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డెరైక్టర్ నుంచి చైర్మన్ వరకు ఎదిగిన వైనం అదృష్టం అంటే ఇదేనేమో. కలలో కూడా ఊహించకుండానే పదవి ఇంటికి వచ్చింది. వ్యవసాయం చేసుకొనే ఆంజనేయులకు అనుకోని రీతిలో అదృష్టం వరించింది. 2013లో వేల్పుల సహకార సొసైటీ పరిధిలో వేముల నుంచి పోటీ చేసి డెరైక్టర్గా గెలుపొందారు. అప్పట్లో పులివెందుల ప్రాంతానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఆంజనేయులకు డీసీసీబీ వైస్ చైర్మన్ పదవిని అప్పజెప్పారు.వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆంజనేయులు తనకున్న పొలంలో పంటలు పండించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆంజనేయులుకు ఇద్దరు సంతానం. ఒకరు వేముల, మరొకరు వేంపల్లెలోని ప్రైవేటు పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఊహించని పరిణామాల మధ్య ఆంజనేయులకు పదవి రావడంతో కుటుంబ సభ్యులు ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. -
కలవరిమాయె
అప్పులెలా తీరుతాయి సాగర్ కాలువ ఆయకట్టు భూములు మావి. రబీ వరికి సాగర్ నీరు విడుదల చేయమంటున్నారు. ఆరుతడి పంటలే వేసుకోవాలంటున్నారు. ఆరుతడి పంటలు వేస్తే మా అప్పులు తీరవు. ఖరీఫ్లో సాగుచేసిన మిర్చి, పత్తి పంటలు ఎండిపోయాయి. ఈ ఏడాది తీవ్ర నష్టాలు వస్తున్నాయి. అంతోఇంతో నష్టాలు పూడాలంటే వరి వేసుకోక తప్పదు. సాగర్ నిండా నీళ్లున్నా ఇవ్వకపోతే మేము ఏమి చేయాలి? - జింకల ఆంజనేయులు, నాగవరప్పాడు సాక్షి, ఖమ్మం: జిల్లాలోని నాగార్జుసాగర్ ఆయకట్టుతో పాటు ఆయకట్టేతర ప్రాంతాల్లో రైతులకు రబీ రంది పట్టుకుంది. సాగర్ ఆయకట్టు పరిధిలోనూ రబీలో ఆరుతడి పంటలే వేసుకోవాలని ఇప్పటికే ఎన్నెస్పీ అధికారులు ప్రకటించడంతో వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. రబీలో మరింతగా విద్యుత్ కోతలు పెరగనుండడంతో బోరుబావులు కింద కూడా వరి సాగు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నెస్పీ ఆయకట్టేతర ప్రాంతాల్లోని రైతుల్లోనూ ఆందోళన నెలకొంది. జిల్లాలో ఈ ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతలతో రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చితో పాటు పలు పంటలను సాగు చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల దిగుబడి బాగా తగ్గింది. సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరందక పంటలు ఎండిపోయాయి. రబీలో అన్ని పంటల సాగు చేసుకోవచ్చని రైతులు భావించారు. కానీ ఈ సీజన్లో వర్షాభావం, విద్యుత్ కోతల నేపథ్యంలో నీరు ఎక్కువగా అసరమయ్యే వరి సాగు చేయవద్దని, ఆరుతడి పంటలనే వేసుకోవాలని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అయినా జిల్లాలో మాత్రం ఖరీఫ్ వరి కోతలు పూర్తి అయిన ప్రాంతాల్లో ఇప్పటికే వరి నాట్లు ప్రారంభమయ్యాయి. ఈ రబీలో అన్ని పంటల సాధారణ విస్తీర్ణం 87,018 హెక్టార్లు కాగా 20,315 హెక్టార్లలో పంటలను రైతులు ఇప్పటికే సాగు చేశారు. వరి సాధారణ విస్తీర్ణం 36,481 హెక్టార్లకు 684 హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయి. సాగర్ నిండా నీళ్లు ఉన్నాయని.. చివరి వరకు నీళ్లు వస్తాయనే ధీమాతో నేలకొండపల్లి, సత్తుపల్లి, మధిర, బోనకల్, ముదిగొండ ప్రాంతాల్లో రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. గత రబీలో కూడా ఆరుతడి పంటలే వేసుకోవాలని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత రైతుల ఆందోళనలతో పంట చేతికి వచ్చే వరకు సాగర్ నీళ్లు విడుదల చేశారు. అయితే మధిర, బోనకల్, ఎర్రుపాలెం మండలాల్లో గతంలో చివరి ఆయకట్టు భూములకు నీరందక వరి ఎండిపోయింది. ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రతిసారీ అధికారులు ప్రకటనలకే పరిమితమవుతున్నారు తప్ప.. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో విసృ్తతంగా ప్రచారం చేయకపోవడంతో చివరకు రైతులు వరిసాగు చేస్తున్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో అప్పుల పాలవుతున్నారు. ఈ రబీలో కూడా ఓవైపు వరి సాగుకు సిద్ధమవుతున్న రైతులు మరోవైపు చివరి వరకు నీళ్లు రాకపోతే పంట చేతికి అందదని అప్పుల ఊబి లో కూరుకపోతామనే ఆందోళనతో ఉన్నారు. మెట్ట రైతుల ఆందోళన చెరువులు, బోరుబావుల కింద వరి సాగు చేయాలనుకుంటున్న రైతులు ఆందోళనలో ఉన్నారు. కొద్ది మొత్తంలో సాగు చేద్దామనుకున్న ఖరీఫ్లోనే విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడిన రైతులు రబీలో భారీగా కోతలు తప్పవని అంచనా వేస్తున్నారు. ఆరుతడి పంటలు వేసినా అడపాదడపా తడులు ఇవ్వాలి కాబట్టి కరెంట్ ఎన్ని గంటలు వస్తుందో.. పంట