పాట్నా: బీహార్ లో బజరంగ్ దళ్ కార్యకర్తలు రెచ్చిపోయారు. రాజధాని పాట్నాకు 52 కిలోమీటర్ల దూరంలో జెహనాబాద్ పట్టణంలో క్రిస్టియన్ భవన్ పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. పేద హిందులను క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారనే ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
బజరంగ్ దళ్ దాడితో క్రైస్తవులు భయాందోళన చెందుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. దాడి చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
క్రిస్టియన్ భవన్ పై బజరంగ్ దళ్ దాడి
Published Sun, Jan 11 2015 8:09 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM
Advertisement
Advertisement