శంషాబాద్: ఇసుక లారీ ఢీకోని గురువారం ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన శంషాబాద్ మండలం పెద్ద శాపూరు బస్టాండ్ వద్ద జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం మక్తగూడానికి చెందిన మణెమ్మ(55) మధ్యాహ్నం రోడ్డు దాటుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. షాద్నగర్ నుంచి శంషాబాద్ వైపు వేగంగా వెళ్తున్న ఇసుక లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులో తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక క్లస్టర్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.