ఎండిపోతే పరిస్థితి ఎంటనే సందిగ్ధంలో ఉన్నారు. ఈశాన్య రైతుల పవనాల ప్రభావం జిల్లాలో అంతగా లేకపోవడంతో ఈ రబీలో ఆరుతడి పంటల సాగు పడిపోయింది. గత ఏడాది రబీలో జొన్న 1,239 హెక్టార్లలో సాగు చేశారు. ఈ సారి కేవలం 164 హెక్టార్లలోనే వేశారు. గతంలో మినుములు 4,083 హెక్టార్లలో సాగు చేస్తే ప్రస్తుతం 1,587 హెక్టారలోనే సాగు చేస్తున్నారు. రబీలో వర్షాలు లేకపోవడంతో ముందస్తుగానే రైతులు ఆరుతడి పంటల సాగునూ తగ్గించారు. గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం రబీలో 87,018 హెక్టార్లు సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనావేశారు. సీజన్ ప్రారంభమై నెలరోజులు గడిచినా ఇప్పటి వరకు కేవలం 20,315 హెక్టార్లలోనే పంటలు వేశారు. ఈ సీజన్లో మొక్కజొన్న అత్యధికంగా 4,539 హెక్టార్లు, అపరాలు 5,290 హెక్టార్లలో సాగు చేశారు. సాగర్ ఆయకట్టు పరిధిలో వరి నూర్పిడి మరో 15 రోజుల్లో పూర్తి కానుంది. వరి సాగుచేద్దామనుకుంటున్న రైతులు 303 హెక్టార్లలో వరి నార్లు పోశారు. ఆరుతడి పంటలు వేసుకోవాలన్న అధికారుల సూచనలను పెడచెవిన పెట్టారు. నీళ్లు ఎలాగైనా వస్తాయన్న నమ్మకంతో వరి సాగుకే మొగ్గుచూపుతున్నారు. తీవ్ర వర్షాభావం, సాగర్ నీళ్లు రాకపోతే పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని ఓవైపు ఆందోళన చెందుతూనే...మరోవైపు వరి సాగు చేయకపోతే గిట్టుబాటు కాదని ఆ పంటవైపు మొగ్గుచూపుతున్నారు. ఖరీఫ్ వెతలతో రబీలో కలిసి వస్తుందనుకున్న రైతులను వర్షాభావం, విద్యుత్ కోతలు, సాగర్ ఆయకట్టులో ఆరుతడి పంటల ప్రకటనలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. -
బతుకు బజారు
పింఛన్ తీసేశారు.. పోషణ భారమైంది ! ఓ అమ్మ ఆవేదన కలెక్టరేట్ చుట్టూ {పదక్షిణల కరుణించని అధికారులు మునిసిపల్ ఆఫీసులోనూ చుక్కెదుర కన్నీటి పర్యంతమైన బజారమ్మ ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు ఆమెకు నా అనే వారు ఎవరూ లేరు. ఉన్నదల్లా ఒక్కగానొక్క కుమారుడు, భర్త. కుమారుడికి మతిస్థిమితం లేదు. భర్త పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. వారి బాగోగులు చూసుకోవడమే ఆమె పని. వృద్ధాప్యంలో శక్తినంతా కూడగట్టుకొని వారిని పోషిస్తోంది. అయితే ఆమెకు ఆసరాగా ఉన్న పింఛన్ను ప్రభుత్వం తీసేసింది. నిబంధనల పేరుతో ఆమెకు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. తనకు రెండు కళ్లుగా ఉన్న భర్త, కుమారుని పోషణ కోసం ఆమె ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. ‘పింఛన్ తీసేశారు.. ఆదుకోండి సారూ’ అంటూ ప్రాధేయపడినా కరుణించే అధికారులు కరువయ్యారు. కర్నూలు (జిల్లా పరిషత్) : ఆనందం ఐదింతలు అంటూ ఒక వైపు ప్రచారం చేస్తూనే మరో వైపు పేదలకున్న ఆసరాను ప్రభుత్వం తొలగించి వేస్తోంది. నెలనెలా వస్తున్న పింఛన్ ఆగిపోవడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్లూరు ఎస్టేట్లోని శివప్పనగర్ కాలనీలో నివాసం ఉంటున్న బజారమ్మ ఈ కోవకే చెందుతుంది. ఈమె ఒక్కగానొక్క కుమారుడు ఆంజనేయులుకు పుట్టుకతోనే బుద్ధిమాంద్యం. ఇప్పటికి 26 ఏళ్లు వచ్చినా అతనిలో మాత్రం మార్పులేదు. మాటలు రావు.. వినిపించవు, ఆకలని కూడా చెప్పలేడు. ఆమె భర్త మారెప్పదీ(62) అదే పరిస్థితి. పక్షవాతం వచ్చి 12 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. కుమారునితో సమానంగా భర్తకూ అన్ని సపర్యలూ చేయాల్సి వస్తోంది. వారి ఆకలిని తీర్చేందుకు ఇరుగు పొరుగు వారి సహాయాన్ని అర్థిస్తుంది. అది కుదరకపోతే వీధిలో భిక్షమెత్తుకుని వచ్చి భర్త, బిడ్డ కడుపు నింపుతోంది. అయితే ఏ మాత్రం కనికరం లేకుండా ఆమెకు వృద్ధాప్య పింఛనూ, కుమారునికి వికలాంగుల పింఛనూ ప్రభుత్వం తీసేసింది. పింఛన్ పునరుద్ధరించాలని బిడ్డను ఎత్తుకుని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం లేకపోయింది. మునిసిపల్ కమిషనర్ను కలిస్తే సమస్య పరిష్కారమవుతుందని జేసీ చెప్పగా గురువారం సాయంత్రం ఆమె తన కుమారున్ని ఎత్తుకుని మునిసిపల్కార్యాలయానికి వెళ్లింది. గంటకు పైగా మున్సిపల్ కమిషనర్ కోసం ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. చివరకు అడిషనల్ కమిషనర్ ప్రసాదశర్మను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. అయితే పింఛన్లు తీసేసేది తాము కాదని, డీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లాలంటూ వెనక్కి పంపించారు. దీంతో బజారమ్మ కన్నీటి పర్యంతమైంది. తనగోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక విలపించింది. ‘ ఈ బిడ్డను భుజాన వేసుకుని ఎక్కడికని తిరగను. ఉన్నోళ్లకు చానా మందికి పింఛన్లు ఇస్తారు...మాలాంటోళ్లవి తీసేశారు. వీడికి(కుమారునికి) వేలిముద్రలు పడవు. అందుకే ఆధార్ రాలేదు. జిల్లా అధికారులు కనికరించి తనకు న్యాయం చేయాలి’ అని విలేకరుల ఎదుట వేడుకుంది. ప్రతి రోజూ కుమారునికి, భర్త పోషణకు రూ.200లకు పైగా ఖర్చు అవుతుందని, దాతలు సహాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. -
