ఇసుక లారీ ఢీకొని మహిళ మృతి | women died in road accident at rangareddy distirict | Sakshi
Sakshi News home page

ఇసుక లారీ ఢీకొని మహిళ మృతి

Published Thu, Jan 29 2015 5:41 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

women died in road accident at rangareddy distirict

శంషాబాద్: ఇసుక లారీ ఢీకోని  గురువారం  ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన శంషాబాద్ మండలం పెద్ద శాపూరు బస్టాండ్ వద్ద జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం మక్తగూడానికి చెందిన మణెమ్మ(55) మధ్యాహ్నం రోడ్డు దాటుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. షాద్‌నగర్ నుంచి శంషాబాద్ వైపు వేగంగా వెళ్తున్న ఇసుక లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులో తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక క్లస్టర్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement