ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో కానిస్టేబుల్ లో పోలీసులు అరెస్ట్ చేశారు.
బరేలీ: ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో కానిస్టేబుల్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. రెండో నిందితుడిగా ఉన్న వీరపాల్ యాదవ్ ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ఇంతకుముందు అవినిష్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 31న ఇంటి నుంచి బయటకు వచ్చిన 14 ఏళ్ల బాలికపై వీరిద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను మూసాజాగ్ పోలీసు స్టేషన్లోకి లాక్కెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.