ఇలా ఓ నాన్న తీర్పు
కొడుకును గొంతు నులిమి చంపిన తండ్రి పాలకుర్తి: కన్నకొడుకును దారుణంగా గొంతు నులిమి హత్య చేయడంతో పాటు, మృతదేహా న్ని చెరువులో పడేసిన సంఘటన వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన మహంకాళి ఆంజనేయులు- కవిత దంపతులకు కుమారులు రాకేష్, కమల్ ఉన్నారు. ఆంజనేయులు హైదరాబాద్లో కూలీ పనులు చేసుకుంటూ తల్లి వద్ద ఉంటుండగా, కవిత గ్రామంలోనే ఉంటూ పిల్లల్ని పోషిస్తోంది. బుధవారం ఆంజనేయులు గ్రామానికి వచ్చి కొడుకులను శివారులోని ఎర్రచెరువు వద్దకు తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చిన కవిత విషయం తెలిసి, గ్రామస్తులతో కలిసి పిల్లల కోసం వెతికింది. అయితే, ఆంజనేయులు పెద్దకుమారుడు రాకేష్ను తీసుకొని తీగారం గుట్టకు వెళ్లాడు. బంధువులకు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి ‘చెరువు గట్టు మీద చిన్న కొడుకు కమల్ గొంతు పిసికి చంపేసి, చెరువులో పడేశాను.’అని చెప్పాడు. అయినా వాళ్లు పట్టించుకోలేదు. కాగా, గురువారం ఆంజనేయులు భార్యకు ఫోన్ చేసి.. ‘చిన్నోన్ని చంపేసి పెద్దోన్ని తీసుకొస్తున్నా’ అని చెప్పాడు. గ్రామస్తులు చిన్న కొడుకు గురించి ప్రశ్నించగా, చెరువులో శవాన్ని చూపించాడు. ఆగ్రహించిన గ్రామస్తులు నిందితుడిని చితకబాది జనగామ పోలీసులకు అప్పగించారు. -
ప్రేమా? ఆకర్షణా?
ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియక యువత తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు? అనే కథాంశంతో బి.యస్. నాయక్ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఎడ్ల మల్లేశం సమర్పణలో బి. ఆంజనేయులు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్లాప్ ఇచ్చారు. అనంతరం దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రేమ వివాహానికీ పెద్దలు కుదిర్చిన వివాహానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సరికొత్త రీతిలో ఆవిష్కరించే చిత్రమిది. జీవితంలో అత్యంత కీలకమైన దశ యవ్వనం. ఆ దశను యువత సంపూర్ణంగా అనుభవిస్తోందా? అనే అంశం గురించి కూడా చర్చిస్తున్నాం’’ అని చెప్పారు. సూర్య, శ్రీకాంత్, అలేఖ్య, అపర్ణ రేణు, దీప్తి, శ్రీరాముల సత్యనారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వంశీ మామిడాల, కెమెరా: ఆర్కే అనంతుల శ్రవణ్. -
ఈ అమ్మ మణిపూస
మే 11మాతృదినోత్సవంసందర్భంగా... మారుమూల గ్రామంలో ఎస్సి కాలనీ పిల్లాడు ఎస్ఎస్సి పాసైతేనే గొప్ప... అలాంటిది ఐఎఎస్ అవ్వడం అంటే మాటలు కాదు కదా! దళితుల జీవితాలను వెలుగులోకి తెచ్చేది విద్య ఒక్కటేనని నమ్మిన ఓ తల్లి బిడ్డనెలాగైనా కలెక్టర్ని చేయాలనుకుంది. ఆమె ఆశయం నెరవేరడం వెనక... కన్న ప్రేమొక్కటే కాదు... కాయకష్టం కూడా ఉంది. మడమ తిప్పిన బిడ్డలో మళ్లీ స్ఫూర్తి నింపి, లక్ష్యంవైపు ముందుకు పంపిన ఆ తల్లి పేరు-మణెమ్మ. అమ్మ కలను నిజం చేసిన కొడుకు - ఆంజనేయులు. ‘బువ్వ పెట్టంగనే బాధ్యత తీరిపోదు కదా! అట్లని ఇచ్చేటందుకు... నా దగ్గర ఆస్తులేమీ లేవు. కలెక్టర్ కావాలని చిన్నగున్నప్పుడు వాడు చెప్పిన మాటలు నిజం చేయాలన్న పట్టుదల మాత్రం నాకు చానా ఉండేది. అదే వాడ్ని కలెక్టర్ని చేసింది’ అంటూ మణెమ్మ చెప్పిన మాటలు అందరి అమ్మల మనసుల్నీ తాకుతాయి. రెండుసార్లు సివిల్స్ పరీక్ష రాసిన ఆంజనేయులు ఫలితం లేకపోవడంతో తల్లి పడుతున్న తిప్పలు చూసి సొంతూరికి తిరిగొచ్చేశాడు. ‘ఏదో ఒక ఉద్యోగం చేసి నీకు సాయపడతానమ్మా... ఇంకా ఎన్నాళ్లు ఈ తిప్పలు పడతావు’ అన్న కొడుకు మాటలకు మణెమ్మ చెప్పిన సమాధానం ఆంజనేయులు ఎప్పటికీ మరిచిపోలేడు. ‘‘నేనున్నగదా బిడ్డా... చదవలేనంటే చెప్పు... నేను చదివించలేనిదాన్ని మాత్రం కాదు. నువ్వు చిన్నప్పుడు ‘కలెక్టరైత నాయనా’ అని మీ నాయనతో అంటే ‘కలెక్టర్ కావాలె బిడ్డా... మన కాలనీ పవర్ చూపియ్యాలే బిడ్డా’ అని మీ నాయనన్న మాటలు నువ్వు మరచినవేమో... నేను మరవలేదు. ఇన్ని రోజులు కష్టపడ్డదాన్ని ఇంకో ఏడాది కష్టం చేయలేనా... నువ్వు ధైర్యంగా మళ్ల ఢిల్లీ రెలైక్కు. కలెక్టర్ అయినంకనే ఊరికి తిరిగిరా!’’ అంటూ ఆంజనేయుల్ని ముందుకు నడిపించింది మణెమ్మ. ఒక్కరోజు కూలీ పని మానితే వంద రూపాయలు పోతాయని... ఎండనకా, వాననకా కూలిపని చేసి, కొడుకును చదివించింది మణెమ్మ. భర్త కోరిక... పంచాయతీ కార్యాలయంలో నల్లాలు విప్పే పని చేసే పోచయ్యకు కొడుకును కలెక్టర్గా చూడాలనే ఆశ ఉండేది కానీ, తన ఆర్థిక పరిస్థితి ఆ కోరిక తీర్చదనే భావనలో ఉండేవాడు. ఆంజనేయులు పదోతరగతి స్కూల్ ఫస్ట్ వచ్చాడన్న వార్త విన్నాక మణెమ్మ, పోచయ్యల ఆనందానికి అవధుల్లేవు. అందరూ ఆంజనేయుల్ని పాలిటెక్నిక్ చదివిస్తే మంచిదని చెప్పగానే అప్పుచేసి కాలేజీలో చేర్పించారు. తండ్రి మరణంతో ఆంజనేయులు తన కలలకు సెలవు చెప్పాడు. చదువైపోగానే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని తల్లికి సాయపడదామనుకున్నాడు. అప్పటికి హైదరాబాద్లో వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. అమ్మతోపాటు అక్కాబావ కూడా ఆంజనేయులుకి ఆర్థికసాయం చేశారు. తల్లి మాట... ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఆంజనేయులకి హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ కొడుకు, ఇక్కడ ఊళ్లో మణెమ్మ పనులు చేసుకుంటూ అప్పులు తీర్చుకునే పనిలో పడ్డారు. ఇంతలో మణెమ్మకు బిడ్డ కలెక్టర్ కల గుర్తుకొచ్చింది. ‘నువ్వు కలెక్టర్ కావాలన్న నాయన కోరిక తీరదంటవా ఆంజనేయులూ’ అంది.‘‘చాలమ్మా...ఇప్పటిదాక పడ్డ తిప్పలు చాలవా... కలెక్టర్ అంటే మాటలు కాదు. ఢిల్లీకి పోయి చదువుకోవాలే. చాలా ఖర్చు అవుతుంది’’ అన్నాడు. ‘‘ఇప్పటిదాకా ఏమైనా ఉచితంగా చదువుకున్నవా! పైసల్లేకుండా చదువెట్లొస్తది. నేనున్న కదా’’ అని తల్లి చెప్పిన మాటలు ఆంజనేయులు గుండెలో కొండంత ధైర్యాన్ని నింపాయి. అనుకున్నదే తడవుగా ఢిల్లీకి బయలుదేరాడు. అక్కడే ఉండి సివిల్స్ కోసం చదువుకున్నాడు. 60 ఏళ్ల మణెమ్మ వ్యవసాయ పనులు లేనపుడు ఉపాధి హామీ పనులకు కూడా వెళ్లి డబ్బులు పోగు చేసింది. మూడోసారి... మాటిమాటికీ గుర్తొచ్చే తల్లి కష్టం గురించి ఆంజనేయులు తలచుకోని రోజులేదు. ‘‘2011లో శిక్షణ పూర్తయ్యాక జార్ఘాండ్లో గుర్మాలో సబ్కలెక్టర్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం గుర్మాలోనే ఉన్నాను. అమ్మ ఊళ్లోనే ఉంటోంది. నేను ఐఎఎస్ శిక్షణలో ఉన్నప్పుడు కూడా అమ్మ ఊళ్లో వ్యవసాయం పనికి వెళ్లింది. అమ్మ ధైర్యం, పట్టుదల ముందు నేనెప్పటికీ పసివాణ్ణే’’ అని చెబుతున్నప్పుడు ఆంజనేయులు మాటల్లో ‘అమ్మ’ అన్న పదం ఎంతో కమ్మగా వినిపించింది. ‘‘చూస్తే... భర్త లేడు, ఉన్న బిడ్డను యాడ్నో పెట్టి చదివిస్తుంది. మణెమ్మకు ఆకాశమంత ఆశగాకపోతే...లక్షలు ఖర్చుపెట్టెటోళ్లకే దిక్కులేదు. అట్లాంటిది..ఈమొక్కామె కష్టంతోనే బిడ్డ కలెక్టర్ అయిపోతడా’’ అంటూ సాగిన చుట్టుపక్కలవారి మాటల్ని లెక్కచేయకుండా పట్టుదలతో బిడ్డను కలెక్టర్ని చేసిన మణెమ్మ రెండేళ్లక్రితమే ఆంజనేయులుకి పెళ్లి చేసి ఆ బాధ్యత కూడా తీర్చుకుంది. బిడ్డ జార్ఘాండ్లో సబ్కలెక్టర్గా ఉద్యోగం చేస్తుంటే మణెమ్మ ఊళ్లో కొడుకు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తోంది. మణెమ్మ నిజంగా గొప్ప తల్లి. ఆంజనేయులు మాటల్లో చెప్పాలంటే ‘మా అమ్మ మణిపూస’. - భువనేశ్వరి ఫొటోలు: కొలగాని రాజేందర్ ************************* ఇంజనీరింగ్లో సీటు వచ్చిందని తెలియగానే పోచయ్య జేబు తడుముకున్నాడు. ‘మన వల్ల కాదేమోనే...’ అన్న భర్త మాటలకు అడ్డు చెబుతూ...‘‘ఇప్పటి దాకా పడ్డ కష్టమొకెత్తు, ఇప్పుడు పడాల్సిన కష్టమొకెత్తు. ఒక్క మూడేళ్లు కళ్లు మూసుకుంటే బిడ్డ ఇంజనీర్ అయితడు. మంచి ఉద్యోగమొస్తది. ఇద్దరం కష్టపడదం. నువ్వు ఇల్లు చూడు... నేను వాడి చదువు చూసుకుంట’’ అంటూ భర్తను ఒప్పించింది. ఆలుమగలూ ఒక్కమాటపై బిడ్డకోసం పడుతున్న కష్టానికి మరో పెద్ద కష్టం అడ్డుపడింది. కాలేయ వ్యాధితో పోచయ్య మంచం పట్టాడు. వ్యాధి ముదిరిపోవడంతో ఎంత వైద్యం చేయించినా లాభం లేకపోయింది. తండ్రి మరణంతో ఆంజనేయులు తన కలలకు సెలవు చెప్పాడు. ************************* ‘రెండుసార్లు సివిల్స్లో ర్యాంకు రాకపోయేసరికి నాకు విసుగొచ్చింది. అమ్మ పడుతున్న కష్టం గుర్తొచ్చినపుడల్లా ఊరికెళిపోవాలనిపించి వచ్చేశాను. ‘‘నువ్వు వస్తే కలెక్టర్గానే ఇంటికి రా... ఎంత కష్టమైనా నేను పడతాను. ఆ తర్వాత నువ్వు ఏం చెబితే అది చేస్తాను’’ అన్న అమ్మ మాటలు నాలో పట్టుదలను నింపాయి. ఆ పట్టుదలే నన్ను మూడో ప్రయత్నంలో విజేతను చేసింది. -
విషాదాన్ని నింపిన హోలీ
పటాన్చెరు టౌన్, న్యూస్లైన్ : హోలీ పండుగ ముగ్గురి కుటుం బాల్లో విషాదం నింపింది. దీంతో ఆయా కుటుంబాన్ని విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. రంగులు కనుక్కోవడానికి వెళ్లిన ఓ వ్యక్తి పుల్కల్ మండలం శివ్వంపేట బ్రిడ్జి కింద నీటిలో శవమై తేలాడు. ఎస్ఐ లోకేష్ కథనం మేరకు.. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ఖాన్పేట గ్రామానికి ఆంజనేయులు, స్వరూ ప దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రమేష్ (24) రెండో వాడు. తండ్రి నిర్వహిస్తున్న హోటల్లో పని చేస్తూ చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే హోలీని పురస్కరించుకుని ఆదివారం గ్రామంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం స్నేహితులు లింగం, హరిశంకర్, విక్రమ్లతో కలిసి రమేష్ స్నానం చేసేందుకు పుల్కల్ మండలం శివ్వంపేట బ్రిడ్జి వద్దకు వచ్చాడు. ముగ్గు రు మిత్రులకు ఈత రాక పోవటంతో వారు ఒడ్డున కూర్చొని స్నానాలు చేశా రు. రమేష్ మాత్రం బ్రిడ్జి పై భాగంలో లోతుగా ఉన్న నీటిలోకి వెళ్లి నీట మునిగాడు. దీంతో విషయాన్ని రమేష్ కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు వచ్చి చూడగా అప్పటికే చీకటి పడడంతో వెనుతిరిగి సోమవారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే రమేష్ మృతదేహం నీట తేలింది. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. మరో సంఘటనలో సిద్దిపేట మం డలం చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన మల్యాల ప్రవీణ్ (15) బావిలో మునిగి దుర్మరణం చెందారు. గ్రామస్తుల కథ నం మేరకు.. గ్రామానికి చెందిన సత్త య్య, దేవవ్వలకు ముగ్గురు కుమారులు. రెండవ కుమారుడు మల్యాల ప్రవీణ్ (15) తొమ్మిదవ తరగతి చదువుతున్నా డు. హోలీ పండుగలో భాగంగా ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి రంగులు చల్లుకున్నారు. దీంతో ఒంటికి అంటిన రంగులు కడుక్కోవడానికి గ్రా మ శివారులో ఉన్న ఓ బావిలోకి ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో బావిలో ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ప్రవీణ్ మునిగి పోయాడు. దీందో విషయాన్ని స్నేహితులు కుటుంబసభ్యులకు, గ్రామస్తులకు చేరవేశారు. వారు బావి వద్దకు చేరుకుని మృతదేహం కోసం రెండు గంటల పాటు వెతికి బయటకు తీశారు. ప్రవీణ్ మృతదేహాన్ని చూ సి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలపించారు. బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ కిషన్రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీహరిగౌడ్లు కోరారు. జేసీబీ గుంతలో పడి మరొకరు పటాన్చెరు టౌన్ : కాలకృత్యాలకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు జేసీబీ గుం టలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నందిగామలో సోమవారం చోటు చేసుకుంది. బీడీఎల్ భానూర్ పోలీసుల కథనం మేర కు.. రాజస్థాన్ రాష్ట్రం బైరాన్ మండలం అసాక్ గ్రామానికి చెందిన జితేందర్సింగ్ (25) మండల పరిధిలోని నందిగామలో గల ఓ ప్రైవేటు పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే పరిశ్రమలో ఉన్న ఓ గదిలో బంధువులతో కలిసి ఉం టున్నాడు. అయితే సోమవారం హోలీ పండుగ కావడంతో పరిశ్రమలో ఉండే తోటి బంధువులతో కలిసి హోలీ ఆడా డు. అనంతరం చిన్నాన్న మహేందర్సింగ్, మామయ్య జితేందర్తో కలసి స్నా నానికి వెళ్లాడు. అయితే ముందుగా జితేందర్ సింగ్ కాలకృత్యాలకు వెళ్లాడు. అనం తరం జేసీబీ గుంతలో దిగి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందా డు. అయితే జితేందర్ ఎంత సేపటికీ రాకపోవడంతో బంధువులు అక్కడికి వె ళ్లి చూసి విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏఎస్ఐ ప్రసాద్బాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
చెదిరిన ‘పెళ్లి కళ’
గజ్వేల్, న్యూస్లైన్: మరికొద్ది సేపట్లో బాజాభజంత్రీలు మోగాల్సిన ఆ పెళ్లి మండపంలో.. ఒక్కసారిగా విచారం అలుముకుంది. తాళి కట్టాల్సిన వరుడు మొహం చాటేశాడు. వధువు బంధువులు వరుడి తల్లిని నిలదీయగా ఎక్కడికి వెళ్లాడో తెలియదని చేతులెత్తేసింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. సాయంత్రం వరకు వరుడి కోసం ఎదురుచూసినా ఎంతకీ రాకపోవడంతో చివరకు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో వధువు బంధువులు విచారంలో మునిగిపోయారు. ఈ సంఘటన గజ్వేల్లో ఆదివారం చోటుచేసుకుంది. గజ్వేల్ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి సికింద్రాబాద్ ఆర్కే పురానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరుణ కుమారుడు విజయ్రెడ్డితో పెళ్లి కుదిరింది. ఇతను హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేఎండబ్ల్యూ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. వివాహాన్ని పురస్కరించుకుని వధువు తల్లిదండ్రులు అతనికి భారీగానే కట్నకానుకలను సమర్పించుకున్నారు. ఆదివారం స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాలులో మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆనవాయితీ ప్రకారం ఆదివారం తెల్లవారుజామున వరుడిని తీసుకురావడానికి వధువు తరపు బంధువులు ఆర్కే పురానికి వెళ్లారు. కానీ అక్కడ ఒక్కసారిగా సీను మారింది. ఏం జరిగిందో తెలియదు కానీ వరుడు అప్పటికే ఆ ఇంట్లోంచి పరారయ్యాడు. దీంతో వారు ఏం చేయాలో తెలియక వరుడి తల్లి అరుణ, సోదరి స్వప్నతో మరో అమ్మాయి, కొందరు బంధువులను తీసుకొని ఇక్కడికి వచ్చారు. వారంతా పెళ్లి సమయానికి విజయ్రెడ్డి వస్తాడని నమ్మబలికారు. తాళి కట్టే సమయానికైనా విజయ్రెడ్డి రావచ్చనే ఆశతో ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. మండపాన్ని తీర్చిదిద్దడమే కాకుండా భోజనాలకు కూడా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వరకు కూడా వరుడి జాడ లేదు. ఫోన్ చేసినా కలవలేదు. అతని తల్లిని, బంధువులను నిలదీస్తే తమకేం తెలియదని చేతులెత్తేశారు. వారిపై వధువు తరపు బంధువులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా వరుడి తరపు బంధువులపై దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన కల్యాణ మండపం వద్దకు చేరుకుని వారిని శాంతింపజేశారు. మొత్తానికి పెళ్లి ఆగిపోవడంతో వధువు తల్లిదండ్రులు, బంధువులు విచారంలో మునిగిపోయారు. గజ్వేల్ ఎస్ఐ ఆంజనేయులును వివరణ కోరగా వధువు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
జాతర విధులు మరువలేనివి
తల్లుల సేవలో తరించడం అదృష్టం వనదేవతల ఆగమనం అనిర్వచనీయం ‘న్యూస్లైన్’తో జెడ్పీ సీఈఓ ఆంజనేయులు తెలంగాణ కుంభమేళాగా వర్ధిల్లుతున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో విధులు నిర్వర్తించడం నా అదృష్టం. కోరిన కోర్కెలు తీర్చుతూ.. భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న వనదేవతల్లో గొప్పశక్తి దాగి ఉంది. రెండేళ్లకోసారి జరిగే జాతరలో ప్రధానఘట్టం తల్లుల ఆగమనం. ఈ సమయంలో జాతర ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంటుంది. భక్తులు తమను తాము మరిచిపోయి వనదేవతలను కొలుస్తుంటారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి మేడారానికి తరలివచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించి జాతరను విజయవంతం చేయడంలో అధికారుల పాత్ర కీలకమని చెప్పవచ్చు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ వనదేవతల సేవలో తరిస్తున్న జిల్లా పరిషత్ సీఈఓ గాదె ఆంజనేయులు శుక్రవారం ‘న్యూస్లైన్’తో గత జాతర అనుభవాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే... జిల్లా పరిషత్, న్యూస్లైన్ : మేడారం జాతరలో విధులు నిర్వర్తించడం ప్రభుత్వ ఉద్యోగుల అదృష్టమనే చెప్పవచ్చు. నేను 2004 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు జాతరలో పనిచేశాను. 2004, 2006లో నర్సం పేట ఆర్డీఓగా, 2008లో ములుగు ఆర్డీఓగా, 2012, 2014లో జిల్లా పరిషత్ సీఈఓ హోదాలో వనదేవతలకు సేవ చేసే భాగ్యం దక్కింది. ఆర్డీఓగా పనిచేసిన అనుభవంతోనే తాను జాతరలో అభివృద్ధి పనుల బాధ్యతను తీసుకున్నాను. 2004 జాతర అధికార యంత్రాంగానికి గుణపాఠం.. 2004లో జరిగిన మేడారం జాతర జిల్లా యంత్రాంగానికి గుణపాఠం నేర్పింది. అప్పుడు జరిగిన జాతరలో ఆర్అండ్బీశాఖ అధికారులు ప్రధాన రహదారిని వెడల్పు చేసి, సైడ్బర్మ్స్ వేసేందుకు పక్కనే కందకం తీసి మట్టిని ఇరువైపుల పోశారు. అయితే జాతర ప్రారంభమయ్యే ముందు వర్షాలు కురియడంతో రోడ్లన్నీ బురదమయంగా మారాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల వాహనాలు అందులో కూరుకుపోయాయి. సాధారణంగా జాతర జరిగే సమయం లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రోడ్డు పక్క ఉన్న అడవిలో వాహనాలను పార్కింగ్ చేసి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. కానీ.. 2004 జాతరలో రోడ్డు వెడల్పు కోసం తీసిన కందకాల్లో వర్షపునీరు నిలువడం తో వాహనాలు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తాడ్వాయి మీదుగా జంగలంచ వరకు, మే డారం-నార్లాపూర్ మార్గంలో పస్రా వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో భక్తు లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది భక్తులు వాహనాలు ఆగిపోయిన చోట నుంచే కాలినడకన మేడారం చేరుకుని సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ట్రాఫిక్ స్తంభించిన సమయంలో దారి పొడవునా చిరువ్యాపారులు తాగునీరు, చల్లటి పానీయాలు, బిస్కెట్లు, ఇతర తినుబండారాలు అమ్మడంతో భక్తులకు కొంత ఊరట లభించింది. రోడ్డు వెడల్పు పనులను సకాలంలో చేయకపోవడం.. జిల్లా యం త్రాంగానికి గుణపాఠం నేర్పింది. 2006లో గద్దెల వద్ద విధులు.. 2006లో నర్సంపేట ఆర్డీఓగా పనిచేస్తున్న సమయంలో గద్దెల వద్ద విధులు నిర్వర్తించాను. అప్పటి జాతరలో ఉదయం 6 గం టల నుంచి రాత్రి 11గంటల వరకు అక్కడే ఉండి పనిచేశాను. ఎందుకంటే తల్లులు గద్దెలపైకి వచ్చిన తర్వాత భక్తుల తాకిడితోపాటు దొంగల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. దేవతలు గద్దెలకు వస్తున్న సమయంలో అధికారులు కూడా తన్మయత్వంతో ఊగిపోతారు. ఆ సమయంలో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. 2008లో ములుగు ఆర్డీఓగా పనిచేస్తున్నప్పుడు జంపన్నవాగు స్నానఘట్టాలపై విధులు నిర్వహించాను. జాతరలో ట్రాఫిక్తో పాటు స్నానఘట్టాలపై పోలీసు యం త్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2008లో జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించే దంపతుల సామగ్రిని దొంగలు ఎత్తుకుపోతుండడం.. నేను కళ్లారా చూశా ను. ఈ విషయాన్ని అప్పటి పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడంతో వారు అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. 2010లో కామారెడ్డిలో పనిచేయడం కారణంగా జాతరలో విధులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. 2011లో జిల్లా పరిషత్ సీఈఓగా మళ్లీ జిల్లాకు రావడంతో 2012లో తల్లులకు సేవలందించాను. అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యత.. జాతరను పురస్కరించుకుని రహదారులు, సదుపాయాల కల్పనకు ఈ ఏడాది ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది. అయితే గత జాతరల్లో పనిచేసిన అనుభవం కలిగిన తనకు కలెక్టర్ అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ విభాగాల ద్వారా చేపట్టిన పనులను పర్యవేక్షిస్తున్నాను. అయితే గత జాతరలో భక్తుల సౌకర్యార్థం ఎన్ని మరుగుదొడ్లు కట్టిన విషయం తెలుసుకునేందుకు జెడ్పీ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు డ్యూటీలు వేశాను. నిరంతరం పర్యవేక్షణ చేస్తుండడంతో పనుల్లో పురోగతి పెరిగింది. మేడారం జాతరతో పాటు అగ్రహంపాడ్, అమ్మవారిపేట లాంటి చిన్న జాతరల్లో జరిగే అభివృద్ధి పనులను కూడా పర్యవేక్షిస్తున్నాం. ఈ ఏడాది జరిగే వనదేవతల జాతరలో ఎంపీడీఓలు, సూపరింటెండెంట్స్థాయి అధికారుల సేవలు వినియోంచుకుంటాం. ప్రధాన గేటు వద్ద ఉన్నతాధికారి విధులు.. గత జాతరల్లో జరిగిన చిన్న చిన్న తప్పిదాలపై జిల్లా యం త్రాంగం ఇటీవల చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. 2010, 2012లో జరిగిన జాతరలో ఇతర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు(వీఐపీ) దర్శనానికి వచ్చిన సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు వారిని నేరుగా అనుమతించలేదు. దీనిపై అధికారుల మధ్య భేదాభి ప్రాయాలు ఏర్పడ్డాయి. అయితే ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. వీఐపీల దర్శనం సందర్భంగా పోలీసు అధికారితో పాటు ఆర్డీఓ స్థాయి అధికారిని ప్రధానగేటు వద్ద విధులు నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. గేటు వద్ద ఉండే ప్రతి అధికారి 12 గంటల పాటు పనిచేసిన అనంతరం విశ్రాంతి తీసుకునే విధంగా షెడ్యూల్ను రూపొందిస్తున్నాం. జాతర సెక్టొరియల్ అధికారులకు సహాయకులుగా తహసీల్దార్లతో పాటు పలువురు ఎంపీడీఓలు పనిచేయనున్నారు. జిల్లా పరిషత్ నుంచి ములుగు పరిధిలోని మండలాలకు చెందిన అధికారులను జాతర విధుల్లోకి తీసుకునే అవకాశాలున్నాయి. -
ఉద్యోగం పోయిందని కండక్టర్ హఠాన్మరణం
- దేవునితండాలో విషాదఛాయలు వంగూరు, న్యూస్లైన్ : అతనికి నాలుగేళ్ల క్రితమే ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం వచ్చింది.. ఆపై రెండేళ్లకే రెగ్యులర్ అయింది. ఇక జీవితం సాఫీగా సాగుతుందనుకున్న తరుణంలోనే చిక్కుల్లో పడ్డాడు. చివరకు ప్రాణాలను కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే... వంగూరు మండలం రంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని దేవునితండాకు చెందిన కేతావత్ మినూనాయక్ (32) 1997లో పదో తరగతి పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే 2009లో ఆర్టీసీ కండక్టరుగా ఎంపికకాగా కల్వకుర్తి డిపోలో ఉద్యోగం చేస్తున్నాడు. 2011 డిసెంబర్లో రెగ్యులర్ అయింది. పది రోజులక్రితమే తన చేతికి గాయం కావడంతో డీఎం అనుమతితో సెలవుపై ఇంటికి వచ్చాడు. ఈయనకు భార్య పేమి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల ఈ డిపోలో 26 మంది కండక్టర్లు నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాన్ని సంపాదించారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈనెల 4న వీరిని సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అందులో అతని పేరుండటంతో ఆందోళనకు గురయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం అనారోగ్యంతో ఉండటాన్ని తల్లి చోక్లి గమనించి కనీసం డికాషన్ అయినా కాసి పోద్దామని దుకాణానికి వెళ్లి తీసుకొచ్చింది. అంతలోనే ఎవరో ఫోన్ చేయడంతో మాట్లాడి ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆమె రోదనలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని చూసేసరికే మృతి చెందాడు. ఈ సంఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని సర్పంచ్ నాగమ్మ, మాజీ సర్పంచ్ మల్లికార్జున్రెడ్డి, సీపీఎం నాయకులు ఆంజనేయులు, బాలస్వామి, శివరాములు పరామర్శించి ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఈ ఘటనకు ఆర్టీసీ అధికారులే కారణమని ఆరోపించారు. ఈ విషయమై కల్వకుర్తి డీఎం హజ్మతుల్లాను వివరణ కోరగా మినూనాయక్ నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరినందువల్లే తొలగించామన్నారు. ఆర్టీసి డిపో ఎదుట మృతదేహంతో ధర్నా కల్వకుర్తి: రాత్రి మిన్నూనాయక్ మృతదేహంతో స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. దీంతో డీఎం హజ్మతుల్లా వారితో మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
దారి తప్పి.. బతుకు బుగ్గి..
ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ యువకుడు చిన్న వయస్సులోనే దారి తప్పాడు. వయసులో తనకంటే పెద్దదైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగక పెళ్లి చేసుకోవాలంటూ పోరు పెట్టాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కసి పెంచుకున్నాడు. చివరకు ఆమెను గొడ్డలితో అత్యంత కిరాతంగా నరికి చంపాడు. ఆ తరువాత గంటల వ్యవధిలోనే తనూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చెడు వ్యసనం ఓ రెండు నిండు ప్రాణాలను బలిగొనగా ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. చిన్నమండెం, న్యూస్లైన్: చిన్నమండెం మండలం పాత వట్టం వారిపల్లెకు చెందిన కాకలపల్లె వెంకటక్షమ్మ, నడిపి రెడ్డెన్న దంపతు ల కుమారుడు ఆంజినేయులు(24) పురుగుల మందు తాగి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ సమీపంలోని మామిడి తోటలో తన వెంట తెచ్చుకున్న ఐదు రకాల పురుగుల మందులను బకెట్లో కలుపుకుని వాటిని తాగి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. రాయచోటి రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్, చిన్నమండెం ఎస్ఐ యోగీంద్ర, పీఎస్ఐ నాగమురళీ తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రియురాలిని గొడ్డలితో కిరాతకంగా నరికి... చిత్తూరు జిల్లా పెద్దమండెం మండలం గౌనివారిపల్లెకు చెందిన తుర్లు అన్నయ్య మొదటి భార్య మస్తానమ్మ అనారోగ్యంతో చనిపోగా ఆయన సీటీఎం పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన పార్వతమ్మను 12 ఏళ్ల కిందట రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిచెర్లలోని టమాట నర్సరీలో పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో పార్వతమ్మతో రెండున్నరేళ్ల నుంచి ఆంజినేయులు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఆంజినేయు లు కోరారు. కొన్నాళ్ల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో ఆమె అతన్ని దూరం పెట్టింది. దీన్ని జీర్ణించుకోలేని ఆం జినేయులు ఆమెపై పగతో రగిలిపోయేవాడు. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అదను కోసం వేచి చూస్తున్న అతనికి సమ యం రానే వచ్చింది. నర్సరీకి వెళ్లిన భర్తకు భోజనం తీసుకుని ఒంటరిగా బయలుదేరిన పార్వతమ్మను కలిచెర్ల-కేశాపురం మార్గంలోని చెట్ల పొదల్లో మంగళవారం దారి కాచి కొడవలితో విచక్ష ణారహితంగా ఆమెపై దాడి చేశాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆ దారిన బైక్లో వెళ్తున్న వారు గమనించి 108కు సమాచారం అందించారు. ఆమెను మదనపల్లె ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది. ప్రాణభయంతో బలవన్మరణం ఈ సంఘటనతో భయపడ్డ ఆంజినేయులు తీవ్రంగా భయపడ్డాడు. బుధవారం తెల్లవారుజామున తమ స్వగ్రామమైన పాత వట్టంవారిపల్లె సమీపంలోని మామిడి తోట వద్దకు చేరుకున్నాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందులను బకెట్లో కలుపుకుని వాటిని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలంలో లభ్యమైన లేఖలో పార్వతమ్మతో తనకున్న సంబంధాలు, తమ మధ్య జరిగిన గొడవల గురించి ఆంజినేయులు అనేక విషయాలు రాసి ఉండడం గమనార్హం. దీంతో పాటు పలు విషయాలు సెల్ఫోన్లోనూ రికార్డు చేసుకున్నట్లు తెలిసింది.